Pbks - ipl 2025: పంజాబ్ కింగ్స్ దూకుడు.. వారిద్దరే మాస్టర్ మైండ్స్
Pbks - ipl 2025: పంజాబ్ కింగ్స్ దూకుడు.. వారిద్దరే మాస్టర్ మైండ్స్"
Play all audios:
తొలి సీజన్లో సెమీస్కు చేరిందా జట్టు. ఆ తర్వాత ప్రతి రెండు లేదా మూడు సీజన్లకు కొత్త కెప్టెన్. జట్టులోని ప్లేయర్లందరూ మారిపోతుంటారనే కామెంట్లు. వీటి నడుమే మళ్లీ 2014లో అగ్రస్థానంతో
ప్లేఆఫ్స్కు చేరుకుంది. కానీ, ఫైనల్లో ఓడి రన్నరప్తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు 11 ఏళ్ల తర్వాత మళ్లీ టాప్ -2లో స్థానం సంపాదించింది. మరి ఈసారి పంజాబ్ కింగ్స్ ప్రదర్శన వెనుక
మాస్టర్ మైండ్స్ ఎవరో తెలుసా? ఐపీఎల్ 2025 సీజన్లో పంజాబ్ కింగ్స్ 14 మ్యాచుల్లో 9 విజయాలు నమోదు చేసింది. ఒక్క మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. అందులోనూ గెలిచే అవకాశాలు మెండుగానే ఉన్నా..
వరుణుడు సహకరించలేదు. అయినా సరే టాప్ -2లో స్థానం సాధించి తొలి క్వాలిఫయర్లో ఆడనుంది. గత పది సీజన్లలో ఒక్కసారి మాత్రమే ఐదో స్థానం వరకు రాగలిగిన పంజాబ్ ఈసారి అద్భుతంగా రాణిస్తోంది. ఈ విజయ
రహస్యం వెనుక ఇద్దరు ‘కింగ్స్’ ఉన్నారు. వారే కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, ప్రధాన కోచ్ రికీ పాంటింగ్. ఈసారి పంజాబ్ జైత్రయాత్ర 18వ ఎడిషన్ ప్రారంభం కాకముందే మొదలైంది. మెగా వేలంలో శ్రేయస్ను
రూ.26.75 కోట్లకు తీసుకున్న ఆ జట్టు.. మిగతా ప్లేయర్ల విషయంలోనూ ఏమాత్రం సంకోచించలేదు. ప్రధాన కోచ్ రికీ పాంటింగ్కు మేనేజ్మెంట్ పూర్తి స్వేచ్ఛనిచ్చింది. అందుకు ప్రతిఫలమే టాప్-2లో స్థానం
దక్కడం. సూపర్ టీమ్తో.. ప్రధాన కోచ్ రికీ పాంటింగ్ తన మార్క్ ఏంటో జట్టు ఎంపిక సమయంలోనే చూపించాడు. గత సీజన్ వరకు దిల్లీకి కోచ్ బాధ్యతలు నిర్వర్తించిన అతడు ఈసారి పంజాబ్తో జట్టు కట్టాడు.
రిటెన్షన్ ప్రక్రియ నుంచి తనదైన శైలిలో నిర్ణయాలు తీసుకొన్నాడు. శశాంక్, అర్ష్దీప్ను ఈ జట్టు రిటైన్ చేసుకుంది. అప్పుడే ఏదో ప్లాన్తో సీజన్లోకి అడుగుపెట్టిందని అంతా భావించారు. శశాంక్ కూడా
‘మేం టాప్-2’లో ఉంటామని బలంగా చెప్పాడు. వేలంలో శ్రేయస్ను భారీ మొత్తం వెచ్చించి మరీ సొంతం చేసుకుంది. అతడు కోల్కతాను విజేతగా నిలిపిన సారథి. అప్పుడంతా క్రెడిట్ గౌతమ్ గంభీర్కు వెళ్లినా..
కీలక పాత్ర మాత్రం శ్రేయస్దే అనడంలో సందేహం లేదు. ఇక బ్యాటింగ్, బౌలింగ్లోనూ స్టార్లనే కాకుండా.. యువకులకూ పెద్ద పీట వేసింది. ఆరంభంలో ప్రభ్ సిమ్రన్ దూకుడు.. నిలకడకు మారుపేరుగా నిలిచే
నేహాల్ వధేరా, శశాంక్, జోష్ ఇంగ్లిస్ వంటి ప్లేయర్లను ఎంచుకుంది. టీ20ల్లోనే టాప్ బౌలర్ అర్ష్దీప్ సింగ్కు తోడుగా యాన్సెన్, వైశాఖ్ విజయ్ కుమార్ పేస్ భారం మోస్తుండగా.. ఐపీఎల్లో టాప్
వికెట్ టేకర్ యుజ్వేంద్ర చాహల్ను మెగా వేలంలో తీసుకుంది. హర్మన్ప్రీత్ బ్రార్ నమ్మదగ్గ స్పిన్నర్గా మారాడు. దూకుడైన కెప్టెన్ ఆట.. కెప్టెన్ అంటే ముందుండి నడిపించాలి. ఈ విషయంలో శ్రేయస్
అయ్యర్కు వందకు వంద మార్కులు పడతాయని క్రికెట్ విశ్లేషకుల అభిప్రాయం. వ్యక్తిగత మైలురాళ్లు కాదు.. జట్టుకు ఉపయోగపడే ఇన్నింగ్స్లు ముఖ్యమని ఇప్పటికే నిరూపించాడు. అదే విధంగా తన బ్యాటింగ్
ఆర్డర్ను మార్చుకొనేందుకూ ఏమాత్రం వెనుకాడలేదు. తాజాగా ముంబయితో తమ చివరి లీగ్ మ్యాచ్లో వన్డౌన్లో రాకుండా జోష్ ఇంగ్లిస్ను పంపించి అతడితో కీలక ఇన్నింగ్స్ ఆడించిన సంగతి తెలిసిందే. డేరింగ్
నిర్ణయాలు తీసుకోవడమే కాకుండా.. బౌలింగ్లో ఏ బౌలరైనా ఇబ్బంది పడితే అతడికి మద్దతుగా నిలిచాడు. చాహల్ కొన్ని మ్యాచుల్లో వికెట్ కూడా తీయలేదు. అయినా, అతడిని కొనసాగించిన సందర్భాలూ ఉన్నాయి. ఇక
హర్మన్ప్రీత్ బ్రార్ పరిస్థితి కూడా అంతే. చాహల్ ఉండటంతో బ్రార్కు ఛాన్స్ రాలేదు. అప్పుడు అండగా ఉన్న శ్రేయస్ సరైన సమయంలో అతడిని బరిలోకి దింపాడు. ఫలితం రాబట్టాడు. ఆల్రౌండ్ ప్రదర్శనతో..
టాప్-2లోకి పంజాబ్ చేరుకోవడంలో ఆ జట్టు ఆటగాళ్ల ఆల్ రౌండ్ ప్రదర్శన ఉంది. టాప్-5 బ్యాటర్లలో జట్టుకు చెందిన ఒక్క ఆటగాడూ లేడు. అయినా, భారీ స్కోర్లు చేసింది. లక్ష్యాలను ఛేదించింది. కెప్టెన్
శ్రేయస్ అయ్యర్ 514 పరుగులతో తొమ్మిదో స్థానంలో ఉన్నాడు. ఇక బౌలింగ్ విషయానికొస్తే.. అర్ష్దీప్ సింగ్ మాత్రమే టాప్-5 బౌలర్లలో పంజాబ్ నుంచి చోటు దక్కించుకున్నాడు. అతడు 14 మ్యాచుల్లో 18
వికెట్లు తీశాడు. అతడితో పాటు మార్కో యాన్సెన్ 16 వికెట్లు పడగొట్టాడు. అందుకే, పంజాబ్ విజయాలు వెనుక సమష్టి కృషి ఉందనేది కాదనలేని వాస్తవం. _- ఇంటర్నెట్ డెస్క్_
Trending News
Vastu: అప్పులు, ఆర్థిక కష్టాలు తీరాలంటే, ఇంట్లో 7 మార్పులు చెయ్యండిగ్లాస్ విండో: మీకు అప్పుల బాధ తీరిపోవాలంటే, ఈశాన్యం దిక్కులో ఓ గ్లాస్ కిటికీని అమర్చండి. మీ ఇల్లు, షాప్ ఏదైనా సరే, ఈశ్యా...
దర్యాప్తునకు ముందే స్టే ఎలా ఇస్తారు..?సాక్షి, న్యూఢిల్లీ: ‘గత విచారణ సందర్భంగానే మీకు చెప్పాం. ఇలా దర్యాప్తు ప్రారంభం కూడా కాకముందే స్టే ఆర్డర్లు ఇవ్వడాన్ని మ...
Coolie movie: రజనీకాంత్కు మొదటి చెప్పిన కథ ‘కూలీ’ కాదు.. : లోకేశ్ కనగరాజ్ఇంటర్నెట్డెస్క్: రజనీకాంత్ (Rajinikanth) కథానాయకుడిగా లోకేశ్ కనగరాజ్ (Lokesh Kanagaraj) దర్శకత్వంలో రూపొందుతున్న యా...
పదేళ్లకే పిల్లల్లో బీపీ, మధుమేహం.. కారణం ఇదే : డాక్టర్ రిమా దాదాదిల్లీ: విద్యార్థుల్లో అధిక మధుమేహాన్ని నియంత్రించడమే లక్ష్యంగా పాఠశాలల్లో ‘షుగర్ బోర్డు’లను ఏర్పాటు చేయాలని సీబీఎస్ఈ(C...
17న ఎంగిలిపూల బతుకమ్మఫైల్ ఫోటో సాక్షి, హన్మకొండ: ఈ ఏడాది అధిక ఆశ్వయుజం వచ్చినందున ఎంగిలిపూల బతుకమ్మ, సద్దుల బతుకమ్మ పండుగలు ఎప్పుడు జరుపుకోవ...
Latests News
Pbks - ipl 2025: పంజాబ్ కింగ్స్ దూకుడు.. వారిద్దరే మాస్టర్ మైండ్స్తొలి సీజన్లో సెమీస్కు చేరిందా జట్టు. ఆ తర్వాత ప్రతి రెండు లేదా మూడు సీజన్లకు కొత్త కెప్టెన్. జట్టులోని ప్లేయర్లందరూ మా...
China: చైనా కెమికల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడుఇంటర్నెట్ డెస్క్: చైనాలోని ఓ రసాయన పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది. తూర్పు ప్రావిన్సు షాన్డాంగ్లో ఈ ప్రమాదం చోటుచే...
Bombay high court: ఒక విద్యార్థి జీవితాన్ని నాశనం చేస్తారా..? బాంబే హైకోర్టు ఆగ్రహంOperation Sindoor: ఆపరేషన్ సిందూర్పై పోస్టు పెట్టిన విద్యార్థిని ఒకరు అరెస్టయ్యారు. ఆమెను వెంటనే విడుదల చేయాలని బాంబే హ...
Kantara 1: ‘కాంతార చాప్టర్ 1’ వాయిదా..? స్పందించిన టీమ్ఇంటర్నెట్ డెస్క్: కన్నడ నటుడు రిషబ్ శెట్టి (Rishab Shetty) ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం ‘కాంతార చాప్టర్ 1’ (Kant...
Pm modi: ఎన్టీఆర్ నుంచి ఎంతో ప్రేరణ పొందాం: ప్రధాని మోదీదిల్లీ: ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) నివాళి అర్పించారు. ఆయన తెలుగు సినీ రంగంలో విశిష్ట నటుడు...