Waker-uz-zaman: బంగ్లా పాలనా పగ్గాలు ఆర్మీ చీఫ్ చేపట్టబోతున్నారా? యూనస్‌తో విభేదాలకు కారణమేంటీ?

Eenadu

Waker-uz-zaman: బంగ్లా పాలనా పగ్గాలు ఆర్మీ చీఫ్ చేపట్టబోతున్నారా? యూనస్‌తో విభేదాలకు కారణమేంటీ?"

Play all audios:

Loading...

ఇంటర్నెట్‌డెస్క్‌: బంగ్లాదేశ్‌ తాత్కాలిక సారథి మహమ్మద్‌ యూనస్(Muhammad Yunus) రాజీనామా చేసేందుకు సిద్ధమైనట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దేశంలోని రాజకీయ పార్టీలు ఐక్యంగా లేకపోతే తాను


పనిచేయలేనంటూ ఆయన చెప్పడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. అయితే, యూనస్‌ తర్వాత బంగ్లా ఆర్మీ చీఫ్ జనరల్ వకార్-ఉజ్-జమాన్ (Waker-Uz-Zaman) ఆ పదవి చేపట్టబోతున్నారా? అసలు యూనస్‌, జమాన్ మధ్య విభేదాలకు


కారణమేంటనేది ఆసక్తికరంగా మారింది. రిజర్వేషన్ల వ్యతిరేక నిరసనలతో గతేడాది షేక్ హసీనా(Sheikh Hasina) ప్రధాని పదవిని కోల్పోయి, ప్రస్తుతం భారత్‌లో ఆశ్రయం పొందుతున్న విషయం తెలిసిందే. ఆగస్టు 5న


ఆమె గద్దె దిగగా, అప్పటికి దాదాపు రెండు నెలల క్రితం జూన్ 23న బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్‌గా వకార్‌ నియమితులయ్యారు. అయితే, అతడి గురించి హసీనాను భారత్‌ ఏడాది ముందే హెచ్చరించినట్లు సమాచారం. జమాన్‌


పాక్‌ అనుకూల వ్యక్తి అని, అతడితో జాగ్రత్తగా వ్యవహరించాలని భారత జాతీయ భద్రతా మండలికి చెందిన కొందరు ఉన్నతస్థాయి అధికారులు ఆమెను అప్రమత్తం చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అయినప్పటికీ నాటి


హసీనా సర్కార్‌ అతడి నియామకానికే మొగ్గుచూపింది. * ‘మాకు నీటిని ఆపితే’.. : పాక్‌ సైన్యం నోట..ఉగ్ర మాట 59 ఏళ్ల వకార్‌-ఉజ్‌-జమాన్‌ నాలుగు దశాబ్దాల పాటు మిలిటరీలో ఉన్నారు. డిఫెన్స్‌ స్టడీస్‌లో


మాస్టర్స్‌ పూర్తి చేశారు. గతంలో ప్రధానమంత్రి కార్యాలయం ఆధ్వర్యంలోని ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌ విభాగంలో ప్రిన్సిపల్‌ స్టాఫ్‌ ఆఫీసర్‌గానూ పనిచేశారు. చీఫ్‌ ఆఫ్‌ జనరల్‌ స్టాఫ్‌గా విధులు


నిర్వర్తించారు. ఆర్మీని ఆధునికీకరించడంలో కీలక పాత్ర పోషించిన ఆయన సేవలను గుర్తించిన హసీనా ప్రభుత్వం.. గతేడాది జూన్‌లో మూడేళ్ల పదవీకాలంపై సైన్యాధిపతిగా నియమించింది. అయితే ఈ పదవిలో నిమితులైన


కొద్ది రోజుల్లోనే రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మొదలైన నిరసనలు తీవ్రరూపం దాల్చాయి. వాటిని నియంత్రించాల్సిన సైన్యాధిపతి అప్పటి ప్రధాని హసీనాకు అల్టిమేటం ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. ఆందోళనలు


హింసాత్మకంగా మారడంతో రాజీనామా చేయాలంటూ సైన్యం హసీనాకు 45 నిమిషాల గడువు ఇచ్చింది. దీంతో ఆమె పదవి నుంచి దిగిపోయి సోదరి షేక్‌ రెహానాతో కలిసి దేశాన్ని వీడాల్సిన పరిస్థితులకు దారి తీయడం మనకు


తెలిసిందే. మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. మాజీ సైన్యాధిపతి ముస్తఫిజుర్‌ రెహమాన్‌ కుమార్తెను జమాన్‌ వివాహం చేసుకున్నారు. షేక్‌ హసీనాకు ముస్తఫిజుర్‌ రెహమాన్‌ వరసకు మామయ్య అవుతారు.  యూనస్‌, జమాన్


మధ్య విభేధాలు.. ప్రస్తుతం యూనస్‌, జమాన్ మధ్య విభేధాలు భగ్గుమంటున్నాయి. 2009లో జరిగిన ఘర్షణల్లో 57 మంది ఆర్మీ అధికారులు, మరో 16 మంది హత్యకు గురైన ఘటనలో కోర్టు 300 మందిని దోషిగా తేల్చింది.


అయితే ఇప్పుడు యూనస్ తాత్కాలిక ప్రభుత్వం పర్యవేక్షణలో వారు విడుదలయ్యారు. అలాగే, ఎన్నికలు నిర్వహణ ఆలస్యం కావడం కూడా విభేదాలకు మరో కారణమని అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. దీంతో పాటు


అమెరికా జోక్యం జమాన్‌కు చికాకు పెట్టిస్తోందట. మయన్మార్ సరిహద్దులో మానవతా కారిడార్ ఏర్పాటు ప్రతిపాదనకు ప్రస్తుత ప్రభుత్వం ఆమోదం తెలపడం సైన్యానికి రుచించలేదు. అది బ్లడీ కారిడార్ అని ఆగ్రహం


వ్యక్తం చేసింది. బంగ్లాదేశ్‌ తూర్పు సరిహద్దుల్లోని చట్టోగ్రామ్‌ ప్రాంతం నుంచి మానవతా కారిడార్‌ను ఏర్పాటు చేయాలన్నది ప్రతిపాదన. మయన్మార్‌లో అంతర్యుద్ధం, భూకంపం కారణంగా తీవ్రంగా నలిగిపోతున్న


రఖైన్‌ ప్రాంతంలోని 20 లక్షల మంది పౌరులకు మానవతా సాయం అందించాలన్నది ఉద్దేశం. దీని వెనుక ఐరాస ఉన్నప్పటికీ మద్దతు మాత్రం అమెరికాదని తెలుస్తోంది. ఈ ప్రతిపాదనను దాదాపు అన్ని పార్టీలు


వ్యతిరేకించాయి. ఇది తమ సార్వభౌమత్వానికి భంగం కలిగించడంతో పాటు అమెరికా భౌగోళిక రాజకీయ అనుకూలంగా మారుతుందన్న ఆందోళన వ్యక్తం అవుతోంది. రోహింగ్యాలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడటంతో లక్షల మంది


బంగ్లాదేశ్‌కు వలస వచ్చారు.  అరకాన్‌ ఆర్మీ ఇటీవల సెయింట్‌ మార్టిన్స్‌ ద్వీపంపై హక్కును ప్రకటించుకోగా.. బంగ్లాదేశ్‌ ప్రభుత్వం దాన్ని తోసిపుచ్చింది. బంగాళాఖాతంలో పలు దేశాల మధ్యలో ఈ ద్వీపం


ఉండటంతో అమెరికా దృష్టి దీనిపై ఎప్పటి నుంచో ఉంది. ఇక్కడ సైనిక స్థావరం నిర్మిస్తే.. ప్రపంచ వాణిజ్యానికి ఎంతో కీలకమైన మలక్కా జలసంధిపై నేరుగా దానికి పట్టు లభిస్తుందని భావిస్తోంది. హసీనా దీనిని


వ్యతిరేకించారు. తన పదవి పోవడానికి అది కూడా ఓ కారణమని గతంలో ఆమె ఆరోపించారు. ఇప్పుడు జమాన్‌, యూనస్ మధ్య వివాదానికి కూడా ఇదో కారణంగా కనిపిస్తోంది. హసీనా దిగిపోయినప్పుడు కూడా జమాన్ పగ్గాలు పదవి


చేపడతారని వార్తలు రాగా.. తాజా పరిస్థితుల నేపథ్యంలో మళ్లీ అలాంటి ఊహాగానాలే వినబడుతుండటం గమనార్హం.


Trending News

Vastu: అప్పులు, ఆర్థిక కష్టాలు తీరాలంటే, ఇంట్లో 7 మార్పులు చెయ్యండి

గ్లాస్ విండో: మీకు అప్పుల బాధ తీరిపోవాలంటే, ఈశాన్యం దిక్కులో ఓ గ్లాస్ కిటికీని అమర్చండి. మీ ఇల్లు, షాప్ ఏదైనా సరే, ఈశ్యా...

దర్యాప్తునకు ముందే స్టే ఎలా ఇస్తారు..?  

సాక్షి, న్యూఢిల్లీ: ‘గత విచారణ సందర్భంగానే మీకు చెప్పాం. ఇలా దర్యాప్తు ప్రారంభం కూడా కాకముందే స్టే ఆర్డర్లు ఇవ్వడాన్ని మ...

Pm narendra modi inaugurates 'maitri setu' between india and bangladesh - key points

Bangladesh Prime Minister Sheikh Hasina also virtually addressed the function organised to inaugurate the double lane Fe...

పదేళ్లకే పిల్లల్లో బీపీ, మధుమేహం.. కారణం ఇదే : డాక్టర్‌ రిమా దాదా

దిల్లీ: విద్యార్థుల్లో అధిక మధుమేహాన్ని నియంత్రించడమే లక్ష్యంగా పాఠశాలల్లో ‘షుగర్ బోర్డు’లను ఏర్పాటు చేయాలని సీబీఎస్‌ఈ(C...

17న ఎంగిలిపూల బతుకమ్మ 

ఫైల్‌ ఫోటో సాక్షి, హన్మకొండ: ఈ ఏడాది అధిక ఆశ్వయుజం వచ్చినందున ఎంగిలిపూల బతుకమ్మ, సద్దుల బతుకమ్మ పండుగలు ఎప్పుడు జరుపుకోవ...

Latests News

Waker-uz-zaman: బంగ్లా పాలనా పగ్గాలు ఆర్మీ చీఫ్ చేపట్టబోతున్నారా? యూనస్‌తో విభేదాలకు కారణమేంటీ?

ఇంటర్నెట్‌డెస్క్‌: బంగ్లాదేశ్‌ తాత్కాలిక సారథి మహమ్మద్‌ యూనస్(Muhammad Yunus) రాజీనామా చేసేందుకు సిద్ధమైనట్లు ఊహాగానాలు ...

Salman khan: సల్మాన్‌ ఇంట్లోకి చొరబడిన వ్యక్తులు.. అరెస్టు

బాలీవుడ్‌ స్టార్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌ (Salman Khan) నివాసంలోకి వేర్వేరు సమయాల్లో ఇద్దరు వ్యక్తులు చొరబడిన ఘటన ఆలస్యంగా వ...

Meenakshi natarajan: తెలంగాణ కాంగ్రెస్‌ నేతలతో మీనాక్షి నటరాజన్‌ సమీక్ష

హైదరాబాద్‌: తెలంగాణ కాంగ్రెస్‌ (Congress) నేతలతో ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ మీనాక్షి నటరాజన్‌ (Meenakshi Natar...

Astrology ఈ రాశుల వారికి త్వరలో విదేశి యానం యోగం.. మీ రాశి ఉందో లేదో చెక్ చేసుకోండి..

CNN18 name, logo and all associated elements ® and © 2017 Cable News Network LP, LLLP. A Time Warner Company. All rights...

Pbks - ipl 2025: పంజాబ్ కింగ్స్‌ దూకుడు.. వారిద్దరే మాస్టర్‌ మైండ్స్‌

తొలి సీజన్‌లో సెమీస్‌కు చేరిందా జట్టు. ఆ తర్వాత ప్రతి రెండు లేదా మూడు సీజన్లకు కొత్త కెప్టెన్. జట్టులోని ప్లేయర్లందరూ మా...

Top