Shreyas iyer: పంజాబ్ రూపురేఖల్నే మార్చి.. 11 ఏళ్ల తర్వాత ప్లేఆఫ్స్నకు చేర్చి.. ఒకేఒక్కడు శ్రేయస్
Shreyas iyer: పంజాబ్ రూపురేఖల్నే మార్చి.. 11 ఏళ్ల తర్వాత ప్లేఆఫ్స్నకు చేర్చి.. ఒకేఒక్కడు శ్రేయస్"
Play all audios:
_ఇంటర్నెట్ డెస్క్: ఎలాంటి అంచనాలు లేని జట్టు అది. నిలకడలేమికి మారు పేరుగా ఉండేది. ఎప్పుడూ పేలవ ప్రదర్శనతో కనీసం ప్లేఆఫ్స్ వరకు రాకుండానే వెనుదిరుగుతుండేది. అలాంటి జట్టు అద్భుత ప్రదర్శనతో
11 ఏళ్ల తర్వాత ప్లేఆఫ్స్లోకి సగర్వంగా అడుగుపెట్టింది. అందుకు కారణం ఒకే ఒక్కడు.. అతడే శ్రేయస్ అయ్యర్ (SHREYAS IYER).. ఆ జట్టే పంజాబ్ కింగ్స్ (PUNJAB KINGS)._ తరచూ కెప్టెన్లు మారుతుండే
జట్టు పంజాబ్. అలాంటి జట్టులోకి వచ్చాడు శ్రేయస్ అయ్యర్. సారథ్య బాధ్యతలు చేపట్టి.. ఈ ఐపీఎల్ సీజన్లో ఆ జట్టు రూపురేఖలనే మార్చివేశాడు. అటు బ్యాట్తో, ఇటు కెప్టెన్సీతో ఆకట్టుకుంటూ.. తన
జట్టును అద్భుతంగా ముందుకు నడిపిస్తున్నాడు. ఇప్పటివరకు ఆడిన 12 మ్యాచ్ల్లో 8 విజయాలను నమోదు చేసింది ఆ జట్టు. సారథిగా ఒకేఒక్కడు.. ఇక ఏ జట్టుకు సారథ్య బాధ్యతలు వహించినా.. తనదైన వ్యూహాలతో
అద్భుతంగా ముందుకునడిపిస్తాడు శ్రేయస్. ఐపీఎల్ చరిత్రలో ఇప్పటివరకూ మూడు వేర్వేరు జట్లకు సారథ్యం వహించి వాటిని ప్లేఆఫ్స్నకు చేర్చిన ఏకైక కెప్టెన్ శ్రేయస్ అయ్యరే. గతంలో దిల్లీని కూడా తన
సారథ్యంలోనే ప్లేఆఫ్స్నకు చేర్చాడు. అతడి సత్తాను చెప్పేవి ఈ గణాంకాలే. గత సీజన్లో కోల్కతాకు సారథ్యం వహించి.. ఆ జట్టుకు టైటిల్ కూడా అందించాడు. అయినప్పటికీ ఆ జట్టు వదులుకోవడంతో.. మెగా వేలంలో
పంజాబ్ రూ.26.75 కోట్లకు దక్కించుకుంది. తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా.. జట్టును అద్భుత రీతిలో నడిపిస్తూ అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు. బ్యాట్తోనూ.. సారథి అంటే జట్టును నడిపించడమే
కాదు.. జట్టు విజయాల్లో తనవంతు పాత్ర కూడా ఉండాలి. ఈ విజయ సూత్రాన్ని నిరూపిస్తూ ముందుకుసాగుతున్నాడు శ్రేయస్. మూడో స్థానంలో బ్యాటింగ్కు వచ్చే అయ్యర్.. ఇప్పటివరకూ 435 పరుగులు చేశాడు. అందులో
ఒక ఇన్నింగ్స్లో శతకానికి(97*) చేరువగా వచ్చాడు. ఆ మ్యాచ్లో సెంచరీ చేసే అవకామున్నా.. జట్టు కోసమే నిలబడ్డాడు. అనుకున్న గుర్తింపు దక్కిందా..? కోల్కతాను విజేతగా నిలబెట్టినా శ్రేయస్కు
రావాల్సిన గుర్తింపు రాలేదనే విమర్శలూ ఉన్నాయి. ఎందుకంటే.. ఆ జట్టు అతడిని ఆ తర్వాత వదిలేసుకుంది. కోల్కతా టైటిల్ విజయంలో అప్పటి మెంటార్ గౌతమ్ గంభీర్కే ఎక్కువ క్రెడిట్ దక్కిందనే వాదనలూ
ఉన్నాయి. ఈ అంశం పైనే తాజాగా క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ స్పందించాడు. ‘‘గత సీజన్లో కోల్కతాను టైటిల్ విజేతగా నిలబెట్టినా.. శ్రేయస్కు తగిన గుర్తింపు లభించలేదు. ఆ ప్రశంసలు మరొకరికి
దక్కాయి. జట్టు విజయాల్లో ప్రధాన పాత్ర పోషించేది కెప్టెనే. డగౌట్లో కూర్చున్న వ్యక్తి కాదు. ఈ ఏడాది చూడండి.. శ్రేయస్కు మంచి పేరు వస్తోంది. కోచ్ రిక్కీ పాంటింగ్కు ఎవరూ క్రెడిట్ ఇవ్వడం
లేదు’’ అంటూ గావస్కర్ పరోక్షంగా అప్పటి కోల్కతా మెంటార్ గౌతమ్ గంభీర్పై వ్యాఖ్యలు చేశాడు. ఛాంపియన్స్ ట్రోఫీలోనూ.. ఐపీఎల్లోనే కాదు.. గత ఛాంపియన్స్ ట్రోఫీలోనూ టీమ్ఇండియా తరఫున అద్భుత
ప్రదర్శన చేశాడు శ్రేయస్. టీమ్ఇండియా టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా నిలిచాడు. మరి శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలో పంజాబ్ తొలిసారి టైటిల్
గెలవాలని ఆ జట్టు అభిమానులు కోరుకుంటున్నారు.
Trending News
Narsapuram election result 2024 live updates: bjp's bhupathi raju srinivasa varma has won in this lok sabha seatNARSAPURAM LOK SABHA ELECTION RESULT 2024 LIVE UPDATES: With the counting of votes for the 2024 Lok Sabha elections unde...
పదేళ్లకే పిల్లల్లో బీపీ, మధుమేహం.. కారణం ఇదే : డాక్టర్ రిమా దాదాదిల్లీ: విద్యార్థుల్లో అధిక మధుమేహాన్ని నియంత్రించడమే లక్ష్యంగా పాఠశాలల్లో ‘షుగర్ బోర్డు’లను ఏర్పాటు చేయాలని సీబీఎస్ఈ(C...
Vastu: అప్పులు, ఆర్థిక కష్టాలు తీరాలంటే, ఇంట్లో 7 మార్పులు చెయ్యండిగ్లాస్ విండో: మీకు అప్పుల బాధ తీరిపోవాలంటే, ఈశాన్యం దిక్కులో ఓ గ్లాస్ కిటికీని అమర్చండి. మీ ఇల్లు, షాప్ ఏదైనా సరే, ఈశ్యా...
నగరంలో ట్రాఫిక్ ఆంక్షలుసాక్షి, సిటీబ్యూరో: మొహర్రం ఊరేగింపు నేపథ్యంలో మంగళవారం పాతబస్తీ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఎలాంటి అవ...
దర్యాప్తునకు ముందే స్టే ఎలా ఇస్తారు..?సాక్షి, న్యూఢిల్లీ: ‘గత విచారణ సందర్భంగానే మీకు చెప్పాం. ఇలా దర్యాప్తు ప్రారంభం కూడా కాకముందే స్టే ఆర్డర్లు ఇవ్వడాన్ని మ...
Latests News
Shreyas iyer: పంజాబ్ రూపురేఖల్నే మార్చి.. 11 ఏళ్ల తర్వాత ప్లేఆఫ్స్నకు చేర్చి.. ఒకేఒక్కడు శ్రేయస్_ఇంటర్నెట్ డెస్క్: ఎలాంటి అంచనాలు లేని జట్టు అది. నిలకడలేమికి మారు పేరుగా ఉండేది. ఎప్పుడూ పేలవ ప్రదర్శనతో కనీసం ప్లేఆఫ...
Vivek agnihotri: రణ్బీర్ను బాయ్కాట్ చేసే ధైర్యం ఎవరికీ లేదు: దర్శకుడు‘ది కశ్మీర్ ఫైల్స్’ (The Kashmir Files) దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. బాలీవుడ్ పరి...
Bangladesh: బంగ్లాదేశ్లోనూ ఆర్థిక సంక్షోభం మొదలైందా?.. అదే సంకేతమా?Published by: Last Updated:July 29, 2022 4:16 PM IST BANGLADESH: బంగ్లాదేశ్ ఇతర దేశాల నుంచి వస్తువులను దిగుమతి చేసుకునేం...
Operation sindoor: భారత్కు సహనం నశించింది.. పాక్కు లెక్క సరిచేసింది..ఇంటర్నెట్డెస్క్: పహల్గాం ఉగ్రదాడితో భారత్కు సహనం నశించింది. ఉగ్రమూక అమాయకుల ప్రాణాలు తీయడమే కాక.. మీ ప్రధానికి వెళ్ల...
లేఆఫ్స్పై ముఖ్యమంత్రికి టెకీల లేఖముంబై : కోవిడ్-19 సంక్షోభంలో ఐటీ కంపెనీలు ఉద్యోగుల తొలగింపునకు, వేతన కోతలకు పాల్పడుతున్నాయని పేర్కొంటూ ఐటీ ఉద్యోగుల యూన...