Indian army: స్వదేశీ మానవ రహిత వైమానిక వ్యవస్థను పరిశీలించిన ఆర్మీ చీఫ్‌

Eenadu

Indian army: స్వదేశీ మానవ రహిత వైమానిక వ్యవస్థను పరిశీలించిన ఆర్మీ చీఫ్‌"

Play all audios:

Loading...

ఇంటర్నెట్‌డెస్క్‌: కాల్పుల విరమణ ఒప్పందంతో సరిహద్దులో భారత్‌-పాక్‌ ఉద్రిక్తలు చల్లారినప్పటికీ.. భారత సైన్యం మాత్రం పూర్తిస్థాయి సన్నద్ధతను ప్రదర్శిస్తోంది. అలాగే అధునాతన సాంకేతికతను


అందిపుచ్చుకొని.. పరీక్షలు నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో ఆర్మీచీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది (General Upendra Dwivedi) బబీనా ఫీల్డ్ ఫైరింగ్‌ రేంజ్‌కు వెళ్లారు (Operation Sindoor). మానవ రహిత


వైమానిక వ్యవస్థ (UAS)లు.. వాటిని ఎదుర్కొనేందుకు వాడే ఆయుధాలను ఆర్మీ చీఫ్‌ పరిశీలించారు. ఈ మేరకు అడిషనల్ డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్ పబ్లిక్‌ ఇన్ఫర్మేషన్ (ADGPI) ఎక్స్ వేదికగా పోస్టు పెట్టింది.


ఇవన్నీ మన బలగాల పోరాట సామర్థ్యాన్ని, కచ్చితత్వాన్ని గణనీయంగా మెరుగుపరుస్తాయని పేర్కొంది. అలాగే ఆ దృశ్యాలను పంచుకుంది. యూఏఎస్‌ (UAS), కౌంటర్ యూఏఎస్‌ (Counter-UAS)తో పాటు లాయిటరింగ్‌


మ్యూనిషన్స్‌ (Loitering Munitions) గురించి ఆ పోస్టులో ప్రస్తావించింది. లాయిటరింగ్ మ్యూనిషన్ కూడా ఒక యూఏవీనే. ఇది టార్గెట్ చేసిన ప్రాంతంపై సంచరించి, ముప్పును గుర్తిస్తుంది. తర్వాత


దాడిచేస్తుంది. ఆత్మాహుతి డ్రోన్లు, ఎక్స్‌ప్లోడింగ్ డ్రోన్లు దీనికిందికి వస్తాయి. ఇవి ఆటోమేటిక్‌గా ఆపరేట్ కాగలవు. మనుషులు ఆపరేట్ చేసేవిధంగానూ రూపొందించారు. ఇటీవల ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా


పాక్‌, పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రస్థావరాలను ధ్వంసం చేయడానికి వీటిని ఉపయోగించారు. కాగా.. అత్యంత అధునాతన ఐదోతరం స్టెల్త్‌ యుద్ధవిమానాన్ని సాకారం చేసే దిశగా కీలక ముందడుగు పడిన సంగతి


తెలిసిందే. ‘అడ్వాన్స్‌డ్‌ మీడియం కంబాట్‌ ఎయిర్‌ క్రాఫ్ట్‌’ (ఆమ్కా) ప్రాజెక్టు అమలు కోసం ‘ఎగ్జిక్యూషన్‌ నమూనా’ తయారీకి రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఆమోదం తెలిపారు. రక్షణ రంగంలో స్వదేశీ


ఉత్పత్తిని ప్రోత్సహించే దిశగా ఈ నిర్ణయం తీసుకున్నారు. దేశీయ పరిజ్ఞానంతో ఆమ్కా ప్రాజెక్టుపై భారత్‌ కొంతకాలంగా కసరత్తు చేస్తోంది. దీనికింద మధ్యశ్రేణి  అధునాతన స్టెల్త్‌ యుద్ధవిమానాన్ని


అభివృద్ధిచేస్తోంది. ఇది శత్రువుల రాడార్లను ఏమార్చి, వారి గగనతలంలోకి చొచ్చుకెళుతుంది. దీనిద్వారా భారత వైమానిక పోరాట సామర్థ్యం మరింత మెరుగుపడుతుంది. అదే రోజు ద్వివేది ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్‌కు


వెళ్లారు. 


Trending News

Vastu: అప్పులు, ఆర్థిక కష్టాలు తీరాలంటే, ఇంట్లో 7 మార్పులు చెయ్యండి

గ్లాస్ విండో: మీకు అప్పుల బాధ తీరిపోవాలంటే, ఈశాన్యం దిక్కులో ఓ గ్లాస్ కిటికీని అమర్చండి. మీ ఇల్లు, షాప్ ఏదైనా సరే, ఈశ్యా...

నగరంలో ట్రాఫిక్‌ ఆంక్షలు

సాక్షి, సిటీబ్యూరో: మొహర్రం ఊరేగింపు నేపథ్యంలో మంగళవారం పాతబస్తీ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఎలాంటి అవ...

17న ఎంగిలిపూల బతుకమ్మ 

ఫైల్‌ ఫోటో సాక్షి, హన్మకొండ: ఈ ఏడాది అధిక ఆశ్వయుజం వచ్చినందున ఎంగిలిపూల బతుకమ్మ, సద్దుల బతుకమ్మ పండుగలు ఎప్పుడు జరుపుకోవ...

Coolie movie: రజనీకాంత్‌కు మొదటి చెప్పిన కథ ‘కూలీ’ కాదు.. : లోకేశ్‌ కనగరాజ్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: రజనీకాంత్‌ (Rajinikanth) కథానాయకుడిగా లోకేశ్‌ కనగరాజ్‌ (Lokesh Kanagaraj) దర్శకత్వంలో రూపొందుతున్న యా...

Pm narendra modi inaugurates 'maitri setu' between india and bangladesh - key points

Bangladesh Prime Minister Sheikh Hasina also virtually addressed the function organised to inaugurate the double lane Fe...

Latests News

Indian army: స్వదేశీ మానవ రహిత వైమానిక వ్యవస్థను పరిశీలించిన ఆర్మీ చీఫ్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: కాల్పుల విరమణ ఒప్పందంతో సరిహద్దులో భారత్‌-పాక్‌ ఉద్రిక్తలు చల్లారినప్పటికీ.. భారత సైన్యం మాత్రం పూర్త...

Stock market: లాభాల్లో ముగిసిన సూచీలు.. 25 వేల ఎగువన నిఫ్టీ

Stock market | ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు లాభాల్లో ముగిశాయి. ముఖ్యంగా ఐటీ, ఆటో, మెటల్‌ స్టాక్స్‌ అండతో సూచీల...

Harvard university: హార్వర్డ్‌పై ట్రంప్‌ ఆంక్షలు.. గందరగోళంలో భారతీయ విద్యార్థులు

వాషింగ్టన్‌: అమెరికాలోని ప్రఖ్యాత హార్వర్డ్‌ విశ్వవిద్యాలయానికి (Harvard University) మరో ఎదురుదెబ్బ తగిలింది. ఈ వర్సిటీల...

Unni mukundan: నా ఇమేజ్‌ను దెబ్బతీసేందుకే అలా చేస్తున్నాడు: మేనేజర్‌ ఫిర్యాదుపై ఉన్ని ముకుందన్‌

తన ఇమేజ్‌ను దెబ్బతీసేందుకు మేనేజర్‌ విపిన్‌ ప్రయత్నిస్తున్నాడని మలయాళ నటుడు ఉన్ని ముకుందన్‌ అన్నారు. విపిన్‌ ఫిర్యాదుపై ...

Gold: సెప్టిక్‌ ట్యాంక్‌లో బంగారం కోసం గాలింపు.. ఊపిరాడక నలుగురి మృతి

సెప్టిక్‌ ట్యాంక్‌లో బంగారం వెతికేందుకు వెళ్లిన నలుగురు కూలీలు ప్రాణాలు కోల్పోయిన ఘటన రాజస్థాన్‌లో చోటుచేసుకుంది.  ఇంటర్...

Top