Gold: సెప్టిక్ ట్యాంక్లో బంగారం కోసం గాలింపు.. ఊపిరాడక నలుగురి మృతి
Gold: సెప్టిక్ ట్యాంక్లో బంగారం కోసం గాలింపు.. ఊపిరాడక నలుగురి మృతి"
Play all audios:
సెప్టిక్ ట్యాంక్లో బంగారం వెతికేందుకు వెళ్లిన నలుగురు కూలీలు ప్రాణాలు కోల్పోయిన ఘటన రాజస్థాన్లో చోటుచేసుకుంది. ఇంటర్నెట్ డెస్క్: సెప్టిక్ ట్యాంక్లో పేరుకుపోయిన బంగారం మడ్డిని
తీసుకురావడానికి అందులోకి వెళ్లి నలుగురు కూలీలు ప్రాణాలు పోగొట్టుకున్న ఘటన రాజస్థాన్లోని జైపుర్లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జైపుర్లోని ఒక జ్యువెలరీ
షాపు యజమాని వికాస్ మెహతా బంగారం వెండిని తమ సిబ్బంది ప్రాసెసింగ్ చేస్తున్న సమయంలో అందులో కొంత మొత్తం సెప్టిక్ ట్యాంక్లో పేరుకుపోయినట్లు గుర్తించారు. వాటిని బయటకు తీయాలని సోమవారం అతడు
ఎనిమిది మంది కూలీలను అడగగా మొదట వారు నిరాకరించారు. బంగారు రజను తీసుకువస్తే అదనంగా డబ్బులు ఇస్తామని షాపు యజమాని ఆశ చూపడంతో చివరికి అంగీకరించారు. సెప్టిక్ ట్యాంక్లోకి దిగేటప్పుడు వారు
ఎటువంటి భద్రతా పరికరాలు తీసుకెళ్లకపోవడంతో.. గాలింపు సమయంలో ఊపిరాడక ఎనిమిది మంది కార్మికులు స్పృహ కోల్పోయారు. వారిని బయటకు తీయగా ఉత్తరప్రదేశ్కు చెందిన రోహిత్ పాల్, సంజీవ్ పాల్, హిమాంగ్షు
సింగ్, అర్పిత్ యాదవ్ అనే నలుగురు కూలీలు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మరో నలుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఫోరెన్సిక్ నిపుణులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఎటువంటి భద్రతా
చర్యలు లేకుండా భూగర్భ సెప్టిక్ ట్యాంక్లోకి కార్మికులను పంపడంపై దర్యాప్తు చేస్తున్నామని అన్నారు. అందులో నిజంగానే బంగారు రజను ఉందా అనే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆభరణాల షాపు
యజమాని, కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకుంటామన్నారు. దీనిపై మాజీ ముఖ్యమంత్రి అశోక్ గహ్లాత్ స్పందిస్తూ..సెప్టిక్ ట్యాంకులలోకి దిగి పారిశుధ్య కార్మికులు మరణిస్తున్న ఘటనలు రాష్ట్రంలో వరుసగా
చోటుచేసుకుంటున్నాయని అన్నారు. వాటిని శుభ్రపరిచేందుకు యంత్రాలను కొనుగోలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ.. చర్యలు మాత్రం తీసుకోవట్లేదని విమర్శించారు. పారిశుధ్య కార్మికుల భద్రతపై రాష్ట్ర
ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
Trending News
Vastu: అప్పులు, ఆర్థిక కష్టాలు తీరాలంటే, ఇంట్లో 7 మార్పులు చెయ్యండిగ్లాస్ విండో: మీకు అప్పుల బాధ తీరిపోవాలంటే, ఈశాన్యం దిక్కులో ఓ గ్లాస్ కిటికీని అమర్చండి. మీ ఇల్లు, షాప్ ఏదైనా సరే, ఈశ్యా...
దర్యాప్తునకు ముందే స్టే ఎలా ఇస్తారు..?సాక్షి, న్యూఢిల్లీ: ‘గత విచారణ సందర్భంగానే మీకు చెప్పాం. ఇలా దర్యాప్తు ప్రారంభం కూడా కాకముందే స్టే ఆర్డర్లు ఇవ్వడాన్ని మ...
Pm narendra modi inaugurates 'maitri setu' between india and bangladesh - key pointsBangladesh Prime Minister Sheikh Hasina also virtually addressed the function organised to inaugurate the double lane Fe...
నగరంలో ట్రాఫిక్ ఆంక్షలుసాక్షి, సిటీబ్యూరో: మొహర్రం ఊరేగింపు నేపథ్యంలో మంగళవారం పాతబస్తీ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఎలాంటి అవ...
17న ఎంగిలిపూల బతుకమ్మఫైల్ ఫోటో సాక్షి, హన్మకొండ: ఈ ఏడాది అధిక ఆశ్వయుజం వచ్చినందున ఎంగిలిపూల బతుకమ్మ, సద్దుల బతుకమ్మ పండుగలు ఎప్పుడు జరుపుకోవ...
Latests News
Gold: సెప్టిక్ ట్యాంక్లో బంగారం కోసం గాలింపు.. ఊపిరాడక నలుగురి మృతిసెప్టిక్ ట్యాంక్లో బంగారం వెతికేందుకు వెళ్లిన నలుగురు కూలీలు ప్రాణాలు కోల్పోయిన ఘటన రాజస్థాన్లో చోటుచేసుకుంది. ఇంటర్...
Anchor sreemukhi : ఆకుపచ్చ రంగు లంగా ఓణీలో మరింత అందంగా యాంకర్ శ్రీముఖి.. పిక్స్ వైరల్..CNN18 name, logo and all associated elements ® and © 2017 Cable News Network LP, LLLP. A Time Warner Company. All rights...
Shashi tharoor: నా వ్యాఖ్యల్ని వక్రీకరించారు.. విమర్శలపై స్పందించిన శశిథరూర్ఇంటర్నెట్డెస్క్: భాజపా అనుకూల వ్యాఖ్యలు చేస్తున్న కాంగ్రెస్ నాయకుడు శశిథరూర్ (Shashi Tharoor)పై ఆ పార్టీ సహచరుడు ఉది...
Operation sindoor outreach: ఉగ్రదాడులను సహించేది లేదు.. అమెరికాలో శశిథరూర్ బృందంఇంటర్నెట్డెస్క్: ఉగ్ర దాడులపై భారత్ మౌనంగా ఉండదని కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ (Shashi Tharoor) స్పష్టం చేశారు. ఉ...
High court: తెలంగాణ హైకోర్టు సీజేగా జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ పేరు సిఫార్సుతెలంగాణ హైకోర్టు (Telangana High Court) సీజేగా జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ పేరును సుప్రీంకోర్టు (Supreme Court) కొలీ...