Earthquake: ఢిల్లీని వణికించిన భూకంపం.. అర్ధరాత్రి జనం పరుగులు.. నేపాల్లో పలువురు మృతి
Earthquake: ఢిల్లీని వణికించిన భూకంపం.. అర్ధరాత్రి జనం పరుగులు.. నేపాల్లో పలువురు మృతి"
Play all audios:
Published by: Last Updated:November 09, 2022 6:11 AM IST నేపాల్ (NEPAL EARTHQUAKE)లో సంభవించిన భారీ భూకంపం ధాటికి దేశ రాజధాని ఢిల్లీతో పాటు యూపీ, బీహార్, మణిపూర్లోని కొన్ని చోట్ల కూడా
భూప్రకంపనలు సంభించాయి. భూకంప ధాటికి దేశరాజధాని ఢిల్లీ (Delhi Earthquake) వణికిపోయింది. అర్ధరాత్రి తర్వాత 01.57 గంటల సమయంలో ఢిల్లీ-ఎన్సిఆర్తో పాటు ఉత్తర భారత దేశంలోని పలు ప్రాంతాల్లో
భూప్రకంపనలు సంభవించాయి. ఢిల్లీ నుంచి నేపాల్ (NEPAL), చైనా (China) వరకు భూప్రకంపనలు నమోదయ్యాయి. దాదాపు 20 సెకన్ల పాటు భూమి కంపించింది. నేపాల్లోని బుధాకోట్ ప్రాంతానికి 3 కి.మీ దూరంలో..
భూమికి 10 కి.మీ. లోతులో భారీ భూంకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (NCS) తెలిపింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.3గా నమోదైనట్లు వెల్లడించింది. యునైటెడ్ స్టేట్ జియోలాజికల్
సర్వే (USGS) మాత్రం 5.6 తీవ్రత నమోదయినట్లు తెలిపింది. advertisement నేపాల్ (Nepal Earthquake)లో సంభవించిన భారీ భూకంపం ధాటికి దేశ రాజధాని ఢిల్లీతో పాటు యూపీ, బీహార్ , మణిపూర్లోని కొన్ని
చోట్ల కూడా భూప్రకంపనలు సంభించాయి. అర్ధరాత్రి భూమి ఒక్కసారిగా కుదుపుకు గురైనట్లు తమకు అనిపించిందని ఢిల్లీకి చాలా మంది ప్రజలు చెబుతున్నారు. రాత్రివేళల్లో ఆఫీసుల్లో పనిచేసే వారికి కూడా ఈ
అనుభవం ఎదురయింది. ఎర్త్ క్వేక్ అలారమ్ మోగడంతో ఆఫీసుల నుంచి ఉద్యోగులు పరుగులు పెట్టారు. మంచాలు కదిలినట్లుగా అనిపించడంతో స్థానిక ప్రజలు కూడా భయాందోళనకు గురయ్యారు. ఇళ్లు, ఆఫీసుల నుంచి బయటకు
వచ్చారు. మళ్లీ 10, 15 నిమిషాల తర్వాతే తిరిగి లోపలికి వెళ్లిపోయారు. advertisement ఈ భూకంపానికి కొన్ని గంటల ముందు కూడా భూమి కంపించింది. నవంబరు 9 మంగళవారం రాత్రి 8.52 గంటలక సమయంలో
ఉత్తరప్రదేశ్లోని అనేక జిల్లాల్లో ప్రకంపనలు సంభవించాయి. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 4.9గా నమోదైంది. ఈ భూకంప కేంద్రం ఉత్తరాఖండ్, నేపాల్ సరిహద్దులో ఉంది. ఈ భూకంపం కూడా భూమికి 10 కి.మీ.
లోతులో ఉన్నట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. advertisement advertisement భూకంపం వల్ల మనదేశంలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగనప్పటికీ.. నేపాల్లో మాత్రం విధ్వంసం సృష్టించినట్లు
తెలుస్తోంది. ఇప్పటి వరకు ముగ్గురు చనిపోయినట్లుగా సమాచారం అందుతోంది. దోతి జిల్లాలో ఇల్లు కూలి ముగ్గురు మరణించారు. పలు చోట్ల ఇళ్లు దెబ్బతిన్నాయి. ఆయా ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశముంది. Location : Hyderabad,Hyderabad,Telangana First Published : November 09, 2022 5:58 AM IST Read More
Trending News
Kondagattu: కొండగట్టులో హనుమాన్ జయంతి వేడుకలు.. పోటెత్తిన భక్తులుజగిత్యాల: హనుమాన్ జయంతి సందర్భంగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొండగట్టు (Kondagattu)కు భక్తులు భారీగా తరలివచ్చారు. అంజన్నన...
Hydra: పీర్జాదిగూడలో అక్రమ నిర్మాణాలు కూల్చేసిన హైడ్రాహైదరాబాద్: మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని పీర్జాదిగూడ పరిధిలో అక్రమ నిర్మాణాలను హైడ్రా (HYDRA) కూల్చివేసింది. పోలీసు బం...
North korea: కిమ్ ప్రారంభించడానికి వెళ్లిన యుద్ధనౌకకు డ్యామేజీఇంటర్నెట్డెస్క్: ఉత్తరకొరియా (North Korea) ఇటీవల 5వేల టన్నుల సామర్థ్యమున్న విధ్వంసక నౌకను రూపొందించిన సంగతి తెలిసిందే....
Canada: అమెరికా ‘గోల్డెన్ డోమ్’ ప్రాజెక్టులో చేరికపై చర్చిస్తున్నాం: కెనడా ప్రధానిఅమెరికా నిర్మిస్తున్న గోల్డెన్ డోమ్ నిర్మాణంలో భాగం అయ్యేందుకు చర్చలు జరుపుతున్నామని కెనడా ప్రధాని మార్క్ కార్నీ పేర్...
Colonel sofiya qureshi: మొసలి కన్నీళ్లా.. కర్నల్పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మంత్రికి సుప్రీం చీవాట్లుదిల్లీ: ఆర్మీ అధికారిణి కర్నల్ సోఫియా ఖురేషి (Colonel Sofiya Qureshi)పై అనుచిత వ్యాఖ్యలు చేసిన మధ్యప్రదేశ్ మంత్రి కున్వ...
Latests News
Siddipet news | latest siddipet news - eenaduపంటలను ముంచిన వడగళ్లు రాష్ట్రంలో అకాల వర్షాలు, వడగళ్ల వానలు హడలెత్తిస్తున్నాయి. ఆదివారం కురిసిన వర్షాలతో జనగామ, సిద్దిపే...
Ncb recovers cannabis from comedian bharti singh, husband haarsh limbachiyaa's mumbai residenceBharti Singh’s name had cropped up during the interrogation of a drug peddler, after which her residence was searched, a...
Palnadu news | latest palnadu news - eenadu‘విజయసాయిరెడ్డి, గోపిరెడ్డి ఒత్తిడితోనే.. మాజీ సభాపతి కోడెలపై కేసు’ వైకాపా మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి, ఆ పార్టీ నేత, మాజీ ...
Ap eapcet: ఏపీ-ఈఏపీసెట్ హాల్టికెట్లు.. డౌన్లోడ్ కోసం క్లిక్ చేయండిఏపీ-ఈఏపీసెట్-2025కు (AP EAPCET 2025) సంబంధించిన హాల్టికెట్లను ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. By Features Desk Publi...
Ipl 2025: వర్షం పడి mi vs dc మ్యాచ్ రద్దైతే ఎవరి పరిస్థితి ఏంటి?ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ (IPL) 2025 సీజన్లో భాగంగా ఈ రోజు ముంబయి ఇండియన్స్ (Mumbai Indians), దిల్లీ క్యాపిటల్స్ (D...