India-pakistan: పాక్ ఊసరవెల్లి మాటలు నమ్మొద్దు: బలోచ్ లిబరేషన్ ఆర్మీ
India-pakistan: పాక్ ఊసరవెల్లి మాటలు నమ్మొద్దు: బలోచ్ లిబరేషన్ ఆర్మీ"
Play all audios:
ఇంటర్నెట్డెస్క్: ‘ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor)’ తర్వాత సైనిక ఘర్షణను ఆపేందుకు భారత్-పాకిస్థాన్ (India-Pakistan) మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో
పాకిస్థాన్లో వేర్పాటువాద బలోచ్ లిబరేషన్ ఆర్మీ స్పందించింది. పాక్ ఊసరవెల్లి మాటలు నమ్మవద్దని వ్యాఖ్యలు చేసింది. ‘‘పాకిస్థాన్ నుంచి వినిపించే శాంతి, కాల్పుల విరమణ, సోదరభావం ప్రవచనాలు కేవలం
మోసం. అవి ఒక యుద్ధ వ్యూహం.. తాత్కాలిక ఉపాయం మాత్రమే’’ అని బలోచ్ పేర్కొంది. ఈనేపథ్యంలో ఆ దేశంతో అప్రమత్తంగా ఉండాలని పరోక్షంగా భారత్కు సూచించింది (Baloch Liberation Army) ఫారిన్
ప్రాక్సీ(విదేశీ మద్దతు ఉన్న) అంటూ వస్తోన్న విమర్శలను తోసిపుచ్చింది. ‘‘మేము కీలుబొమ్మలం కాదు. అలాగే మౌనంగా చూస్తూ ఉండిపోము. ఈ ప్రాంతానికి సంబంధించి ప్రస్తుత, భవిష్యత్తు సైనిక, రాజకీయ,
వ్యూహాత్మక నిర్మాణంలో మాకు సరైన స్థానం ఉంది. మా పాత్ర గురించి మాకు పూర్తిగా తెలుసు’’ అని వెల్లడించింది. తనను తాను డైనమిక్, నిర్ణయాత్మక పార్టీగా అభివర్ణించుకుంది. పాకిస్థాన్లోని
బలోచిస్థాన్ ప్రావిన్సులో చమురు, బొగ్గు, బంగారం, రాగి, సహజ వాయువు తదితర వనరులు పుష్కలంగా ఉన్నాయి. వీటి ఆదాయం పాక్ ఖజానా నింపుతోంది. అయితే, దేశ వ్యవసాయ యోగ్య భూమిలో ఆ రాష్ట్ర వాటా కేవలం 5
శాతం మాత్రమే. అక్కడ కఠినమైన ఎడారి వాతావరణం ఉంటుంది. పేదరికం కూడా ఎక్కువే. జనాభా తక్కువగా ఉండటంతో అభివృద్ధికి దూరమైంది. ఫలితంగా రాజకీయ అనిశ్చితి నెలకొని.. వేర్పాటువాదులు శక్తిమంతమయ్యారు.
ప్రత్యేక దేశంగా ఏర్పడాలని ఇక్కడి ప్రజలు కొన్ని దశాబ్దాలుగా పోరాడుతున్నారు. భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతోన్న తరుణంలో బలోచిస్థాన్ ప్రావిన్స్లోని కాలత్ జిల్లా మంగోచర్
పట్టణాన్ని తాము స్వాధీనం చేసుకున్నట్లు శనివారం బలోచ్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) ప్రకటించిన సంగతి తెలిసిందే. 51 లక్ష్యాలపై దాడులు చేసినట్లు వెల్లడించింది. అయితే దానిపై అధికారికంగా ఏ ప్రకటనా
రాలేదు. శుక్రవారం కూడా పాక్ ఆర్మీ సిబ్బందిపై తిరుగుబాటుదారులు దాడి చేయగా.. 22 మంది సైనికులు మరణించినట్లు వార్తలు వచ్చాయి. అయితే దీనిపై ఎలాంటి అధికారిక సమాచారం లేదు. సుమారు 425 మంది
ప్రయాణికులతో క్వెట్టా నుంచి పెషావర్కు వెళుతున్న జాఫర్ ఎక్స్ప్రెస్ను మార్చి నెలలో బలోచ్ వేర్పాటువాదులు బోలన్ ప్రాంతంలో హైజాక్ చేసిన సంగతి తెలిసిందే.
Trending News
20 వరకు కట్టుదిట్టంగా లాక్డౌన్సాక్షి, హైదరాబాద్ : కరోనా వ్యాప్తి నివారణ కోసం రాష్ట్రంలో లాక్డౌన్ బాగా అమలవుతోందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు పే...
Ap eapcet 2025: ఏపీ ఈఏపీసెట్ రాస్తున్నారా? మీ సందేహాలకు సమాధానాలివిగోAP EAPCET 2025: ఏపీ ఈఏపీసెట్ పరీక్ష రాసే విద్యార్థుల సందేహాలు.. వాటికి సమాధానాలేంటో చూద్దాం..! By Features Desk Publish...
నేత కార్మికులకు అండగా సీఎం జగన్'ధనవంతులవ్వడం చాలా సులభం': రాబర్ట్ కియోసాకి ఆర్ధిక సంక్షోభం, మార్కెట్ క్రాష్ గురించి చెప్పిన రిచ్ డాడ్ పూర్ డా...
Supreme court: ఆశ్రయం ఇచ్చేందుకు భారత్ ధర్మసత్రం కాదు: సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలుదిల్లీ: ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే శరణార్థులకు ఆశ్రయం కల్పించేందుకు భారత్ ఉచిత సత్రం కాదని సుప్రీం కోర్టు (Supreme Cou...
Virat kohli: కోహ్లీ మరికొంతకాలం టెస్ట్ క్రికెట్లో కొనసాగాల్సింది: సయ్యద్ కిర్మాణివిరాట్కోహ్లీ ఇంకొంతకాలం ఆడి ఉండాల్సింది. అతడిలో ఇంకా ఎంతో టెస్ట్ క్రికెట్ దాగిఉందని టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ సయ్య...
Latests News
India-pakistan: పాక్ ఊసరవెల్లి మాటలు నమ్మొద్దు: బలోచ్ లిబరేషన్ ఆర్మీఇంటర్నెట్డెస్క్: ‘ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor)’ తర్వాత సైనిక ఘర్షణను ఆపేందుకు భారత్-పాకిస్థాన్ (India-Pakis...
Congress-brs: ధర్మారంలో కాంగ్రెస్, భారాస పోటాపోటీ ప్రదర్శనలు.. ఉద్రిక్తతపెద్దపల్లి జిల్లా ధర్మారంలో కాంగ్రెస్(Congress), భారాస (BRS) పోటాపోటీ ప్రదర్శనలతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ధర్మారం: పెద...
Paytm q4 results: పేటీఎం నష్టం రూ. 545 కోట్లు.. ఆదాయంలోనూ క్షీణతPaytm Q4 Results | ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ ఫిన్టెక్ సంస్థ పేటీఎం (వన్97 కమ్యూనికేషన్స్) త్రైమాసిక ఫలితాలను (Paytm...
Eps opens buttermilk stalls in tamil nadu's konganapuram, edappadiSALEM: AIADMK general secretary Edappadi K Palaniswami on Saturday inaugurated buttermilk stalls set up by party members...
Chiranjeevi's niece niharika konidela headed for split with husband chaitanya?Chiranjeevi's niece Niharika Konidela married Chaitanya Jonnalagadda in December 2020 with friends and family in at...