Supreme court: ఆశ్రయం ఇచ్చేందుకు భారత్‌ ధర్మసత్రం కాదు: సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

Eenadu

Supreme court: ఆశ్రయం ఇచ్చేందుకు భారత్‌ ధర్మసత్రం కాదు: సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు"

Play all audios:

Loading...

దిల్లీ: ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే శరణార్థులకు ఆశ్రయం కల్పించేందుకు భారత్‌ ఉచిత సత్రం కాదని సుప్రీం కోర్టు (Supreme Court) వ్యాఖ్యానించింది. మన దేశంలో ఆశ్రయం కోరుతూ శ్రీలంక జాతీయుడు (Sri


Lankan National) వేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. ఇక్కడ సెటిల్‌ అయ్యేందుకు మీకేం హక్కు ఉందని ధర్మాసనం ప్రశ్నించింది. అసలేం జరిగిందంటే.. నిషేధిత


సంస్థ లిబరేషన్‌ టైగర్స్‌ ఆఫ్‌ తమిళ్ ఈలం (ఎల్‌టీటీఈ)తో సంబంధాలున్నాయని ఆరోపణలతో 2015లో శ్రీలంకకు చెందిన ఓ వ్యక్తిని తమిళనాడు పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో విచారణ జరిపిన ట్రయల్‌ కోర్టు..


చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం కింద 2018లో అతడిని దోషి తేలుస్తూ 10 ఏళ్ల శిక్ష ఖరారు చేసింది. * మొసలి కన్నీళ్లా.. కర్నల్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మంత్రికి సుప్రీం చీవాట్లు అనంతరం


ఆ వ్యక్తి మద్రాసు హైకోర్టును ఆశ్రయించగా.. శిక్షను ఏడేళ్లకు తగ్గిస్తూ ఉన్నత న్యాయస్థానం తీర్పు వెలువరించింది. అయితే, శిక్ష పూర్తి కాగానే దేశం విడిచి వెళ్లిపోవాలని స్పష్టం చేసింది. దీనిపై


నిందితుడు సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. తాను చట్టబద్ధమైన వీసాపైనే భారత్‌కు వచ్చానని, స్వదేశంలో తన ప్రాణాలకు ముప్పు ఉందని పేర్కొన్నాడు. అంతేగాక, తన భార్యాపిల్లలు ఈ దేశంలోనే సెటిల్‌ అయ్యారని


తెలిపాడు. తనకు ఇక్కడే ఆశ్రయం (refuge) కల్పించాలని కోరాడు. దీనికి జస్టిస్‌ దీపాంకర్‌ దత్తా, జస్టిస్‌ కె. వినోద్‌ చంద్రన్‌ ధర్మాసనం స్పందిస్తూ పిటిషనర్‌పై అసహనం వ్యక్తం చేసింది. ‘‘ప్రపంచం


నలుమూలల నుండి వచ్చే శరణార్థులకు భారతదేశం ఆశ్రయం ఇవ్వాలా? ఇప్పటికే మా దేశంలో 140 కోట్ల మంది జనాభా ఉంది. అన్ని దేశాల నుంచి వచ్చే వారిని ఆదరించేందుకు భారత్‌ ధర్మశాల కాదు’’ అని ధర్మాసనం స్పష్టం


చేసింది. ఇక్కడ సెటిల్‌ అయ్యేందుకు మీకేం హక్కు ఉందని ప్రశ్నించింది. దీనికి పిటిషనర్‌ తరఫు న్యాయవాది స్పందిస్తూ.. శ్రీలంకలో అతడి ప్రాణాలకు ముప్పు ఉందని తెలిపారు. అలాగైతే మరో దేశానికి వెళ్లండని


సుప్రీం కోర్టు సూచించింది.


Trending News

20 వరకు కట్టుదిట్టంగా లాక్‌డౌన్‌

సాక్షి, హైదరాబాద్‌ : కరోనా వ్యాప్తి నివారణ కోసం రాష్ట్రంలో లాక్‌డౌన్‌ బాగా అమలవుతోందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పే...

Virat kohli: కోహ్లీ మరికొంతకాలం టెస్ట్‌ క్రికెట్‌లో కొనసాగాల్సింది: సయ్యద్‌ కిర్మాణి

విరాట్‌కోహ్లీ ఇంకొంతకాలం ఆడి ఉండాల్సింది. అతడిలో ఇంకా ఎంతో టెస్ట్‌ క్రికెట్‌ దాగిఉందని టీమ్‌ ఇండియా మాజీ క్రికెటర్‌ సయ్య...

Ap eapcet 2025: ఏపీ ఈఏపీసెట్‌ రాస్తున్నారా? మీ సందేహాలకు సమాధానాలివిగో

AP EAPCET 2025: ఏపీ ఈఏపీసెట్‌ పరీక్ష రాసే విద్యార్థుల సందేహాలు.. వాటికి సమాధానాలేంటో చూద్దాం..! By Features Desk Publish...

నాలుగేళ్ల ప్రేమ విషాదాంతం

శిరీష, వెంకటేష్‌ _నాలుగేళ్ల వాళ్ల ప్రేమ విషాదంతో ముగిసింది. కొద్ది రోజుల్లో పెళ్లి చేస్తామని పెద్ద వాళ్లు చెప్పినా ఇంతలో...

Sangameswara temple: అమృత గుండం.. ఒక్కసారి స్నానం చేస్తే చాలు..

Reported by: Published by: Last Updated:August 18, 2024 1:11 PM IST ఈ ఆలయం పూర్వం నాటి పాలకులు కుబేర భూపాల్ అనే రాజు నిర...

Latests News

Supreme court: ఆశ్రయం ఇచ్చేందుకు భారత్‌ ధర్మసత్రం కాదు: సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

దిల్లీ: ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే శరణార్థులకు ఆశ్రయం కల్పించేందుకు భారత్‌ ఉచిత సత్రం కాదని సుప్రీం కోర్టు (Supreme Cou...

Mission swacchata aur paani: "స్వచ్ఛతా కి పాఠశాల"ను దేశమంతటా అనుకరించాలి

మరుగుదొడ్ల లభ్యత సమస్యగా ఉండదు. అయినప్పటికీ, పరిశుభ్రత ఇప్పటికీ సమస్యగా ఉంది. మరుగుదొడ్డిని కనుగొనడం వల్ల వచ్చే నిరాశను ...

Pm modi: ఆదంపుర్‌ ఎయిర్‌బేస్‌కు వెళ్లిన ప్రధాని మోదీ

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రధాని నరేంద్రమోదీ (Narendra Modi) మంగళవారం పంజాబ్‌లోని ఆదంపుర్ ఎయిర్‌బేస్‌ (Adampur air base)ను సంద...

Russia: కస్క్‌ రీజియన్‌లో పుతిన్‌ పర్యటన..

Russia ఇంటర్నెట్‌డెస్క్‌: కస్క్‌ ప్రాంతాన్ని ఉక్రెయిన్‌ బలగాల నుంచి తిరిగి స్వాధీనం చేసుకొన్నాక తొలిసారి రష్యా అధ్యక్షుడ...

Kajal aggarwal: బీచ్‌లో బికినీతో రెచ్చిపోయిన కాజల్ అగర్వాల్..

CNN18 name, logo and all associated elements ® and © 2017 Cable News Network LP, LLLP. A Time Warner Company. All rights...

Top