Preity zinta: వివాదంలో పంజాబ్‌ జట్టు.. కోర్టుకెక్కిన ప్రీతి జింటా

Eenadu

Preity zinta: వివాదంలో పంజాబ్‌ జట్టు.. కోర్టుకెక్కిన ప్రీతి జింటా"

Play all audios:

Loading...

ఇంటర్నెట్‌ డెస్క్‌: పంజాబ్‌ కింగ్స్‌ (Punjab Kings) జట్టులో వివాదం చెలరేగింది. ఆ జట్టు సహ యజమాని, బాలీవుడ్‌ నటి ప్రీతి జింటా (Preity Zinta) కోర్టుకెక్కింది. జట్టు సహ డైరెక్టర్లు అయిన మోహిత్‌


బుర్మాన్‌, నెస్‌ వాడియాపై చండీగఢ్‌ కోర్టులో కేసు వేసింది. నిబంధనలకు విరుద్ధంగా వీరు సమావేశం నిర్వహించారంటూ పిటిషన్‌ వేసింది. వీరు ముగ్గురు కేపీహెచ్‌ డ్రీమ్‌ క్రికెట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌


డైరెక్టర్లుగా ఉన్నారు. ఐపీఎల్‌ (IPL) లోని పంజాబ్‌ కింగ్స్‌ (Punjab Kings) జట్టు ఈ కంపెనీదే. గత నెల 21న నిర్వహించిన సర్వసభ్య సమావేశం(EGM) చట్టబద్ధతను ప్రీతి జింటా కోర్టులో సవాలు చేసింది.


కంపెనీ చట్టం 2013 ప్రకారం ఎలాంటి నిబంధనలు పాటించకుండానే ఈ సమావేశాన్ని నిర్వహించారని తన పిటిషన్‌లో పేర్కొంది. ఈ భేటీకి సంబంధించి అభ్యంతరాలను తాను ఏప్రిల్‌ 10నే ఈమెయిల్‌ రూపంలో


తెలియజేసినప్పటికీ పట్టించుకోలేదని ఆమె పేర్కొంది. నెస్‌ వాడియా మద్దతుతో మోహిత్‌ బర్మాన్‌ ఈ సమావేశాన్ని నిర్వహించారని ఆరోపించింది. తాను, మరో డైరెక్టర్‌ కరణ్‌ పాల్‌ ఈ సమావేశానికి


హాజరైనప్పటికీ.. ఈ సమావేశం చట్టబద్ధత చెల్లదని ప్రకటించాలని ప్రీతి జింటా కోర్టును కోరింది. ఈ సమావేశంలో మునీశ్‌ ఖన్నాను డైరెక్టర్‌గా నియమించడాన్ని ప్రీతి జింటా, పాల్‌ వ్యతిరేకించారు.


డైరెక్టర్‌గా ఖన్నా నియామకాన్ని నిలిపివేయాలని ఆమె తన పిటిషన్‌లో కోర్టును కోరింది. ఈ భేటీలో తీసుకున్న నిర్ణయాలను కంపెనీ అమలుచేయకుండా చూడాలని అభ్యర్థించింది. ఈ కేసు పరిష్కారం అయ్యేవరకూ.. తాను,


కరణ్‌పాల్‌ లేకుండా బోర్డు సమావేశాలు నిర్వహించకుండా చూడాలని ప్రీతి జింటా కోర్టును కోరారు. * గుజరాత్‌కు పంచ్‌.. లఖ్‌నవూ చేతిలో ఓటమి బోర్డులో వివాదాలు ఉన్నప్పటికీ.. ప్రీతి జింటా పంజాబ్‌


కింగ్స్‌ మ్యాచ్‌లకు హాజరై స్టేడియంలో జట్టుకు మద్దతుగా నిలిచింది. ఆటగాళ్లను ప్రోత్సహించింది. ఇక శ్రేయస్‌ అయ్యర్‌ నేతృత్వంలో పంజాబ్‌ కింగ్స్‌ ఈ సీజన్‌లో అద్భుతంగా  రాణిస్తున్న విషయం తెలిసిందే.


11 ఏళ్ల అనంతరం ఆ జట్టు ప్లేఆఫ్స్‌కు చేరింది. టాప్‌ 2లో స్థానం లక్ష్యంగా ముందుకుసాగుతోంది. 


Trending News

duduku | TechCrunch

SAVE NOW THROUGH JUNE 4 FOR TECHCRUNCH SESSIONS: AI SAVE $300 ON YOUR TICKET TO TC SESSIONS: AI—AND GET 50% OFF A SECOND...

‘క్రికెట్‌ సెలక్షన్‌’ను ప్రత్యక్ష ప్రసారం చేయాలి

ముంబై: భారత క్రికెటర్, బెంగాల్‌ రంజీ జట్టు మాజీ కెప్టెన్‌ మనోజ్‌ తివారీ భారత సెలక్షన్‌ కమిటీ తీరుపై విరుచుకుపడ్డాడు. జట్...

Ipl 2023 young guns : టీమిండియాకు వరల్డ్ కప్ కావాలా నాయనా.. అయితే, ఈ ముగ్గుర్ని జట్టులోకి తీసుకోండి..!

జైస్వాల్, రింకూ సింగ్, తిలక్ వర్మలు త్వరలోనే టీమిండియాకు ఎంపికయ్యే అవకాశం ఉన్నట్లు వార్తలు కూడా వస్తున్నాయి. అసలకే ఈ ఏడా...

Jairam ramesh: 21 రోజుల్లో 11 సార్లు ట్రంప్‌ నోట అదే మాట.. మోదీ స్పందనేదీ? : జైరాం రమేశ్‌

Jairam Ramesh: భారత్‌, పాక్‌ మధ్య ఉద్రిక్తతలను తానే తగ్గించానని ట్రంప్‌ చేస్తోన్న ప్రకటనలపై కాంగ్రెస్‌ సీనియర్ నేత జైరాం...

Ap dsc hall tickets: ఏపీలో వాట్సప్‌ ద్వారా మెగా డీఎస్సీ హాల్‌ టికెట్లు

ఏపీలో మెగా డీఎస్సీ హాల్‌ టికెట్లు విడుదలయ్యాయి. వాట్సప్‌ ద్వారా  హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకునే అవకాశం కల్పించారు. AP...

Latests News

Preity zinta: వివాదంలో పంజాబ్‌ జట్టు.. కోర్టుకెక్కిన ప్రీతి జింటా

ఇంటర్నెట్‌ డెస్క్‌: పంజాబ్‌ కింగ్స్‌ (Punjab Kings) జట్టులో వివాదం చెలరేగింది. ఆ జట్టు సహ యజమాని, బాలీవుడ్‌ నటి ప్రీతి జ...

Tirumala: శ్రీవారి మెట్టు మార్గంలో చిరుత.. ఆ ప్రచారం ఫేక్‌

శ్రీవారి మెట్టు మార్గంలో ఆదివారం ఉదయం చిరుత సంచరించిందనే వార్తలు అవాస్తవమని అటవీ శాఖ ఎఫ్ఆర్‌వో దొరైస్వామి తెలిపారు. తిరు...

Jahnvi kapoor: జాన్వీని విపరీతంగా ట్రోల్‌ చేశారు కానీ.. : దర్శకుడు వ్యాఖ్యలు

జాన్వీకపూర్‌ (Jahnvi kapoor)ను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు బాలీవుడ్‌ దర్శకుడు. ఆమెను ఎంతోమంది ట్రోల్‌ చేశారని అ...

Realme gt 7: రియల్‌మీ జీటీ సిరీస్‌లో కొత్త ఫోన్లు.. ధర, ఫీచర్లు ఇవే..

Realme GT 7 | ఇంటర్నెట్‌ డెస్క్‌: మొబైల్‌ తయారీ సంస్థ రియల్‌మీ మిడ్‌ రేంజ్‌లో జీటీ సిరీస్‌లో కొత్త ఫోన్లను లాంచ్ చేసింది...

Mumbai rainfall: ముంబయిలో రెడ్‌ అలర్ట్‌: 107 ఏళ్ల నాటి వర్షపాత రికార్డు బద్దలు..

Mumbai rainfall ఇంటర్నెట్‌డెస్క్‌: దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో కుండపోతగా వర్షం కురుస్తోంది. ఆదివారం అర్ధరాత్రి నుంచి సోమ...

Top