Ipl 2025: అలాంటి వారిని రిటైన్ చేసుకోవద్దు: మహమ్మద్‌ కైఫ్‌

Eenadu

Ipl 2025: అలాంటి వారిని రిటైన్ చేసుకోవద్దు: మహమ్మద్‌ కైఫ్‌"

Play all audios:

Loading...

ఇంటర్నెట్‌ డెస్క్‌: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో (Sunrisers Hyderabad) సోమవారం జరిగిన మ్యాచ్‌లో లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌ (Lucknow Super Giants) ఓటమి పాలైంది. ఈ పరాజయంతో లఖ్‌నవూ ప్లేఆఫ్స్‌ రేసు


నుంచి నిష్క్రమించింది. ఆటగాళ్ల గాయాల వల్లే తమ టీమ్‌కు ఈ పరిస్థితి వచ్చిందని రిషభ్‌ పంత్‌ (Rishabh Pant) మ్యాచ్‌ అనంతరం అన్నాడు. మయాంక్‌ యాదవ్‌, మోసిన్‌ఖాన్‌ లాంటి బౌలర్ల సేవలు అందుబాటులో


లేకపోవడం జట్టుకు చేటు చేసిందని అభిప్రాయం వ్యక్తంచేశాడు. దీనిపై టీమ్‌ఇండియా (Team India) మాజీ క్రికెటర్‌ మహమ్మద్‌ కైఫ్‌ (Mohammad Kaif) స్పందించాడు. అలాంటి ఆటగాళ్లను పెద్దమొత్తాలు వెచ్చించి


ప్రాంఛైజీ యాజమాన్యాలు రిటైన్‌ చేసుకోకూడదన్నాడు. ఐపీఎల్ (IPL) 2025 మెగా వేలానికి ముందు లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌ రూ.21 కోట్లతో నికోలస్‌ పూరన్‌, రూ.11 కోట్లతో రవి బిష్ణోయ్‌, మయాంక్‌ యాదవ్‌,


రూ.4 కోట్లు వెచ్చించి మోసిన్‌ ఖాన్‌, ఆయుష్‌ బదోనీని రిటైన్‌ చేసుకుంది. మయాంక్‌ యాదవ్‌ కొన్ని మ్యాచ్‌లకు మాత్రమే అందుబాటులో ఉండగా, మోసిన్‌ ఖాన్‌ ఇప్పటివరకు కనీసం ఒక్క మ్యాచ్‌ కూడా ఆడలేదు.


అలాగే లఖ్‌నవూ వేలంలో దక్కించుకున్న ఆకాశ్‌ దీప్‌ కూడా ఈ సీజన్‌లో అందుబాటులో లేకుండా పోయాడు.  ‘క్రికెట్‌లో ఇవన్నీ సహజమే’ ‘ఇది మా బెస్ట్‌ సీజన్‌ అవుతుందని అనుకున్నాం. కానీ చాలామంది ఆటగాళ్లు


గాయాల వల్ల టీమ్‌కు అందుబాటులో లేకుండా పోయారు. ఈ ఖాళీలను మేం సరిగా భర్తీ చేయలేకపోయాం. నిజానికి మేం ఈ విషయాల గురించి అసలు మాట్లాడకూడదు అనుకున్నాం. కానీ క్రికెట్‌లో ఇవన్నీ సహజమే. మేం ఆడిన


విధానంపై గర్వంగానే ఉన్నాం. నెగిటివ్‌ అంశాలను పక్కనపెట్టి, సానుకూల ధోరణిలోనే ముందుకు సాగుతాం’ అని లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌ సారథి రిషభ్ పంత్‌ అన్నాడు. ‘బౌలింగ్‌ దళమంతా గాయాలతోనే..’ ‘నేనైతే


సీజన్‌ మొత్తం ఆడే ఆటగాళ్ల కోసం డబ్బు వెచ్చించడానికి మొగ్గు చూపుతాను. లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌ జట్టు బౌలింగ్‌ దళమంతా గాయాలతోనే సతమతమవుతోంది. ఆటగాళ్లకు గాయాలు కావని నేను చెప్పడం లేదు. కానీ


ఎక్కువగా గాయాలపాలయ్యే అవకాశమున్న ఆటగాళ్లను పెద్ద మొత్తం వెచ్చించి రిటైన్‌ చేసుకునే బదులు, వారిని వేలంలో తీసుకుంటేనే బాగుంటుంది’ అని మహమ్మద్‌ కైఫ్‌ తన అభిప్రాయం వ్యక్తం చేశాడు. 


Trending News

Chiru’s Khaidi No 150 collects Rs 164 crore

Tollywood megastar Chiranjeevi’s comeback film, Khaidi No 150, released to packed houses for Sankaranti earlier this yea...

Nara lokesh: తిరుమలలో మళ్లీ వైకాపా కుట్రలు మొదలయ్యాయి: మంత్రి నారా లోకేశ్‌

కలియుగ ప్రత్యక్షదైవం వెంకటేశ్వరస్వామి సన్నిధిలో మళ్లీ వైకాపా కుట్రలు మొదలయ్యాయని మంత్రి నారా లోకేశ్‌ ధ్వజమెత్తారు. అమరావ...

Komatireddy venkat reddy | latest komatireddy venkat reddy - eenadu

చరిత్ర పుటల్లో నిలిచే రోజు రాష్ట్రాన్ని సంక్షోభం నుంచి సంక్షేమం వైపు, అవినీతి నుంచి అభివృద్ధి వైపు, విధ్వంసం నుంచి పునర్...

Suzlon: కాసులు కురిపిస్తున్న సుజ్లాన్ ఎనర్జీ షేర్లు.. రూ. 22 నుంచి రూ. 86 దాకా..!

Published by: Last Updated:September 12, 2024 2:58 PM IST STOCK MARKET: స్టాక్ మార్కెట్ లో సుజ్లాన్ ఎనర్జీ షేర్లు దూసుకు...

రామ జన్మభూమి టీజర్ లాంచ్.. ఇంట్రెస్టింగ్ కథతో కొత్త సినిమా

Published by: Last Updated:May 11, 2024 2:50 PM IST ‘రామ జన్మ భూమి’ టైటిల్ తో జై సిద్దార్ద్ హీరోగా కొత్త సినిమా రాబోతోంద...

Latests News

Ipl 2025: అలాంటి వారిని రిటైన్ చేసుకోవద్దు: మహమ్మద్‌ కైఫ్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో (Sunrisers Hyderabad) సోమవారం జరిగిన మ్యాచ్‌లో లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌ (...

Ps vinothraj’s kottukkaali wins grand prix award at amur international film festival

PS Vinothraj’s critically acclaimed film _Kottukkaali _starring Soori and Anna Ben has won the Grand Prix Award at the 2...

కోలుకున్న వారు ప్లాస్మా దానం చేయాలి :శ్రీదేవి

తాడికొండ: కరోనా వైరస్‌ బారిన పడి కోలుకున్న వారు ప్లాస్మాను దానం చేయాలని తాడికొండ ఎమ్మెల్యే, రాష్ట్ర అధికార ప్రతినిధి డాక...

Mumbai malayalees upset with choice of kerala duronto halts

The demand to provide halts at Thane and Panvel for the Kerala-bound Duronto is an old one, with passenger associations,...

Cm revanth reddy: ఉద్యోగాల భర్తీని అడ్డుకుంటున్న వారిని ప్రజలు నిలదీయాలి: సీఎం రేవంత్‌రెడ్డి

హైదరాబాద్‌: అంబేడ్కర్‌ రచించిన రాజ్యాంగం ప్రకారం రిజర్వేషన్లు అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. బాబూ...

Top