Ipl 2025: అలాంటి వారిని రిటైన్ చేసుకోవద్దు: మహమ్మద్ కైఫ్
Ipl 2025: అలాంటి వారిని రిటైన్ చేసుకోవద్దు: మహమ్మద్ కైఫ్"
Play all audios:
ఇంటర్నెట్ డెస్క్: సన్రైజర్స్ హైదరాబాద్తో (Sunrisers Hyderabad) సోమవారం జరిగిన మ్యాచ్లో లఖ్నవూ సూపర్ జెయింట్స్ (Lucknow Super Giants) ఓటమి పాలైంది. ఈ పరాజయంతో లఖ్నవూ ప్లేఆఫ్స్ రేసు
నుంచి నిష్క్రమించింది. ఆటగాళ్ల గాయాల వల్లే తమ టీమ్కు ఈ పరిస్థితి వచ్చిందని రిషభ్ పంత్ (Rishabh Pant) మ్యాచ్ అనంతరం అన్నాడు. మయాంక్ యాదవ్, మోసిన్ఖాన్ లాంటి బౌలర్ల సేవలు అందుబాటులో
లేకపోవడం జట్టుకు చేటు చేసిందని అభిప్రాయం వ్యక్తంచేశాడు. దీనిపై టీమ్ఇండియా (Team India) మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ (Mohammad Kaif) స్పందించాడు. అలాంటి ఆటగాళ్లను పెద్దమొత్తాలు వెచ్చించి
ప్రాంఛైజీ యాజమాన్యాలు రిటైన్ చేసుకోకూడదన్నాడు. ఐపీఎల్ (IPL) 2025 మెగా వేలానికి ముందు లఖ్నవూ సూపర్ జెయింట్స్ రూ.21 కోట్లతో నికోలస్ పూరన్, రూ.11 కోట్లతో రవి బిష్ణోయ్, మయాంక్ యాదవ్,
రూ.4 కోట్లు వెచ్చించి మోసిన్ ఖాన్, ఆయుష్ బదోనీని రిటైన్ చేసుకుంది. మయాంక్ యాదవ్ కొన్ని మ్యాచ్లకు మాత్రమే అందుబాటులో ఉండగా, మోసిన్ ఖాన్ ఇప్పటివరకు కనీసం ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు.
అలాగే లఖ్నవూ వేలంలో దక్కించుకున్న ఆకాశ్ దీప్ కూడా ఈ సీజన్లో అందుబాటులో లేకుండా పోయాడు. ‘క్రికెట్లో ఇవన్నీ సహజమే’ ‘ఇది మా బెస్ట్ సీజన్ అవుతుందని అనుకున్నాం. కానీ చాలామంది ఆటగాళ్లు
గాయాల వల్ల టీమ్కు అందుబాటులో లేకుండా పోయారు. ఈ ఖాళీలను మేం సరిగా భర్తీ చేయలేకపోయాం. నిజానికి మేం ఈ విషయాల గురించి అసలు మాట్లాడకూడదు అనుకున్నాం. కానీ క్రికెట్లో ఇవన్నీ సహజమే. మేం ఆడిన
విధానంపై గర్వంగానే ఉన్నాం. నెగిటివ్ అంశాలను పక్కనపెట్టి, సానుకూల ధోరణిలోనే ముందుకు సాగుతాం’ అని లఖ్నవూ సూపర్ జెయింట్స్ సారథి రిషభ్ పంత్ అన్నాడు. ‘బౌలింగ్ దళమంతా గాయాలతోనే..’ ‘నేనైతే
సీజన్ మొత్తం ఆడే ఆటగాళ్ల కోసం డబ్బు వెచ్చించడానికి మొగ్గు చూపుతాను. లఖ్నవూ సూపర్ జెయింట్స్ జట్టు బౌలింగ్ దళమంతా గాయాలతోనే సతమతమవుతోంది. ఆటగాళ్లకు గాయాలు కావని నేను చెప్పడం లేదు. కానీ
ఎక్కువగా గాయాలపాలయ్యే అవకాశమున్న ఆటగాళ్లను పెద్ద మొత్తం వెచ్చించి రిటైన్ చేసుకునే బదులు, వారిని వేలంలో తీసుకుంటేనే బాగుంటుంది’ అని మహమ్మద్ కైఫ్ తన అభిప్రాయం వ్యక్తం చేశాడు.
Trending News
Vindhya expressway to connect bhopal with singrauli via damoh, rewa, sidhi as madhya pradesh cm announces new projectIndustrial clusters will also be developed along this proposed Vindhya expressway to provide employment to youths from t...
పేదవారి ఆకలి తీర్చటమే వీరి ధ్యేయం..Telugu Edition हिन्दी(Hindi) English(English) বাংলা(Bengali) मराठी(Marathi) ગુજરાતી(Gujarati) অসমীয়া(Assam) ಕನ್ನಡ(Kanna...
Ap inter results 2024 : ఫలించిన అన్నయ్య కష్టం.. ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటిన తమ్ముడుCNN18 name, logo and all associated elements ® and © 2017 Cable News Network LP, LLLP. A Time Warner Company. All rights...
Post office scheme: పోస్టాఫీసులో అద్భుత స్కీం.. రూ. లక్ష పెట్టుబడి పెడితే.. రూ. 2లక్షలు లాభం..ప్రస్తుతం దీనిలో 6.9 శాతం వడ్డీ ఉంది. కిసాన్ వికాస్ పత్రను సర్టిఫికేట్ రూపంలో కొనుగోలు చేయాలి. ఇవి రూ.1000, రూ.5వేలు, రూ...
Hyderabad: వందేభారత్ రైలు..ఎలక్ట్రిక్ గరుడ బస్సు.. విజయవాడకు వెళ్లాలంటే వీటిలో ఏది బెస్ట్?Hyderabad: వందేభారత్ రైలు..ఎలక్ట్రిక్ గరుడ బస్సు.. విజయవాడకు వెళ్లాలంటే వీటిలో ఏది బెస్ట్?Reported by:BONEPALLI KUMARnew...
Latests News
ఈ తండావాసులు చేసిన పనికి.. అందరూ సెల్యూట్ చేస్తున్నారు.. కారణం ఇదే..Reported by: Published by: Last Updated:September 17, 2024 8:23 PM IST బతికి ఉన్నపుడే తల్లిదండ్రుల బాగోగులను పట్టించుకోన...
వేసవి మునుపే వీటి వ్యాపారం జోరుగా ఉందట!Reported by: Published by: Last Updated:February 17, 2024 11:25 AM IST ఎక్కువగా కూలీలు ప్రస్తుతం తమ వద్ద కొనుగోలు చేస్తు...
Pm modi: యోగాంధ్ర-2025.. ప్రజల్లో ఉత్సాహం చూస్తుంటే ఆనందంగా ఉంది: ప్రధాని మోదీఆంధ్రప్రదేశ్లో యోగా దినోత్సవం పట్ల ప్రజల్లో ఉత్సాహాన్ని చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉందని ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) అన్న...
Farmer: రైతులకు భారీ శుభవార్త.. క్వింటాల్ కు రూ. 500 అదనం..Reported by: Published by: Last Updated:October 12, 2024 8:54 PM IST ప్రస్తుత ఖరీఫ్లో రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగో...
Bank nomination: బ్యాంకు నామినీ వివరాల్లో ఇ-మెయిల్, ఫోన్ నంబర్..Bank Nomination: అన్క్లెయిమ్డ్ డిపాజిట్లు తగ్గించేందుకు ఆర్బీఐ నామినీల ఫోన్ నంబర్లు, ఇ-మెయిల్ వివరాలు కూడా తీసుకోవా...