India-afghanistan: భారత్-అఫ్గాన్ చర్చలు.. ఈ అనూహ్య పరిణామం ఎందుకు?
India-afghanistan: భారత్-అఫ్గాన్ చర్చలు.. ఈ అనూహ్య పరిణామం ఎందుకు?"
Play all audios:
ఇంటర్నెట్డెస్క్: భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. అఫ్గానిస్థాన్ తాత్కాలిక విదేశాంగ మంత్రిగా ఉన్న ఆమిర్ఖాన్ ముత్తాఖీతో.. భారత విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి
ఎస్. జైశంకర్ (S Jaishankar) ఫోన్లో మాట్లాడారు. పహల్గాం ఉగ్రదాడిని తాలిబన్లు ఖండించడాన్ని జైశంకర్ స్వాగతించారు. అయితే, తాలిబన్లతో సంబంధాలను వ్యతిరేకించే భారత్ అనూహ్యంగా వారితో ఎందుకు
చర్చలు జరుపుతోందన్నది చర్చనీయాంశంగా మారింది. మహాభారతంలో మూలాలు ఇప్పటి దక్షిణ అఫ్గానిస్థాన్లోని కాందహార్ను అప్పట్లో గాంధార రాజ్యంగా పిలిచేవారు. ఆ ప్రాంతానికి చెందిన వాడే శకుని. పాండవ,
కౌరవుల మధ్య కురుక్షేత్ర మహా సంగ్రామం జరగడానికి ప్రధాన కారకుడు అతడేనని ఇతిహాసాలు చెబుతున్నాయి. ఆ తర్వాత ఆ ప్రాంతాన్ని మౌర్యులు చాలా ఏళ్లపాటు పాలించారు. 1100 సంవత్సరం వరకు అఫ్గానిస్థాన్ అఖండ
భారతంలో భాగంగానే ఉంది. ఆ తర్వాత 18వ శతాబ్దంలో బ్రిటన్, రష్యాల విస్తరణ కాంక్షతో ఆ ప్రాంతాలన్నీ విచ్ఛిన్నమయ్యాయి. బ్రిటిష్ ప్రభుత్వం 1893లో అఫ్గానిస్థాన్కు అవిభాజ్య భారత్కు మధ్య సరిహద్దు
రేఖ గీసింది. అయితే అఫ్గాన్ దానిని గుర్తించలేదు. మూడో ఆంగ్లో-అఫ్గాన్ యుద్ధం తర్వాత 1919లో ఆ దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. 1973లో గణతంత్ర దేశంగా ఆవిర్భవించింది. అప్పటికే భారత్ నుంచి
పాకిస్థాన్ వేరుపడిన తరుణంలో.. అఫ్గాన్ను భారత్ తన కూటమి దేశంగా గుర్తించింది. ఈ బంధం 1996 వరకు కొనసాగింది. అప్పుడే అఫ్గాన్లో చోటు చేసుకున్న సివిల్ వార్లో పాకిస్థాన్ సాయంతో తాలిబన్లు
విజయం సాధించారు. తీవ్రవాద అజెండాను అమలు చేస్తూ.. మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడ్డారు. తాలిబన్లు ఏర్పాటు చేసిన ఈ ప్రభుత్వాన్ని భారత్ గుర్తించలేదు. దీంతో ఇరుదేశాల మధ్య పొరపొచ్చాలు మొదలయ్యాయి.
విమానం హైజాక్తో.. 1999లో కాఠ్మాండు నుంచి వస్తున్న ఇండియన్ ఎయిర్లైన్స్ విమానాన్ని పాకిస్థాన్ హైజాక్ చేసింది. పాకిస్థాన్లో ఉన్నట్లు భారత్ గుర్తిస్తే తీవ్రంగా ప్రతిఘటిస్తుందని
గ్రహించి.. దానిని అఫ్గానిస్థాన్లోని కాందహార్కు తరలించింది. అక్కడ అధికారంలో ఉన్న తాలిబన్లు కూడా అందుకు సహకరించారు. భారత్ చెరలో ఉన్న ఉగ్రవాదులను అప్పగించాలని పాకిస్థాన్ డిమాండ్ చేయడంతో..
సామాన్య ప్రజల ప్రాణాలను దృష్టిలో పెట్టుకున్న భారత ప్రభుత్వం ఎలాంటి షరతులు విధించకుండా ముగ్గురు ఉగ్రవాదులను అప్పగించి.. విమానంలోని 300 మందిని భారత్ స్వదేశానికి తీసుకొచ్చింది. ఈ ఘటనతో భారత్,
అఫ్గాన్ మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. 2021లో మళ్లీ అదే పరిస్థితి.. 1996 నాటి పరిస్థితులే 2021లో అఫ్గాన్లో మళ్లీ రిపీట్ అయ్యాయి. అమెరికా తన బలగాలను ఉపసంహరించుకోవడంతో మరోసారి
తాలిబన్లు అధికారంలోకి వచ్చారు. భారత్ అక్కడి పరిస్థితులను నిశితంగా గమనిస్తూనే గుంభనంగా వ్యవహరించింది. వారికి మద్దతివ్వనూ లేదు, అలాగని వ్యతిరేకించనూ లేదు. తొలిసారిగా 8 జనవరి 2025న భారత
విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ, ఆ దేశ తాత్కాలిక విదేశాంగశాఖ మంత్రితో భేటీ అయ్యారు. 1996 తర్వాత అఫ్గానిస్థాన్తో అధికారిక చర్చలు జరగడం ఇదే తొలిసారి. తాజాగా భారత విదేశాంగశాఖ మంత్రి జై
శంకర్.. అఫ్గాన్ మంత్రి ఆమిర్ఖాన్ ముత్తాఖీతో మాట్లాడటంతో ఇరుదేశాల మధ్య సంబంధాలకు మరోసారి బీజం పడినట్లయింది. శత్రువుకు శత్రువు మిత్రుడు ఒకే భాగస్వామితో ఎక్కువ కాలం కలిసి ఉండటం
అఫ్గానిస్థాన్ చరిత్రలోనే లేదు. ఒకప్పుడు సోవియట్ యూనియన్పై జరిపిన యుద్ధంలో అమెరికా దాని మిత్రదేశంగా ఉండేది. ఆ తర్వాత శత్రువుగా మారింది. ఇప్పుడు పాకిస్థాన్ వంతు వచ్చింది. ఇటీవల కాలంలో
అఫ్గానిస్థాన్ కేంద్రంగా పని చేస్తున్న తెహ్రీక్ ఇ- తాలిబన్ పాకిస్థాన్ (టీటీపీ) పాకిస్థాన్లో తరచూ దాడులకు పాల్పడుతోంది. ప్రత్యేకించి ఖైబర్ ఫఖ్తుంఖ్వా, బలోచిస్థాన్ ప్రాంతాల్లో దాడులు
చేస్తోంది. వీటికి అఫ్గాన్ మద్దతు పలుకుతోందని పాక్ వాదిస్తోంది. ఈ క్రమంలోనే ఆ రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. గతేడాది డిసెంబర్లో టీటీపీ దాడి తర్వాత.. అఫ్గానిస్థాన్లోని పలు
ప్రాంతాలపై పాకిస్థాన్ వైమానిక దాడులకు దిగింది. ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేసినట్లు పాక్ చెబుతున్నప్పటికీ.. భారీ సంఖ్యలో సామాన్య ప్రజలు మృతి చెందినట్లు తాలిబన్ ప్రభుత్వం చెబుతోంది.
అంతేకాకుండా ఆ రెండు దేశాలమధ్య సరిహద్దు రేఖ ‘డ్యూరాండ్ లైన్’ విషయంలోనూ పొరపొచ్చాలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఆ రెండూ శత్రుదేశాలుగా మారాయి. ఈ క్రమంలోనే శత్రువుకు శత్రువు మిత్రుడు అన్న చందంగా..
అఫ్గానిస్థాన్.. భారత్తో చెలిమికి సిద్ధమవుతోంది. అయినప్పటికీ.. భారత్ దూరదృష్టితో ఆలోచించి.. చాకచక్యంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది.
Trending News
Team Yaariyan 2 Visits Lalbaugcha Raja In MumbaiTeam Yaariyan 2 Visits Lalbaugcha Raja In Mumbai By: FPJ Web Desk | September 20, 2023...
Narsapuram election result 2024 live updates: bjp's bhupathi raju srinivasa varma has won in this lok sabha seatNARSAPURAM LOK SABHA ELECTION RESULT 2024 LIVE UPDATES: With the counting of votes for the 2024 Lok Sabha elections unde...
పదేళ్లకే పిల్లల్లో బీపీ, మధుమేహం.. కారణం ఇదే : డాక్టర్ రిమా దాదాదిల్లీ: విద్యార్థుల్లో అధిక మధుమేహాన్ని నియంత్రించడమే లక్ష్యంగా పాఠశాలల్లో ‘షుగర్ బోర్డు’లను ఏర్పాటు చేయాలని సీబీఎస్ఈ(C...
Vastu: అప్పులు, ఆర్థిక కష్టాలు తీరాలంటే, ఇంట్లో 7 మార్పులు చెయ్యండిగ్లాస్ విండో: మీకు అప్పుల బాధ తీరిపోవాలంటే, ఈశాన్యం దిక్కులో ఓ గ్లాస్ కిటికీని అమర్చండి. మీ ఇల్లు, షాప్ ఏదైనా సరే, ఈశ్యా...
దర్యాప్తునకు ముందే స్టే ఎలా ఇస్తారు..?సాక్షి, న్యూఢిల్లీ: ‘గత విచారణ సందర్భంగానే మీకు చెప్పాం. ఇలా దర్యాప్తు ప్రారంభం కూడా కాకముందే స్టే ఆర్డర్లు ఇవ్వడాన్ని మ...
Latests News
India-afghanistan: భారత్-అఫ్గాన్ చర్చలు.. ఈ అనూహ్య పరిణామం ఎందుకు?ఇంటర్నెట్డెస్క్: భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. అఫ్గానిస్థాన్ తాత్కాలిక విదేశాంగ ...
Bank services: బ్యాంకింగ్ సేవలన్నీ సజావుగానే..సరిహద్దు ఉద్రిక్తతలు బ్యాంకింగ్ సేవలకు ఆటంకం కావని; ఎస్బీఐ, పంజాబ్ నేషనల్ బ్యాంకుల ATMలు, డిజిటల్ సేవలు సజావుగానే ప...
Pudina karam podi | latest pudina karam podi - eenaduపొడి,బాత్... అన్నీ పుదీనాతోనే! పోషకాలతోపాటూ శరీరానికి చల్లదనాన్నీ అందించే పుదీనాను ఈ వేసవిలో కేవలం పచ్చడికే పరిమితం కాక...
Home decoration | latest home decoration - eenaduఇంటికి పచ్చందం! ఇల్లు అందంగా ఉండాలీ... వచ్చినవాళ్లు ముచ్చటగా చూస్తుండిపోవాలీ... హాయిగా ఉంది, ఇంకాసేపు కూర్చుందాం అనిపించ...
Cannes film festival 2025: అట్టహాసంగా ‘కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్’.. మెరిసిన తారలుఫ్రాన్స్లో 78వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ మంగళవారం అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ వేడుకకు సినీ అతిరథ మహారథులు తరలివచ్చారు. ...