Supreme court: కోటాలోనే విద్యార్థులు ఎందుకు చనిపోతున్నారు?.. ప్రభుత్వాన్ని నిలదీసిన సుప్రీం
Supreme court: కోటాలోనే విద్యార్థులు ఎందుకు చనిపోతున్నారు?.. ప్రభుత్వాన్ని నిలదీసిన సుప్రీం"
Play all audios:
రాజస్థాన్లోని కోటాలోనే విద్యార్థుల ఆత్మహత్యలు ఎందుకు చోటుచేసుకుంటున్నాయంటూ ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఇంటర్నెట్ డెస్క్: రాజస్థాన్లో విద్యార్థుల వరుస ఆత్మహత్యలపై
సర్వోన్నత న్యాయస్థానం (Supreme Court) తీవ్ర ఆందోళన వ్యక్తంచేసింది. కోటాలోనే ఇవి ఎందుకు చోటుచేసుకుంటున్నాయంటూ ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఈ ఏడాది ఇప్పటికే 14 మంది విద్యార్థులు
బలవంతంగా ప్రాణాలు తీసుకోవడాన్ని తీవ్రంగా పరిగణించిన సుప్రీంకోర్టు.. రాష్ట్ర ప్రభుత్వంగా ఏం చేస్తున్నారంటూ నిలదీసింది. కోటా, ఐఐటీ ఖరగ్పుర్లకు చెందిన ఇద్దరు విద్యార్థుల ఆత్మహత్యల కేసులను
విచారించిన జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ ఆర్.మహదేవన్ల ధర్మాసనం.. ఎఫ్ఐఆర్ నమోదులో పోలీసుల వైఖరిని తప్పుపట్టింది. ఐఐటీ ఖరగ్పుర్కు చెందిన విద్యార్థి (22) ఆత్మహత్యకు సంబంధించిన కేసును
సుప్రీం విచారించింది. మే 4న హాస్టల్ గదిలో ఉరివేసుకొని మరణించగా.. పోలీసులు మాత్రం మే 8న ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కేసు నమోదుకు నాలుగు రోజులు ఆలస్యం ఎందుకు అయ్యిందని సంబంధిత పోలీసు అధికారిని
ధర్మాసనం ప్రశ్నించింది. ఈ కేసులను తేలికగా తీసుకోవద్దని, చాలా తీవ్రత కలిగిన అంశాలని పేర్కొంది. ఉన్నత విద్యాసంస్థల్లో విద్యార్థుల వరుస ఆత్మహత్యలకు సంబంధించి మార్చి 24న ఇచ్చిన తీర్పును
ప్రస్తావించిన న్యాయస్థానం.. ఇటువంటి కేసుల్లో ఎఫ్ఐఆర్ త్వరగా నమోదుచేయడం ఎంతో ముఖ్యమని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా పోలీసు అధికారి, ఐఐటీ ఖరగ్పుర్ తరఫు న్యాయవాది ఇచ్చిన వివరణలపై సుప్రీం
ధర్మాసనం అసంతృప్తి వ్యక్తంచేసింది. * పోక్సో చట్టం కింద దోషిగా తేలిన వ్యక్తికి ఏ శిక్షా వేయని సుప్రీంకోర్టు! కోటాలో నీట్ (NEET)కు సన్నద్ధమవుతోన్న విద్యార్థిని ఆత్మహత్య చేసుకోగా.. ఎఫ్ఐఆర్
నమోదు చేయకపోవడాన్ని ధర్మాసనం తప్పుపట్టింది. గతంలో న్యాయస్థానం ఇచ్చిన తీర్పును ధిక్కరిస్తున్నారని, ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేయలేదని నిలదీసింది. సంబంధిత పోలీసు అధికారి విధి నిర్వహణలో
విఫలమయ్యారని, కోర్టు ఆదేశాలను ఆయన పాటించలేదని పేర్కొంది. దీనిపై జులై 14 సదరు పోలీసు అధికారి హాజరై వివరణ ఇవ్వాలని సమన్లు జారీచేసింది. ‘‘రాష్ట్ర ప్రభుత్వంగా ఏం చేస్తున్నారు? కోటాలోనే
విద్యార్థులు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నారు? ఈ విషయంపై ఎందుకు ఆలోచించడం లేదు? అని రాజస్థాన్ ప్రభుత్వం తరఫు న్యాయవాదిని సుప్రీం ధర్మాసనం ప్రశ్నించింది. ఇందుకు న్యాయవాది బదులిస్తూ..
ఆత్మహత్యల కేసులను పరిశీలించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేశామని చెప్పారు.
Trending News
‘క్రికెట్ సెలక్షన్’ను ప్రత్యక్ష ప్రసారం చేయాలిముంబై: భారత క్రికెటర్, బెంగాల్ రంజీ జట్టు మాజీ కెప్టెన్ మనోజ్ తివారీ భారత సెలక్షన్ కమిటీ తీరుపై విరుచుకుపడ్డాడు. జట్...
Usa: అమెరికాలో ప్రమాదం.. భారత సంతతి ఇంజినీర్ సహా ముగ్గురు మృతిఅమెరికాలో పర్వతారోహణ క్రమంలో ప్రమాదానికి గురైన ఘటనలో భారత సంతతికి చెందిన విష్ణు ఇరిగిరెడ్డి సహా ముగ్గురు ప్రాణాలు కోల్పో...
Nadendla manohar: రేషన్ దుకాణాల ద్వారా నిత్యావసరాలు.. డీలర్లు సిద్ధం కావాలి: మంత్రి నాదెండ్లవిజయవాడ: ప్రజా పంపిణీ వ్యవస్థలో ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా ఉండేందుకు ప్రభుత్వం రేషన్ దుకాణాల ద్వారా సరకుల పంపిణీ ...
Anasuya bharadwaj: ‘ఆంజనేయస్వామి మా ఇంటికి వచ్చారు’.. కొత్త ఇంట్లో అనసూయ ఎమోషనల్ఇంటర్నెట్డెస్క్: యాంకర్గా, నటిగా వైవిధ్యమైన పాత్రలతో తెలుగు ప్రేక్షకులను మెప్పిస్తున్న అనసూయ (Anasuya Bharadwaj) కొత్...
Cong releases cd of uma bharti calling modi 'vinash purush'Congress on Thursday sought to embarrass BJP by releasing a three-year-old video in which senior party leader Uma Bharti...
Latests News
Supreme court: కోటాలోనే విద్యార్థులు ఎందుకు చనిపోతున్నారు?.. ప్రభుత్వాన్ని నిలదీసిన సుప్రీంరాజస్థాన్లోని కోటాలోనే విద్యార్థుల ఆత్మహత్యలు ఎందుకు చోటుచేసుకుంటున్నాయంటూ ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ప్రశ్న...
Vijayawada: విజయవాడలో థీమ్ యోగా కార్యక్రమాలు.. వేలాదిగా తరలివచ్చిన ఔత్సాహికులునగరంలోని బీఆర్టీఎస్ రోడ్డులో రాష్ట్రస్థాయి థీమ్ యోగా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి వేలాదిగా యోగా ఔత్స...
Credit cards: ఈ 7 సందర్భాల్లో మీ క్రెడిట్ కార్డును జాగ్రత్తగా వాడండిక్రెడిట్ కార్డు ఒక ప్రముఖ ఆర్థిక సాధనమని మనందరికీ తెలిసిందే. ఇది స్వల్పకాలిక రుణ అవకాశాన్నిస్తూ, కార్డుదారుడి కొనుగోలు ...
Srisailam: ప్రతి భక్తుడికీ ఉచితంగా లడ్డూ ప్రసాదం.. శ్రీశైలంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలపై మంత్రుల సమీక్షశ్రీశైలం: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలపై మంత్రులు కీలక సమీక్ష నిర్వహించారు. మల్లన్నను దర్శించుకొనేందుకు వచ్చే భక్తులకు ఇబ్...
Neha bhandari: కళ్లెదుటే శత్రువున్నా వెరవని నారీమణి.. ‘సిందూర్’కు సిసలైన అర్థం నేహా భండారిజమ్మూ: కంటికి కన్పించేంత దూరంలో శత్రువు.. దాడుల రూపంలో ముంచుకొస్తున్న ముప్పు.. అలాంటి సమయంలో ప్రత్యర్థికి ఎదురొడ్డి పోరా...