Nadendla manohar: రేషన్ దుకాణాల ద్వారా నిత్యావసరాలు.. డీలర్లు సిద్ధం కావాలి: మంత్రి నాదెండ్ల
Nadendla manohar: రేషన్ దుకాణాల ద్వారా నిత్యావసరాలు.. డీలర్లు సిద్ధం కావాలి: మంత్రి నాదెండ్ల"
Play all audios:
విజయవాడ: ప్రజా పంపిణీ వ్యవస్థలో ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా ఉండేందుకు ప్రభుత్వం రేషన్ దుకాణాల ద్వారా సరకుల పంపిణీ చేపడుతుందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.
విజయవాడలో కలెక్టర్లు, పౌరసరఫరాలశాఖ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. కూటమి ప్రభుత్వం నిర్ణయం మేరకు జూన్ 1 నుంచి డీలర్లు రేషన్ దుకాణాల ద్వారా నిత్యావసరాల పంపిణీకి సిద్ధం కావాలని
ఆదేశించారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వానికి మంచిపేరు తెచ్చేలా రేషన్ డీలర్లు పనిచేయాలని కోరారు. గతంలో కార్డుదారుల కుటుంబాలకు కుటుంబ పెద్దలా ఉన్న రేషన్ డీలర్లు
అదే విధంగా ఇప్పుడు కూడా మనసుపెట్టి పనిచేసి లబ్ధిదారులకు గౌరవంగా సేవలందించాలన్నారు. రేషన్ దుకాణాల పరిసరాలు శుభ్రంగా ఉండేలా చూడటం, సరైన తూకంతో సరకులు పంపిణీ చేయటం, ధరలు, స్టాక్ బోర్డ్,
పోస్టర్లు ఏర్పాటు చేసుకోవాలన్నారు. దివ్యాంగులు, 65 ఏళ్లు పైబడిన వృద్ధులకు ఇంటివద్దే రేషన్ సరకులు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ప్రతినెల ఒకటో తేదీ నుంచి 15వ తేదీ వరకు ఆదివారాల్లో సైతం సరకుల
పంపిణీ పూర్తి చేయాలన్నారు. ఒకటో తేదీ నుంచి 5వ తేదీలోపే దివ్యాంగులు, వృద్ధులకు రేషన్ సరకులు పంపిణీ చేసేందుకు చొరవ చూపాలని మంత్రి సూచించారు. వాట్సప్ గ్రూపు ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం
అందించడం వల్ల కార్డుదారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడవచ్చన్నారు. ఒకవేళ ఎప్పుడైనా సాంకేతిక సమస్యలు ఎదురైనాసరే కార్డుదారులకు ఇబ్బందిలేకుండా ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా సరుకుల
పంపిణీ జరగాల్సిందేనని స్పష్టం చేశారు. ఈ-పోస్, వేయింగ్ మిషన్ల రిపేర్లకు సంబంధించి సర్వీసు క్యాంపులు ప్రతి జిల్లాలో ఏర్పాటు చేశామన్నారు.
Trending News
కరోనా సెకండ్ వేవ్ వస్తోందిబుధవారం కలెక్టర్లు, జేసీలు, ఎస్పీలతో సీఎం వీడియో కాన్ఫరెన్స్ సాక్షి, అమరావతి: కోవిడ్ సెకండ్ వేవ్ వస్తోందని, ఇప్పటికే...
duduku | TechCrunchSAVE NOW THROUGH JUNE 4 FOR TECHCRUNCH SESSIONS: AI SAVE $300 ON YOUR TICKET TO TC SESSIONS: AI—AND GET 50% OFF A SECOND...
Nadendla manohar: రేషన్ దుకాణాల ద్వారా నిత్యావసరాలు.. డీలర్లు సిద్ధం కావాలి: మంత్రి నాదెండ్లవిజయవాడ: ప్రజా పంపిణీ వ్యవస్థలో ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా ఉండేందుకు ప్రభుత్వం రేషన్ దుకాణాల ద్వారా సరకుల పంపిణీ ...
వేలి ముద్రలు పడకపోయినా రేషన్సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా ఉచిత రేషన్ సరుకులు తీసుకొనే క్రమంలో లబ్ధిదారులకు ఎదురవుతున్న వేలి ముద్రల సమస్యను పరి...
సల్మాన్ఖాన్ (బాలీవుడ్) రాయని డైరీకరణ్ ఫోన్ చేసి, ‘‘ఏంటి ఆలోచిస్తున్నావ్’’ అన్నాడు! ‘ఏం చేస్తున్నావ్?’ అని అతడు ఎప్పుడూ అడగడు. అతడు ఫోన్ చేసినప్పుడు...
Latests News
Video: revanth reddy sworn in as cm of telangana, bhatti vikramarka his deputyAnumula Revanth Reddy on Thursday took oath as Chief Minister of Telangana, becoming the first Congress CM of the younge...
Ajit doval: ఎస్-400 ముందస్తు డెలివరీ కోసం.. రష్యాకు డోభాల్..దిల్లీ: జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ వచ్చేవారం రష్యాలో పర్యటించనున్నట్లు తెలుస్తోంది. మే 27 నుంచి 29 వరకు భద్రతా...
Mumbai indians: ముంబయి ఇండియన్స్ టాప్-2లోకి దూసుకుపోవాలంటే..ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ (IPL) 2025 సీజన్లో భాగంగా బుధవారం దిల్లీ క్యాపిటల్స్తో (Delhi Capitals) జరిగిన మ్యాచ్లో మ...
Tunnel rescue: ‘ప్రాణాలకు తెగించాం.. కానీ.. ’ ర్యాట్ హోల్ మైనర్ల ఆవేదనసిల్క్యారా సొరంగంలో చిక్కుకుపోయిన కార్మికులను బయటకు తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన ‘ర్యాట్ హోల్ మైనర్లు’.. ఉత్తరాఖ...
Pm modi: ఆ రాష్ట్రాల అనుభవాలు వింటుంటే అద్భుతంగా ఉంది: ప్రధాని మోదీ ట్వీట్దిల్లీ: ఎన్డీయే పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులతో దిల్లీలో జరిగిన సమావేశం ముగిసిన అనంతరం ప్రధాని నరేంద్ర ...