Pm modi: ఆ రాష్ట్రాల అనుభవాలు వింటుంటే అద్భుతంగా ఉంది: ప్రధాని మోదీ ట్వీట్
Pm modi: ఆ రాష్ట్రాల అనుభవాలు వింటుంటే అద్భుతంగా ఉంది: ప్రధాని మోదీ ట్వీట్"
Play all audios:
దిల్లీ: ఎన్డీయే పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులతో దిల్లీలో జరిగిన సమావేశం ముగిసిన అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా వారితో కలిసి దిగిన ఫొటోను
షేర్ చేసిన ఆయన ఈ కీలక భేటీలో చర్చించిన అంశాల సారాంశాన్ని ‘ఎక్స్’ వేదికగా పంచుకున్నారు. ‘‘దిల్లీలో ఎన్డీయే సీఎంల కాంక్లేవ్లో పాల్గొన్నా. అనేక అంశాలపై సుదీర్ఘంగా చర్చించాం. నీటి సంరక్షణ,
ఫిర్యాదుల పరిష్కారం, అడ్మినిస్ట్రేటివ్ ఫ్రేమ్వర్క్లను బలోపేతం చేయడం, విద్య, మహిళా సాధికారత, క్రీడలు, తదితర విభిన్న రంగాల్లో చేపడుతున్న ఉత్తమ పద్ధతులను ఆయా రాష్ట్రాలు ప్రదర్శించాయి. ఈ
అనుభవాలను వినడం చాలా అద్భుతంగా ఉంది’’ అన్నారు. * కుమారుడిని పార్టీ నుంచి బహిష్కరించిన లాలూ దేశాభివృద్ధికి ఊతం ఇవ్వాల్సిన కీలక ఆవశ్యకతను గుర్తు చేసిన ప్రధాని.. డబుల్ ఇంజిన్ ప్రభుత్వాలు
చేపట్టే పథకాలు ప్రజలకు సమర్థవంతంగా చేరేలా చూడాలని సూచించారు. ఈ భేటీలో పరిశుభ్రత, పారిశుద్ధ్యం, ఆరోగ్య సంరక్షణ, యువత సాధికారత, వ్యవసాయం, సాంకేతికత వంటి కీలక రంగాల్లో బలమైన వ్యవస్థను
నిర్మించడంపై మాట్లాడినట్లు పేర్కొన్నారు. ఉత్తమ పాలనా పద్ధతులు అవలంబించండి: ప్రధాని సూచన తమ ప్రభుత్వం చేపట్టనున్న కుల గణన దేశంలో వెనుకబడిన, అణగారిన వర్గాలను అభివృద్ధి దిశగా తీసుకొచ్చేందుకు
ఓ కీలక అడుగు అని ప్రధాని మోదీ(PM Modi) అన్నట్లు సమాచారం. ‘ఆపరేషన్ సిందూర్’ విజయం దేశం స్వావలంబన దిశగా సాధించిన విజయాలను పునరుద్ఘాటించిందని, ఇది దేశీయ రక్షణ సాంకేతికత కచ్చితత్వాన్ని
చాటిచెప్పిందని పేర్కొన్నారు. ఎన్డీయే పాలిత రాష్ట్రాల్లో ఉత్తమ పాలనా పద్ధతులను అవలంబించాలని ప్రధాని సూచించారు. ఈ భేటీ అనంతరం భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మీడియాతో మాట్లాడారు. ‘ఎన్డీయే
కూటమి కుల రాజకీయాలను నమ్మదు.. కానీ, కుల గణన వివిధ రంగాలలో వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి దోహదపడుతుంది’ అని పేర్కొన్నారు. ఈ భేటీలో సాయుధ బలగాల ధైర్యసాహసాలను, ప్రధాని మోదీ నాయకత్వ పటిమను
ప్రశంసిస్తూ నేతలంతా తీర్మానం చేశారు. ఆపరేషన్ సిందూర్పై తీర్మానాన్ని రాజస్థాన్ సీఎం భజన్లాల్ శర్మ, శివసేన నేత, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్నాథ్ శిందే ప్రతిపాదించగా.. కులగణనపై
తీర్మానాన్ని హరియాణా సీఎం నాయబ్ సింగ్ సైనీ ప్రతిపాదించారు. ఆపరేషన్ సిందూర్ భారతీయుల ఆత్మవిశ్వాసాన్ని పెంచిందని ఈ తీర్మానంలో పేర్కొన్నారు. మోదీ సాయుధ బలగాలకు మద్దతు ఇచ్చారంటూ ఆయన
నాయకత్వాన్ని ప్రశంసించారు. ఆపరేషన్ సిందూర్.. ఉగ్రవాదులు, వారికి మద్దతు తెలిపేవారికి తగిన సమాధానమని పేర్కొన్నారు. ఏప్రిల్ 22న జరిగిన పహల్గాం ఉగ్ర దాడిలో ప్రాణాలు కోల్పోయినవారికి
నివాళులర్పించారు. మోదీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చి మొదటి వార్షికోత్సవం, సుపరిపాలన అంశాలపైనా ఈ భేటీలో ప్రధానంగా చర్చించినట్లు తెలిసింది.
Trending News
Ktr | సీఎం రేవంత్ పై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలుCNN18 name, logo and all associated elements ® and © 2017 Cable News Network LP, LLLP. A Time Warner Company. All rights...
Lord shiva: శివ పూజలో పొరపాటున కూడా ఇవి వాడొద్దు.. పరమేశ్వరుడికి కోపం వస్తుందంట..!తామర, మల్లె, కేతకి వంటి పూలను శివుడికి అస్సలు సమర్పించ కూడదంట. ఈ పువ్వులు లైంగిక కోరికలను ప్రేరేపిస్తాయి, కనుక వీటిని శి...
BJP alleges preferential treament to Saradha scam accused Madan MitraBJP's state chief Rahul Sinha on Friday slammed Kolkata police for allegedly giving preferential treatment to West Benga...
Money: PF డబ్బు విత్డ్రా చేస్తున్నారా..? ముందు ఈ కీలక విషయాలు తెలుసుకోండి..Money: PF డబ్బు విత్డ్రా చేస్తున్నారా..? ముందు ఈ కీలక విషయాలు తెలుసుకోండి..Published by:Sunil Boddulanews18-teluguLast ...
Bahubali's kattappa aka sathyaraj joins cast of salman khan-starrer 'sikandar'She captioned the post, "Garma Garam pictures from the sets of SajidNadiadwala's Sikandar!!! With my fave Sath...
Latests News
Pm modi: ఆ రాష్ట్రాల అనుభవాలు వింటుంటే అద్భుతంగా ఉంది: ప్రధాని మోదీ ట్వీట్దిల్లీ: ఎన్డీయే పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులతో దిల్లీలో జరిగిన సమావేశం ముగిసిన అనంతరం ప్రధాని నరేంద్ర ...
Ttd news: ఆగస్టులో తిరుమలకు వెళ్లాలనుకునే భక్తులకు అలర్ట్.. నెలరోజుల పాటు మూసివేత..ముక్కోటి తీర్థలతో కలిసే ఏకైక ప్రదేశమే శ్రీవారి పుష్కరిణి. ఈ పుష్కరిణిలో తొమ్మిది తీర్థాలు ప్రప్రధమంగా కలుస్తాయని చెప్తార...
అమ్మకు పౌష్టికాహారంపౌష్టికాహారంపై అవగాహన కల్పిస్తున్న అంగన్వాడీ కార్యకర్తలు నెల్లూరు(వేదాయపాళెం): ప్రతి మహిళ అమ్మ కావడాన్ని అదృష్టంగా భావి...
Tdp launches 'kalalaku rekkalu' scheme to empower women in andhra pradeshAndhra Pradesh’s Telugu Desam Party (TDP) on Wednesday launched a website to enable women, aspiring to pursue profession...
#unseenlives: పీరియడ్స్ సమయంలో గుడికి వెళ్తే తేనెటీగలు కుడతాయా? - bbc news తెలుగు#UNSEENLIVES: పీరియడ్స్ సమయంలో గుడికి వెళ్తే తేనెటీగలు కుడతాయా? కథనం * రచయిత, డీఎల్ నరసింహ * హోదా, బీబీసీ కోసం * 27 మార్...