Pm modi: ఆ రాష్ట్రాల అనుభవాలు వింటుంటే అద్భుతంగా ఉంది: ప్రధాని మోదీ ట్వీట్‌

Eenadu

Pm modi: ఆ రాష్ట్రాల అనుభవాలు వింటుంటే అద్భుతంగా ఉంది: ప్రధాని మోదీ ట్వీట్‌"

Play all audios:

Loading...

దిల్లీ: ఎన్డీయే పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులతో దిల్లీలో జరిగిన సమావేశం ముగిసిన అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ట్వీట్‌ చేశారు. ఈ సందర్భంగా వారితో కలిసి దిగిన ఫొటోను


షేర్‌ చేసిన ఆయన ఈ కీలక భేటీలో చర్చించిన అంశాల సారాంశాన్ని ‘ఎక్స్‌’ వేదికగా పంచుకున్నారు.  ‘‘దిల్లీలో ఎన్డీయే సీఎంల కాంక్లేవ్‌లో పాల్గొన్నా. అనేక అంశాలపై సుదీర్ఘంగా చర్చించాం. నీటి సంరక్షణ,


ఫిర్యాదుల పరిష్కారం, అడ్మినిస్ట్రేటివ్‌ ఫ్రేమ్‌వర్క్‌లను బలోపేతం చేయడం, విద్య, మహిళా సాధికారత, క్రీడలు, తదితర విభిన్న రంగాల్లో చేపడుతున్న ఉత్తమ పద్ధతులను ఆయా రాష్ట్రాలు ప్రదర్శించాయి. ఈ


అనుభవాలను వినడం చాలా అద్భుతంగా ఉంది’’ అన్నారు.  * కుమారుడిని పార్టీ నుంచి బహిష్కరించిన లాలూ దేశాభివృద్ధికి ఊతం ఇవ్వాల్సిన కీలక ఆవశ్యకతను గుర్తు చేసిన ప్రధాని.. డబుల్ ఇంజిన్ ప్రభుత్వాలు


చేపట్టే పథకాలు ప్రజలకు సమర్థవంతంగా చేరేలా చూడాలని సూచించారు. ఈ భేటీలో పరిశుభ్రత, పారిశుద్ధ్యం, ఆరోగ్య సంరక్షణ, యువత సాధికారత, వ్యవసాయం, సాంకేతికత వంటి కీలక రంగాల్లో బలమైన వ్యవస్థను


నిర్మించడంపై మాట్లాడినట్లు పేర్కొన్నారు.  ఉత్తమ పాలనా పద్ధతులు అవలంబించండి: ప్రధాని సూచన తమ ప్రభుత్వం చేపట్టనున్న కుల గణన దేశంలో వెనుకబడిన, అణగారిన వర్గాలను అభివృద్ధి దిశగా  తీసుకొచ్చేందుకు


ఓ కీలక అడుగు అని ప్రధాని మోదీ(PM Modi) అన్నట్లు సమాచారం.  ‘ఆపరేషన్‌ సిందూర్‌’ విజయం దేశం స్వావలంబన దిశగా సాధించిన విజయాలను పునరుద్ఘాటించిందని, ఇది దేశీయ రక్షణ సాంకేతికత కచ్చితత్వాన్ని


చాటిచెప్పిందని పేర్కొన్నారు. ఎన్డీయే పాలిత రాష్ట్రాల్లో ఉత్తమ పాలనా పద్ధతులను అవలంబించాలని ప్రధాని సూచించారు. ఈ భేటీ అనంతరం భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మీడియాతో మాట్లాడారు. ‘ఎన్డీయే


కూటమి కుల రాజకీయాలను నమ్మదు.. కానీ, కుల గణన వివిధ రంగాలలో వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి దోహదపడుతుంది’ అని పేర్కొన్నారు. ఈ భేటీలో సాయుధ బలగాల ధైర్యసాహసాలను, ప్రధాని మోదీ నాయకత్వ పటిమను


ప్రశంసిస్తూ నేతలంతా తీర్మానం చేశారు. ఆపరేషన్‌ సిందూర్‌పై తీర్మానాన్ని రాజస్థాన్‌ సీఎం భజన్‌లాల్‌ శర్మ, శివసేన నేత, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్‌ శిందే ప్రతిపాదించగా..  కులగణనపై


తీర్మానాన్ని హరియాణా సీఎం నాయబ్‌ సింగ్‌ సైనీ ప్రతిపాదించారు.  ఆపరేషన్ సిందూర్ భారతీయుల ఆత్మవిశ్వాసాన్ని పెంచిందని ఈ తీర్మానంలో పేర్కొన్నారు. మోదీ సాయుధ బలగాలకు మద్దతు ఇచ్చారంటూ ఆయన


నాయకత్వాన్ని ప్రశంసించారు. ఆపరేషన్‌ సిందూర్‌.. ఉగ్రవాదులు, వారికి మద్దతు తెలిపేవారికి తగిన సమాధానమని పేర్కొన్నారు. ఏప్రిల్‌ 22న జరిగిన పహల్గాం ఉగ్ర దాడిలో ప్రాణాలు కోల్పోయినవారికి


నివాళులర్పించారు. మోదీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చి మొదటి వార్షికోత్సవం, సుపరిపాలన అంశాలపైనా ఈ భేటీలో ప్రధానంగా చర్చించినట్లు తెలిసింది. 


Trending News

Gold rate today: అదిరిపోయే శుభవార్త.. పండగ ముందు పసిడి ధరలు ఢమాల్

CNN18 name, logo and all associated elements ® and © 2017 Cable News Network LP, LLLP. A Time Warner Company. All rights...

కరీంనగర్ లో ఈ బ్రిడ్జి చూడని వారే ఉండరట.. అంత స్పెషల్ ఏంటంటే..

CNN18 name, logo and all associated elements ® and © 2017 Cable News Network LP, LLLP. A Time Warner Company. All rights...

Jeev, Kapur make modest starts; Chawrasia recovers well

Veteran Indian golfer Jeev Milkha Singh closed with two birdies in last two holes for a two-under par 70 round and was t...

Watch: chiranjeevi flips pesarattu like a boss

“Here it is Jakkana @ssrajamouli. మన ఇంట్లో ప్రేమలు ఆప్యాయతలే కాదు. పనులను కూడా పంచుకుందాం. It is fun when you share the...

Watch: teaser of nagarjuna’s romcom ‘manmadhudu 2’ out

The film also stars Rakul Preet Singh as the female lead and features Vennela Kishore, Lakshmi, Rao Ramesh, and Jhansi i...

Latests News

Pm modi: ఆ రాష్ట్రాల అనుభవాలు వింటుంటే అద్భుతంగా ఉంది: ప్రధాని మోదీ ట్వీట్‌

దిల్లీ: ఎన్డీయే పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులతో దిల్లీలో జరిగిన సమావేశం ముగిసిన అనంతరం ప్రధాని నరేంద్ర ...

Tirupati Trains: ప్రయాణికులకు అలర్ట్.. తిరుపతి ట్రైన్స్ రద్దు, లిస్ట్ ఇదే!

Tirupati Trains: ప్రయాణికులకు అలర్ట్.. తిరుపతి ట్రైన్స్ రద్దు, లిస్ట్ ఇదే!Reported by:GT Hemanta Kumarnews18-teluguPubli...

Arunachal: cm khandu holds cabinet meeting to discuss state issues

The Arunachal Pradesh state cabinet, headed by Chief Minister Pema Khandu, reviewed the status of the COVID-19 situation...

Vidya balan approached for mahesh babu’s ‘sarkaru vaari paata’?

Mahesh Babu’s last film in theatres was _Sarileru Neekevvaru_. Directed by Anil Ravipudi, it starred Rashmika Mandanna a...

Viral video: Kili Paul, sister Neema dance to Bhojpuri song 'Lollipop Lagelu', netizens say 'mauj kardi babua'

The latest to jump on the bandwagon is Tanzanian Instagrammer Kili Paul who is seen shaking a leg to this popular Bhojpu...

Top