Pm modi: ఆ రాష్ట్రాల అనుభవాలు వింటుంటే అద్భుతంగా ఉంది: ప్రధాని మోదీ ట్వీట్
Pm modi: ఆ రాష్ట్రాల అనుభవాలు వింటుంటే అద్భుతంగా ఉంది: ప్రధాని మోదీ ట్వీట్"
Play all audios:
దిల్లీ: ఎన్డీయే పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులతో దిల్లీలో జరిగిన సమావేశం ముగిసిన అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా వారితో కలిసి దిగిన ఫొటోను
షేర్ చేసిన ఆయన ఈ కీలక భేటీలో చర్చించిన అంశాల సారాంశాన్ని ‘ఎక్స్’ వేదికగా పంచుకున్నారు. ‘‘దిల్లీలో ఎన్డీయే సీఎంల కాంక్లేవ్లో పాల్గొన్నా. అనేక అంశాలపై సుదీర్ఘంగా చర్చించాం. నీటి సంరక్షణ,
ఫిర్యాదుల పరిష్కారం, అడ్మినిస్ట్రేటివ్ ఫ్రేమ్వర్క్లను బలోపేతం చేయడం, విద్య, మహిళా సాధికారత, క్రీడలు, తదితర విభిన్న రంగాల్లో చేపడుతున్న ఉత్తమ పద్ధతులను ఆయా రాష్ట్రాలు ప్రదర్శించాయి. ఈ
అనుభవాలను వినడం చాలా అద్భుతంగా ఉంది’’ అన్నారు. * కుమారుడిని పార్టీ నుంచి బహిష్కరించిన లాలూ దేశాభివృద్ధికి ఊతం ఇవ్వాల్సిన కీలక ఆవశ్యకతను గుర్తు చేసిన ప్రధాని.. డబుల్ ఇంజిన్ ప్రభుత్వాలు
చేపట్టే పథకాలు ప్రజలకు సమర్థవంతంగా చేరేలా చూడాలని సూచించారు. ఈ భేటీలో పరిశుభ్రత, పారిశుద్ధ్యం, ఆరోగ్య సంరక్షణ, యువత సాధికారత, వ్యవసాయం, సాంకేతికత వంటి కీలక రంగాల్లో బలమైన వ్యవస్థను
నిర్మించడంపై మాట్లాడినట్లు పేర్కొన్నారు. ఉత్తమ పాలనా పద్ధతులు అవలంబించండి: ప్రధాని సూచన తమ ప్రభుత్వం చేపట్టనున్న కుల గణన దేశంలో వెనుకబడిన, అణగారిన వర్గాలను అభివృద్ధి దిశగా తీసుకొచ్చేందుకు
ఓ కీలక అడుగు అని ప్రధాని మోదీ(PM Modi) అన్నట్లు సమాచారం. ‘ఆపరేషన్ సిందూర్’ విజయం దేశం స్వావలంబన దిశగా సాధించిన విజయాలను పునరుద్ఘాటించిందని, ఇది దేశీయ రక్షణ సాంకేతికత కచ్చితత్వాన్ని
చాటిచెప్పిందని పేర్కొన్నారు. ఎన్డీయే పాలిత రాష్ట్రాల్లో ఉత్తమ పాలనా పద్ధతులను అవలంబించాలని ప్రధాని సూచించారు. ఈ భేటీ అనంతరం భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మీడియాతో మాట్లాడారు. ‘ఎన్డీయే
కూటమి కుల రాజకీయాలను నమ్మదు.. కానీ, కుల గణన వివిధ రంగాలలో వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి దోహదపడుతుంది’ అని పేర్కొన్నారు. ఈ భేటీలో సాయుధ బలగాల ధైర్యసాహసాలను, ప్రధాని మోదీ నాయకత్వ పటిమను
ప్రశంసిస్తూ నేతలంతా తీర్మానం చేశారు. ఆపరేషన్ సిందూర్పై తీర్మానాన్ని రాజస్థాన్ సీఎం భజన్లాల్ శర్మ, శివసేన నేత, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్నాథ్ శిందే ప్రతిపాదించగా.. కులగణనపై
తీర్మానాన్ని హరియాణా సీఎం నాయబ్ సింగ్ సైనీ ప్రతిపాదించారు. ఆపరేషన్ సిందూర్ భారతీయుల ఆత్మవిశ్వాసాన్ని పెంచిందని ఈ తీర్మానంలో పేర్కొన్నారు. మోదీ సాయుధ బలగాలకు మద్దతు ఇచ్చారంటూ ఆయన
నాయకత్వాన్ని ప్రశంసించారు. ఆపరేషన్ సిందూర్.. ఉగ్రవాదులు, వారికి మద్దతు తెలిపేవారికి తగిన సమాధానమని పేర్కొన్నారు. ఏప్రిల్ 22న జరిగిన పహల్గాం ఉగ్ర దాడిలో ప్రాణాలు కోల్పోయినవారికి
నివాళులర్పించారు. మోదీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చి మొదటి వార్షికోత్సవం, సుపరిపాలన అంశాలపైనా ఈ భేటీలో ప్రధానంగా చర్చించినట్లు తెలిసింది.
Trending News
Chiranjeevi | latest chiranjeevi - eenaduవాళ్ల నటనను స్ఫూర్తిగా తీసుకునే నటుడిగా నన్ను మలుచుకున్నా భారతదేశాన్ని ప్రపంచ కేంద్రంగా నిలబెట్టాలనే లక్ష్యంతో కేంద్రప్ర...
Himanta biswa sarma: ఆ సమయంలో ప్రతిపక్షాలు అండగా నిలిచాయి: హిమంతప్రతిపక్ష నేతలైన శశిథరూర్, అసదుద్దీన్ ఒవైసీ, సుప్రియా సూలేలపై అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ ప్రశంసలు కురిపించారు. కాంగ్ర...
Stock market: ఆర్బీఐ రేట్ల కోత అంచనాలు.. లాభాల్లో ముగిసిన సూచీలుStock Market closing Bell | ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు (Stock market) లాభాల్లో ముగిశాయి. ఆర్బీఐ వడ్డీ రేట్ల...
Supreme court | latest supreme court - eenaduఆ చట్టాలకు కోర్టు ధిక్కారం వర్తించదు పార్లమెంటు, శాసనసభలు చేసిన చట్టాలకు కోర్టు ధిక్కార నేరం వర్తించదని సుప్రీంకోర్టు స్...
Delhi: దిల్లీ విమానాశ్రయంలో ఈనెల 15 నుంచి రోజుకు 114 దేశీయ విమాన సర్వీసులు రద్దుమొత్తం రోజువారీ విమాన సర్వీసుల్లో 7.5 శాతానికి సమానమైన 114 విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్లు దిల్లీ విమానాశ్రయాన్ని న...
Latests News
Pm modi: ఆ రాష్ట్రాల అనుభవాలు వింటుంటే అద్భుతంగా ఉంది: ప్రధాని మోదీ ట్వీట్దిల్లీ: ఎన్డీయే పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులతో దిల్లీలో జరిగిన సమావేశం ముగిసిన అనంతరం ప్రధాని నరేంద్ర ...
Nagathihalli Chandrashekar’s untitled film to commence shoot in LondonThe shooting of Nagathihalli Chandrashekar’s directorial will begin on August 4 in London and the team is preparing for ...
Census: 2027లో జనగణన ప్రారంభం.. : కేంద్రం వెల్లడిదిల్లీ: దేశవ్యాప్త జనగణన (Census) ఎప్పుడు నిర్వహిస్తారోనన్న ఎదురుచూపులకు తెర పడే సమయం ఆసన్నమైంది. జనగణనకు కేంద్రం సిద్ధమ...
Kommineni: శాంతిభద్రతలు భగ్నం చేసేందుకు ఆ వ్యాఖ్యలు.. కొమ్మినేని రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలుఅమరావతి మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలు ముందస్తు ప్రణాళిక ప్రకారమే దురద్దేశంతో చేశారని సాక్షి టీవీ ఛానల్ వ్యాఖ్యాత కొమ్మినేని...
Usa: లాస్ ఏంజెలెస్లో అక్రమ వలసదారుల అరెస్టు.. ఆందోళనకారులపై టియర్ గ్యాస్అక్రమ వలసదారుల ఏరివేతకు లాస్ ఏంజెలెస్లో అధికారులు నిర్వహిస్తున్న ఆకస్మిక తనిఖీలకు వ్యతిరేకంగా ప్రజలు పెద్దఎత్తున ఆందోళ...