Usa: అమెరికాలో ప్రమాదం.. భారత సంతతి ఇంజినీర్‌ సహా ముగ్గురు మృతి

Eenadu

Usa: అమెరికాలో ప్రమాదం.. భారత సంతతి ఇంజినీర్‌ సహా ముగ్గురు మృతి"

Play all audios:

Loading...

అమెరికాలో పర్వతారోహణ క్రమంలో ప్రమాదానికి గురైన ఘటనలో భారత సంతతికి చెందిన విష్ణు ఇరిగిరెడ్డి సహా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఇంటర్నెట్‌ డెస్క్‌: అమెరికాలో విషాద ఘటన చోటుచేసుకుంది.


వాషింగ్టన్‌ రాష్ట్రంలోని నార్త్‌ క్యాస్కేడ్స్‌ పర్వతారోహణకు వెళ్లిన ఓ బృందం ప్రమాదానికి గురయ్యింది. ఈ ఘటనలో భారత సంతతికి చెందిన విష్ణు ఇరిగిరెడ్డి (Vishnu Irigireddy) సహా ముగ్గురు ప్రాణాలు


కోల్పోయారు. ప్రాణాలతో బయటపడిన మరో యువకుడి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలిసింది. సియాటెల్‌లోని ప్రముఖ కంపెనీలో ఇంజినీర్‌గా పనిచేస్తున్న సియాటెల్‌కు చెందిన విష్ణు (48).. మరో ముగ్గురు


స్నేహితులతో కలిసి పర్వతారోహణ కోసం నార్త్‌ ఎర్లీ వింటర్స్‌ స్పియర్స్‌ ప్రాంతానికి వెళ్లారు. దిగే సమయంలో ప్రతికూల వాతావరణం ఎదురయ్యింది. ఈ క్రమంలో వారి యాంకర్‌ పాయింట్‌ అదుపుతప్పి 200 అడుగుల


లోతులో పడిపోయారు. అందులో ప్రాణాలతో ఉన్న ఓ యువకుడు మాత్రం 64కి.మీ మేర నడిచి.. ఎట్టకేలకు సురక్షిత ప్రాంతానికి చేరుకొన్నాడు. ప్రమాద విషయాన్ని అధికారులకు వెల్లడించడంతో ఈ విషయం వెలుగులోకి


వచ్చింది. వెంటనే రంగంలోకి దిగిన రెస్క్యూ బృందాలు.. హెలికాప్టర్‌ సాయంతో మృతదేహాలను బయటకు తీసుకువచ్చినట్లు సమాచారం. * ప్రతి దానికి క్రెడిట్‌ తీసుకోవడం ట్రంప్‌నకు అలవాటే: పెంటగాన్‌ మాజీ అధికారి


భారత్‌కు చెందిన విష్ణు ఇరిగిరెడ్డి సియాటెల్‌లో స్థిరపడ్డారు. గ్రేటర్‌ సియాటెల్‌లో ఉన్న ప్రముఖ ఎలక్ట్రానిక్‌ సంస్థ ఫ్లూక్‌ కార్పొరేషన్‌లో ఇంజినీరింగ్‌ విభాగానికి ఉపాధ్యక్షుడిగా పనిచేశారు.


అక్కడ పేరుగాంచిన నిపుణుల్లో ఒకడిగా గుర్తింపు పొందడంతోపాటు స్థానికంగా నిర్వహించే కార్యక్రమాల్లో క్రియాశీలంగా వ్యవహరించేవారు.


Trending News

‘క్రికెట్‌ సెలక్షన్‌’ను ప్రత్యక్ష ప్రసారం చేయాలి

ముంబై: భారత క్రికెటర్, బెంగాల్‌ రంజీ జట్టు మాజీ కెప్టెన్‌ మనోజ్‌ తివారీ భారత సెలక్షన్‌ కమిటీ తీరుపై విరుచుకుపడ్డాడు. జట్...

Cm revanth reddy: ఇందిరమ్మ ఇళ్లకు ఉచితంగా ఇసుక సరఫరా: సీఎం రేవంత్‌ రెడ్డి ఆదేశం

హైదరాబాద్‌: రాష్ట్రంలో ఇసుక రవాణా, తవ్వకాల అంశంపై తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి(Revanth Reddy) కీలక నిర్ణయాలు తీసుకున్నారు...

రూపాయి.. రూపాయి నువ్వేం చేస్తావు..? ఎంతటి ఘోరానికి కారణమైందో చూడండి

Reported by: Published by: Last Updated:April 12, 2023 10:04 PM IST గొడ్డలి, రోకలిబండలతో ఆయన కుటుంబ సభ్యులు చేసిన దాడిలో...

Ipl 2025 playoffs: సండే ఐపీఎల్‌ ట్రిపుల్‌ ధమాకా.. రెండు మ్యాచులు.. మూడు బెర్త్‌లు

IPL Playoffs Scenario : ఈ రోజు జరగబోయే రెండు ఐపీఎల్‌ మ్యాచులతో ఐపీఎల్‌ 2025 మూడు బెర్తుల్లో ఒకటి అధికారికంగా, రెండు దాదా...

Indus treaty: సింధూ జలాలపై పునఃసమీక్షించండి.. భారత్‌కు పాకిస్థాన్‌ విజ్ఞప్తి

Indus treaty | దిల్లీ: సింధూ జలాల ఒప్పందం నిలిపివేత వల్ల జరిగే నష్టం ఏంటో పాకిస్థాన్‌కు తెలుసొచ్చింది. మొన్నటి వరకు ఈ అం...

Latests News

Usa: అమెరికాలో ప్రమాదం.. భారత సంతతి ఇంజినీర్‌ సహా ముగ్గురు మృతి

అమెరికాలో పర్వతారోహణ క్రమంలో ప్రమాదానికి గురైన ఘటనలో భారత సంతతికి చెందిన విష్ణు ఇరిగిరెడ్డి సహా ముగ్గురు ప్రాణాలు కోల్పో...

రూపాయి.. రూపాయి నువ్వేం చేస్తావు..? ఎంతటి ఘోరానికి కారణమైందో చూడండి

Reported by: Published by: Last Updated:April 12, 2023 10:04 PM IST గొడ్డలి, రోకలిబండలతో ఆయన కుటుంబ సభ్యులు చేసిన దాడిలో...

Ipl 2025 playoffs: సండే ఐపీఎల్‌ ట్రిపుల్‌ ధమాకా.. రెండు మ్యాచులు.. మూడు బెర్త్‌లు

IPL Playoffs Scenario : ఈ రోజు జరగబోయే రెండు ఐపీఎల్‌ మ్యాచులతో ఐపీఎల్‌ 2025 మూడు బెర్తుల్లో ఒకటి అధికారికంగా, రెండు దాదా...

Indus treaty: సింధూ జలాలపై పునఃసమీక్షించండి.. భారత్‌కు పాకిస్థాన్‌ విజ్ఞప్తి

Indus treaty | దిల్లీ: సింధూ జలాల ఒప్పందం నిలిపివేత వల్ల జరిగే నష్టం ఏంటో పాకిస్థాన్‌కు తెలుసొచ్చింది. మొన్నటి వరకు ఈ అం...

Hari hara veera mallu: పవన్‌ కల్యాణ్‌ ఒక్క సినిమానే డైరెక్ట్‌ చేసినా.. : నిర్మాత ఏఎం రత్నం

ఇంటర్నెట్‌ డెస్క్‌: సినిమాకి సంబంధించి పవన్‌ కల్యాణ్‌ అద్భుతమైన టెక్నీషియన్‌ అని నిర్మాత ఏఎం రత్నం (AM Rathnam) పేర్కొన్...

Top