Iran: ఇరాన్‌లో ముగ్గురు భారత యువకులు కిడ్నాప్‌..

Eenadu

Iran: ఇరాన్‌లో ముగ్గురు భారత యువకులు కిడ్నాప్‌.."

Play all audios:

Loading...

ఇంటర్నెట్‌ డెస్క: ఇరాన్‌ (Iran)కు వెళ్లిన ముగ్గురు భారత యువకులు అదృశ్యమయినట్లు అక్కడి భారత దౌత్య కార్యాలయం పేర్కొంది. తప్పిపోయిన భారత పౌరుల ఆచూకీ కనుగొనాలని టెహ్రాన్‌లోని అధికారులను కోరింది.


తప్పిపోయిన వారిని పంజాబ్‌కు చెందిన సంప్రీత్, అమృత్‌పాల్, జస్పాల్‌గా పేర్కొంది. ఇటీవల మరో ఇద్దరు యువకులతో ఇరాన్‌కు వెళ్లిన తన కుమారుడు కొద్ది రోజులుగా తమకు అందుబాటులోకి రావట్లేదని.. వారి


సమాచారం తెలియట్లేదని హుస్న్‌ప్రీత్ తల్లి పంజాబ్ ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడంతో ఈ అంశం వెలుగులోకి వచ్చింది.  ఏజెంట్ల సహాయంతో వారు దిల్లీ మీదుగా డంకీ రూట్‌లో ఉద్యోగాల కోసం ఆస్ట్రేలియాకు


బయల్దేరారని..వారిని తీసుకువెళ్లిన ఏజెంట్లు తాత్కాలికంగా బస చేద్దామని నమ్మించి మే 11వ తేదీన వారిని ఇరాన్‌ తీసుకెళ్లి అక్కడ కిడ్నాప్‌ చేశారని ఆమె ఆరోపించారు. విడుదల చేయాలంటే డబ్బు ఇవ్వాలని


డిమాండ్‌ చేస్తున్నారని అధికారులకు తెలియజేశారు. వారిని తాళ్లతో కట్టేసి ఉన్న ఫొటోలు తమకు పంపారని, ఒంటిపై గాయాలు కూడా ఉన్నాయని వాపోయారు. వీలయినంత త్వరగా తమ వారిని విడిపించాలని యువకుల కుటుంబాలు


ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. దీంతో పంజాబ్‌ ప్రభుత్వం ఈ విషయాన్ని ఇరాన్‌లోని భారత రాయబార కార్యాలయం దృష్టికి తీసుకువెళ్లింది.  దీంతో రాయబార కార్యాలయం ఈ విషయంలో ఇరాన్ అధికారుల సహాయం కోరింది.


అదృశ్యమైన భారతీయులను తక్షణమే గుర్తించాలని, వారి భద్రతను నిర్ధరించాలని అభ్యర్థించింది. 


Trending News

Vastu: అప్పులు, ఆర్థిక కష్టాలు తీరాలంటే, ఇంట్లో 7 మార్పులు చెయ్యండి

గ్లాస్ విండో: మీకు అప్పుల బాధ తీరిపోవాలంటే, ఈశాన్యం దిక్కులో ఓ గ్లాస్ కిటికీని అమర్చండి. మీ ఇల్లు, షాప్ ఏదైనా సరే, ఈశ్యా...

Pm narendra modi inaugurates 'maitri setu' between india and bangladesh - key points

Bangladesh Prime Minister Sheikh Hasina also virtually addressed the function organised to inaugurate the double lane Fe...

దర్యాప్తునకు ముందే స్టే ఎలా ఇస్తారు..?  

సాక్షి, న్యూఢిల్లీ: ‘గత విచారణ సందర్భంగానే మీకు చెప్పాం. ఇలా దర్యాప్తు ప్రారంభం కూడా కాకముందే స్టే ఆర్డర్లు ఇవ్వడాన్ని మ...

నగరంలో ట్రాఫిక్‌ ఆంక్షలు

సాక్షి, సిటీబ్యూరో: మొహర్రం ఊరేగింపు నేపథ్యంలో మంగళవారం పాతబస్తీ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఎలాంటి అవ...

17న ఎంగిలిపూల బతుకమ్మ 

ఫైల్‌ ఫోటో సాక్షి, హన్మకొండ: ఈ ఏడాది అధిక ఆశ్వయుజం వచ్చినందున ఎంగిలిపూల బతుకమ్మ, సద్దుల బతుకమ్మ పండుగలు ఎప్పుడు జరుపుకోవ...

Latests News

Iran: ఇరాన్‌లో ముగ్గురు భారత యువకులు కిడ్నాప్‌..

ఇంటర్నెట్‌ డెస్క: ఇరాన్‌ (Iran)కు వెళ్లిన ముగ్గురు భారత యువకులు అదృశ్యమయినట్లు అక్కడి భారత దౌత్య కార్యాలయం పేర్కొంది. తప...

నేటి తాజా వార్తలు @ ఈనాడు. నెట్‌ (23/05/2025)

23/05/2025 11:09(IST) ఏపీ మద్యం కుంభకోణం.. రాజ్‌ కెసిరెడ్డికి సుప్రీంలో చుక్కెదురు రాజ్‌ కెసిరెడ్డి, ఆయన తండ్రి ఉపేంద్రర...

Raashii khann: రాశీ ఖన్నాకు గాయాలు.. ఫొటోలు షేర్‌ చేసిన నటి

ఇంటర్నెట్ డెస్క్‌: ప్రేక్షకులకు వినోదాన్ని పంచడం కోసం తెరవెనక నటీనటులు ఎంతో కష్టపడుతుంటారు. షూటింగ్‌ సమయంలో అయ్యే గాయాలన...

చిరంజీవికి మోహ‌న్‌బాబు బ‌ర్త్‌డే గిఫ్ట్‌

ఆదివారం వినాయ‌క చ‌వితిని టాలీవుడ్ ప్ర‌ముఖులంద‌రూ త‌మ‌తమ ఇళ్ల‌ల్లో భ‌క్తిశ్ర‌ద్ధ‌ల‌తో జ‌రుపుకున్నారు. అయితే సినీ ప్రేమికు...

Nara bhuvaneswari: ఈ తారకరామారావు మా నాన్నంత ఎత్తుకు ఎదగాలి: నారా భువనేశ్వరి

ఇంటర్నెట్‌ డెస్క్‌: నందమూరి హరికృష్ణ మనవడు, జానకిరామ్‌ కుమారుడు.. తారక రామారావు (Nandamuri Taraka Ramarao) హీరోగా వై.వి....

Top