Shashi tharoor: కాంగ్రెస్ చెప్పింది వారిని.. కేంద్రం ఎంచుకుంది శశిథరూర్ని..
Shashi tharoor: కాంగ్రెస్ చెప్పింది వారిని.. కేంద్రం ఎంచుకుంది శశిథరూర్ని.."
Play all audios:
ఇంటర్నెట్డెస్క్: భారత్పై ఉగ్రవాదాన్ని ఉసిగొల్పుతోన్న పాకిస్థాన్ను అంతర్జాతీయంగా ఏకాకిని చేసేందుకు కేంద్రం రంగం సిద్ధం చేసింది. పాక్ ఉగ్ర కుట్రలను ప్రపంచదేశాలకు వివరించడం కోసం ఏడు
అఖిలపక్ష బృందాలను ఏర్పాటు చేసింది. ఆ ప్రతినిధుల బృందాలకు ఏడుగురు ఎంపీలు నాయకత్వం వహిస్తుండగా.. వారిలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు శశిథరూర్ (Shashi Tharoor) కూడా ఉన్నారు. అయితే కాంగ్రెస్ పంపిన
జాబితాలో అసలు థరూర్ పేరు లేకపోవడం గమనార్హం. పాక్ను ఎండగట్టేందుకు పంపే బృందం కోసం పేర్లు పంపాలని కేంద్రమంత్రి కిరణ్ రిజిజు మే 16న కాంగ్రెస్ను కోరగా, అదేరోజున హస్తం పార్టీ అగ్రనాయకుడు రాహుల్
గాంధీ నాలుగు పేర్లు పంపారు. వారిలో కేంద్ర మాజీ మంత్రి ఆనంద్ శర్మ, రాజ్యసభ ఎంపీ డాక్టర్ సయ్యద్ నజీర్ హుస్సేన్, లోక్సభ ఎంపీ రాజా బ్రార్, మరో నేత గౌరవ్ గొగొయ్ ఉన్నారని ఆ పార్టీ నేత జైరాం
రమేశ్ ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఆ లిస్ట్లో థరూర్ పేరు లేదు. అయితే ఈ రోజు కేంద్రం విడుదల చేసిన తుది జాబితాలో వారి పేర్లేవీ లేవు. కానీ తిరువనంతపురం ఎంపీ శశిథరూర్కు మాత్రం అనూహ్యంగా చోటు
దక్కింది. * ఇక పాక్పై దౌత్యయుద్ధం.. శశిథరూర్ సహా ఏడుగురు ఎంపీలతో విదేశాలకు బ్రీఫింగ్ అవసరం ఉన్నచోట నేనుంటా.. ‘‘ఇటీవలి పరిణామాలపై దేశం విధానాన్ని వివిధ దేశాలకు వివరించేందుకు వెళ్తున్న
బృందానికి నాయకత్వం వహించడం గౌరవంగా భావిస్తున్నాను. దేశ ప్రయోజనాలతో ముడిపడిన సందర్భాల్లో అక్కడ నా అవసరం ఉంటే.. నేను అందుబాటులో ఉంటా. జైహింద్ ’’ అని థరూర్ ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు. కాగా..
ఎంపీలు శశిథరూర్ (కాంగ్రెస్), రవిశంకర్ ప్రసాద్(భాజపా), బైజయంత్ పాండా (భాజపా) సంజయ్కుమార్ ఝా(జేడీయూ), కనిమొళి (డీఎంకే), సుప్రియా సూలే (ఎన్సీపీ -ఎస్పీ), శ్రీకాంత్ శిందే (శివసేన)
విదేశాల్లో భారత బృందాలకు నాయకత్వం వహించనున్నట్లు కేంద్రం వెల్లడించింది. ఉగ్రవాద కార్యకలాపాలకు పాకిస్థాన్ ఏవిధంగా మద్దతు పలుకుతోందనే విషయాన్ని.. ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor)తో
ఉగ్రవాదంపై భారత్ జరిపిన పోరాటాన్ని పలు ఆధారాల ద్వారా విదేశాలకు ఈ బృందాలు వివరించనున్నట్లు సమాచారం.
Trending News
Indus water treaty: ఒమర్ vs మెహబూబా.. ‘తుల్బుల్’పై మాటల యుద్ధంఇంటర్నెట్ డెస్క్: సింధూ జలాల ఒప్పందం నిలిపివేత అంశంపై జమ్మూకశ్మీర్ రాజకీయాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. తాజాగా దీనికి స...
Talasani srinivas yadav | latest talasani srinivas yadav - eenaduఆ పరిశ్రమ తలసాని కుటుంబానిదే.. మంత్రి సీతక్క ఆరోపణ నిర్మల్ జిల్లా దిలావర్పూర్ ఇథనాల్ పరిశ్రమ భారాసకు చెందిన మాజీ మంత...
Dilruba: కిరణ్ అబ్బవరం ‘దిల్ రూబా’.. విడుదల వాయిదాఇంటర్నెట్ డెస్క్: కిరణ్ అబ్బవరం (Kiran Abbavaraam) హీరోగా దర్శకుడు విశ్వకరుణ్ తెరకెక్కించిన చిత్రం ‘దిల్ రూబా’ (Dil...
Arjun kapoor and parineeti chopra wrap up punjab schedule of namaste englandArjun Kapoor, Parineeti Chopra on the poster of Namaste England  The much-loved pair of _Ishaqzaade_ - Arjun Kap...
బిహార్లో మహాకూటమికి షాక్పట్నా : బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు పాలక ఎన్డీయే, ఆర్జేడీ నేతృత్వంలోని మహాకూటమిలో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి...
Latests News
Shashi tharoor: కాంగ్రెస్ చెప్పింది వారిని.. కేంద్రం ఎంచుకుంది శశిథరూర్ని..ఇంటర్నెట్డెస్క్: భారత్పై ఉగ్రవాదాన్ని ఉసిగొల్పుతోన్న పాకిస్థాన్ను అంతర్జాతీయంగా ఏకాకిని చేసేందుకు కేంద్రం రంగం సిద్ధ...
Defence stocks: భారత్- పాక్ల మధ్య ఉద్రిక్తతలు.. డిఫెన్స్ స్టాక్స్ పరుగులుDefence stocks | ముంబయి: ఉగ్రవాదులను ఏరిపారేయడమే లక్ష్యంగా భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ను జీర్ణించుకోలేని పాకిస్థ...
Supreme court | latest supreme court - eenaduడీటీహెచ్ సేవలపై వినోద, సేవా పన్నులు విధించొచ్చు వినియోగదార్లకు అందించే డీటీహెచ్ సేవలపై రాష్ట్ర శాసనసభలు, పార్లమెంటు వి...
Ttd: తితిదే ట్రస్ట్కు ఎన్ఆర్ఐ భారీ విరాళంతిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్కు అమెరికాలోని బోస్టన్కు చెందిన ఎన్ఆర్ఐ భాగవతుల ఆనంద్మోహన్ భారీ విరాళం అందజేశారు. ...
Shashi tharoor: శశిథరూర్పై వేటు వేద్దామా.. వద్దా? భాజపా అస్త్రంతో ఎటూ తేల్చుకోలేకపోతున్న కాంగ్రెస్..Shashi Tharoor: సొంత పార్టీపై బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు శశిథరూర్. 2026లో కేరళ అసెంబ్లీ ఎన్నికలు జరిగే ...