Indus water treaty: ఒమర్ vs మెహబూబా.. ‘తుల్బుల్’పై మాటల యుద్ధం
Indus water treaty: ఒమర్ vs మెహబూబా.. ‘తుల్బుల్’పై మాటల యుద్ధం"
Play all audios:
ఇంటర్నెట్ డెస్క్: సింధూ జలాల ఒప్పందం నిలిపివేత అంశంపై జమ్మూకశ్మీర్ రాజకీయాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. తాజాగా దీనికి సంబంధించి ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా (Omar Abdullah), పీడీపీ
అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీల (Mehbooba Mufti) మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ ఒప్పందంపై ముఖ్యమంత్రి వైఖరిని ప్రశ్నిస్తూ ముఫ్తీ విమర్శలు గుప్పించారు. ఇందుకు దీటుగా బదులిచ్చిన సీఎం.. తీవ్ర
స్థాయిలో విరుచుకుపడ్డారు. సరిహద్దు అవతల ఉన్నవారి కోసం ఆమె ఆలోచిస్తున్నారు తప్ప, ఇక్కడి ప్రజల సంక్షేమం పట్టడం లేదంటూ మండిపడ్డారు. ఈ ప్రాజెక్టు పునరుద్ధరిస్తే.. సింధూ ఒప్పందం అమలు నిలిపివేత
దృష్ట్యా.. వులర్ సరస్సుపై గతంలో తలపెట్టిన ‘తుల్బుల్’ బ్యారేజీ ప్రాజెక్టు పునరుద్ధరణపై ఒమర్ మాట్లాడారు. ‘‘1980ల్లో ఇది ప్రారంభమైంది. ఒప్పందం పేరు చెప్పి పాకిస్థాన్ ఒత్తిడి తేవడం వల్ల
ఇన్నేళ్లుగా దీన్ని పక్కన పెట్టాల్సి వచ్చింది. ఒకవేళ ఈ ప్రాజెక్టు పూర్తయితే నావిగేషన్ కోసం జీలంను ఉపయోగించుకునేందుకు మార్గం సుగమం అవుతుంది. అంతేకాకుండా దిగువన ఉన్న ప్రాజెక్టులతో విద్యుత్
ఉత్పత్తిని మెరుగుపరుస్తుంది’’ అని సీఎం ఒమర్ పేర్కొన్నారు. * భారత్ సమీపంలో చైనా గూఢచారి నౌక.. పాక్కు సాయం చేసేందుకేనా? సీఎం ఒమర్ అబ్దుల్లా అభిప్రాయంపై పీడీపీ అధినేత మెహబూబా స్పందిస్తూ..
‘‘ఆయన వ్యాఖ్యలు చాలా దురదృష్టకరం. అవి బాధ్యతారహిత వ్యాఖ్యలే కాకుండా ప్రమాదకరంగా, ప్రేరేపించేలా ఉన్నాయి. ఇరుదేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులను మరింత రెచ్చగొట్టేందుకు ఒమర్ ప్రయత్నిస్తున్నారు.
అత్యంత అవసరమైన, జీవనాధారమైన నీటిని ఆయుధంగా మార్చడం అమానవీయం. అంతేకాకుండా ద్వైపాక్షిక అంశాలను అంతర్జాతీయంగా మార్చే ప్రమాదం ఉంది’’ అని ముఫ్తీ ఆందోళన వ్యక్తం చేశారు. ముఫ్తీ వ్యాఖ్యలను సీఎం
ఒమర్ అబ్దుల్లా తిప్పికొట్టారు. ఈ ఒప్పందం జమ్మూకశ్మీర్కు చారిత్రక ద్రోహమని అంగీకరించేందుకు ముఫ్తీ నిరాకరిండం.. చౌకబారు పబ్లిసిటీ చేసుకొనే ప్రయత్నంలో భాగమన్నారు. సరిహద్దు అవతల ఉన్న కొంతమంది
ప్రయోజనం కోసం ఇలా చేయడం దురదృష్టకరమన్నారు. సింధూ జలాల ఒప్పందం (IWT)ను తాను మొదటినుంచీ వ్యతిరేకిస్తున్నానని, భవిష్యత్తులోనూ కొనసాగిస్తానని చెప్పారు.
Trending News
Talasani srinivas yadav | latest talasani srinivas yadav - eenaduఆ పరిశ్రమ తలసాని కుటుంబానిదే.. మంత్రి సీతక్క ఆరోపణ నిర్మల్ జిల్లా దిలావర్పూర్ ఇథనాల్ పరిశ్రమ భారాసకు చెందిన మాజీ మంత...
Pm modi: ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్.. నక్సలిజంపై పోరాటంలో ఘన విజయమంటూ మోదీ పోస్ట్దిల్లీ: ఛత్తీస్గఢ్ (Chhattisgarh)లోని నారాయణపూర్ జిల్లాలో బుధవారం ఉదయం జరిగిన ఎదురుకాల్పుల్లో 27 మంది మావోయిస్టులు మృ...
Sri sathya sai district news | latest sri sathya sai district news - eenaduరామగిరి హెలిప్యాడ్ ఘటన.. విచారణకు హాజరైన పైలట్, కోపైలట్ ఈ నెల 8న శ్రీసత్యసాయి జిల్లా రామగిరి మండలం పాపిరెడ్డిపల్లిలో ...
India-pakistan: సరిహద్దుల్లో పాక్ ఆర్మీ కాల్పులు.. భారత జవాను మృతిIndia-Pakistan: నియంత్రణ రేఖ వెంబడి పాక్ సైన్యం కవ్వింపులకు పాల్పడుతోంది. శత్రు సైన్యం జరిపిన కాల్పుల్లో ఓ భారత జవాను ప...
Rajanna sircilla news | latest rajanna sircilla news - eenaduసిరిసిల్లలో కాంగ్రెస్, భారాస నేతల ఘర్షణ రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదుట కాంగ్రెస్, ...
Latests News
Indus water treaty: ఒమర్ vs మెహబూబా.. ‘తుల్బుల్’పై మాటల యుద్ధంఇంటర్నెట్ డెస్క్: సింధూ జలాల ఒప్పందం నిలిపివేత అంశంపై జమ్మూకశ్మీర్ రాజకీయాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. తాజాగా దీనికి స...
Rahul srivastava read all the latest hindi news from rahul srivastava | jagran. ComLanguage * हिन्दी * English * ગુજરાતી * ਪੰਜਾਬੀ * मराठी * Naidunia * Jagran Josh * Her Zindagi * Onlymyhealth * Jagran TV...
Shubman gill: టెస్ట్ కెప్టెన్సీ సంగతి తర్వాత.. గిల్ ముందు టీమ్లో స్థానం సుస్థిరం చేసుకోవాలి: శ్రీకాంత్‘అంతా శుభ్మన్ గిల్ను కాబోయే కెప్టెన్ అంటున్నారు. కానీ నా దృష్టిలో అతడికి తుది జట్టులో స్థానమే పదిలం కాదు. బుమ్రానే క...
Eddie Jones discusses Manu Tuilagi selectionLeicester Tigers centre Tuilagi has not played international rugby since March 2016 having been riddled with injuries ov...
25 మంది కూలీలకు తీవ్ర అస్వస్థత.. ఆ నీటిలో ఏం కలిసిందో తెలుసా? రైతులూ బీ అలర్ట్Published by: Last Updated:April 02, 2023 4:01 PM IST గురువారం మధ్యాహ్న సమయంలో భోజనం చేయడం కోసం 25 మంది కూలీలు పక్క మిర్...