Shashi tharoor: ’శశిథరూర్ లక్ష్మణ రేఖ దాటారు’.. సొంత పార్టీలోనే విమర్శలు
Shashi tharoor: ’శశిథరూర్ లక్ష్మణ రేఖ దాటారు’.. సొంత పార్టీలోనే విమర్శలు"
Play all audios:
భారత్- పాకిస్థాన్ ఉద్రిక్తతల సమయంలో వరుస వ్యాఖ్యలతో శశిథరూర్ లక్ష్మణ రేఖ దాటారని కాంగ్రెస్ వర్గాలు పేర్కొన్నాయి. ఇంటర్నెట్ డెస్క్: కాంగ్రెస్ (Congress) అధినాయకత్వంతో పార్టీ సీనియర్
నేత శశిథరూర్ (Shashi Tharoor) బంధం బీటలు వారుతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సొంత పార్టీలోనే ఆయన వ్యవహార శైలిపై అసంతృప్తి వ్యక్తమవుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల
భారత్- పాకిస్థాన్ ఉద్రిక్తతల సమయంలో వరుస వ్యాఖ్యలతో శశిథరూర్ లక్ష్మణ రేఖ దాటారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. కాంగ్రెస్ సీనియర్ నేతలు రాహుల్ గాంధీ, జైరాం రమేశ్, కేసీ వేణుగోపాల్,
శశిథరూర్, ప్రియాంక గాంధీ, సచిన్ పైలట్ తదితరులు బుధవారం దిల్లీలో సమావేశమయ్యారు. ఈ భేటీ అనంతరం పార్టీ వర్గాలు శశిథరూర్ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశాయి. ‘‘కాంగ్రెస్ ఓ ప్రజాస్వామ్య
పార్టీ. నేతలు తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తపరుస్తారు. కానీ, శశిథరూర్ ఈసారి లక్ష్మణ రేఖ దాటారు. ఈ క్రమంలోనే వ్యక్తిగత అభిప్రాయాల వెల్లడికి ఇది సమయం కాదని, పార్టీ వైఖరికి కట్టుబడి ఉండాలని
తాజా సమావేశంలో అధిష్ఠానం సైతం ఎవరి పేరు ఎత్తకుండానే స్పష్టం చేసింది’’ అని తెలిపాయి. ఈ వ్యవహారంపై జైరాం రమేశ్ సైతం స్పందిస్తూ.. శశిథరూర్ వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగత అభిప్రాయాలని, పార్టీతో
ఎటువంటి సంబంధం లేదన్నారు. * సింధూ జలాలపై పునఃసమీక్షించండి.. భారత్కు పాకిస్థాన్ విజ్ఞప్తి భారత్- పాక్ ఉద్రిక్తతల సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ సమర్థంగా వ్యవహరించారంటూ శశిథరూర్ ఇటీవల
ప్రశంసించారు. ఉగ్రవాదం విషయంలో దాయాది దేశానికి స్పష్టమైన సందేశాన్ని ఇచ్చారన్నారు. అంతకుముందు తిరువనంతపురంలో ప్రధాని మోదీ కార్యక్రమానికి శశిథరూర్ హాజరైన విషయం తెలిసిందే. తాము ఇద్దరం ఒకే
వేదికపై ఉండటం కొంతమందికి నిద్ర లేని రాత్రిని మిగులుస్తుందని మోదీ అప్పట్లో వ్యంగ్యాస్త్రాలు విసిరారు.
Trending News
Mission swacchata aur paani: "స్వచ్ఛతా కి పాఠశాల"ను దేశమంతటా అనుకరించాలిమరుగుదొడ్ల లభ్యత సమస్యగా ఉండదు. అయినప్పటికీ, పరిశుభ్రత ఇప్పటికీ సమస్యగా ఉంది. మరుగుదొడ్డిని కనుగొనడం వల్ల వచ్చే నిరాశను ...
Demat additions: స్టాక్ మార్కెట్ డీలా.. 21 నెలల కనిష్ఠానికి కొత్త డీమ్యాట్ ఖాతాలుDemat accounts | ఇంటర్నెట్ డెస్క్: దేశంలో కొత్త డీమ్యాట్ ఖాతాల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతోంది. ఒకప్పుడు డీమ్యాట్ ఖ...
Pib fact check: ఎస్బీఐ ఖాతాదారులకు అలర్ట్ ‘రివార్డ్స్’ పేరిట ఇలాంటి మెసేజ్లు వస్తున్నాయా? జాగ్రత్తఅమాయకులను టార్గెట్ చేసుకొని సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఆశల వలవేసి యథేచ్ఛగా బ్యాంకు ఖాతాలను లూటీ చేస్తున్నారు. ఇ...
Kenishaa francis: ఏదైనా ఉంటే డైరెక్ట్గా నాతో చెప్పండి.. : నటుడి భార్య పోస్ట్పై స్పందించిన గాయనిజయం రవి, కెనీషా రిలేషన్లో ఉన్నట్లు ఎంతో కాలం నుంచి వార్తలు వస్తోన్న విషయం తెలిసిందే. ఈనేపథ్యంలోనే కెనీషా పెట్టిన ఓ పోస్...
Pm modi: ఆపరేషన్ సిందూర్.. జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్న మోదీఇంటర్నెట్ డెస్క్: భారత ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. పాకిస్థాన్ భారత్ చేపట...
Latests News
Shashi tharoor: ’శశిథరూర్ లక్ష్మణ రేఖ దాటారు’.. సొంత పార్టీలోనే విమర్శలుభారత్- పాకిస్థాన్ ఉద్రిక్తతల సమయంలో వరుస వ్యాఖ్యలతో శశిథరూర్ లక్ష్మణ రేఖ దాటారని కాంగ్రెస్ వర్గాలు పేర్కొన్నాయి. ఇంట...
Anagani satya prasad | latest anagani satya prasad - eenaduఅమర వీరుడు మురళీనాయక్కు నివాళులర్పించిన మంత్రులు లోకేశ్, అనగాని దేశ సరిహద్దుల్లో వీరమరణం పొందిన జవాను మురళీనాయక్కు మం...
Ncb recovers cannabis from comedian bharti singh, husband haarsh limbachiyaa's mumbai residenceBharti Singh’s name had cropped up during the interrogation of a drug peddler, after which her residence was searched, a...
India vs pakistan | latest india vs pakistan - eenaduసమయం, సందర్భం ఉండవా?: వసీం అక్రమ్ ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్లో భారత ఓపెనర్ శుభ్మన్ గిల్ను ఔట్ చేసినప్పుడు, పాకిస్థ...
NISHABDHAM MOVIE DOWNLOAD ON FILMYZILLAAdvertisement Live Breaking News: Ghaziabad: Meat-Laden Truck Allegedly Carrying Beef Seized by Hindu Groups on Pilkhuwa...