Nda meet: ఎన్డీయే పాలిత రాష్ట్రాల సీఎంలు, డిప్యూటీ సీఎంలతో ప్రధాని భేటీ

Eenadu

Nda meet: ఎన్డీయే పాలిత రాష్ట్రాల సీఎంలు, డిప్యూటీ సీఎంలతో ప్రధాని భేటీ"

Play all audios:

Loading...

దిల్లీ: ఎన్డీయే (NDA) పాలిత రాష్ట్రాల సీఎంలు, డిప్యూటీ సీఎంలతో ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) దిల్లీలో సమావేశమయ్యారు. కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, భాజపా అధ్యక్షుడు


జేపీ నడ్డా సహా పలువురు కేంద్రమంత్రులు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. కుల గణన, మోదీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతుండడం, కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సుపరిపాలన అంశాలు ఈ


సమావేశంలో ప్రధాన ఎజెండాగా ఉన్నాయని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఆపరేషన్ సిందూర్‌ (Operation Sindoor) తర్వాత తొలిసారి ఈ సమావేశాన్ని నిర్వహిస్తుండడంతో దానికి సంబంధించిన వివరాలను సీఎంలు,


డిప్యూటీ సీఎంలకు కేంద్ర మంత్రులు వివరించారు. తమ తమ రాష్ట్రాల్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వాలు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉపముఖ్యమంత్రులు వివరించారు. పహల్గాం


ఉగ్రదాడి మృతులకు నివాళులు అర్పించారు. ఇందులో భాగంగా ఈ సమావేశంలో రెండు తీర్మానాలు ఆమోదించారు.ఆపరేషన్ సిందూర్‌లో ప్రధాని మోదీ నాయకత్వాన్ని, సాయుధ దళాల పరాక్రమాన్ని అభినందిస్తూ ఒక తీర్మానం


తీసుకురాగా.. దేశవ్యాప్తంగా కుల జనగణన చేపట్టడంపై మరో తీర్మానం చేశారు. సమావేశంలో భాగంగా.. ఆపరేషన్ సిందూర్‌పై కాంగ్రెస్ సహా విపక్షాలు చేసిన విమర్శలను తిప్పికొట్టే అంశంపై చర్చలు జరగనున్నట్లు


సమాచారం. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ శిందే మాట్లాడుతూ..ఆపరేషన్‌ సిందూర్‌ సమయంలో ప్రధాని సాయుధ దళాలకు అధికారాను ఇచ్చి..ముందుకు నడిపించారని కొనియాడారు. ఆపరేషన్ సిందూర్‌ ఉగ్రవాదులకు,


వారిని పోషిస్తున్న వారికి తగిన బుద్ధి చెప్పిందని అన్నారు.


Trending News

‘క్రికెట్‌ సెలక్షన్‌’ను ప్రత్యక్ష ప్రసారం చేయాలి

ముంబై: భారత క్రికెటర్, బెంగాల్‌ రంజీ జట్టు మాజీ కెప్టెన్‌ మనోజ్‌ తివారీ భారత సెలక్షన్‌ కమిటీ తీరుపై విరుచుకుపడ్డాడు. జట్...

Pib fact check: ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌ ‘రివార్డ్స్‌’ పేరిట ఇలాంటి మెసేజ్‌లు వస్తున్నాయా? జాగ్రత్త

అమాయకులను టార్గెట్‌ చేసుకొని సైబర్‌ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఆశల వలవేసి యథేచ్ఛగా బ్యాంకు ఖాతాలను లూటీ చేస్తున్నారు. ఇ...

Usa: అమెరికాలో ప్రమాదం.. భారత సంతతి ఇంజినీర్‌ సహా ముగ్గురు మృతి

అమెరికాలో పర్వతారోహణ క్రమంలో ప్రమాదానికి గురైన ఘటనలో భారత సంతతికి చెందిన విష్ణు ఇరిగిరెడ్డి సహా ముగ్గురు ప్రాణాలు కోల్పో...

Pratyusha banerjee commits suicide, balika vadhu actress declared dead

* Home * Entertainment * Pratyusha Banerjee commits suicide, Balika Vadhu actress declared dead PRATYUSHA HANGED HERSELF...

Tej pratap: ‘మాలో చీలిక తెచ్చేందుకు కుట్ర’.. మౌనం వీడిన తేజ్‌ప్రతాప్‌

పార్టీ నుంచి తన పెద్ద కుమారుడు, మాజీ మంత్రి తేజ్‌ ప్రతాప్‌ యాదవ్‌ను బహిష్కరిస్తున్నట్లు ఆ పార్టీ అధినేత లాలూ ప్రసాద్‌ యా...

Latests News

Nda meet: ఎన్డీయే పాలిత రాష్ట్రాల సీఎంలు, డిప్యూటీ సీఎంలతో ప్రధాని భేటీ

దిల్లీ: ఎన్డీయే (NDA) పాలిత రాష్ట్రాల సీఎంలు, డిప్యూటీ సీఎంలతో ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) దిల్లీలో సమావేశమయ...

Elon musk: ఆ ఒప్పందం వద్దని ట్రంప్‌పై ఒత్తిడి.. మాట వినలేదనే మస్క్‌ దూరమా..?

వాషింగ్టన్‌: అమెరికా ప్రభుత్వంలోని డోజ్‌ శాఖ బాధ్యతల నుంచి అపర కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) వైదొలిగ...

Fresher hiring: టెక్‌ కంపెనీల్లో 50% తగ్గిన ఫ్రెషర్ల నియామకాలు

Fresher hiring | ఇంటర్నెట్‌ డెస్క్‌: కృత్రిమ మేధ (AI) సాంకేతికత ప్రతి రంగంలోనూ విప్లవాత్మక మార్పులు తీసుకొస్తోంది. దీని ...

Satya pal malik: మాజీ గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్‌పై.. సీబీఐ ఛార్జిషీటు దాఖలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: జమ్మూ కశ్మీర్‌లో (Jammu Kashmir News) ఓ పవర్ ప్రాజెక్ట్ టెండర్ల ప్రక్రియలో అవినీతి జరిగిందని ఆరోపణలు...

Crime news: గోదావరిలో గల్లంతైన ఘటన.. ఎనిమిదో మృతదేహం లభ్యం

ముమ్మిడివరం: గోదావరిలో గల్లంతయిన 8 మంది మృతదేహాలూ లభ్యమయ్యాయి. (Crime News) మంగళవారం వరకు ఏడు మృతదేహాలు లభ్యం కాగా.. నేడ...

Top