Elon musk: ఆ ఒప్పందం వద్దని ట్రంప్‌పై ఒత్తిడి.. మాట వినలేదనే మస్క్‌ దూరమా..?

Eenadu

Elon musk: ఆ ఒప్పందం వద్దని ట్రంప్‌పై ఒత్తిడి.. మాట వినలేదనే మస్క్‌ దూరమా..?"

Play all audios:

Loading...

వాషింగ్టన్‌: అమెరికా ప్రభుత్వంలోని డోజ్‌ శాఖ బాధ్యతల నుంచి అపర కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) వైదొలిగారు. ఈ సంచలన నిర్ణయం వెనక కారణమేంటో చెప్పలేదు గానీ..  ప్రత్యేక


గవర్నమెంట్‌ ఉద్యోగిగా తన షెడ్యూల్‌ ముగిసిందని పేర్కొన్నారు. ట్రంప్-మస్క్‌ బంధం చెడిందంటూ వార్తలు వస్తోన్నవేళ ఈ పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. ఈక్రమంలోనే తాజాగా ఓ కథనం వెలుగులోకి వచ్చింది.


కృత్రిమ మేధ సంస్థ ఓపెన్‌ఏఐ-యూఏఈ మధ్య ఒప్పందం కుదర్చవద్దని మస్క్‌ అమెరికా అధ్యక్షుడి (Donald Trump)పై ఒత్తిడి తెచ్చినట్లు వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ కథనం సారాంశం. దీన్ని వైట్‌హౌస్‌


పట్టించుకోలేదని సమాచారం. ఓపెన్‌ ఏఐ (OpenAI), సాఫ్ట్‌ బ్యాంక్‌, ఒరాకిల్ సంయుక్త భాగస్వామ్యంతో ఈ ఏడాది ఆరంభంలో ‘స్టార్‌గేట్‌ (StarGate)’ అనే ప్రాజెక్ట్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే.


ఇందులోభాగంగానే అబుదాబీలో అతిపెద్ద డేటా సెంటర్‌ను ఏర్పాటుచేసుకునేందుకు ‘స్టార్‌గేట్‌ యూఏఈ’ అని వెంచరన్‌ను ప్రకటించారు. ఇందులో జీ42, ఎమిరాటి ఏఐ కంపెనీలు భాగస్వామిగా ఉండనున్నాయి. ఇటీవల ట్రంఫ్‌


గల్ఫ్‌ పర్యటన సందర్భంగా ఓపెన్‌ఏఐ-యూఏఈ మధ్య దీనిపై ఒప్పందం ఖరారైనట్లు సమాచారం. అంతేకాదు.. ట్రంప్ పర్యటనలో ఆయన వెంట ఓపెన్‌ఏఐ సీఈఓ శామ్‌ ఆల్ట్‌మన్‌ కూడా ఉన్నారు. * ట్రంప్‌ పాలకవర్గం నుంచి


వైదొలగిన ఎలాన్‌ మస్క్‌ ఇది నచ్చని మస్క్‌.. ఒప్పందం కుదుర్చుకోవద్దని ట్రంప్‌ సర్కారుపై ఒత్తిడి తెచ్చినట్లు వాల్‌స్ట్రీట్‌ కథనం వెల్లడించింది. ఆ ప్రాజెక్టులో తన ‘ఎక్స్‌ఏఐ’ను కూడా చేర్చాలని


ప్రపంచ కుబేరుడు పట్టుబట్టారట. అంతేగాక, స్వయంగా జీ42 కంపెనీ ఛైర్‌పర్సన్‌కు మస్క్‌ ఫోన్‌ చేసి.. ‘‘ఎక్స్‌ఏఐ లేకుండా.. ట్రంప్‌ ఎలాంటి డీల్‌ను అంగీకరించరు’ అని చెప్పినట్లు సదరు కథనం పేర్కొంది.


అయితే, మస్క్‌ ఒత్తిడిని పట్టించుకోకుండా ట్రంప్‌ సర్కారు డీల్‌కు సుముఖత వ్యక్తంచేసినట్లు సమాచారం. వైట్‌హౌస్‌ అధికారులు ఈ ఒప్పందాన్ని పరిశీలించి ప్రణాళిక ప్రకారమే డీల్‌ కుదుర్చుకున్నట్లు


తెలుస్తోంది. దీనిపై ఓ అధికారి మాట్లాడుతూ.. ‘‘మస్క్‌ ఆందోళనలో నిజం ఉందో, లేదో పక్కనబెడితే.. శామ్‌ ఆల్ట్‌మన్‌తో ఆయనకు సుదీర్ఘకాలంగా వైరం ఉన్న విషయం అందరికీ తెలిసిందే. దానివల్లే ఆయన ఈ ఒత్తిడి


తెచ్చి ఉంటారనే సంకేతాలు కన్పిస్తున్నాయి’’ అని అన్నారు. 2022 నవంబరులో వచ్చిన ఓపెన్‌ ఏఐకి చెందిన చాట్‌జీపీటీ (ChatGPT) ఆరు నెలల్లోనే ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఆదరణ సంపాదించుకున్న సంగతి


తెలిసిందే. అయితే, 2015లో ఓపెన్‌ ఏఐను శామ్‌ ఆల్ట్‌మన్‌ బృందం స్థాపించినప్పుడు మస్క్ అందులో పెట్టుబడులు పెట్టారు. 2018లో ఆ కంపెనీని వీడారు. ఆ తర్వాత 2019లో మైక్రోసాఫ్ట్‌ ఓపెన్‌ ఏఐలో 14


బిలియన్‌ డాలర్ల పెట్టుబడి పెట్టింది. ఈక్రమంలోనే ఓపెన్‌ ఏఐ, మైక్రోసాఫ్ట్‌పై మస్క్‌ గతేడాది దావా వేశారు. కంపెనీ స్థాపించినప్పుడు రాసుకున్న ఒప్పందాలను ఉల్లంఘిస్తున్నారంటూ అందులో ఆరోపించారు.


Trending News

‘క్రికెట్‌ సెలక్షన్‌’ను ప్రత్యక్ష ప్రసారం చేయాలి

ముంబై: భారత క్రికెటర్, బెంగాల్‌ రంజీ జట్టు మాజీ కెప్టెన్‌ మనోజ్‌ తివారీ భారత సెలక్షన్‌ కమిటీ తీరుపై విరుచుకుపడ్డాడు. జట్...

Supreme court: కోటాలోనే విద్యార్థులు ఎందుకు చనిపోతున్నారు?.. ప్రభుత్వాన్ని నిలదీసిన సుప్రీం

రాజస్థాన్‌లోని కోటాలోనే విద్యార్థుల ఆత్మహత్యలు ఎందుకు చోటుచేసుకుంటున్నాయంటూ ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ప్రశ్న...

రూపాయి.. రూపాయి నువ్వేం చేస్తావు..? ఎంతటి ఘోరానికి కారణమైందో చూడండి

Reported by: Published by: Last Updated:April 12, 2023 10:04 PM IST గొడ్డలి, రోకలిబండలతో ఆయన కుటుంబ సభ్యులు చేసిన దాడిలో...

Usa: అమెరికాలో ప్రమాదం.. భారత సంతతి ఇంజినీర్‌ సహా ముగ్గురు మృతి

అమెరికాలో పర్వతారోహణ క్రమంలో ప్రమాదానికి గురైన ఘటనలో భారత సంతతికి చెందిన విష్ణు ఇరిగిరెడ్డి సహా ముగ్గురు ప్రాణాలు కోల్పో...

Pratyusha banerjee commits suicide, balika vadhu actress declared dead

* Home * Entertainment * Pratyusha Banerjee commits suicide, Balika Vadhu actress declared dead PRATYUSHA HANGED HERSELF...

Latests News

Elon musk: ఆ ఒప్పందం వద్దని ట్రంప్‌పై ఒత్తిడి.. మాట వినలేదనే మస్క్‌ దూరమా..?

వాషింగ్టన్‌: అమెరికా ప్రభుత్వంలోని డోజ్‌ శాఖ బాధ్యతల నుంచి అపర కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) వైదొలిగ...

Fresher hiring: టెక్‌ కంపెనీల్లో 50% తగ్గిన ఫ్రెషర్ల నియామకాలు

Fresher hiring | ఇంటర్నెట్‌ డెస్క్‌: కృత్రిమ మేధ (AI) సాంకేతికత ప్రతి రంగంలోనూ విప్లవాత్మక మార్పులు తీసుకొస్తోంది. దీని ...

Satya pal malik: మాజీ గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్‌పై.. సీబీఐ ఛార్జిషీటు దాఖలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: జమ్మూ కశ్మీర్‌లో (Jammu Kashmir News) ఓ పవర్ ప్రాజెక్ట్ టెండర్ల ప్రక్రియలో అవినీతి జరిగిందని ఆరోపణలు...

Crime news: గోదావరిలో గల్లంతైన ఘటన.. ఎనిమిదో మృతదేహం లభ్యం

ముమ్మిడివరం: గోదావరిలో గల్లంతయిన 8 మంది మృతదేహాలూ లభ్యమయ్యాయి. (Crime News) మంగళవారం వరకు ఏడు మృతదేహాలు లభ్యం కాగా.. నేడ...

ఆ కుంభకోణం నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు జగన్‌ కుట్ర: తెదేపా ఎంపీ కేశినేని చిన్ని

వైకాపా హయాంలో రాష్ట్రంలో జరిగిన మద్యం కుంభకోణం నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు జగన్‌ (YS Jagan) కుట్ర చేస్తున్నారని తెద...

Top