Justice as oka: తల్లి మరణించిన మరుసటి రోజే విధుల్లోకి.. ఒకేరోజు 11 తీర్పులు

Eenadu

Justice as oka: తల్లి మరణించిన మరుసటి రోజే విధుల్లోకి.. ఒకేరోజు 11 తీర్పులు"

Play all audios:

Loading...

ముందురోజు (మే 22న) తల్లి అంత్యక్రియల్లో పాల్గొన్న జస్టిస్‌ ఓకా.. మరుసటి రోజే విధుల్లో చేరి పనిపట్ల తన నిబద్ధతను చాటుకున్నారు. ఇంటర్నెట్‌ డెస్క్‌: సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఏఎస్‌


ఓకా (Justice AS Oka)కు ఆఖరి పనిదినం నాడు 11 తీర్పులు వెలువరించారు. అంతేకాదు, ముందురోజు (మే 22న) తల్లి అంత్యక్రియల్లో పాల్గొన్న జస్టిస్‌ ఓకా.. మరుసటి రోజే విధుల్లో చేరి పనిపట్ల తన నిబద్ధతను


చాటుకున్నారు. సుప్రీం కోర్టు (Supreme Court) న్యాయమూర్తిగా మే 24న పదవీ విరమణ చేయనున్న ఆయన.. చివరి పనిదినం రోజు న్యాయమూర్తులు విధులు నిర్వర్తించకపోవడాన్ని తాను అంగీకరించనని ఇటీవల


అభిప్రాయపడ్డారు. ఆరోజు మధ్యాహ్నం వరకు కాకుండా పూర్తి సమయం వరకు పనిచేయాలన్నారు. జస్టిస్‌ అభయ్‌ శ్రీనివాస్‌ ఓకా 1960 మే 25న జన్మించారు. యూనివర్సిటీ ఆఫ్‌ బాంబే నుంచి న్యాయశాస్త్రంలో పట్టాపొందిన


ఆయన.. 1983లో న్యాయవాదిగా నమోదు చేసుకున్నారు. తండ్రి శ్రీనివాస్‌ డబ్ల్యూ ఓకా వద్ద ప్రాక్టీస్‌ మొదలుపెట్టారు. అనంతరం వీపీ టిప్‌నిస్‌ వద్ద పనిచేసిన ఆయన.. 2003లో బాంబే హైకోర్టు అదనపు


న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. అనంతరం 2005, నవంబర్‌ 12న శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. * హత్యకేసులో 43 ఏళ్లు జైల్లోనే.. నిర్దోషిగా విడుదలైన 104 ఏళ్ల వృద్ధుడు! కర్ణాటక హైకోర్టు ప్రధాన


న్యాయమూర్తిగా 2019 మే 10న బాధ్యతలు చేపట్టిన జస్టిస్‌ ఏఎస్‌ ఓకా... 2021 ఆగస్టు 31న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. అప్పటినుంచి వివిధ ధర్మాసనాల్లో మొత్తంగా 295 తీర్పులు ఇవ్వగా..


వివిధ ధర్మాసనాల్లో వెయ్యి తీర్పుల్లో భాగస్వామ్యం పంచుకున్నారు. బెయిల్‌ దరఖాస్తులను ట్రయల్‌ కోర్టులు తిరస్కరించడంపై పలు సందర్భాల్లో అసంతృప్తి వ్యక్తం చేసిన జస్టిస్‌ ఓకా.. కొవిడ్‌ సమయంలోనూ వలస


కార్మికుల హక్కుల రక్షణకు సంబంధించి కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వం వారిపై అనుసరించిన వైఖరిని ప్రశ్నించారు.


Trending News

Vastu: అప్పులు, ఆర్థిక కష్టాలు తీరాలంటే, ఇంట్లో 7 మార్పులు చెయ్యండి

గ్లాస్ విండో: మీకు అప్పుల బాధ తీరిపోవాలంటే, ఈశాన్యం దిక్కులో ఓ గ్లాస్ కిటికీని అమర్చండి. మీ ఇల్లు, షాప్ ఏదైనా సరే, ఈశ్యా...

Pm narendra modi inaugurates 'maitri setu' between india and bangladesh - key points

Bangladesh Prime Minister Sheikh Hasina also virtually addressed the function organised to inaugurate the double lane Fe...

టీడీపీ భూ అక్రమాలకు అడ్డుకట్ట..

సాక్షి, తిరుపతి: టీడీపీ హయాంలో సాగిన భూ అక్రమాలకు అడ్డుకట్ట వేసే దిశగా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంటోంద...

Coolie movie: రజనీకాంత్‌కు మొదటి చెప్పిన కథ ‘కూలీ’ కాదు.. : లోకేశ్‌ కనగరాజ్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: రజనీకాంత్‌ (Rajinikanth) కథానాయకుడిగా లోకేశ్‌ కనగరాజ్‌ (Lokesh Kanagaraj) దర్శకత్వంలో రూపొందుతున్న యా...

జూమ్‌ వర్సెస్‌ జియోమీట్‌

తమ యాప్‌ను కాపీ కొట్టారన్న జూమ్‌ సాక్షి, న్యూఢిల్లీ : జూమ్‌కు దీటుగా రిలయన్స్‌ జియో రూపొందించిన జియో వీడియో కాన్ఫరెన్సిం...

Latests News

Justice as oka: తల్లి మరణించిన మరుసటి రోజే విధుల్లోకి.. ఒకేరోజు 11 తీర్పులు

ముందురోజు (మే 22న) తల్లి అంత్యక్రియల్లో పాల్గొన్న జస్టిస్‌ ఓకా.. మరుసటి రోజే విధుల్లో చేరి పనిపట్ల తన నిబద్ధతను చాటుకున్...

Himanta biswa sarma: ఆ ప్రాంతాల్లో స్థానికులకు ఆయుధ లైసెన్సులు ఇస్తాం: సీఎం హిమంత ప్రకటన

గువాహటి: స్థానిక ప్రజల రక్షణ దృష్ట్యా అస్సాం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మారుమూల ప్రాంతాల్లో అభద్రతతో జీవిస్తున్న ...

Chagos islands: ఆగండి.. చాగోస్‌ దీవుల అప్పగింతకు యూకే కోర్టు బ్రేకులు..

Chagos Islands || ఇంటర్నెట్‌డెస్క్‌: హిందూ మహా సముద్రంలో అత్యంత కీలకమైన చాగోస్‌ ద్వీప సముదాయాన్ని మారిషస్‌కు అప్పగించకుం...

Delhi: దిల్లీలో ఎన్డీయే పాలిత రాష్ట్రాల సీఎంలు, డిప్యూటీ సీఎంల భేటీ

ఎన్డీయే పాలిత రాష్ట్రాల సీఎంలు, డిప్యూటీ సీఎంల సమావేశం దిల్లీలో కొనసాగుతోంది. ప్రధాని మోదీ అధ్యక్షతన ఈ భేటీ జరుగుతోంది. ...

Uttar pradesh: యూపీలో ఎన్‌కౌంటర్‌.. బిష్ణోయ్‌ గ్యాంగ్‌ షార్ప్‌ షూటర్‌ మృతి

యూపీ పోలీసులు జరిపిన ఎన్‌కౌంటర్‌లో లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌కు చెందిన షార్ప్‌ షూటర్‌ నవీన్‌కుమార్‌ మృతి చెందాడు.  ఇంట...

Top