Kiit: నా బిడ్డకు భారత్‌ న్యాయం చేస్తుందని నమ్మకం ఉంది: కీట్‌ విద్యార్థిని తండ్రి

Eenadu

Kiit: నా బిడ్డకు భారత్‌ న్యాయం చేస్తుందని నమ్మకం ఉంది: కీట్‌ విద్యార్థిని తండ్రి"

Play all audios:

Loading...

భువనేశ్వర్: ఒడిశాలో కీట్‌ (KIIT) విశ్వవిద్యాలయంలో బీటెక్‌ విద్యార్థి ఆత్మహత్య ఘటనపై ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. న్యాయం కోసం తోటి విద్యార్థులు నిరసనలు తెలుపుతున్నారు. ఈ ఘటనపై మృతురాలి తండ్రి


కాఠ్‌మాండూ నుంచి మీడియాతో మాట్లాడారు. ‘‘రామాయణ కాలం నుంచి భారత్‌-నేపాల్ (India-Nepal)ల మధ్య విడదీయరాని అనుబంధం ఉంది. దర్యాప్తు జరుగుతున్నంత కాలం నేను ఒడిశాలోనే ఉండటం వీలుకాదు. కానీ   నా


కుమార్తెకు భారత్‌ న్యాయం చేస్తుందని నమ్ముతున్నాను’’ అని అన్నారు. తన బంధువుల ద్వారా భువనేశ్వర్‌లోని కీట్ విశ్వవిద్యాలయం గురించి ఆ విద్యార్థిని తెలుసుకుంది. దాంతో ఉన్నత విద్య చదివి,


కుటుంబానికి అండగా నిలవాలని బీటెక్‌లో చేరింది. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన గోరఖ్‌పుర్‌లోని భారత సరిహద్దుకు 5 కి.మీ. దూరంలో ఉన్న భైరాహవా(నేపాల్‌) నుంచి వచ్చి, ఇక్కడ విద్యను అభ్యసిస్తోంది. ‘‘తన


సోదరుడికి మంచి భవిష్యత్తును ఇవ్వాలని నా కుమార్తె తపించేది. కానీ ఇలా మధ్యలోనే తాను మాకు దూరమైంది. తన కలలన్నీ కల్లలయ్యాయి. ఆమెకు ఈ పరిస్థితి తీసుకొచ్చినవారికి శిక్ష పడాలి’’ అని డిమాండ్ చేశారు.


ఆమె ఎవరితోను త్వరగా కలవదు కానీ.. తనను వేధించిన వారిపై ఫిర్యాదులు చేసిందని చెప్పారు. విశ్వవిద్యాలయ యాజమాన్యం వేధించిన విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇచ్చి వదిలేశారని, వారిపై తగిన చర్యలు తీసుకొని


ఉంటే తన బిడ్డకు ఈ పరిస్థితి వచ్చేదే కాదని వాపోయారు.  * Indian student: మా బిడ్డ కోమాలో ఉంది.. ప్లీజ్ వీసా ఇవ్వండి: భారతీయ విద్యార్థిని కుటుంబం ఆవేదన ఫిబ్రవరి 16న ఆమె చనిపోవడానికి రెండు గంటల


ముందు తల్లితో మాట్లాడింది. తన చదువు గురించి చెప్పడమే గాకుండా, ఇంటి విషయాలు అడిగి తెలుసుకుంది. ‘‘అప్పుడు మాకు తన మాటల్లో ఎలాంటి తేడా కనిపించలేదు. కానీ రెండు గంటల తర్వాత తన ఆత్మహత్య వార్త మాకు


అందింది’’ అని ఆవేదన వ్యక్తంచేశారు. ఆ ఘటన తెలిసిన వెంటనే నేపాలీ విద్యార్థుల సంఘం నిరసనలకు దిగింది. దాంతో 500 మంది నేపాలీ విద్యార్థులను హాస్టళ్లు ఖాళీ చేయించారంటూ వార్తలు వచ్చాయి. దాంతో


పూర్తి వివరాలు తెలుసుకునేందుకు నేపాల్‌ దౌత్య కార్యాలయం తన అధికారులను పంపింది. నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి మృతురాలి తల్లిదండ్రులతో మాట్లాడారు. దర్యాప్తు గురించి భరోసా ఇచ్చారు.


భువనేశ్వర్‌లోని ‘కీట్‌’(KIIT) వర్సిటీ యంత్రాంగానికి యూజీసీ మంగళవారం నోటీసు జారీ చేసింది. కీట్‌లో నేపాల్‌ విద్యార్థిని ఆత్మహత్య తర్వాత ఇతర విద్యార్థులపై ప్రైవేటు సెక్యూరిటీ సిబ్బంది


చేయిచేసుకోవడం, వసతిగృహాలను ఖాళీ చేయించడంపై సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశించింది. మరోవైపు ప్రభుత్వం ఏర్పాటుచేసిన త్రిసభ్య ఉన్నతస్థాయి సంఘం మంగళవారం కీట్‌కు చెందిన మరో ఆరుగురు అధికారుల్ని


27న విచారణకు హాజరుకావాలని పేర్కొంది. 


Trending News

Crime news: సైబర్‌ నేరగాళ్లకు బ్యాంకు ఖాతాలు సమకూరుస్తున్న ఇద్దరి అరెస్టు

హైదరాబాద్‌: సైబర్‌ నేరగాళ్లకు బ్యాంకు ఖాతాలు సమకూరుస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు (Crime News). దిల్లీకి చెంది...

China: విద్యార్థుల వీసాలు నిలిపివేసిన అమెరికా.. స్పందించిన చైనా

విదేశీ విద్యార్థుల వీసాలకు నిర్వహించే ఇంటర్వ్యూలను అమెరికా తాత్కాలికంగా నిలిపివేయడంపై తాజాగా చైనా స్పందించింది.  ఇంటర్నె...

Isi: పాక్‌ నిఘా సంస్థ కోసం పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగి అరెస్ట్‌..

ISI ఇంటర్నెట్‌డెస్క్‌: భారత్‌లో విస్తరించిన పాకిస్థాన్‌ నిఘా సంస్థ వేళ్లు తవ్వేకొద్దీ బయటకు వస్తున్నాయి. తాజాగా రాజస్థాన...

Game changer: ‘గేమ్‌ఛేంజర్‌’.. మొత్తం ఏడున్నర గంటలు: ఎడిటర్‌ కీలక వ్యాఖ్యలు

రామ్‌చరణ్‌ (Ram Charan) హీరోగా శంకర్‌ (Shankar) దర్శకత్వం వహించిన చిత్రం ‘గేమ్‌ ఛేంజర్‌’ (Game Changer). ఈ చిత్రాన్ని ఉద...

Bcci: ఆస్ట్రేలియా vs ఇండియా.. మహిళల జట్టు వన్డే సిరీస్‌ షెడ్యూలు విడుదల

స్వదేశంలో భారత మహిళల జట్టుకు, ఆస్ట్రేలియా ఉమెన్స్‌ టీమ్‌తో మూడు వన్డే మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ సిరీస్‌కు సంబంధించిన షెడ్...

Latests News

Kiit: నా బిడ్డకు భారత్‌ న్యాయం చేస్తుందని నమ్మకం ఉంది: కీట్‌ విద్యార్థిని తండ్రి

భువనేశ్వర్: ఒడిశాలో కీట్‌ (KIIT) విశ్వవిద్యాలయంలో బీటెక్‌ విద్యార్థి ఆత్మహత్య ఘటనపై ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. న్యాయం ...

'avatar' vfx specialist chuck cominskey on board 'anizham thirunaal marthanda varma'

The project will be directed by K Madhu and will feature extensive VFX work, which will be carried out on a lavish budge...

Wealth: ఈ ఏడాది ఎక్కువ సంపద కోల్పోయింది అదానీ, అంబానీయే

Gautam Adani- Mukesh Ambani: ప్రపంచ కుబేరుల జాబితాలో భారతీయులైన అంబానీ, అదానీనే ఎక్కువ సంపద కోల్పోయారు. ఈ ఒక్క ఏడాదిలో అ...

One family: ఒకే ఒక్క కుటుంబం నివసించే గ్రామం.. ఎక్కడో తెలుసా?

(ప్రతీకాత్మక చిత్రం) నల్‌బరి: గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలు అని జాతిపిత మహాత్మాగాంధీ చెప్పిన అంశాన్ని పాఠ్య పుస్తకాల్లో...

Wtc - icc: డబ్ల్యూటీసీ ప్రైజ్‌మనీని భారీగా పెంచిన ఐసీసీ.. విజేతకు రూ. ఎన్ని కోట్లంటే?

ఇంటర్నెట్ డెస్క్: టెస్టు క్రికెట్‌ను మరింత ప్రోత్సాహించేందుకు ఐసీసీ (ICC) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రపంచ టెస్టు ఛాంపియన్...

Top