Corona virus: కొవిడ్‌ మళ్లీ పెరగడానికి కారణమేంటీ? ఆందోళన అవసరమా?

Eenadu

Corona virus: కొవిడ్‌ మళ్లీ పెరగడానికి కారణమేంటీ? ఆందోళన అవసరమా?"

Play all audios:

Loading...

ఇంటర్నెట్ డెస్క్‌: దేశంలో కొవిడ్‌ కేసులు (COVID 19) మళ్లీ కలకలం రేపుతున్నాయి.  తాజాగా దేశంలోని పలు రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్‌ కేసులు వెలుగుచూస్తున్నాయి. మంగళవారం రాత్రి నాటికి దేశంలో 1010


క్రియాశీల కేసులు ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ తెలిపింది. కొవిడ్ కొత్త వేరియంట్లు ఎన్‌బీ.1.8.1, ఎల్‌ఎఫ్‌.7లను భారత్‌లో గుర్తించినట్లు ఇండియన్‌ సార్స్‌-కోవ్‌-2 జీనోమిక్స్‌ కన్సార్టియం


(INSACOG) ఇదివరకే వెల్లడించింది. ఇతర దేశాలతో పోలిస్తే.. మన దగ్గర వైరస్‌ వ్యాప్తి తక్కువగానే ఉన్నప్పటికీ జాగ్రత్తగా ఉండాలని వైద్యరంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు.  ఇటీవల కాలంలో కొవిడ్‌ కేసులు


పెరగడానికి అనేక కారణాలు ఉన్నాయని నిపుణులు భావిస్తున్నారు. గతంలో ఇన్ఫెక్షన్లు సోకడం, టీకాలు వేసుకోవడం ద్వారా వచ్చిన రోగనిరోధక శక్తి క్షీణించడం కూడా ఒక కారణమని పేర్కొంటున్నారు. ఇమ్యూనిటీ


క్షీణించడం ద్వారా వృద్ధులు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వ్యక్తులు తిరిగి వైరస్‌ బారిన పడే అవకాశం ఉండొచ్చని విశ్లేషిస్తున్నారు. అయితే,  జేఎన్‌.1 ఉపరకమైన ఎన్‌బీ 1.8.1 వంటి కొత్త వేరియంట్లు


బాధితులపై తీవ్రమైన ప్రభావం చూపినట్లు మాత్రం ప్రస్తుతానికి ఎలాంటి రుజువల్లేవు.  * కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు విస్తృతం చేయాలి ఇతర శ్వాసకోశ వ్యాధుల్లాగే కరోనా కూడా చల్లని, అధిక తేమతో కూడిన


పరిస్థితుల్లో వేగంగా వ్యాప్తి చెందే లక్షణం కలిగినదే. దేశంలోని అనేక నగరాల్లో సీజనల్‌ ఫ్లూ, ఇతర వైరల్‌ ఇన్ఫెక్షన్లు పెరుగుతున్న వాతావరణం కూడా కరోనా వ్యాప్తికి అనుకూలంగా ఉన్నట్లు కనబడుతోంది.  


మరీ ముఖ్యంగా దేశంలోని అనేక ప్రాంతాల్లో రుతుపవనాలు ముందుగానే రావడం వల్ల గాలిలో తేమ శాతం అధికంగా ఉండటం కూడా ఈ వైరస్‌ మళ్లీ వ్యాప్తి చెందడానికి కారణం కావొచ్చనే విశ్లేషణలూ వినబడుతున్నాయి.  


దీనికితోడు ప్రస్తుత పరిస్థితుల్లో కొవిడ్‌ టెస్టింగ్‌, జన్యుపరమైన నిఘా తగ్గడం వంటివీ మరో కీలకాంశమని పలు కథనాలు  పేర్కొంటున్నాయి.  కొవిడ్‌-19ను ఎండమిక్‌గా గుర్తించినప్పటి నుంచి సాధారణ


పరీక్షలు, జన్యుశ్రేణిపై విశ్లేషణలు, పర్యవేక్షణ కొరవడిన నేపథ్యంలో ఈ వైరస్‌ మళ్లీ వ్యాపించడానికి కారణమని పలువురు విశ్లేషిస్తున్నారు. సింగపూర్‌, ఇతర ఆగ్నేయాసియా దేశాల్లో ఇటవల కేసులు


పెరుగుతున్నాయి. మే మాసం తొలి రోజుల్లో సింగపూర్‌లో దాదాపు 30శాతం మేర ఇన్ఫెక్షన్లు పెరిగాయి. అయితే, భారత్‌లో మాత్రం కొవిడ్‌ వ్యాప్తి ఒక నిర్దిష్ట భౌగోళిక ప్రాంతానికి పరిమితమైనట్లు కనబడుతోంది.


దేశంలో ప్రస్తుతం ఉన్న క్రియాశీల కేసుల్లో ఒక్క కేరళలోనే దాదాపు 43శాతం ఉండగా.. మహారాష్ట్ర 21శాతంతో రెండో స్థానంలో, దిల్లీ, గుజరాత్‌ , తమిళనాడు వరుసగా 10, 8, 7శాతాలతో తర్వాతి స్థానాల్లో


కొనసాగుతున్నాయి. అయితే, ప్రపంచంలో కొవిడ్‌ కేసులు మళ్లీ పెరుగుతుండటంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం అప్రమత్తమైంది. ప్రస్తుతం వ్యాప్తిలో ఉన్న వేరియంట్‌లలో ఏదీ ఆందోళనకరమని నిర్ధారణ కాలేదు.


జాగ్రత్తలు తీసుకోండి.. దేశంలో తాజా పరిణామాల నేపథ్యంలో కొవిడ్‌ వ్యాప్తిపై ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. ఈ వైరస్‌ను నియంత్రించేందుకు వైరస్‌ లక్షణాలు ఉన్నవారికి టెస్టులు పెంచాలని సూచించింది. అలాగే,


60 ఏళ్లు పైబడిన వారు, ఇప్పటికే పలు అనారోగ్యాలతో బాధపడుతున్న వారు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య రంగ నిపుణులు సూచిస్తున్నారు. అప్రమత్తంగా ఉంటూ రద్దీ ప్రదేశాల్లో మాస్కులు ధరించడం,


చేతులను శుభ్రంగా కడుక్కోవడం, కొవిడ్‌ లక్షణాలు ఏవైనా కనిపిస్తే స్వీయ నిర్బంధంలోకి వెళ్లడం వంటి నిబంధనలు పాటించాలని కోరుతున్నారు. కేరళలో ఆందోళనక పరిస్థితి లేదు.. మంత్రి వీణాజార్జ్‌ కేరళలో


పరిస్థితిని సునిశితంగా గమనిస్తున్నట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి వీణాజార్జ్‌ తెలిపారు.  ప్రపంచ దేశాల్లో కొవిడ్‌ కేసులు పెరుగుతుండటంతో.. సత్వరమే స్పందించి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించినట్లు


పేర్కొన్నారు. అనంతరం ఎప్పటికప్పుడు పరిస్థితిని నిశితంగా పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. అన్ని జిల్లాల్లో  కొవిడ్‌ టెస్టులు నిర్వహించాలని ఆదేశించామన్నారు. కేరళలో ఎలాంటి


ఆందోళనకర పరిస్థితి లేదన్న ఆమె.. ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. మంగళవారం నాటికి రాష్ట్రంలో 519 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని.. తీవ్ర తక్కువగానే ఉందని తెలిపారు. తగిన జాగ్రత్తలు


తీసుకోకపోతే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉన్నవారు కొంత మేరకు ఇబ్బంది పడే అవకాశం ఉంటుందని చెప్పారు. ఇప్పటివరకు కేరళలో మూడు మరణాలు సంభవించాయని మంత్రి పేర్కొన్నారు.


Trending News

Vastu: అప్పులు, ఆర్థిక కష్టాలు తీరాలంటే, ఇంట్లో 7 మార్పులు చెయ్యండి

గ్లాస్ విండో: మీకు అప్పుల బాధ తీరిపోవాలంటే, ఈశాన్యం దిక్కులో ఓ గ్లాస్ కిటికీని అమర్చండి. మీ ఇల్లు, షాప్ ఏదైనా సరే, ఈశ్యా...

Pm narendra modi inaugurates 'maitri setu' between india and bangladesh - key points

Bangladesh Prime Minister Sheikh Hasina also virtually addressed the function organised to inaugurate the double lane Fe...

దర్యాప్తునకు ముందే స్టే ఎలా ఇస్తారు..?  

సాక్షి, న్యూఢిల్లీ: ‘గత విచారణ సందర్భంగానే మీకు చెప్పాం. ఇలా దర్యాప్తు ప్రారంభం కూడా కాకముందే స్టే ఆర్డర్లు ఇవ్వడాన్ని మ...

నగరంలో ట్రాఫిక్‌ ఆంక్షలు

సాక్షి, సిటీబ్యూరో: మొహర్రం ఊరేగింపు నేపథ్యంలో మంగళవారం పాతబస్తీ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఎలాంటి అవ...

17న ఎంగిలిపూల బతుకమ్మ 

ఫైల్‌ ఫోటో సాక్షి, హన్మకొండ: ఈ ఏడాది అధిక ఆశ్వయుజం వచ్చినందున ఎంగిలిపూల బతుకమ్మ, సద్దుల బతుకమ్మ పండుగలు ఎప్పుడు జరుపుకోవ...

Latests News

Corona virus: కొవిడ్‌ మళ్లీ పెరగడానికి కారణమేంటీ? ఆందోళన అవసరమా?

ఇంటర్నెట్ డెస్క్‌: దేశంలో కొవిడ్‌ కేసులు (COVID 19) మళ్లీ కలకలం రేపుతున్నాయి.  తాజాగా దేశంలోని పలు రాష్ట్రాల్లో కరోనా పా...

Iran: ఇరాన్‌లో ముగ్గురు భారత యువకులు కిడ్నాప్‌..

ఇంటర్నెట్‌ డెస్క: ఇరాన్‌ (Iran)కు వెళ్లిన ముగ్గురు భారత యువకులు అదృశ్యమయినట్లు అక్కడి భారత దౌత్య కార్యాలయం పేర్కొంది. తప...

నేటి తాజా వార్తలు @ ఈనాడు. నెట్‌ (23/05/2025)

23/05/2025 11:09(IST) ఏపీ మద్యం కుంభకోణం.. రాజ్‌ కెసిరెడ్డికి సుప్రీంలో చుక్కెదురు రాజ్‌ కెసిరెడ్డి, ఆయన తండ్రి ఉపేంద్రర...

Raashii khann: రాశీ ఖన్నాకు గాయాలు.. ఫొటోలు షేర్‌ చేసిన నటి

ఇంటర్నెట్ డెస్క్‌: ప్రేక్షకులకు వినోదాన్ని పంచడం కోసం తెరవెనక నటీనటులు ఎంతో కష్టపడుతుంటారు. షూటింగ్‌ సమయంలో అయ్యే గాయాలన...

చిరంజీవికి మోహ‌న్‌బాబు బ‌ర్త్‌డే గిఫ్ట్‌

ఆదివారం వినాయ‌క చ‌వితిని టాలీవుడ్ ప్ర‌ముఖులంద‌రూ త‌మ‌తమ ఇళ్ల‌ల్లో భ‌క్తిశ్ర‌ద్ధ‌ల‌తో జ‌రుపుకున్నారు. అయితే సినీ ప్రేమికు...

Top