Operation sindoor: 100 మంది ఉగ్రవాదులు హతం.. ‘ఆపరేషన్‌ సిందూర్‌’ కొనసాగుతోంది: రాజ్‌నాథ్‌ సింగ్‌

Eenadu

Operation sindoor: 100 మంది ఉగ్రవాదులు హతం.. ‘ఆపరేషన్‌ సిందూర్‌’ కొనసాగుతోంది: రాజ్‌నాథ్‌ సింగ్‌"

Play all audios:

Loading...

దిల్లీ: పహల్గాంలో అమాయక పౌరులను పొట్టనబెట్టుకున్న ఉగ్రమూకలపై భారత్‌ ప్రతీకారం తీర్చుకుంది. సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తోన్న పాకిస్థాన్‌కు గట్టిగా బదులు చెప్పింది. పాకిస్థాన్‌, పాక్


ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్ర స్థావరాలపై మెరుపు దాడులతో విరుచుకుపడింది. ఈ ‘ఆపరేషన్‌ సిందూర్‌ (Operation Sindoor)’లో కనీసం 100 మంది ఉగ్రవాదులు హతమైనట్లు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ (Rajnath


Singh) వెల్లడించారు. ఈ మేరకు ఆపరేషన్‌ వివరాలను గురువారం ఆయన అఖిలపక్షానికి తెలియజేశారు. ఆపరేషన్‌ సిందూర్‌ కొనసాగుతుందని ఆయన తెలిపారు. ‘ఆపరేషన్‌ సిందూర్‌’ గురించి వివరించేందుకు కేంద్రం


గురువారం అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. ఇందులో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ మాట్లాడుతూ.. ‘‘తొమ్మిది ఉగ్ర స్థావరాలపై అత్యంత కచ్చితత్వంతో దాడులు నిర్వహించాం. దాదాపు 100 మంది ఉగ్రవాదులను


మట్టుబెట్టాం. దీనికి సంబంధించిన మరింత సమాచారం కోసం ఎదురుచూస్తున్నాం. ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతుందన్న ఈ ఆపరేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడే వెల్లడించలేం. ఈ


ఉద్రిక్తతలను పెంచాలన్న ఉద్దేశం మాకు లేదు. కానీ, పాక్‌ (Pakistan) రెచ్చగొట్టే చర్యలకు పాల్పడితే మాత్రం.. వెనక్కి తగ్గేదే లేదు. ‘ఆపరేషన్‌ సిందూర్‌’ కొనసాగుతుంది’’ అని వెల్లడించారు. * గురి


తప్పకుండా.. ముష్కరులు తప్పించుకోకుండా..! రాజకీయాలకు తావులేదు: కిరణ్‌ రిజిజు సమావేశం అనంతరం కేంద్రమంత్రి కిరణ్‌ రిజిజు మీడియాతో మాట్లాడారు. ‘‘ఆపరేషన్‌ సిందూర్‌ వివరాలు, ప్రభుత్వ ఉద్దేశాలను


రక్షణమంత్రి ప్రతిపక్ష నేతలకు వివరించారు. అయితే, ఇది కొనసాగుతున్న ఆపరేషన్‌ గనుక.. సాంకేతిక అంశాలను ఆయన వెల్లడించలేకపోయారు. ప్రతిపక్షాలు అత్యంత పరిణతితో వ్యవహరించాయి. ప్రభుత్వానికి సంపూర్ణ


మద్దతు ప్రకటించాయి. ఈ అంశంలో రాజకీయాలకు తావులేదు’’ అని రిజిజు వెల్లడించారు. ఐక్యంగా నిలబడుతాం: రాహుల్‌ కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) మాట్లాడుతూ.. ‘‘ఆపరేషన్‌ సిందూర్‌పై


ప్రతిపక్షాలు ఐక్యంగా నిలిచి ప్రభుత్వానికి అండగా ఉంటున్నాం. దేశం కోసం కేంద్రం తీసుకునే చర్యలకు పూర్తి మద్దతు ప్రకటిస్తున్నాం. ఆపరేషన్‌ సిందూర్‌ ఇంకా ముగియలేదని, కొనసాగుతోందని రాజ్‌నాథ్‌


సింగ్‌ చెప్పారు’’ అని రాహుల్‌ పేర్కొన్నారు.


Trending News

Indus water treaty: ఒమర్‌ vs మెహబూబా.. ‘తుల్‌బుల్‌’పై మాటల యుద్ధం

ఇంటర్నెట్‌ డెస్క్‌: సింధూ జలాల ఒప్పందం నిలిపివేత అంశంపై జమ్మూకశ్మీర్‌ రాజకీయాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. తాజాగా దీనికి స...

Talasani srinivas yadav | latest talasani srinivas yadav - eenadu

ఆ పరిశ్రమ తలసాని కుటుంబానిదే.. మంత్రి సీతక్క ఆరోపణ నిర్మల్‌ జిల్లా దిలావర్‌పూర్‌ ఇథనాల్‌ పరిశ్రమ భారాసకు చెందిన మాజీ మంత...

Astrology: 2023 జనవరి వరకు వీరికి అద్భుతంగా ఉంటుంది.. శని దయతో అన్నీ విజయాలే

CNN18 name, logo and all associated elements ® and © 2017 Cable News Network LP, LLLP. A Time Warner Company. All rights...

Anant ambani and radhika merchant's wedding: అనంత్, రాధిక పెళ్లి వేళ.. ధీరూభాయ్ అంబానీకి ముఖేష్ అంబానీ నివాళులు

ధీరూభాయ్ అంబానీ జూలై 6, 2002న కన్నుమూశారు. ముఖేష్ అంబానీ, ఆయన సోదరుడు అనిల్ అంబానీ తరచుగా కుటుంబ ప్రత్యేక సందర్భాలలో తమ ...

Kaleshwaram overflows with devotion as thousands gather for saraswati pushkaralu

BHUPALPALLY: As the weekend aligned with the tenth day of the sacred Saraswati Pushkaralu, the serene village of Kaleshw...

Latests News

Operation sindoor: 100 మంది ఉగ్రవాదులు హతం.. ‘ఆపరేషన్‌ సిందూర్‌’ కొనసాగుతోంది: రాజ్‌నాథ్‌ సింగ్‌

దిల్లీ: పహల్గాంలో అమాయక పౌరులను పొట్టనబెట్టుకున్న ఉగ్రమూకలపై భారత్‌ ప్రతీకారం తీర్చుకుంది. సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రేరేపి...

Women health tips and beauty tips in telugu - eenadu vasundhara

వేసవి సెలవుల్లో మీ పిల్లలకు ఎలాంటి నైపుణ్యాలు నేర్పించాలనుకుంటున్నారు? ఈ వేసవి సెలవుల్లో మీ పిల్లలకు ఎలాంటి నైపుణ్యాలు న...

ఈనాడు జర్నలిజం స్కూలు ప్రాథమిక పరీక్ష కీ విడుదల

ఈనాడు జర్నలిజం స్కూలు ప్రవేశ పరీక్ష పేపర్‌-1 సమాధానాలు విడుదలయ్యాయి. పేపర్‌ 1 సమాధానాలివీ! By Features Desk Published : ...

Rcb vs kkr: ఆర్సీబీ, కోల్‌కతా మ్యాచ్‌కు వరుణుడి ఆటంకం.. మ్యాచ్ రద్దయితే?

బెంగళూరు: భారత్‌, పాకిస్థాన్ ఉద్రిక్తతల కారణంగా వాయిదా పడిన ఐపీఎల్‌ 2025 (IPL).. నేడు జరగనున్న ఆర్సీబీ (Royal Challenger...

Operation sindoor: భారత్‌కు సహనం నశించింది.. పాక్‌కు లెక్క సరిచేసింది..

ఇంటర్నెట్‌డెస్క్‌: పహల్గాం ఉగ్రదాడితో భారత్‌కు సహనం నశించింది. ఉగ్రమూక అమాయకుల ప్రాణాలు తీయడమే కాక..  మీ ప్రధానికి వెళ్ల...

Top