Stock market: ఫుల్‌ జోష్‌లో స్టాక్‌ మార్కెట్లు.. సెన్సెక్స్‌ 2500 పాయింట్లు జంప్‌

Eenadu

Stock market: ఫుల్‌ జోష్‌లో స్టాక్‌ మార్కెట్లు.. సెన్సెక్స్‌ 2500 పాయింట్లు జంప్‌"

Play all audios:

Loading...

Stock Market Opening bell: దలాల్‌ స్ట్రీట్‌లో నేడు బుల్‌ పరుగులు తీస్తోంది. సెన్సెక్స్‌, నిఫ్టీ భారీ లాభాల్లో కదలాడుతున్నాయి. Stock Market Opening bell |  ఇంటర్నెట్‌డెస్క్‌: దేశీయ మార్కెట్లు


నేడు ఫుల్‌ జోష్‌లో ఉన్నాయి. భారీ లాభాల్లో కదలాడుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల సంకేతాలు, భారత్‌-పాక్‌ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం వంటి పరిణామాలతో బుల్‌ పరుగులు తీస్తోంది. దీంతో


సెన్సెక్స్‌ ఏకంగా 2500 పాయింట్లకు పైగా పెరగ్గా.. నిఫ్టీ 24,700 మార్క్‌ పైన ట్రేడ్‌ అవుతోంది. మధ్యాహ్నం 12.40 గంటల సమయానికి సెన్సెక్స్‌ 2,532.58  పాయింట్ల లాభంతో 81,987.05 వద్ద ట్రేడవుతోంది.


నిఫ్టీ 789.30 పాయింట్లు ఎగబాకి 24,797.30 దగ్గర కొనసాగుతోంది. సెన్సెక్స్‌ 30 సూచీలో సన్‌ఫార్మా, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ మినహా మిగిలిన షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌,


ఇన్ఫోసిస్‌, ఎటర్నల్‌, అదానీ పోర్ట్స్‌, టాటా స్టీల్‌ షేర్లు ప్రధానంగా లాభాల్లో ట్రేడవుతున్నాయి. మార్కెట్ల ర్యాలీకి కారణాలివే.. * ‘ఆపరేషన్‌ సిందూర్‌ (Operation Sindoor)’ తర్వాత సైనిక ఘర్షణను


ఆపేందుకు భారత్‌-పాకిస్థాన్‌ మధ్య శనివారం కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే. ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు కాస్త తగ్గడం మదుపర్ల సెంటిమెంట్‌ను బలపర్చింది. * ప్రపంచంలోని రెండు


అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య వాణిజ్య వివాదాన్ని తగ్గించే లక్ష్యంతో అమెరికా-చైనా (US-China) మధ్య జరిగిన చర్చలు సానుకూలంగా ముగిసినట్లు తెలుస్తోంది. వాణిజ్య యుద్ధంలో నష్టాన్ని తగ్గించే దిశగా


ట్రేడ్‌ డీల్‌ (Trade Deal)కు ఇరుదేశాలు సుముఖత చూపించినట్లు వార్తలు వస్తున్నాయి. * ఎప్పటినుంచో చర్చల దశలో ఉన్న భారత్‌- బ్రిటన్ మధ్య వాణిజ్య ఒప్పందం ఖరారైన సంగతి తెలిసిందే. అలాగే స్వేచ్ఛా


వాణిజ్య ఒప్పందంపై తదుపరి దశ చర్చలు జరిపేందుకు భారత్, ఐరోపా సమాఖ్య (ఈయూ) ప్రతినిధులు సోమవారం సమావేశం కానున్నారు. సాధ్యమైనంత త్వరగా మొదటి దశ ఒప్పందం కుదుర్చుకోవడమే లక్ష్యమని అధికార వర్గాలు


తెలిపాయి. అంతర్జాతీయ వాణిజ్య అనిశ్చితుల నేపథ్యంలో.. రెండు దశల్లో ఒప్పందాన్ని కుదుర్చుకునేందుకు ఇరు వర్గాలు అంగీకరించాయి.


Trending News

duduku | TechCrunch

SAVE NOW THROUGH JUNE 4 FOR TECHCRUNCH SESSIONS: AI SAVE $300 ON YOUR TICKET TO TC SESSIONS: AI—AND GET 50% OFF A SECOND...

కరోనా‌ సెకండ్‌ వేవ్‌ వస్తోంది

బుధవారం కలెక్టర్లు, జేసీలు, ఎస్పీలతో సీఎం వీడియో కాన్ఫరెన్స్‌ సాక్షి, అమరావతి: కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌ వస్తోందని, ఇప్పటికే...

Nri news: దోహాలో ఘనంగా మినీ మహానాడు, ఎన్టీఆర్‌ జయంతి వేడుకలు

దోహా: ఖతార్‌ రాజధాని నగరం దోహాలో తెదేపా మినీ మహానాడు, తెలుగు ప్రజల కీర్తిని దశ దిశలు వ్యాపింపజేసిన నందమూరి తారక రామారావు...

Exhibitors producers meet: థియేటర్ల బంద్‌.. తుది నిర్ణయం ఆరోజే

మరోసారి ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లతో సంయుక్తంగా సమావేశం కావాలని నిర్మాతలు నిర్ణయించారు. అప్పుడే తుది నిర్ణయం ప్రకటిం...

Nadendla manohar: రేషన్‌ దుకాణాల ద్వారా నిత్యావసరాలు.. డీలర్లు సిద్ధం కావాలి: మంత్రి నాదెండ్ల

విజయవాడ: ప్రజా పంపిణీ వ్యవస్థలో ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా ఉండేందుకు ప్రభుత్వం రేషన్‌ దుకాణాల ద్వారా సరకుల పంపిణీ ...

Latests News

Stock market: ఫుల్‌ జోష్‌లో స్టాక్‌ మార్కెట్లు.. సెన్సెక్స్‌ 2500 పాయింట్లు జంప్‌

Stock Market Opening bell: దలాల్‌ స్ట్రీట్‌లో నేడు బుల్‌ పరుగులు తీస్తోంది. సెన్సెక్స్‌, నిఫ్టీ భారీ లాభాల్లో కదలాడుతున్...

Upcoming movies telugu: ఈ వారం థియేటర్‌/ఓటీటీలో అలరించే చిత్రాలివే..

అటు వేసవి, ఇటు ఐపీఎల్‌ సీజన్‌ ముగింపునకు వచ్చిన వేళ థియేటర్‌లో సినిమాల సందడి మొదలవుతోంది. మే చివరి వారంలో థియేటర్‌తో పాట...

Kandula durgesh press meet: సినిమా వాళ్ల వ్యాఖ్యలు అహంకారపూరితం.. వారి విజ్ఞతకే వదిలేశాం: మంత్రి కందుల దుర్గేష్‌

రాజమహేంద్రవరం: అగ్ర కథానాయకుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ (Pawan Kalyan) నటించిన ‘హరి హర వీరమల్లు’ (Hari Hara Veera Ma...

Gaddar film awards: 2014- 2023 సినిమాలకు గద్దర్ అవార్డులు.. ఉత్తమ చిత్రాలివే

2014-2023 సంవత్సరాల్లో విడుదలైన సినిమాలకు సంబంధించి గద్దర్‌ అవార్డుల వివరాలను మురళీమోహన్‌ ప్రెస్‌మీట్‌లో వెల్లడించారు. ఇ...

Nota: ‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు

ఎన్నికల్లో నోటా (NOTA)కు అత్యధికంగా ఓట్లు వస్తే.. సదరు నియోజకవర్గం ఫలితాన్ని రద్దు చేసి కొత్తగా పోలింగ్‌ నిర్వహించాలని క...

Top