Stock market: భారీ లాభాల్లో సూచీలు.. 25 వేల పైకి నిఫ్టీ.. కారణాలు ఇవే

Eenadu

Stock market: భారీ లాభాల్లో సూచీలు.. 25 వేల పైకి నిఫ్టీ.. కారణాలు ఇవే"

Play all audios:

Loading...

Stock market | ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు (Stock market) భారీ లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాల నేపథ్యంలో ఉదయం నష్టాల్లో ట్రేడయిన సూచీలు.. మధ్యాహ్నం


తర్వాత ఒక్కసారిగా దూసుకెళ్లాయి. అమెరికా- భారత్‌ మధ్య ట్రేడ్‌ డీల్‌పై డొనాల్డ్‌ ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలు పాజిటివ్‌ సెంటిమెంట్‌కు కారణమయ్యాయి. ముఖ్యంగా రిలయన్స్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌,


హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, భారతీ ఎయిర్‌టెల్‌ వంటి స్టాక్స్‌లో కొనుగోళ్ల మద్దతు సూచీలకు కలిసొచ్చింది. ఆటో, మెటల్‌, ఐటీ, ఫైనాన్షియల్‌ స్టాక్స్ రాణించాయి. మిడ్‌క్యాప్‌, స్మాల్‌ క్యాప్‌ సూచీలు


స్వల్పంగా లాభపడ్డాయి. ఈ క్రమంలో సెన్సెక్స్‌ 82 వేలు దాటగా.. నిఫ్టీ 25వేల మార్కు అందుకుంది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సంకేతాలతో సెన్సెక్స్‌ ఉదయం 81,354.43 పాయింట్ల వద్ద (క్రితం ముగింపు


81,330.56) స్వల్ప లాభాల్లో ప్రారంభమైంది. కాసేపటికే నష్టాల్లోకి జారుకుంది. మధ్యాహ్నం వరకు స్వల్ప శ్రేణిలో ఒడుదొడుకులు ఎదుర్కొన్న సూచీ.. తర్వాత ఒక్కసారిగా దూసుకెళ్లింది. ఇంట్రాడేలో 82,718.14


పాయింట్ల వద్ద గరిష్ఠాన్ని తాకింది. చివరికి 1200 పాయింట్ల లాభంతో 82,530.74 వద్ద స్థిరపడింది. నిఫ్టీ కూడా 394 పాయింట్లు లాభంతో 25061 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ 85.52గా ఉంది.


సెన్సెక్స్‌ 30 సూచీలో ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ మినహా అన్ని షేర్లూ లాభాల్లో ముగిశాయి. టాటా మోటార్స్‌, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, అదానీ పోర్ట్స్‌, ఎటర్నల్‌, మారుతీ సుజుకీ షేర్లు ప్రధానంగా


లాభపడ్డాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్‌ బ్యారెల్‌ 63 డాలర్ల వద్ద ట్రేడవుతుండగా.. బంగారం ఔన్సు 3177 డాలర్ల వద్ద కొనసాగుతోంది. కారణాలు ఇవే... * తమ దేశం నుంచి దిగుమతి చేసేకొనే చాలా


రకాల వస్తువులపై భారత్‌ జీరో టారిఫ్‌లను ఆఫర్‌ చేసిందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రకటన చేశారు. ఇప్పటికే భారత్‌-అమెరికా దేశాలు వాణిజ్య ఒప్పందంపై చర్చిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన నుంచి వచ్చిన


ఈ ప్రకటన పాజిటివ్‌ సెంటిమెంట్‌కు కారణమైంది. * అమెరికా-ఇరాన్‌ మధ్య న్యూక్లియర్‌ డీల్‌ జరగొచ్చన్న వార్తల కారణంగా క్రూడాయిల్‌ ధర బ్యారెల్‌కు 2 డాలర్ల మేర క్షీణించింది. ఇరాన్‌పై ఆంక్షలు తొలగితే


గ్లోబల్‌గా క్రూడ్‌ సప్లయ్‌ పెరుగుతుంది. * మన మార్కెట్‌పై విదేశీ సంస్థాగత మదుపర్ల విశ్వాసం కొనసాగుతోంది. గడిచిన 20 ట్రేడింగ్‌ సెషన్లలో 19 రోజులు నికర కొనుగోలుదారులుగా ఉన్నారు. రూ.50వేల


కోట్లు విలువైన ఈక్విటీ షేర్లను కొనుగోలు చేశారు.  * అమెరికా డాలర్‌ ఇండెక్స్‌ కాస్త బలహీన పడి 100.74కు చేరింది. ఫిబ్రవరిలో 109.88గా ఉంది. డాలర్‌ బలహీన పడితే భారత్‌ వంటి మార్కెట్లకు విదేశీ


పెట్టుబడులు సమకూరుతాయి.  * దేశీయంగానూ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. ఏప్రిల్‌లో రిటైల్‌ ద్రవ్యోల్బణం ఆరేళ్ల కనిష్ఠస్థాయికి చేరి 3.16 శాతంగా నమోదైంది. ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టడంతో ఆర్‌బీఐ


వడ్డీ రేట్లు తగ్గించొచ్చన్న అంచనాలు కూడా మార్కెట్లు రాణించడానికి దోహదపడ్డాయి.


Trending News

Real cast away: 32 ఏళ్లుగా.. ఒంటరిగా.. దీవిలో జీవించిన 81 ఏళ్ల పెద్దాయన

Published by: Last Updated:April 28, 2021 12:05 PM IST REAL CAST AWAY: మనిషి సంఘజీవి. ఒంటరిగా బతకడం కష్టం. మరి అతను ఎలా ...

Pawan kalyan - shruti hassan: ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆ విష‌యంలో తోపు అంటున్న శ్రుతి!

Published by: Last Updated:February 27, 2021 9:59 PM IST PAWAN KALYAN - SHRUTI HASSAN: మీరేమైనా చెప్పండి! ఎన్న‌యినా చెప్...

Indus water treaty: ఒమర్‌ vs మెహబూబా.. ‘తుల్‌బుల్‌’పై మాటల యుద్ధం

ఇంటర్నెట్‌ డెస్క్‌: సింధూ జలాల ఒప్పందం నిలిపివేత అంశంపై జమ్మూకశ్మీర్‌ రాజకీయాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. తాజాగా దీనికి స...

Talasani srinivas yadav | latest talasani srinivas yadav - eenadu

ఆ పరిశ్రమ తలసాని కుటుంబానిదే.. మంత్రి సీతక్క ఆరోపణ నిర్మల్‌ జిల్లా దిలావర్‌పూర్‌ ఇథనాల్‌ పరిశ్రమ భారాసకు చెందిన మాజీ మంత...

Kl rahul: రాహుల్‌ ఆ స్థానంలో బ్యాటింగ్‌ చేయడం జట్టుకు బలం: భారత బ్యాటింగ్‌ కోచ్‌

దిల్లీ: టీమ్‌ ఇండియా బ్యాటర్‌ కేఎల్‌ రాహుల్‌పై భారత బ్యాటింగ్‌ కోచ్‌ సితాన్ష్‌ కోటక్‌ ప్రశంసల జల్లు కురిపించారు. అతను ఆర...

Latests News

Stock market: భారీ లాభాల్లో సూచీలు.. 25 వేల పైకి నిఫ్టీ.. కారణాలు ఇవే

Stock market | ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు (Stock market) భారీ లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ...

Vladimir putin | latest vladimir putin - eenadu

రష్యా, ఉత్తర కొరియాలపై ట్రంప్‌ సుంకాల్లేవ్‌ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ ప్రకటించిన ప్రతీకార సుంకాల నుంచి రష్యా, ...

Operation sindoor: ‘ఆపరేషన్‌ సిందూర్‌’.. ప్రత్యక్షంగా పర్యవేక్షించిన ప్రధానిమోదీ

దిల్లీ: ‘ఆపరేషన్‌ సిందూర్‌’ను ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Narendra Modi) ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. పాకిస్థాన్‌లోని ...

Operation sindoor: భారత సరిహద్దుల్లో మళ్లీ పాక్‌ డ్రోన్లు..?

 కాల్పుల విరమణ ఒప్పందం జరిగినా పాక్‌ దాడులు చేస్తూనే ఉందా? అవుననే అంటున్నాయి డిఫెన్స్‌ వర్గాలు. తాజాగా జమ్ముకశ్మీర్‌లోని...

Chandrababu: సంపద సృష్టించాలి.. ప్రజలకు అందించాలి: ఏపీ సీఎం చంద్రబాబు

విజయవాడ: ప్రపంచంలో యువత ఎక్కువగా ఉండేది భారత్‌లోనే అని ఏపీ సీఎం చంద్రబాబు (Chandrababu) అన్నారు. ఆర్థిక సంస్కరణలతో ప్రభు...

Top