Delhi ordinance bill: లోక్ సభ ముందుకు ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లు.. తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విపక్షాలు!

Telugu

Delhi ordinance bill: లోక్ సభ ముందుకు ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లు.. తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విపక్షాలు!"

Play all audios:

Loading...

Published by: Last Updated:August 01, 2023 3:17 PM IST DELHI ORDINANCE BILL: లోక సభ ముందుకు ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లును కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చింది. ఈ బిల్లును కేంద్ర హోం శాఖా మంత్రి


అమిత్ షా ప్రవేశపెట్టారు. అయితే ఈ బిల్లును మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న విపక్షాలు లోక్ సభలో సైతం తీవ్రంగా వ్యతిరేకించాయి. ఈ బిల్లు రాజ్యాంగానికి వ్యతిరేకమంటూ విపక్షాలు పెద్ద ఎత్తున నినాదాలు


చేశారు.   Delhi Ordinance Bill: లోక సభ ముందుకు ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లును కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చింది. ఈ బిల్లును కేంద్ర హోం శాఖా సహాయ మంత్రి ప్రవేశపెట్టారు. అయితే ఈ బిల్లును మొదటి


నుంచి వ్యతిరేకిస్తున్న విపక్షాలు లోక్ సభలో సైతం తీవ్రంగా వ్యతిరేకించాయి. ఈ బిల్లు రాజ్యాంగానికి వ్యతిరేకమంటూ విపక్షాలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.  ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లు సమాఖ్య


స్ఫూర్తికి విరుద్ధమని కాంగ్రెస్ వ్యతిరేకిస్తే..కేంద్రం రాష్ట్ర హక్కులను కాలరాస్తోందని అందుకే ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నట్టు RSP ప్రకటించింది. ఢిల్లీలో చట్టాలు చేసే అధికారం కేంద్రానికి


ఉంటుందని..ఇది రాజ్యాంగంలోనే ఉందని అమిత్ షా అన్నారు. ఇక కేంద్రం ప్రవేశపెట్టిన ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లుపై రేపు లోక్ సభలో చర్చ జరగనుంది. కాగా ఢిల్లీ ఆర్డీనెన్సు బిల్లు తీసుకురావాలని కేంద్ర


కేబినెట్ నిర్ణయించింది. అయితే ఈ బిల్లును తాము వ్యతిరేకిస్తున్నామని ఢిల్లీ సీఎంకు తెలంగాణ  సీఎం కేసీఆర్ (Cm Kcr) హామీనిచ్చారు. ఈ మేరకు దీనికి అనుగుణంగా బిల్లుకు వ్యతిరేకంగా ఓటింగ్ చేసేలా


పార్టీ ఎంపీలకు ఇప్పటికే విప్ జారీ చేశారు. advertisement కేంద్ర ప్రభుత్వంపై ప్రతిపక్షాలు 2 రోజుల కిందట అవిశ్వాస తీర్మానం పెట్టాయి. అందులో భాగంగా 26 పార్టీల ఇండియా కూటమి (INDIA) తరపున


కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ అవిశ్వాస తీర్మానం పెట్టగా..బీఆర్ఎస్ తరపున ఎంపీ నామా నాగేశ్వర్రావు అవిశ్వాస తీర్మానాన్ని పెట్టారు. బీఆర్ఎస్ అవిశ్వాస తీర్మానానికి ఎంఐఎం మద్దతు తెలిపింది. ఈ మేరకు


ఒవైసీ అవిశ్వాస తీర్మానంపై సంతకం చేశారు. ఈ తీర్మానం ద్వారా ఢిల్లీ ఆర్డినెన్సు, మణిపూర్ అంశంపై సమాధానం చెప్పించటమే లక్ష్యంగా ప్రతిపక్షాలు చూస్తున్నాయి. advertisement పార్లమెంట్ లో ఎన్డీయేకి


330 మంది సభ్యుల మద్దతు ఉంది. ఇక ఇండియా కూటమి (INDIA) కి 140 మంది మద్దతు ఉంది. ఏ కూటమిలో లేని ఎంపీల సంఖ్య 60గా ఉంది. అయితే ఈ తీర్మానం వీగిపోవడం ఖాయమని  తెలిసినా కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకే


విపక్షాలు చేస్తున్న ప్రయత్నంగా తెలుస్తుంది. అవిశ్వాస తీర్మానాన్ని లోక్ సభ స్పీకర్ కు ఎంపీలు అందజేశారు. దీనితో ఈనెల 8,9.,10వ తేదీల్లో అవిశ్వాస తీర్మానంపై చర్చ జరగనుంది. దీనిపై ప్రధాని మోదీ


మాట్లాడే అవకాశం ఉంది. Location : Hyderabad,Telangana First Published : August 01, 2023 2:46 PM IST Read More


Trending News

Ap news: ఏపీ వ్యాప్తంగా రేషన్‌ దుకాణాల్లో సరకుల పంపిణీ.. ప్రారంభించిన మంత్రులు

పిఠాపురంలో రేషన్‌ పంపిణీని ప్రారంభిస్తున్న మంత్రి నాదెండ్ల మనోహర్‌ అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా రేషన్‌ దుకాణాల్లో స...

Rohit sharma: ఓ ఎజెండా ప్రకారమే భారత్‌లో క్రికెట్ కామెంట్రీ: రోహిత్ వ్యాఖ్యలు

ఇంటర్నెట్ డెస్క్‌: భారత్‌కు చెందిన పలువురి క్రికెట్ కామెంట్రీపై రోహిత్ శర్మ (Rohit Sharma) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడ...

Russia: రష్యాలో కూలిన మరో వంతెన.. పట్టాలు తప్పిన గూడ్స్‌ రైలు..

Russia | ఇంటర్నెట్‌డెస్క్: రష్యాలోని బ్రయాన్స్క్‌లో వంతెన కూలి రైలు బోల్తాపడిన ఘటన చోటు చేసుకుని 24 గంటలు గడవక ముందే.. అ...

delhi-chunav2020: Latest delhi-chunav2020 News in Hindi - Naidunia

delhi chunav2020Delhi Capitals IPL 2025 Schedule: लखनऊ से होगा दिल्ली कैपिटल्स का पहला मैच, पढ़ें कौन किस पर भारीsports3...

Usa: అమెరికాలో తుపానుల బీభత్సం.. 21 మంది మృతి

ఇంటర్నెట్‌ డెస్క్: అమెరికా (USA)లో తుపానుల కారణంగా విపత్కర వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా కెంటకీ, మిస్సోరీల్ల...

Latests News

Delhi ordinance bill: లోక్ సభ ముందుకు ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లు.. తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విపక్షాలు!

Published by: Last Updated:August 01, 2023 3:17 PM IST DELHI ORDINANCE BILL: లోక సభ ముందుకు ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లును ...

Aamir khan: ఆ భారీ ప్రాజెక్ట్‌ తర్వాత.. సినిమాలకు స్టార్‌ హీరో గుడ్‌బై..?

తన కెరీర్‌ను ఉద్దేశించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు బాలీవుడ్‌ స్టార్‌ హీరో ఆమిర్‌ ఖాన్‌ (Aamir Khan)....

Shashi tharoor: పాక్‌లో ఉగ్రవాదులు హతమైతే సంతాపమా..? శశిథరూర్‌

భారత్‌ దాడుల్లో పాకిస్థాన్‌లో ప్రాణాలు కోల్పోయిన వారికి కొలంబియా ప్రభుత్వం సంతాపం తెలపడంపై కాంగ్రెస్‌ నాయకుడు శశిథరూర్ అ...

Russia: రష్యాలో భారత బృందానికి వింత అనుభవం.. గంటల పాటు గాల్లోనే చక్కర్లు

మాస్కో: పహల్గాం ఉగ్ర దాడి, పాకిస్థాన్‌ సీమాంతర ఉగ్రవాదంపై వివరించేందుకు డీఎంకే ఎంపీ కనిమొళి నేతృత్వంలోని భారత ప్రతినిధుల...

Schengen visa: భారతీయులకు షెంజెన్‌ వీసాల దెబ్బ.. గతేడాది 1. 65లక్షల దరఖాస్తులు రిజెక్ట్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఐరోపా దేశాల్లో పర్యటించేందుకు ఇచ్చే షెంజెన్‌ వీసా (Schengen visa) దరఖాస్తుల్లో గతేడాది లక్షలాది సంఖ్...

Top