G20 summit : జీ20 సమావేశంలో కీలక పరిణామం.. ఇండియా పేరు మార్పుపై మోదీ క్లారిటీ.. వీడియో చూడండి

Telugu

G20 summit : జీ20 సమావేశంలో కీలక పరిణామం.. ఇండియా పేరు మార్పుపై మోదీ క్లారిటీ.. వీడియో చూడండి"

Play all audios:

Loading...

Published by: Last Updated:September 09, 2023 1:05 PM IST న్యూఢిల్లీలో ఇవాళ రెండు రోజుల జీ20 సదస్సు ప్రారంభమైంది. ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లోని "భారత్‌ మండపం"లో జరుగుతున్న జీ20


సమావేశాల్లో పలు ప్రపంచ దేశాల అధినేతలు పాల్గొన్నారు. న్యూఢిల్లీలో ఇవాళ రెండు రోజుల జీ20 సదస్సు ప్రారంభమైంది. ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లోని "భారత్‌ మండపం"లో జరుగుతున్న జీ20


సమావేశాల్లో పలు దేశాల అధినేతలు,అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. అయితే ఈ సందర్భంగా కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆఫ్రికన్‌ యూనియన్‌ కు జీ20లో శాశ్వత సభ్యత్వం కల్పిస్తున్నట్లు జీ20


సమావేశంలో ప్రధాని మోదీ ప్రకటించారు. భారత్‌ మండపంలో జరిగిన వన్‌ ఎర్త్‌ సెషన్‌ ప్రారంభోపన్యాసంలో ప్రధాని నరేంద్ర మోదీ ఈ విషయాన్ని ప్రతిపాదించారు. మోదీ మాట్లాడుతూ.."సబ్‌కా సాథ్‌, సబ్‌కా


వికాస్‌, సబ్‌కా విశ్వాస్‌, సబ్‌కా ప్రయాస్‌ మంత్రంతో మనందరం కలిసి ప్రపంచంలో నెలకొన్న అపనమ్మకాన్ని తొలగించాం. ప్రపంచంలో పేద, సంపన్న దేశాల మధ్య భేదాలు, ఆహారం, ఇంధనం నిర్వహణ, హెల్త్‌, ఎనర్జీ,


నీటి భద్రత వంటి సమస్యలకు సమాధానం కోసం ముందుకు వెళ్లాల్సిందే. భారత్‌ జీ20 అధ్యక్షతన దేశం లోపల, బయట అందరిని కలుపుకొని పోవడానికి ప్రతీకగా నిలిచింది. సబ్‌కా సాథ్‌ భావనతోనే ఆఫ్రికన్‌ యూనియన్‌కు


జీ20 సభ్యత్వం ఇవ్వాలని భారత్‌ ప్రతిపాదిస్తోంది. ఈ ప్రతిపాదనకు అందరూ అంగీకరిస్తారని నమ్ముతున్నాను. మీ అనుమతితో జీ20 సభ్యుడి హోదాలో ఆఫ్రికన్‌ యూనియన్‌ అధ్యక్షుడు గ్రూపులో స్థానాన్ని


స్వీకరించాలని ఆహ్వానిస్తున్నాను" అని తెలిపారు. అందరు సభ్యుల అంగీకారంతో ఆఫ్రికన్‌ యూనియన్‌కు శాశ్వత సభ్యత్వం ఇస్తున్నట్లు ప్రకటించారు. అనంతరం ఆఫ్రికన్‌ యూనియన్‌ అధినేత అజాలీ అసౌమనీని


శాశ్వత సభ్యులకు కేటాయించిన కుర్చీలో కూర్చోబెట్టారు. advertisement ఇక,సదస్సు ప్రారంభం సందర్భంగా మొరాకోలో గత రాత్రి సంభవించిన భూకంపం కారణంగా మృతి చెందినవారికి ప్రధాని సంతాపం తెలిపారు.


గాయపడినవాళ్లు వీలైనంత త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. ఈ కష్టకాలంలో మొరాకోకు ఎలాంటి సామయందించేందుకైనా భారత్ రెడీగా ఉందన్నారు. > #WATCH | G 20 in India | PM Modi at the G 


20 Summit says "Before we > start the proceedings of G20, I want to express my condolences over > the loss of lives due to an earthquake in Morocco. We pray that all > injured 


recover at the earliest. India is ready to offer all > possible… pic.twitter.com/ZTqcg11cKI > — ANI (@ANI) September 9, 2023 advertisement మరోవైపు,గ‌త కొన్ని రోజుల నుంచి దేశం పేరు


మార్పు గురించి తీవ్ర స్థాయిలో చ‌ర్చ సాగుతున్న విష‌యం తెలిసిందే. జీ20 సమ్మిట్‌ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఏర్పాటు చేసిన విందు ఆహ్వాన పత్రికల్లో ప్రెసిడెంట్‌ ఆఫ్‌ ఇండియాకు బదులుగా


"ప్రెసిడెంట్‌ ఆఫ్‌ భారత్‌" అని ఉండటంతో ఈ అంశం కాస్తా చర్చీనీయాంశమైంది. తాజాగా జీ20 సమ్మిట్‌లో ప్రధాని మోదీ కూర్చున్న కుర్చీ దగ్గర టేబుల్‌పై ఉండే దేశం నేమ్‌ప్లేట్‌పై ఇండియాకు బదులు


భారత్‌ అని రాసి ఉంది. దీంతో పరోక్షంగా దేశం మార్పుకి కేంద్రం సిద్దంగా ఉన్నట్లు కనిపిస్తోంది. మోదీ త‌న ప్రసంగాన్ని ప్రారంభిస్తూ.. భార‌త్ మిమ్మల్ని స్వాగ‌తిస్తోంద‌ని అన్నారు. Location :


Hyderabad,Telangana First Published : September 09, 2023 12:33 PM IST Read More


Trending News

Ktr: మిస్‌ ఇంగ్లాండ్‌ ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు చేయించాలి: కేటీఆర్‌

మిస్‌ ఇంగ్లాండ్‌ మిల్లా మాగీ ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు చేయించాలని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌(KTR) డిమాండ్‌ చ...

Bhatti vikramarka: పేదల ఇంటి నిర్మాణానికి రూ. 5 లక్షలు ఇస్తున్న రాష్ట్రం మరొకటి లేదు: భట్టి విక్రమార్క

అన్ని సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మం: అ...

తిరుమల వెళ్లే భక్తులకు అలర్ట్... శ్రీవారి దర్శనానికి 40 గంటల సమయం

Reported by: Published by: Last Updated:May 24, 2024 3:27 PM IST అసలే ఓ వైపు సెలవులు.. మరో వైపు అన్ని పరీక్షా ఫలితాలు వి...

Tdp mahanadu | latest tdp mahanadu - eenadu

వైకుంఠపాళి మనకొద్దు అభివృద్ధి వైకుంఠపాళి కాకూడదని, మంచి పాలన కొనసాగాలని, ఒకసారి ఎక్కడం, మళ్లీ కింద పడటం, మళ్లీ ఎక్కడం, మ...

Nvidia: మైక్రోసాఫ్ట్‌ను దాటేసిన ఎన్విడియా.. అత్యంత విలువైన కంపెనీల్లో మళ్లీ టాప్‌

Nvidia: ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా ఎన్విడియా అవతరించింది. మైక్రోసాఫ్ట్‌ను అధిగమించి మొదటిస్థానంలో నిలిచింది. Nv...

Latests News

G20 summit : జీ20 సమావేశంలో కీలక పరిణామం.. ఇండియా పేరు మార్పుపై మోదీ క్లారిటీ.. వీడియో చూడండి

Published by: Last Updated:September 09, 2023 1:05 PM IST న్యూఢిల్లీలో ఇవాళ రెండు రోజుల జీ20 సదస్సు ప్రారంభమైంది. ఢిల్లీ...

Ap news: రైఫిల్ షూటింగ్ పైనే వారి గురి.. ఎందుకో తెలుసా..?

చ‌దువుల‌తో పాటు ఆట‌లు కీల‌కం. ఒక‌ప్పుడు ఆడ‌పిల్ల‌లు ఆట‌ల్లో రాణంచాలంటే దానికొక పెద్ద త‌తంగ‌మే ఉండేది. ఇళ్ల‌ల్లో అనుమ‌తుల...

Twitter: నాన్-ట్విట్టర్ బ్లూ యూజర్లకు షాక్.. ఏప్రిల్ 1 నుంచి బ్లూ చెక్‌మార్క్ తొలగింపు..

Published by: Last Updated:March 24, 2023 3:47 PM IST TWITTER: ఏప్రిల్ 1 నుంచి కేవలం పెయిడ్ సబ్‌స్క్రైబర్లు, అప్రూవల్ పొ...

Operation sindoor live updates: ఆపరేషన్‌ సిందూర్‌.. లైవ్‌ అప్‌డేట్స్‌

09/05/2025 07:33(IST) భారత్‌-పాక్‌ ఉద్రిక్తతలు.. మా జోక్యం ఉండదు: అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ రెండు అణుశక్తి దేశాల...

ఏడేళ్ల క్రితం స్పెర్మ్‌తో పండంటి బిడ్డ

ప్రతీకాత్మక చిత్రం సాక్షి, హైదరాబాద్‌ : ఏడేళ్ల క్రితం ముందు జాగ్రత్తతో ఆ దంపతులు భద్రపరుచుకున్న స్పెర్మ్‌.. ఇప్పుడు వారి...

Top