‘అసంతృప్త నేతలపై చర్యలు లేవు’

Sakshi

‘అసంతృప్త నేతలపై చర్యలు లేవు’"

Play all audios:

Loading...

సాక్షి, న్యూఢిల్లీ : పార్టీలో సంస్ధాగత అంశాలను పరిశీలించి పరిష్కరిస్తామని, పార్టీ పునర్నిర్మాణం నిరంతరం కొనసాగే ప్రక్రియని సీడబ్ల్యూసీ సమావేశంలో పార్టీ చీఫ్‌ సోనియా గాంధీ స్పష్టం చేశారని


కాంగ్రెస్‌ ప్రతినిధి రణ్‌దీప్‌ సింగ్‌ సుర్జీవాలా పేర్కొన్నారు. సోమవారం సుదీర్ఘంగా సాగిన సీడబ్ల్యూసీ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పార్టీ నేతలెవరిపైనా ఎలాంటి చర్యలూ ఉండవనీ, వారంతా


తమ కుటుంబంలో భాగమని సోనియా వెల్లడించారని చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీ పెద్ద కుటుంబమని, పలు సందర్భాల్లో ఎన్నో విభేదాలు ఎదురైనా చివరికి తామంతా ఒక్కటిగా నిలిచామని సమావేశం చివరిలో సోనియా


పేర్కొన్నారని సుర్జీవాలా చెప్పారు. దేశంలో ప్రజా వ్యతిరేక ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల పక్షాన పోరాటం చేయాల్సిన అవసరం ప్రస్తుతం పార్టీ శ్రేణుల ముందున్నదని ఆమె చెప్పారని అన్నారు. కాగా,


కాంగ్రెస్‌ పార్టీ తాత్కాలిక చీఫ్‌గా సోనియా గాంధీ కొనసాగుతారని పార్టీ నేత కేసీ వేణుగోపాల్‌ తెలిపారు. నూతన అధ్యక్షుడి ఎన్నిక పూర్తయ్యే వరకూ ఆమె మరికొన్ని నెలల పాటు పదవిలో కొనసాగుతారని


వెల్లడించారు. పార్టీ తాత్కాలిక చీఫ్‌గా సోనియానే కొనసాగాలని పార్టీ నేతలు ఏకగ్రీవంగా మద్దతు తెలిపారని అన్నారు. మరోవైపు సీడబ్ల్యూసీ భేటీలో సోనియా గాంధీ రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించగానే రాహుల్‌


సీనియర్‌ నేతల తీరును తప్పుపట్టారు.బీజేపీతో కలిసి కుట్రపూరితంగానే పార్టీ ప్రక్షాళన కోరుతూ సోనియాకు లేఖ రాశారని సీనియర్లపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాహుల్‌ వ్యాఖ్యలపై సీనియర్‌ నేతలు గులాం నబీ


ఆజాద్‌, కపిల్‌ సిబల్‌, ఆనంద్‌ శర్మ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. బీజేపీతో సంబంధాలను నిరూపిస్తే రాజీనామాకు సిద్ధమని స్పష్టం చేశారు. ఇక సీనియర్‌ నేతలను అనునయించేందుకు వారిపై తాను ఎలాంటి


వ్యాఖ్యలూ చేయలేదని రాహుల్‌ వివరణ ఇవ్వాల్సి వచ్చింది. చదవండి : సోనియా రాజీనామా : సీడబ్ల్యూసీ భేటీలో ట్విస్ట్‌


Trending News

Vastu: అప్పులు, ఆర్థిక కష్టాలు తీరాలంటే, ఇంట్లో 7 మార్పులు చెయ్యండి

గ్లాస్ విండో: మీకు అప్పుల బాధ తీరిపోవాలంటే, ఈశాన్యం దిక్కులో ఓ గ్లాస్ కిటికీని అమర్చండి. మీ ఇల్లు, షాప్ ఏదైనా సరే, ఈశ్యా...

పదేళ్లకే పిల్లల్లో బీపీ, మధుమేహం.. కారణం ఇదే : డాక్టర్‌ రిమా దాదా

దిల్లీ: విద్యార్థుల్లో అధిక మధుమేహాన్ని నియంత్రించడమే లక్ష్యంగా పాఠశాలల్లో ‘షుగర్ బోర్డు’లను ఏర్పాటు చేయాలని సీబీఎస్‌ఈ(C...

నేటి తాజా వార్తలు @ ఈనాడు. నెట్‌ (23/05/2025)

23/05/2025 11:09(IST) ఏపీ మద్యం కుంభకోణం.. రాజ్‌ కెసిరెడ్డికి సుప్రీంలో చుక్కెదురు రాజ్‌ కెసిరెడ్డి, ఆయన తండ్రి ఉపేంద్రర...

Hari hara veera mallu: పవన్‌ కల్యాణ్‌ ఒక్క సినిమానే డైరెక్ట్‌ చేసినా.. : నిర్మాత ఏఎం రత్నం

ఇంటర్నెట్‌ డెస్క్‌: సినిమాకి సంబంధించి పవన్‌ కల్యాణ్‌ అద్భుతమైన టెక్నీషియన్‌ అని నిర్మాత ఏఎం రత్నం (AM Rathnam) పేర్కొన్...

Khammam: ఖమ్మం జిల్లాలో ఘోర ప్రమాదం.. కారు ఢీకొని తల్లి, కుమారుడు మృతి

ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం బుడదంపాడు వద్ద ఘోర ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన తాటి ముంజలు కొంటున్న వారిపైకి కారు దూసు...

Latests News

‘అసంతృప్త నేతలపై చర్యలు లేవు’

సాక్షి, న్యూఢిల్లీ : పార్టీలో సంస్ధాగత అంశాలను పరిశీలించి పరిష్కరిస్తామని, పార్టీ పునర్నిర్మాణం నిరంతరం కొనసాగే ప్రక్రియ...

Food stories | latest food stories - eenadu

రసామృతం వాతావరణం చల్లగా ఉన్నప్పుడు వేడివేడి రసంతో అన్నం తింటే ఎంత బాగుంటుందో కదూ! టొమాటో, ఆనియన్, క్యారెట్, బీట్‌రూట్, న...

Hyderabad: బ్యాండ్‌ సిబ్బందినీ వదలని ఎస్సై.. రూ. 15వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కి..

హైదరాబాద్‌: లంచం తీసుకుంటూ ఓ ఎస్సై ఏసీబీకి చిక్కిన ఘటన జగద్గిరిగుట్ట పోలీస్‌ స్టేషన్‌లో చోటు చేసుకుంది. ఏసీబీ అధికారులు ...

Politics: రాయలసీమలో రాజకీయ చక్రం తిప్పిన కుటుంబానికి కష్టాలు.. పరిటాల రవి ఫ్యామిలీ పోటీపై సందిగ్ధం

Published by: Last Updated:February 10, 2024 6:16 PM IST POLITICS: అనంతపురం జిల్లాకు చెందిన దివంగత నేత, టీడీపీ నాయకుడు ప...

Nagarkurnool news | latest nagarkurnool news - eenadu

DONKEY MILK: ఖరము పాలు.. కురిపించు సిరులు రెస్టారెంట్‌, హోటల్‌, లేడీస్‌ కార్నర్‌, రెడీమేడ్‌ దుస్తుల దుకాణం ఇలా ఏ వ్యాపార...

Top