Muhammad yunus: ‘సెవెన్‌ సిస్టర్స్‌’ గురించి మరోసారి నోరుపారేసుకున్న యూనస్

Eenadu

Muhammad yunus: ‘సెవెన్‌ సిస్టర్స్‌’ గురించి మరోసారి నోరుపారేసుకున్న యూనస్"

Play all audios:

Loading...

ఇంటర్నెట్‌డెస్క్‌: బంగ్లాదేశ్‌ (Bangladesh) తాత్కాలిక సారథిగా బాధ్యతలు చేపట్టిన దగ్గరి నుంచి మహమ్మద్‌ యూనస్ (Muhammad Yunus) భారత్‌ వ్యతిరేక వైఖరిని అవలంబిస్తున్నారు. మరోసారి ఈశాన్య


రాష్ట్రాల గురించి మాట్లాడి.. భారత్‌పై అక్కసు వెళ్లగక్కారు. బంగ్లాదేశ్‌, నేపాల్, ఈశాన్య రాష్ట్రాలకు సమగ్ర ఆర్థిక సమైక్యతా ప్రణాళిక అవసరమని వ్యాఖ్యలు చేశారు. జలశక్తి, ఆరోగ్య సంరక్షణ, రవాణా,


మౌలిక సదుపాయాలు వంటి అంశాల్లో సహకారం ముఖ్యమంటూ మాట్లాడారు. నేపాల్ డిప్యూటీ స్పీకర్‌తో భేటీ సందర్భంగా మన రాష్ట్రాల ప్రస్తావన తెచ్చారు. భారత్‌కు క్రమంగా దూరమవుతున్న బంగ్లా.. పాకిస్థాన్‌,


చైనాతో సంబంధాల కోసం ఆరాటపడుతూ ఈ తరహా వైఖరిని ప్రదర్శిస్తుంది. గత నెల యూనస్‌ చైనాలో పర్యటించిన సందర్భంగా.. బంగ్లాదేశ్‌లో డ్రాగన్ తన కార్యకలాపాలు విస్తరించుకోవచ్చంటూ ఆహ్వానం పలికిన సంగతి


తెలిసిందే. అక్కడితో ఆగకుండా భారత ఈశాన్య రాష్ట్రాలను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసి నోరుపారేసుకున్నారు. ‘‘భారత ఈశాన్య ప్రాంతంలోని ఏడు రాష్ట్రాలను సెవెన్‌ సిస్టర్స్ అంటారు. అవి బంగ్లాదేశ్‌తో


భూపరివేష్టితమై ఉన్నాయి. వారు సముద్రానికి చేరుకోవడానికి వేరే మార్గం లేదు. ఈ ప్రాంతంలో సముద్రానికి మేమే రక్షకులం. కాబట్టి ఇది భారీ అవకాశం. చైనా ఆర్థిక బేస్‌ను విస్తరించుకోవడానికి అనుకూలంగా


ఉంటుంది’’ అని వ్యాఖ్యలు చేసినట్లుగా ఉన్న ఓ వీడియో వైరల్ అయింది. దానికి భారత్ నుంచి స్ట్రాంగ్ కౌంటర్ కూడా వచ్చింది. * పేర్లు మార్చినంత మాత్రాన వాస్తవాలు మారవు.. చైనాపై మండిపడిన భారత్


‘‘బంగాళాఖాతం చుట్టూ ఉన్న, దాని సమీపంలోని దేశాలకు ఉమ్మడి ఆసక్తులు, ఆందోళనలు రెండూ ఉన్నాయి. వాటిలో కొన్నింటికి మన చరిత్ర దోహదం చేసింది. ఇతర ప్రాధాన్యాలు ఈ ప్రాంతం శ్రేయస్సును పక్కనపెట్టాయి.


బంగాళాఖాతంలో భారత్‌కు 6,500కి.మీ. మేర పొడవైన తీరరేఖ ఉంది. భారతదేశం ఐదు బిమ్స్‌స్టెక్ సభ్య దేశాలతో సరిహద్దును కలిగిఉంది. అలాగే ఆసియన్ దేశాలతో అనుసంధానాన్ని అందిస్తోంది. ముఖ్యంగా మా ఈశాన్య


ప్రాంతం బిమ్స్‌స్టెక్ కనెక్టివిటీ హబ్‌గా వృద్ధి చెందుతోంది. రోడ్లు, రైల్వేలు, జలమార్గాలు, గ్రిడ్‌లు, పైప్‌లైన్‌ నెట్‌వర్క్‌లతో ఈ ప్రాంతం పసిఫిక్ మహాసముద్రం వరకు అనుసంధానం అవుతోంది. ఇది


నిజంగా గేమ్ ఛేంజర్‌’’ అని విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్ గట్టి బదులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈశాన్య రాష్ట్రాలు అరుణాచల్‌ ప్రదేశ్, అస్సాం, మణిపుర్‌, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్‌, త్రిపురను


సెవెన్‌ సిస్టర్స్‌గా పిలుస్తారు. 


Trending News

Crime news: సైబర్‌ నేరగాళ్లకు బ్యాంకు ఖాతాలు సమకూరుస్తున్న ఇద్దరి అరెస్టు

హైదరాబాద్‌: సైబర్‌ నేరగాళ్లకు బ్యాంకు ఖాతాలు సమకూరుస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు (Crime News). దిల్లీకి చెంది...

China: విద్యార్థుల వీసాలు నిలిపివేసిన అమెరికా.. స్పందించిన చైనా

విదేశీ విద్యార్థుల వీసాలకు నిర్వహించే ఇంటర్వ్యూలను అమెరికా తాత్కాలికంగా నిలిపివేయడంపై తాజాగా చైనా స్పందించింది.  ఇంటర్నె...

Isi: పాక్‌ నిఘా సంస్థ కోసం పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగి అరెస్ట్‌..

ISI ఇంటర్నెట్‌డెస్క్‌: భారత్‌లో విస్తరించిన పాకిస్థాన్‌ నిఘా సంస్థ వేళ్లు తవ్వేకొద్దీ బయటకు వస్తున్నాయి. తాజాగా రాజస్థాన...

Game changer: ‘గేమ్‌ఛేంజర్‌’.. మొత్తం ఏడున్నర గంటలు: ఎడిటర్‌ కీలక వ్యాఖ్యలు

రామ్‌చరణ్‌ (Ram Charan) హీరోగా శంకర్‌ (Shankar) దర్శకత్వం వహించిన చిత్రం ‘గేమ్‌ ఛేంజర్‌’ (Game Changer). ఈ చిత్రాన్ని ఉద...

Bcci: ఆస్ట్రేలియా vs ఇండియా.. మహిళల జట్టు వన్డే సిరీస్‌ షెడ్యూలు విడుదల

స్వదేశంలో భారత మహిళల జట్టుకు, ఆస్ట్రేలియా ఉమెన్స్‌ టీమ్‌తో మూడు వన్డే మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ సిరీస్‌కు సంబంధించిన షెడ్...

Latests News

Muhammad yunus: ‘సెవెన్‌ సిస్టర్స్‌’ గురించి మరోసారి నోరుపారేసుకున్న యూనస్

ఇంటర్నెట్‌డెస్క్‌: బంగ్లాదేశ్‌ (Bangladesh) తాత్కాలిక సారథిగా బాధ్యతలు చేపట్టిన దగ్గరి నుంచి మహమ్మద్‌ యూనస్ (Muhammad Yu...

Kondagattu: కొండగట్టులో హనుమాన్‌ జయంతి వేడుకలు.. పోటెత్తిన భక్తులు

జగిత్యాల: హనుమాన్‌ జయంతి సందర్భంగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొండగట్టు (Kondagattu)కు భక్తులు భారీగా తరలివచ్చారు. అంజన్నన...

Nizamabad | latest news on nizamabad district - eenadu

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, w...

Mulugu: మహిళలకు అద్భుతమైన అవకాశం.. ఉచితంగా కుట్టు మిషన్, శిక్షణ

Published by: Last Updated:November 30, 2022 8:16 PM IST MULUGU: మహిళకు ఉచితంగా శిక్షణ ఇవ్వడమే కాకుండా భోజన సదుపాయం కల్ప...

Shreyas iyer: ఇది ‘ఇండియన్‌’ ప్రీమియర్‌ లీగ్‌: శ్రేయస్‌ అయ్యర్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత్‌, పాకిస్థాన్‌ సరిహద్దుల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఐపీఎల్‌ (IPL) వాయిదా పడిన విషయం తెలిసిందే. ఇ...

Top