Pakistan: ఉద్రిక్తతల వేళ.. పాకిస్థాన్‌ ఆర్మీ చీఫ్‌కు ప్రమోషన్‌

Eenadu

Pakistan: ఉద్రిక్తతల వేళ.. పాకిస్థాన్‌ ఆర్మీ చీఫ్‌కు ప్రమోషన్‌"

Play all audios:

Loading...

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత్‌-పాక్‌ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ(Operation Sindoor) దాయాది దేశంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. అక్కడి సైన్యాధ్యక్షుడు జనరల్‌ ఆసిం మునీర్‌కు ప్రభుత్వం


ప్రమోషన్‌ ఇచ్చింది. దేశంలో అత్యున్నత సైనిక హోదా కలిగిన ‘ఫీల్డ్‌ మార్షల్‌’గా నియమించేందుకు అక్కడి కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం


తీసుకున్నట్లు తెలిసింది. ఇటీవల భారత్‌-పాకిస్థాన్‌ల మధ్య చోటుచేసుకున్న ఘర్షణలో ఆసిం మునీర్‌ కీలక పాత్ర వహించినట్లు దాయాది దేశం భావిస్తోందట. ఇందులో తామే పైచేయి సాధించినట్లు చెబుతున్నట్లు


సమాచారం. ఇలా వారి సాయుధ బలగాలను ముందుండి నడిపించినందుకే ఆర్మీ చీఫ్‌కు తాజా ప్రమోషన్‌ కట్టబెట్టినట్లు స్థానిక మీడియాలో కథనాలు వచ్చాయి. పహల్గాం దాడికి ప్రతీకారంగా భారత్‌ చేపట్టిన ‘ఆపరేషన్‌


సిందూర్‌’(Operation Sindoor) ద్వారా పాక్‌లోని ఉగ్ర, సైనిక స్థావరాలను తీవ్రంగా ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి అనేక ఆధారాలను కూడా భారత సైన్యం(Indian Army) విడుదల చేసింది. ఈ


క్రమంలో పదుల సంఖ్యలో పాకిస్థాన్‌ సైనికులు, అధికారులు మృతి చెందారని, అనేకమంది పాక్‌ సైనికులు గాయపడినట్లు భారత సైనిక వర్గాలు వెల్లడించాయి. అయినప్పటికీ తమదే పైచేయి అని భ్రమలో ఉన్న పాకిస్థాన్‌..


తమ సైన్యాధ్యక్షుడికి పదోన్నతి కల్పించడం గమనార్హం.


Trending News

Technology | latest tech news today - eenadu

ఐఫోన్‌ డేటా బదిలీ సులువుగా.. కొత్త ఐఫోన్‌ కొన్నారా? పాత ఐఫోన్‌ నుంచి డేటా మొత్తం బదిలీ చేసుకోవాలని అనుకుంటున్నారా? థర్డ్...

Movie news - bollywood (hindi), tamil, telugu, kannada, malayalam - filmibeat

To Start receiving timely alerts please follow the below steps: * Click on the Menu icon of the browser, it opens up a l...

‘సున్నా వడ్డీ’తో మా కుటుంబాల్లో వెలుగు

సాక్షి, అమరావతి: సున్నా వడ్డీ పథకం ద్వారా మా కుటుంబాల్లో వెలుగులు నింపారని పొదుపు సంఘాల మహిళలు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రె...

సేవా సైనికులు.. మీకు సెల్యూట్‌: సీఎం ‌జగన్‌

సేవా వజ్ర, సేవా రత్న, సేవా మిత్ర అవార్డులు పొందిన వలంటీర్లతో సీఎం వైఎస్‌ జగన్‌ వలంటీర్ల సేవా దృక్పథం, మంచి చేయాలన్న తపనన...

కాస్ట్‌లీ కరోనా టెస్టులు!  

సాక్షి, హైదరాబాద్‌: ప్రైవేటు, కార్పొరేట్‌ ఆసుపత్రులు, ల్యాబ్‌ల్లో కరోనా నిర్ధారణ పరీక్షలు చాలా ఖరీదుగా మారాయి. ప్రభుత్వ...

Latests News

Pakistan: ఉద్రిక్తతల వేళ.. పాకిస్థాన్‌ ఆర్మీ చీఫ్‌కు ప్రమోషన్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత్‌-పాక్‌ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ(Operation Sindoor) దాయాది దేశంలో కీలక పరిణామం చ...

Stock market: భారత్‌-పాక్‌ ఉద్రిక్తతల ఎఫెక్ట్‌: సెన్సెక్స్‌ 880 పాయింట్లు డౌన్‌.. మళ్లీ 80 వేల దిగువకు

Stock market | ముంబయి: భారత్‌-పాక్‌ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు దేశీయ స్టాక్‌ మార్కెట్‌పై ప్రభావం చూపాయి. సరిహద్దు రాష్ట్ర...

Chaganti koteswara rao: చాగంటి కోటేశ్వరరావుకు అవమానమంటూ దుష్ప్రచారం.. పోలీసులకు తితిదే ఫిర్యాదు

ఏపీ రాష్ట్ర ప్రభుత్వ నైతిక విలువల సలహాదారు, ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావుకు (Chaganti Koteswara Rao) అవమానం అంటూ...

Cpm: కాల్పుల విరమణలో మూడో దేశం మధ్యవర్తిత్వం అనవసరం: ఎంఏ బేబీ

హైదరాబాద్‌: ఉగ్రవాదాన్ని అణచివేయాలని సీపీఎం ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. భారత్‌-పాక్‌ కాల్పుల...

20 వరకు కట్టుదిట్టంగా లాక్‌డౌన్‌

సాక్షి, హైదరాబాద్‌ : కరోనా వ్యాప్తి నివారణ కోసం రాష్ట్రంలో లాక్‌డౌన్‌ బాగా అమలవుతోందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పే...

Top