Chaganti koteswara rao: చాగంటి కోటేశ్వరరావుకు అవమానమంటూ దుష్ప్రచారం.. పోలీసులకు తితిదే ఫిర్యాదు
Chaganti koteswara rao: చాగంటి కోటేశ్వరరావుకు అవమానమంటూ దుష్ప్రచారం.. పోలీసులకు తితిదే ఫిర్యాదు"
Play all audios:
ఏపీ రాష్ట్ర ప్రభుత్వ నైతిక విలువల సలహాదారు, ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావుకు (Chaganti Koteswara Rao) అవమానం అంటూ అసత్య ప్రచారం చేసిన సోషల్ మీడియా ఛానళ్ల ప్రతినిధులపై తితిదే.. తిరుపతి
యూనివర్సిటీ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. తిరుమల: ప్రముఖ ప్రవచనకర్త, ఏపీ ప్రభుత్వ నైతిక విలువల సలహాదారు చాగంటి కోటేశ్వరరావుకు (Chaganti Koteswara Rao) అవమానం జరిగిందంటూ అసత్య ప్రచారం
చేసిన సోషల్ మీడియా ఛానళ్ల ప్రతినిధులపై పోలీసులకు తితిదే ఫిర్యాదు చేసింది. ఈ మేరకు తిరుపతి యూనివర్సిటీ పోలీసు స్టేషన్తో పాటు దిల్లీ, విజయవాడ పీఐబీలో ఫిర్యాదు చేసినట్లు తితిదే ఓ ప్రకటనలో
తెలిపింది. భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా విషప్రచారం చేసిన సదరు సోషల్ మీడియా సంస్థల లైసెన్స్లను రద్దు చేయాలంటూ యూట్యూబ్ మెటా మేనేజ్మెంట్కు కూడా ఫిర్యాదు చేసినట్లు పేర్కొంది. తితిదే (TTD)
తెలిపిన వివరాల ప్రకారం.. చాగంటి కోటేశ్వరరావు జనవరి 14న తిరుమల శ్రీవారి దర్శనంతో పాటు 16వ తేదీ సాయంత్రం మహతి ఆడిటోరియంలో ప్రవచనాలు ఇచ్చేందుకు డిసెంబర్ 20, 2024న తితిదే అనుమతి ఇచ్చింది. ఆయనకు
ఉన్న క్యాబినెట్ ర్యాంక్ ప్రొటోకాల్ ప్రివిలేజ్ ప్రకారం జనవరి 14న శ్రీవారి దర్శన ఏర్పాట్లు చేసింది. దీనిలో భాగంగా రాంబగీచ గెస్ట్ హౌస్ నుంచి శ్రీవారి ఆలయానికి తీసుకెళ్లేందుకు బ్యాటరీ వాహనాలను,
శ్రీవారి ఆలయానికి బయోమెట్రిక్ ద్వారా అనుమతించేందుకు ఏర్పాట్లు చేసింది. కానీ తితిదే చేసిన ప్రత్యేక ఏర్పాట్లను చాగంటి సున్నితంగా తిరస్కరించారు. సామాన్య భక్తుల తరహాలోనే వైకుంఠం క్యూ కాంప్లెక్స్
నుంచి ఆలయానికి చేరుకుని శ్రీవారిని దర్శించుకున్నారు. (TTD News) మరోవైపు జనవరి 8న తిరుపతిలో జరిగిన తోపులాట ఘటన నేపథ్యంలో చాగంటి ప్రవచన కార్యక్రమాన్ని వాయిదా వేస్తే బాగుంటుందని తితిదే
(Tirumala) ఉన్నతాధికారులు ఆయన దృష్టికి తీసుకెళ్లగా అంగీకరించారు. మరోసారి ఆయన అనుమతితో వేరే తేదీల్లో ప్రవచనాల కార్యక్రమం నిర్వహించేందుకు తితిదే నిర్ణయించింది. వాస్తవం ఇలా ఉండగా.. బయోమెట్రిక్
ద్వారా కాకుండా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి శ్రీవారి ఆలయంలోకి అనుమతించారని సోషల్ మీడియా ఛానళ్లలో అసత్యాలను ప్రచారం చేశారు. చివరి నిమిషంలో పరిపాలనా కారణాల వల్ల చాగంటి ప్రవచనాల
కార్యక్రమాన్ని తితిదే రద్దు చేసినట్లు అవాస్తవ సమాచారాన్ని ప్రచారం చేశారు. ఈ నేపథ్యంలో శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీయడమే కాకుండా, తితిదేను పలుచన చేస్తూ ఉద్దేశపూర్వకంగా అవాస్తవాలను పదేపదే
దుష్ప్రచారం చేస్తున్న వ్యక్తులపైనా, సంస్థలపైనా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తితిదే ఫిర్యాదులో కోరింది.
Trending News
Amar Deep: బిగ్ బాస్ ఫేమ్ అమర్ దీప్ 'నా నిరీక్షణ' మూవీ షురూ...!Amar Deep: బిగ్ బాస్ ఫేమ్ అమర్ దీప్ 'నా నిరీక్షణ' మూవీ షురూ...!Published by:Bhanuprasad Rangaiahgarinews18-teluguLast Up...
Prabhas: షూటింగ్లో గాయపడ్డ ప్రభాస్... కాలికి స్వల్పగాయం..!Telugu Edition हिन्दी(Hindi) English(English) বাংলা(Bengali) मराठी(Marathi) ગુજરાતી(Gujarati) অসমীয়া(Assam) ಕನ್ನಡ(Kanna...
Manchu Family | మంచు మనోజ్ ఇంటి జనరేటర్లో చక్కెర...NEWS18 TELUGUManchu Family | మంచు మనోజ్ ఇంటి జనరేటర్లో చక్కెర...0:00/0:34...
Aadhaar: ఆధార్ యూజర్లకు బిగ్ అలర్ట్.. మారిన రూల్స్..Aadhaar: ఆధార్ యూజర్లకు బిగ్ అలర్ట్.. మారిన రూల్స్..Published by:Veera Babutrending deskLast Updated:January 04, 2025 9:...
సీఎం జగన్ దాడిపై సజ్జల కీలక వ్యాఖ్యలుTelugu Edition हिन्दी(Hindi) English(English) বাংলা(Bengali) मराठी(Marathi) ગુજરાતી(Gujarati) অসমীয়া(Assam) ಕನ್ನಡ(Kanna...
Latests News
Chaganti koteswara rao: చాగంటి కోటేశ్వరరావుకు అవమానమంటూ దుష్ప్రచారం.. పోలీసులకు తితిదే ఫిర్యాదుఏపీ రాష్ట్ర ప్రభుత్వ నైతిక విలువల సలహాదారు, ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావుకు (Chaganti Koteswara Rao) అవమానం అంటూ...
Eenadu sports league | latest eenadu sports league - eenaduదంచికొట్టిన రాకర్స్.. దుమ్మురేపిన హీరోస్.. ఆద్యంతం ఉత్కంఠగా సాగిన ఈనాడు స్పోర్ట్స్ లీగ్ రాష్ట్ర స్థాయి క్రికెట్ పోట...
Tirumala: శ్రీవారిమెట్టు వద్ద దివ్యదర్శనం టోకెన్ల జారీ కౌంటర్లు తాత్కాలికంగా మార్పుశ్రీవారిమెట్టు వద్ద ఇచ్చే దివ్యదర్శనం టోకెన్ల జారీ కౌంటర్లను తాత్కాలికంగా అలిపిరిలోని భూదేవి కాంప్లె్క్స్కు మార్చాలని త...
Rbi: రూ. 6,181 కోట్లు విలువైన రూ. 2,000 నోట్లు ఇంకా రాలేదు..RBI | ఇంటర్నెట్డెస్క్: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.2,000 నోట్లను మార్కెట్ నుంచి వెనక్కి తీసుకొన్నా.. అవి పూర్తి ...
కరోనా నేర్పిన పాఠాలుకరోనా వైరస్ మహమ్మారిపై మన దేశం ఎడతెగకుండా పోరు సాగిస్తున్నా ఆ కేసుల సంఖ్య 2,07,000 దాటిపోయింది. ఆ వైరస్ దండయాత్ర మొదలె...