Mea: బలోచిస్థాన్లో పేలుడు.. పాక్ ఆరోపణలను తిప్పికొట్టిన భారత్
Mea: బలోచిస్థాన్లో పేలుడు.. పాక్ ఆరోపణలను తిప్పికొట్టిన భారత్"
Play all audios:
సొంత వైఫల్యాల నుంచి ప్రపంచ దృష్టిని మరల్చే ప్రయత్నంలో భాగంగా పాకిస్థాన్ నిరాధార ఆరోపణలు చేస్తోందని భారత్ దుయ్యబట్టింది. ఇంటర్నెట్ డెస్క్: బలోచిస్థాన్లో పాఠశాల బస్సు లక్ష్యంగా జరిగిన
ఆత్మాహుతి దాడిలో పలువురు చిన్నారులు మృతి చెందిన విషయం తెలిసిందే. దీనిపై పాకిస్థాన్ (Pakistan) చేసిన ఆరోపణలను భారత్ తోసిపుచ్చింది. సొంత వైఫల్యాల నుంచి ప్రపంచ దృష్టిని మరల్చే ప్రయత్నంలో
భాగంగా ఈ ఆరోపణలు చేస్తోందని దుయ్యబట్టింది. అంతేకాకుండా స్థానిక సమస్యలకూ భారత్ను నిందించడం దాయాది దేశానికి అలవాటుగా మారిందని మండిపడింది. ‘‘ఖుజ్దార్లో చోటుచేసుకున్న దాడిలో (Balochistan
Blast) భారత్ హస్తం ఉందంటూ పాకిస్థాన్ చేసిన నిరాధార ఆరోపణలను ఖండిస్తున్నాం. అటువంటి ఘటనల్లో మరణించిన వారికి భారత్ సంతాపం తెలిపింది. అయినప్పటికీ.. సొంత వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడంతోపాటు
ఉగ్రవాదానికి అంతర్జాతీయ కేంద్రంగా పేరుగాంచిన వారు, ప్రపంచ దృష్టి మరల్చేందుకు ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారు. వారి అంతర్గతంగా ఉన్న అన్ని సమస్యలకు భారత్ను నిందించడం పాక్కు పరిపాటిగా మారింది’’
అని విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రణ్ధీర్ జైశ్వాల్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రపంచాన్ని మోసగించేందుకు పాక్ చేస్తున్న ఈ తరహా ప్రయత్నాలు విఫలం అవుతున్నాయని అన్నారు. * 175 బిలియన్ డాలర్లతో
‘గోల్డెన్ డోమ్’: ట్రంప్ బలోచిస్థాన్లోని ఖుజ్దార్ ప్రావిన్స్లో ఓ పాఠశాల బస్సును లక్ష్యంగా చేసుకొని ఆత్మాహుతి దాడి జరిగింది. ఆ ఘటనలో ముగ్గురు చిన్నారులు సహా ఐదుగురు ప్రాణాలు కోల్పోగా..
38 మంది తీవ్రంగా గాయపడ్డారు. అక్కడి వేర్పాటువాద గ్రూపులు ఈ దాడికి పాల్పడివుండవచ్చని అనుమానిస్తున్నారు.
Trending News
20 వరకు కట్టుదిట్టంగా లాక్డౌన్సాక్షి, హైదరాబాద్ : కరోనా వ్యాప్తి నివారణ కోసం రాష్ట్రంలో లాక్డౌన్ బాగా అమలవుతోందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు పే...
Ap eapcet 2025: ఏపీ ఈఏపీసెట్ రాస్తున్నారా? మీ సందేహాలకు సమాధానాలివిగోAP EAPCET 2025: ఏపీ ఈఏపీసెట్ పరీక్ష రాసే విద్యార్థుల సందేహాలు.. వాటికి సమాధానాలేంటో చూద్దాం..! By Features Desk Publish...
నేత కార్మికులకు అండగా సీఎం జగన్'ధనవంతులవ్వడం చాలా సులభం': రాబర్ట్ కియోసాకి ఆర్ధిక సంక్షోభం, మార్కెట్ క్రాష్ గురించి చెప్పిన రిచ్ డాడ్ పూర్ డా...
Virat kohli: కోహ్లీ మరికొంతకాలం టెస్ట్ క్రికెట్లో కొనసాగాల్సింది: సయ్యద్ కిర్మాణివిరాట్కోహ్లీ ఇంకొంతకాలం ఆడి ఉండాల్సింది. అతడిలో ఇంకా ఎంతో టెస్ట్ క్రికెట్ దాగిఉందని టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ సయ్య...
Supreme court: ఆశ్రయం ఇచ్చేందుకు భారత్ ధర్మసత్రం కాదు: సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలుదిల్లీ: ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే శరణార్థులకు ఆశ్రయం కల్పించేందుకు భారత్ ఉచిత సత్రం కాదని సుప్రీం కోర్టు (Supreme Cou...
Latests News
Mea: బలోచిస్థాన్లో పేలుడు.. పాక్ ఆరోపణలను తిప్పికొట్టిన భారత్సొంత వైఫల్యాల నుంచి ప్రపంచ దృష్టిని మరల్చే ప్రయత్నంలో భాగంగా పాకిస్థాన్ నిరాధార ఆరోపణలు చేస్తోందని భారత్ దుయ్యబట్టింది...
భారత్ బంద్ పాక్షికంన్యూఢిల్లీ: వివాదాస్పద సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు పిలుపునిచ్చిన భారత్ బంద్ శుక్రవారం పంజాబ్, హరియాణా మినహా మిగతా...
నయీం కుడి భుజం శేషన్న జాడేది..?సాక్షి, హైదరాబాద్ : ఎన్కౌంటర్లో హతమైన గ్యాంగ్స్టర్ నయీం ప్రధాన అనుచరుడు శేషన్న ఇప్పటికీ పోలీసులకు చిక్కలేదు. ఎన్కౌ...
Movie news - bollywood (hindi), tamil, telugu, kannada, malayalam - filmibeatTo Start receiving timely alerts please follow the below steps: * Click on the Menu icon of the browser, it opens up a l...
Ipl 2025: లఖ్నవూ ఆటగాడు దిగ్వేశ్ రాఠీని సస్పెండ్ చేసిన బీసీసీఐలఖ్నవూ, హైదరాబాద్ మధ్య సోమవారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో దిగ్వేశ్ రాఠీ.. అభిషేక్ శర్మతో వాగ్వాదానికి దిగాడు. దీంతో బీ...