Rajendra prasad: థియేటర్ల బంద్.. ఎవరో మిస్ గైడ్ చేశారు: రాజేంద్రప్రసాద్
Rajendra prasad: థియేటర్ల బంద్.. ఎవరో మిస్ గైడ్ చేశారు: రాజేంద్రప్రసాద్"
Play all audios:
ఇంటర్నెట్ డెస్క్: థియేటర్ల బంద్ చిన్న విషయం కాదన్నారు సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ (Rajendra Prasad). తన తాజా చిత్రం ‘షష్టిపూర్తి’ (Shashtipurthi) ప్రీరిలీజ్ వేడుకలో ఆయన
పాల్గొన్నారు. ‘లేడీస్ టైలర్’ విడుదలైన 38 ఏళ్ల తర్వాత రాజేంద్రప్రసాద్, అర్చన ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘షష్టిపూర్తి’. రూపేశ్, ఆకాంక్ష సింగ్ కీలకపాత్రల్లో నటించారు. పవన్ ప్రభ
దర్శకుడు. మే 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ప్రీరిలీజ్ ఈవెంట్ను నిర్వహించారు. ‘‘థియేటర్లు మూసేయడం అనేది ఒకరు చెబితే చేసేది కాదు. అది సమష్టిగా తీసుకోవాల్సిన నిర్ణయం. దీన్ని
ఎవరో మిస్ గైడ్ చేశారు. చివరకు ఏమైంది.. అది నిలబడలేదు కదా. పవన్ కల్యాణ్ ఫీల్ అయ్యాడంటే అది సరైనదే అవుతుంది. ఇలాంటివి సృష్టించిన వారిని కనిపెడితే ఈ సమస్యకు ఫుల్స్టాప్ పడుతుంది.
థియేటర్లను బంద్ చేస్తాం అనే మాట చిన్నది కాదు.. ఇలాంటివి ఇంకెప్పుడూ జరగకూడదని కోరుకుంటున్నాను. పవన్ ఈ విషయంలో బాధ్యత తీసుకొని దీని వెనక ఎవరున్నారో కనిపెట్టాలని కోరడం హర్షించదగ్గ విషయం’’ అని
అన్నారు. * ఎప్పుడూ మనసు చెప్పేదే వింటాను: దీపికా పదుకొణె తన కెరీర్ గురించి రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. ‘‘నేను ఎప్పుడూ జేబు నింపుకోవడానికి సినిమాలు చేయలేదు. ఒకవేళ నేను సంపాదించిన డబ్బును
కొందరు హీరోలు పెట్టుబడులు పెట్టినట్లు పెట్టి ఉంటే ఈ పాటికి మద్రాసు, హైదరాబాద్లలో వేల కోట్ల రూపాయల ఆస్తులుండేవి. సంపాదన గురించి పట్టించుకోకుండా సినిమాలు చేశాను. మంచి పాత్ర అవునా.. కాదా
అనేది మాత్రమే చూస్తాను. పవన్ కల్యాణ్ నాకు తమ్ముడితో సమానం. ఆయన సినిమాలో నటించడం ఎందుకో కుదర్లేదు. త్వరలోనే ఆ అవకాశం రావాలని కోరుకుంటున్నాను’’ అని చెప్పారు.
Trending News
‘క్రికెట్ సెలక్షన్’ను ప్రత్యక్ష ప్రసారం చేయాలిముంబై: భారత క్రికెటర్, బెంగాల్ రంజీ జట్టు మాజీ కెప్టెన్ మనోజ్ తివారీ భారత సెలక్షన్ కమిటీ తీరుపై విరుచుకుపడ్డాడు. జట్...
ఆ కుంభకోణం నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు జగన్ కుట్ర: తెదేపా ఎంపీ కేశినేని చిన్నివైకాపా హయాంలో రాష్ట్రంలో జరిగిన మద్యం కుంభకోణం నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు జగన్ (YS Jagan) కుట్ర చేస్తున్నారని తెద...
Ed raids: అన్ని హద్దులూ దాటుతున్నారు.. ఈడీ సోదాలపై సుప్రీం సీరియస్ED Raids: సమాఖ్య పాలన భావనను ఈడీ ఉల్లంఘిస్తోందని, అది సోదాల విషయంలో అన్ని హద్దులను దాటుతోందని సుప్రీంకోర్టు ఆగ్రహించింది...
Neha bhandari: కళ్లెదుటే శత్రువున్నా వెరవని నారీమణి.. ‘సిందూర్’కు సిసలైన అర్థం నేహా భండారిజమ్మూ: కంటికి కన్పించేంత దూరంలో శత్రువు.. దాడుల రూపంలో ముంచుకొస్తున్న ముప్పు.. అలాంటి సమయంలో ప్రత్యర్థికి ఎదురొడ్డి పోరా...
Srisailam: ప్రతి భక్తుడికీ ఉచితంగా లడ్డూ ప్రసాదం.. శ్రీశైలంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలపై మంత్రుల సమీక్షశ్రీశైలం: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలపై మంత్రులు కీలక సమీక్ష నిర్వహించారు. మల్లన్నను దర్శించుకొనేందుకు వచ్చే భక్తులకు ఇబ్...
Latests News
Rajendra prasad: థియేటర్ల బంద్.. ఎవరో మిస్ గైడ్ చేశారు: రాజేంద్రప్రసాద్ఇంటర్నెట్ డెస్క్: థియేటర్ల బంద్ చిన్న విషయం కాదన్నారు సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ (Rajendra Prasad). తన తాజా చిత...
Epfo interest rate: ఈపీఎఫ్ వడ్డీ రేటు ఖరారు చేసిన కేంద్రంEPFO interest rate | దిల్లీ: ఈపీఎఫ్ నిల్వలపై వడ్డీ రేటును కేంద్రం ఖరారు చేసింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి 8.25 శాతంగ...
Manchu manoj: ఆ బాధ నాకు తెలుసు.. విజయ్ విషయంలో సారీ: మంచు మనోజ్హైదరాబాద్: దర్శకుడు విజయ్ కనకమేడలపై జరిగిన ట్రోలింగ్పై నటుడు మంచు మనోజ్ (Manchu Manoj) స్పందించారు. ‘భైరవం’ ప్రీ రిలీ...
Bandi sanjay: కవిత వ్యవహారం.. అదంతా ఫ్యామిలీ డ్రామా: బండి సంజయ్హైదరాబాద్: భారాస ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) వ్యవహారం అంతా ఫ్యామిలీ డ్రామా అని కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay...
Bhatti vikramarka: పేదల ఇంటి నిర్మాణానికి రూ. 5 లక్షలు ఇస్తున్న రాష్ట్రం మరొకటి లేదు: భట్టి విక్రమార్కఅన్ని సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మం: అ...