Manchu manoj: ఆ బాధ నాకు తెలుసు.. విజయ్ విషయంలో సారీ: మంచు మనోజ్
Manchu manoj: ఆ బాధ నాకు తెలుసు.. విజయ్ విషయంలో సారీ: మంచు మనోజ్"
Play all audios:
హైదరాబాద్: దర్శకుడు విజయ్ కనకమేడలపై జరిగిన ట్రోలింగ్పై నటుడు మంచు మనోజ్ (Manchu Manoj) స్పందించారు. ‘భైరవం’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆయన ఎమోషనల్గా మాట్లాడారు. మనోజ్, నారా రోహిత్,
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోలుగా విజయ్ తెరకెక్కించిన చిత్రమిది. ఈ నెల 30న విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ను ఆదివారం నిర్వహించారు. దర్శకులు అనిల్ రావిపూడి, సంపత్ నంది
ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. * మనోజ్.. మీరెప్పుడూ ఇలా నవ్వుతూ ఉండాలి.. మీ టైమ్ స్టార్ట్ అయింది: అనిల్ రావిపూడి వారి వల్లే ఇక్కడున్నా.. ‘‘చాలా కాలం తర్వాత నా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో
మాట్లాడుతున్నందుకు ఆనందంగా ఉంది. రోహిత్, సాయి శ్రీనివాస్తో అనుబంధం ఈ సినిమాతో మరింత పెరిగింది. జీవితంలో ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్న నేను ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నానంటే కారణం నా టీమ్. నా
సెక్యూరిటీలు, నా డ్రైవర్లు, ఇంట్లో పని చేసేవారు.. ఇలా అందరూ నాకు మద్దతుగా నిలిచారు. ఒక సామాజిక వర్గానికి చెందిన వారు కలిసి సినిమా చేస్తున్నారన్న మాటలు వినిపిస్తున్నాయి. సినిమా ఒక వర్గానికి
చెందింది కాదు. కళామతల్లి.. ప్రతిభ తప్ప ఇంకేం చూడదు. మా సామాజిక వర్గం సినిమా, మా గుడి సినిమా థియేటర్. సూర్య ఎవరు? ఆయన ఎక్కడి నుంచి వచ్చారు? టాలెంట్ ఉన్న ఎవరినైనా తెలుగు ప్రేక్షకులు
ఆదరిస్తారు. అంత గొప్ప ఇండస్ట్రీ మనది’’ సినిమాకి మేమంతా సమానం.. ‘‘ఎవరికైనా ఫోన్ చేసి రూ.10 వేలు అడిగి చూడండి. ఎంతగా ఆలోచిస్తారో తెలుస్తుంది. లాభం వస్తుందా? రాదా? అన్నది తర్వాత టాలెంట్,
కష్టాన్ని చూసి హీరోలపై నిర్మాతలు డబ్బు పెడుతుంటారు. మా బ్యాక్గ్రౌండ్ ఏంటన్నది ఈ సినిమా నిర్మాత రాధామోహన్ చూడలేదు. మా ముగ్గురిని నమ్మి ఆయన సినిమా నిర్మించారు. తల్లికి బిడ్డ.. బిడ్డే.
కుమారుడైనా, కుమార్తె అయినా ఒకటే. పొట్టి, పొడుగు.. ఇలాంటివేవీ చూడదు. అలాగే సినిమా మాకు తల్లి. ఆమె ముందు మేమంతా సమానం. దయచేసి సామాజిక వర్గాల ప్రస్తావన మా ఇండస్ట్రీలోకి తీసుకురాకండి’’ * మనోజ్
అదరగొట్టాడు.. ‘భైరవం’ ఈవెంట్లో మౌనిక సందడి ఆ బాధ నాకు తెలుసు.. ‘‘ఇటీవల ఈ సినిమా విషయంలో బాయ్కాట్ ట్రెండ్ నడిచింది. దర్శకుడు విజయ్ పని పట్ల అంకిత భావం ఉన్న వ్యక్తి. పదిమందికి సేవ చేస్తూ
ఉంటారు. విజయ్ ఏదో ఒక పోస్టు పెట్టారంటూ కొందరు అంటున్నారు. అది నిజమో కాదో తెలియదు. చిరంజీవి, పవన్ కల్యాణ్లకు ఆయన వీరాభిమాని. అందరూ ఒక్కటై.. మనల్ని ఒంటరిని చేస్తే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు
తెలుసు. వేరే ఎవరైనా అంటే విజయ్ పట్టించుకునేవారు కాదు. కానీ, కుటుంబంలాంటి మెగా అభిమానులే విమర్శిస్తుంటే.. ఆయన్ను చూడలేకపోతున్నా. ఈ సినిమాకి మెగా ఫ్యాన్స్ సపోర్ట్ చేయాలని కోరుతున్నా. పోస్టు
విషయంలో మీరు ఇబ్బంది ఫీల్ అయితే మా టీమ్ తరఫున మీ (మెగా అభిమానులు) అందరికీ క్షమాపణలు. సినిమా ఒక్కరి వల్ల సాధ్యం కాదు. ఎంతోమంది కష్టంతో కూడుకున్నది. 9 ఏళ్ల గ్యాప్ తర్వాత నేను నటించిన
సినిమా ఇది. ఆశీర్వదించండి. ఇప్పటికీ నా వెన్నెంటే ఉన్న అభిమానులకు కృతజ్ఞతలు’’ అని పేర్కొన్నారు.
Trending News
‘క్రికెట్ సెలక్షన్’ను ప్రత్యక్ష ప్రసారం చేయాలిముంబై: భారత క్రికెటర్, బెంగాల్ రంజీ జట్టు మాజీ కెప్టెన్ మనోజ్ తివారీ భారత సెలక్షన్ కమిటీ తీరుపై విరుచుకుపడ్డాడు. జట్...
తెలంగాణలో అడుగుపెట్టిన పవన్ కల్యాణ్CNN18 name, logo and all associated elements ® and © 2017 Cable News Network LP, LLLP. A Time Warner Company. All rights...
Ghulam nabi azad: పాక్ ఉగ్రవాదుల పుట్ట.. ప్రపంచంలో మరెక్కడా అంత మంది లేరు: గులాం నబీ ఆజాద్ప్రపంచం మొత్తంతో పోల్చితే పాకిస్థాన్లోనే అత్యధిక ఉగ్రవాదులు ఉన్నారని జమ్మూకశ్మీర్ మాజీ సీఎం గులాం నబీ ఆజాద్ విమర్శించ...
Ed raids: అన్ని హద్దులూ దాటుతున్నారు.. ఈడీ సోదాలపై సుప్రీం సీరియస్ED Raids: సమాఖ్య పాలన భావనను ఈడీ ఉల్లంఘిస్తోందని, అది సోదాల విషయంలో అన్ని హద్దులను దాటుతోందని సుప్రీంకోర్టు ఆగ్రహించింది...
Neha bhandari: కళ్లెదుటే శత్రువున్నా వెరవని నారీమణి.. ‘సిందూర్’కు సిసలైన అర్థం నేహా భండారిజమ్మూ: కంటికి కన్పించేంత దూరంలో శత్రువు.. దాడుల రూపంలో ముంచుకొస్తున్న ముప్పు.. అలాంటి సమయంలో ప్రత్యర్థికి ఎదురొడ్డి పోరా...
Latests News
Manchu manoj: ఆ బాధ నాకు తెలుసు.. విజయ్ విషయంలో సారీ: మంచు మనోజ్హైదరాబాద్: దర్శకుడు విజయ్ కనకమేడలపై జరిగిన ట్రోలింగ్పై నటుడు మంచు మనోజ్ (Manchu Manoj) స్పందించారు. ‘భైరవం’ ప్రీ రిలీ...
Bandi sanjay: కవిత వ్యవహారం.. అదంతా ఫ్యామిలీ డ్రామా: బండి సంజయ్హైదరాబాద్: భారాస ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) వ్యవహారం అంతా ఫ్యామిలీ డ్రామా అని కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay...
Bhatti vikramarka: పేదల ఇంటి నిర్మాణానికి రూ. 5 లక్షలు ఇస్తున్న రాష్ట్రం మరొకటి లేదు: భట్టి విక్రమార్కఅన్ని సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మం: అ...
Corona virus: మళ్లీ పెరుగుతున్న కొవిడ్ కేసులు.. ఐసీఎంఆర్ చీఫ్ ఏమన్నారంటే?దిల్లీ: దేశంలో మళ్లీ కొవిడ్ కేసులు(Covid 19) కలకలం రేపుతున్నాయి. గత వారం రోజులుగా కేరళ, మహారాష్ట్ర, దిల్లీ, గుజరాత్, త...
Russia-ukraine: ఉక్రెయిన్తో మరోసారి శాంతి చర్చలు.. రష్యా ప్రతిపాదనమాస్కో: ఇటీవల తుర్కియే వేదికగా రష్యా, ఉక్రెయిన్ (Russia-Ukraine Conflict) మధ్య ప్రత్యక్ష శాంతి చర్చలు జరిగిన సంగతి తెలి...