Theatres bandh: జూన్ 1న థియేటర్ల బంద్ లేదు: ఫిల్మ్ ఛాంబర్
Theatres bandh: జూన్ 1న థియేటర్ల బంద్ లేదు: ఫిల్మ్ ఛాంబర్"
Play all audios:
జూన్ 1 నుంచి థియేటర్లను బంద్ చేయటం లేదని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ప్రకటించింది. శనివారం ఈ మేరకు ప్రతినిధులు విలేకరులతో మాట్లాడారు. ఇంటర్నెట్డెస్క్: జూన్ 1వ తేదీ నుంచి తెలుగు రాష్ట్రాల్లో
సినిమా థియేటర్ల బంద్ ఏమీ ఉండదని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ప్రకటించింది. థియేటర్లకు కూడా పర్సంటేజీ విధానం అమలు చేయాలని డిమాండ్ చేసిన నేపథ్యంలో శనివారం ఫిల్మ్ ఛాంబర్లో డిస్ట్రిబ్యూటర్లు,
ఎగ్జిబిటర్లతో నిర్మాతలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు. అనంతరం సమావేశానికి సంబంధించిన వివరాలను ఫిల్మ్ ఛాంబర్ కార్యదర్శి దామోదర ప్రసాద్ వెల్లడించారు. మీడియా ప్రతినిధులు
అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ‘‘థియేటర్ల బంద్ అనేది తప్పుగా చిత్రీకరించారు. చర్చలు జరగకపోతే, జూన్ 1వ తేదీ నుంచి అలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వస్తుందన్నది మాత్రమే నిజం. కానీ, అందరూ
థియేటర్లు మూసి వేస్తారన్న సమాచారాన్నే ప్రచారం చేశారు. ప్రస్తుతం అలాంటిదేమీ లేదు. కేవలం ఒక్క సినిమాను దృష్టిలో పెట్టుకుని థియేటర్లను బంద్ చేస్తున్నామనడం సరికాదు. కొన్ని వార్తలు బిజినెస్ను
దెబ్బతీస్తాయి. చిత్ర పరిశ్రమలో వంద సమస్యలు ఉన్నాయి. అన్నీ ఒకదానితో ఒకటి కనెక్ట్ అయి ఉన్నాయి. వాటిని ఒక్కొక్కటీ పరిష్కరించుకుంటూ రావాలి. థియేటర్ల పర్సంటేజీ విషయమై కొన్నేళ్లుగా ఎలాంటి చర్చ
జరగలేదు. ప్రస్తుతం జరుగుతోంది. తర్వాత రోడ్ మ్యాప్ ఏంటనేది నిర్ణయిస్తాం. మూడు సెక్టార్ల నుంచి కమిటీ వేస్తున్నాం. నిర్ణీత సమయంలోగా సమస్యలు పరిష్కరించుకుంటాం. ఈనెల 30న జరిగే సమావేశంలో కమిటీ
ఎవరనేది నిర్ణయిస్తాం’’ ‘‘థియేటర్ల బంద్ ప్రచారాన్ని ఎవరూ నమ్మొద్దు. తెలుగు ఫిల్మ్ ఛాంబర్, దాని ప్రతినిధుల నుంచి వచ్చే సమాచారమే అధీకృతం. దానికి మేము సమాధానాలు చెబుతాం. ఎవరెవరి దగ్గరి నుంచో
మీడియా అభిప్రాయాలు తీసుకుని ఎవరి వెర్షన్ వారు రాసుకుని వార్తలు ప్రసారం చేస్తున్నారు. ఫిల్మ్ ఛాంబర్లో ఏం జరుగుతుందో తెలుసుకోకుండా రాయడం సరికాదు. చిత్ర పరిశ్రమలో అన్ని వర్గాలను త్వరలోనే
కలుస్తాం. వీలైనన్ని సమస్యలను మేమే పరిష్కరించుకుంటాం. మిగిలిన వాటి విషయంలో ప్రభుత్వంతోనూ చర్చిస్తాం. ఏపీ మంత్రి కందుల దుర్గేష్ను కలిసి ఇండస్ట్రీలోని సమస్యలను వివరిస్తాం’’ అని ఫిల్మ్ ఛాంబర్
కార్యదర్శి దామోదర ప్రసాద్ అన్నారు.
Trending News
కరోనా సెకండ్ వేవ్ వస్తోందిబుధవారం కలెక్టర్లు, జేసీలు, ఎస్పీలతో సీఎం వీడియో కాన్ఫరెన్స్ సాక్షి, అమరావతి: కోవిడ్ సెకండ్ వేవ్ వస్తోందని, ఇప్పటికే...
duduku | TechCrunchSAVE NOW THROUGH JUNE 4 FOR TECHCRUNCH SESSIONS: AI SAVE $300 ON YOUR TICKET TO TC SESSIONS: AI—AND GET 50% OFF A SECOND...
Nadendla manohar: రేషన్ దుకాణాల ద్వారా నిత్యావసరాలు.. డీలర్లు సిద్ధం కావాలి: మంత్రి నాదెండ్లవిజయవాడ: ప్రజా పంపిణీ వ్యవస్థలో ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా ఉండేందుకు ప్రభుత్వం రేషన్ దుకాణాల ద్వారా సరకుల పంపిణీ ...
వేలి ముద్రలు పడకపోయినా రేషన్సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా ఉచిత రేషన్ సరుకులు తీసుకొనే క్రమంలో లబ్ధిదారులకు ఎదురవుతున్న వేలి ముద్రల సమస్యను పరి...
‘క్రికెట్ సెలక్షన్’ను ప్రత్యక్ష ప్రసారం చేయాలిముంబై: భారత క్రికెటర్, బెంగాల్ రంజీ జట్టు మాజీ కెప్టెన్ మనోజ్ తివారీ భారత సెలక్షన్ కమిటీ తీరుపై విరుచుకుపడ్డాడు. జట్...
Latests News
Theatres bandh: జూన్ 1న థియేటర్ల బంద్ లేదు: ఫిల్మ్ ఛాంబర్జూన్ 1 నుంచి థియేటర్లను బంద్ చేయటం లేదని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ప్రకటించింది. శనివారం ఈ మేరకు ప్రతినిధులు విలేకరులతో మ...
Revanth reddy: ఫ్యూచర్సిటీలో విద్యుత్ లైన్లు అన్నీ భూగర్భంలోనే: సీఎం రేవంత్వచ్చే మూడేళ్లలో విద్యుత్ డిమాండ్ పెరుగుతుందని, అందుకు అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని అధికారులకు సీఎం రేవంత్ర...
Jasprit bumrah: బుమ్రా అన్ని మ్యాచ్లకు అందుబాటులో ఉండడు: బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్వర్క్లోడ్ కారణంగా జస్ప్రీత్ బుమ్రా ఇంగ్లండ్తో జరగనున్న అన్ని టెస్టు మ్యాచ్లకు అందుబాటులో ఉండడని బీసీసీఐ చీఫ్ సెలెక...
నేటి తాజా వార్తలు @ ఈనాడు. నెట్ (15/05/2025)15/05/2025 12:20(IST) ఆకట్టుకునేలా నవధాన్య విత్తనాల ప్రదర్శన విజయనగరం జిల్లా, బొండపల్లి మండలం దేవుపల్లి గ్రామంలో ప్రకృతి...
Tourist family: రాజమౌళి మెచ్చిన మూవీ: ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్శశికుమార్, సిమ్రన్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘టూరిస్ట్ ఫ్యామిలీ’. ఓటీటీ విడుదల తేదీ తాజాగా ఖరారైంది. ఇంటర్నెట్...