Defence budget: ఆపరేషన్ సిందూర్‌.. రక్షణ బడ్జెట్‌ రూ. 50వేల కోట్ల పెంపు..

Eenadu

Defence budget: ఆపరేషన్ సిందూర్‌.. రక్షణ బడ్జెట్‌ రూ. 50వేల కోట్ల పెంపు.."

Play all audios:

Loading...

ఇంటర్నెట్‌డెస్క్‌: భారత్‌-పాక్‌ ఉద్రిక్తతల వేళ రక్షణరంగం విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ఆ రంగానికి రూ.50,000 కోట్ల మేర బడ్జెట్‌ (defence budget)లో అదనపు


కేటాయింపులు చేపట్టవచ్చని తెలుస్తోంది. ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో ప్రభుత్వం ఈ దిశగా సన్నాహాలు చేస్తుందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ ఏడాది రక్షణశాఖ కేటాయింపులు రూ.6.81 లక్షల కోట్లుగా


ఉన్నాయి. తాజాగా పెంపునకు పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఆమోదం లభించే అవకాశాలున్నాయి. దాంతో డిఫెన్స్‌కు కేటాయించిన నిధులు రూ.7 లక్షల కోట్లు దాటుతాయని ఆ వర్గాలు తెలిపాయి. చైనా, పాకిస్థాన్‌


నుంచి భద్రతా సవాళ్లు ఎదురవుతున్న నేపథ్యంలో రక్షణరంగాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ ఆర్థిక సంవత్సరానికి కేంద్రం బడ్జెట్‌లో కేటాయింపులను ప్రభుత్వం పెంచిన సంగతి తెలిసిందే. ఈ పద్దు కింద


రూ.6,81,210 కోట్లను ప్రతిపాదించింది. 2024-25 బడ్జెట్‌ కేటాయింపుల (రూ.6.22 లక్షల కోట్లు)తో పోలిస్తే ఇది 9.53 శాతం అధికం. సవరించిన అంచనాల (రూ.6.41 లక్షల కోట్ల)తో పోలిస్తే  6.2 శాతం ఎక్కువ.


తాజా కేటాయింపుల్లో కొత్త ఆయుధ వ్యవస్థల కొనుగోలుకు పెద్దపీట వేశారు. స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో రక్షణ కేటాయింపులు 1.91 శాతంగా ఉన్నాయి. * 18 వరకు కాల్పుల విరమణకు భారత్‌-పాక్‌ అంగీకారం


రూ.50వేల కోట్ల అనుబంధ బడ్జెట్‌లో నిధులను పరిశోధన, ఆయుధాలు, అవసరమైన పరికరాల కొనుగోలుకు ఉపయోగించే అవకాశాలున్నాయి. 2014-15 ఆర్థిక సంవత్సరానికి ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత


ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో డిఫెన్స్‌ కేటాయింపులు రూ.2.29 లక్షల కోట్లుగా ఉన్నాయి. మొత్తం వార్షిక పద్దులో 13 శాతం రక్షణకే కేటాయించారు. ఏప్రిల్‌ 22న జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంకు దగ్గర్లో ఉన్న


ప్రముఖ పర్యాటక ప్రాంతం బైసరన్‌ లోయలో ఉగ్రవాదులు మారణహోమానికి పాల్పడిన సంగతి తెలిసిందే. సైనిక దుస్తుల్లో వచ్చినవారు పర్యాటకులను అతి సమీపం నుంచి కాల్చి చంపారు. ఈ ఘటనలో 26 మంది ప్రాణాలు


కోల్పోయారు. దానికి ప్రతిగా పీఓకే, పాక్‌లోని ఉగ్రస్థావరాలను ఆపరేషన్ సిందూర్ పేరిట భారత్ ధ్వంసం చేసింది. అది జీర్ణించుకోలేని పాక్‌ తర్వాత రెచ్చగొట్టే చర్యలకు పాల్పడటంతో రెండు దేశాల మధ్య


ఉద్రిక్తతలు తారస్థాయికి చేరాయి. అయితే భారత్‌ ధాటిని తట్టుకోలేని పాక్‌ వెనక్కి తగ్గటంతో కాల్పులు విరమణ ఒప్పందం కుదిరింది.


Trending News

Indus water treaty: ఒమర్‌ vs మెహబూబా.. ‘తుల్‌బుల్‌’పై మాటల యుద్ధం

ఇంటర్నెట్‌ డెస్క్‌: సింధూ జలాల ఒప్పందం నిలిపివేత అంశంపై జమ్మూకశ్మీర్‌ రాజకీయాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. తాజాగా దీనికి స...

Talasani srinivas yadav | latest talasani srinivas yadav - eenadu

ఆ పరిశ్రమ తలసాని కుటుంబానిదే.. మంత్రి సీతక్క ఆరోపణ నిర్మల్‌ జిల్లా దిలావర్‌పూర్‌ ఇథనాల్‌ పరిశ్రమ భారాసకు చెందిన మాజీ మంత...

Kaleshwaram overflows with devotion as thousands gather for saraswati pushkaralu

BHUPALPALLY: As the weekend aligned with the tenth day of the sacred Saraswati Pushkaralu, the serene village of Kaleshw...

Chandrababu: మార్కాపురంలో చంద్రబాబు పర్యటన.. మహిళా ర్యాపిడో డ్రైవర్లను అభినందించిన సీఎం

ఏపీ సీఎం చంద్రబాబు ప్రకాశం జిల్లా మార్కాపురంలో పర్యటించారు. అక్కడ నిర్వహించిన మహిళా దినోత్సవంలో పాల్గొన్నారు. మార్కాపురం...

Karthika deepam: దీపను లేపేద్దాం.. మాస్టర్ ప్లాన్ వేసిన పారిజాతం.. అయ్యో వంటలక్క చచ్చిపోతుందా?

CNN18 name, logo and all associated elements ® and © 2017 Cable News Network LP, LLLP. A Time Warner Company. All rights...

Latests News

Defence budget: ఆపరేషన్ సిందూర్‌.. రక్షణ బడ్జెట్‌ రూ. 50వేల కోట్ల పెంపు..

ఇంటర్నెట్‌డెస్క్‌: భారత్‌-పాక్‌ ఉద్రిక్తతల వేళ రక్షణరంగం విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ...

Priyanka chopra boyfriend latest news in hindi, photos, videos on priyanka chopra boyfriend inextlive jagran

प्रियंका चोपड़ा ब्वॉयफ्रेंड निक जोनस संग वकेशन मनाने उड़ चलीं गोवा, परिणीति भी दिखीं साथ, देखें तस्वीरें bollywood-masal...

Boney kapoor acquires remake rights of tamil superhit 'comali'

Mumbai, Sep 20 (IANS) Producer Boney Kapoor, who remade the Amitabh Bachchan-starrer "Pink" in Tamil, has now ...

Ragananthini vethasalam | the malaysian insight

Saturday, 08 Jan 2022 07:00 AM BUSINESSES STILL WEATHERING HEADWINDS TO STAY AFLOAT __ Companies will take awhile to reb...

Ttd: సామాన్య భక్తుడిలా తితిదే ఛైర్మన్‌ పర్యటన.. సౌకర్యాల పట్ల భక్తుల సంతృప్తి

ప్రొటోకాల్‌ పక్కన పెట్టి సామాన్య భక్తుడిలా తితిదే ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు ఆదివారం శ్రీవారి ఆలయం ముందు కలియతిరిగారు. తిరుమ...

Top