Operation sindoor: పాక్‌ ‘చీప్‌’ ట్రిక్కు: కీలక వివరాలు సేకరిస్తున్న భారత్‌..

Eenadu

Operation sindoor: పాక్‌ ‘చీప్‌’ ట్రిక్కు: కీలక వివరాలు సేకరిస్తున్న భారత్‌.."

Play all audios:

Loading...

operation sindoor ఇంటర్నెట్‌డెస్క్‌: ఆపరేషన్‌ సిందూర్‌ (operation sindoor) వేళ  పాకిస్థాన్‌ వందల సంఖ్యలో చిన్న డ్రోన్లను ఉపయోగించింది. వీటిల్లో కొన్ని అత్యంత తక్కువదూరం ప్రయాణించేవే. ఆ


సమయంలో మన భద్రతా దళాలు కొన్నింటిని పేల్చివేయగా.. మరికొన్నింటిని అత్యాధునిక సాంకేతికత వినియోగించి నిర్వీర్యం చేశాయి. తాజాగా వాటి శకలాలను దళాలు సేకరిస్తున్నాయి. వీటిల్లో కొన్ని చెక్కుచెదరలేదు.


వీటిల్లో చాలావరకు మే 7-10వ తేదీల్లో ప్రయోగించినవే. వీటిల్లో వెరీ షార్ట్‌రేంజి కిందకు వచ్చే డ్రోన్లు కూడా ఉన్నాయి. వాటిని స్థానిక ఆపరేషన్లకు మాత్రమే వినియోగించే వీలుంది. తక్కువ రేంజి ఉండటంతో


వీటి విలువ కూడా చౌకగానే ఉంటుంది.  ఈనేపథ్యంలో అధికారులు అసలు వీటిని ఎక్కడినుంచి కొనుగోలు చేశారో తెలుసుకొనే అంశంపై దృష్టిపెట్టారు. డ్రోన్ల విక్రయాలకు సంబంధించి ఈ కామర్స్‌ వేదికలో రికార్డులు


ఉంటాయి. వీటినుంచి కొనుగోలుదారుల వివరాలు సేకరించాలని భావిస్తున్నారు.  భారత్‌ ఆర్మీకి చెందిన ఎయిర్‌ డిఫెన్స్‌ విభాగం చీఫ్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ సుమెర్‌ డి కున్హా స్పందిస్తూ.. పాకిస్థాన్‌ సైనిక


దాడికి 800 నుంచి 1,000 వరకు డ్రోన్లు వాడింది. వీటిల్లో చాలావాటిని ఇండియన్‌ ఎయిర్‌ గన్స్‌, సిస్టమ్స్‌ ధ్వంసం చేశాయి.  మరికొన్ని 10 కిలోల పేలుడు పదార్థాలను మోసుకువచ్చాయి.  వీటిని కూడా


కూల్చివేశాం. ఆర్మీకి వందల సంఖ్యలో వీటి శకలాలు లభ్యం అయ్యాయి. ఆపరేషన్‌ సిందూర్‌ వేళ భారత ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థలను పూర్తిగా ఉక్కిరిబిక్కిరి చేసి వాటి సామర్థ్యాన్ని మించేటట్లు పాక్‌ వందల


కొద్దీ డ్రోన్లను ప్రయోగించింది. వీటిల్లో చాలావరకు చౌకబారువి ఉన్నాయి. కనీసం కెమెరా కూడా లేదు. వీటి మాటున కొన్ని నిఘా, సాయుధ డ్రోన్లను కూడా పంపింది. భారత ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థల లోపాలు,


సైనిక సామగ్రిని మ్యాపింగ్‌ చేయడం దీని ప్రధాన ఉద్దేశం. జమ్మూకశ్మీర్‌లోని బారాముల్లా నుంచి రాజస్థాన్‌లోని బర్మేర్‌ వరకు నాలుగు రోజులపాటు ఈ రకమైన ప్రయత్నాలు చేసింది. కొన్ని డ్రోన్లతో లైట్‌


డిటెక్షన్‌ అండ్‌ రేంజింగ్‌ టెక్నాలజీని కూడా పాక్‌ వాడినట్లు మన సైన్యం చెబుతోంది. 60శాతం డ్రోన్లను ఎయిర్‌ డిఫెన్స్‌ గన్సే కూల్చేశాయి.. భారత్‌ వద్ద అత్యాధునిక ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థ


ఎస్‌-400, ఆకాశ్‌ ఉన్నా.. వాటిని పాక్‌ మిసైల్స్‌ కోసం అధికంగా వాడారు. డ్రోన్ల కూల్చివేతను ఎక్కువగా గన్స్‌తోనే చేపట్టినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆర్మీ ఎయిర్‌ డిఫెన్స్‌ అధిపతి సుమేర్‌ కూడా


ధ్రువీకరించారు. సోవియట్‌ కాలం నాటి ఎల్‌-70, ది జూ, షిల్కా, లైట్‌ మెషిన్‌గన్‌, మీడియం మెషిన్‌ గన్స్‌నే అధికంగా వాడారు.   ఓ ఎత్తుగడ ప్రకారమే రాడర్ల వినియోగం.. రాడార్ల వినియోగంలో ఓ అత్యాధునిక


ఎత్తుగడను భారత్‌ వాడింది. నిరంతరంగా వాటినుంచి సంకేతాలను విడుదల చేయలేదు. గన్స్‌ రేంజిలో డ్రోన్లు ఉంటే.. రాడర్ల స్విచ్చ్‌ఆఫ్‌ చేసినట్లు పేర్కొన్నారు. వారికి మన సైనిక స్థావరాలు, రాడర్ల


ప్రదేశాలు అర్థం కానీయలేదన్నారు.


Trending News

Pratyusha banerjee commits suicide, balika vadhu actress declared dead

* Home * Entertainment * Pratyusha Banerjee commits suicide, Balika Vadhu actress declared dead PRATYUSHA HANGED HERSELF...

సోనియాతో రాజీవ్ గాంధీ: ‘నా దగ్గర వేరే దారి లేదు, నేనెలాగూ చనిపోతా’ - bbc news తెలుగు

సోనియాతో రాజీవ్ గాంధీ: ‘నా దగ్గర వేరే దారి లేదు, నేనెలాగూ చనిపోతా’ కథనం * రచయిత, రేహాన్ ఫజల్ * హోదా, బీబీసీ ప్రతినిధి * ...

కాస్ట్‌లీ కరోనా టెస్టులు!  

సాక్షి, హైదరాబాద్‌: ప్రైవేటు, కార్పొరేట్‌ ఆసుపత్రులు, ల్యాబ్‌ల్లో కరోనా నిర్ధారణ పరీక్షలు చాలా ఖరీదుగా మారాయి. ప్రభుత్వ...

Odisha news | latest odisha news - eenadu

విజిలెన్స్‌ అధికారులకు చిక్కిన ఏఎస్సై, హోంగార్డు ఓ ఇద్దరు అధికారులు లంచం తీసుకుంటూ విజిలెన్స్‌ అధికారులకు చిక్కారు. ఒడిశ...

Khammam news | latest khammam news - eenadu

సిద్దిపేట, ఖమ్మంలో ఆయిల్‌పామ్‌ శుద్ధి పాంట్లు: మంత్రి తుమ్మల తెలంగాణలోని సిద్దిపేట, ఖమ్మంలో త్వరలో ఆయిల్‌పామ్‌ శుద్ధి ప్...

Latests News

Operation sindoor: పాక్‌ ‘చీప్‌’ ట్రిక్కు: కీలక వివరాలు సేకరిస్తున్న భారత్‌..

operation sindoor ఇంటర్నెట్‌డెస్క్‌: ఆపరేషన్‌ సిందూర్‌ (operation sindoor) వేళ  పాకిస్థాన్‌ వందల సంఖ్యలో చిన్న డ్రోన్లను...

Operation sindoor: 36 ప్రాంతాల్లో 400 డ్రోన్లతో పాక్‌ దుశ్చర్య - భారత్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత్‌లోని సరిహద్దు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని గురువారం రాత్రి పాకిస్థాన్‌ (Pakistan) డ్రోన్‌ దాడ...

Lsg vs rcb: రిషభ్ పంత్ సెంచరీ.. బెంగళూరు లక్ష్యం 228

లఖ్‌నవూ: ఐపీఎల్ (IPL) 2025లో నేటితో లీగ్ దశ ముగియనుంది. లీగ్ స్టేజ్‌లో చివరి మ్యాచ్‌లో లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌, రాయల్ ...

Operation sindoor: మమ్మల్ని సంప్రదించకుండానే అఖిలపక్షంలో యూసఫ్‌ పఠాన్‌ పేరు: తృణమూల్

పాకిస్థాన్‌ తీరును ఎండగట్టేందుకు భారత్‌ తరఫున విదేశాలకు వెళ్తున్న దౌత్యబృందం నుంచి తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ యూసఫ్‌ పఠాన్...

Ravindra jadeja: ధోనీ మూడ్‌ సరిగా లేనప్పుడు అతడితో మాట్లాడటానికి ఇప్పటికీ సంకోచిస్తా: రవీంద్ర జడేజా

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత మాజీ దిగ్గజ క్రికెటర్‌ ధోనీని (MS Dhoni) తాను మొదటిసారి కలిసినప్పటి సంఘటనను టీమ్‌ఇండియా ఆల్‌ రౌ...

Top