Ashwini vaishnaw: మరో సెమీ కండక్టర్‌ యూనిట్‌ ఏర్పాటుకు కేంద్ర క్యాబినెట్‌ ఆమోదం

Eenadu

Ashwini vaishnaw: మరో సెమీ కండక్టర్‌ యూనిట్‌ ఏర్పాటుకు కేంద్ర క్యాబినెట్‌ ఆమోదం"

Play all audios:

Loading...

ఉత్తరప్రదేశ్‌లోని జెవార్‌లో ఆరో సెమీ కండక్టర్‌ యూనిట్‌ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఇంటర్నెట్‌ డెస్క్‌: సెమీ కండక్టర్ల (semiconductor) విషయంలో దేశం స్వావలంబన సాధించే


దిశగా కేంద్రం మందడుగు వేసింది. మరో సెమీ కండక్టర్‌ యూనిట్‌ ఏర్పాటుకు కేంద్ర క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది. రూ.3,707 కోట్ల పెట్టుబడితో ఉత్తరప్రదేశ్‌లోని జెవార్‌లో ఆరో యూనిట్‌ ఏర్పాటుకు గ్రీన్‌


సిగ్నల్‌ ఇచ్చింది. ఎలక్ట్రానిక్స్‌ ఉత్పత్తి రంగంలో ప్రపంచ ప్రసిద్ధి గాంచిన ‘హోన్‌ హాయ్‌ టెక్నాలజీ’ గ్రూప్‌నకు చెందిన ‘ఫాక్స్‌కాన్‌’ (Foxconn).. హెచ్‌సీఎల్‌ సంయుక్తంగా ఈ సెమీకండక్టర్


ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తున్నాయని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ తెలిపారు. ఇది మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ఆటోమొబైల్స్ ఇతర పరికరాల కోసం డిస్‌ప్లే  డ్రైవర్ చిప్‌లను తయారు చేస్తుందని


పేర్కొన్నారు. సెమీ కండక్టర్ల రంగాన్ని మరింత ప్రోత్సహించే క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అశ్వినీ వైష్ణవ్‌ తెలిపారు.ఈ సెమీకండక్టర్ యూనిట్‌ నిర్మాణంతో దాదాపు 2వేల మందికి ఉపాధి లభిస్తుందని


అన్నారు. సెమీ కండక్టర్‌ యూనిట్లలో నెలకు 3.6 కోట్ల చిప్‌లను ఉత్పత్తి చేస్తామని పేర్కొన్నారు. కండక్టర్లకు వాడే పరికరాలు కూడా భారత్‌లో తయారు చేయడానికి కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం


దాదాపు 60 శాతం సెమీకండక్టర్ల పరికరాలను అమెరికా కంపెనీలే ఉత్పత్తి చేస్తున్నట్లు తెలిపారు. ఈ సాంకేతికతపై దాదాపు 70 స్టార్టప్‌లు పని చేస్తున్నాయని అశ్వినీ వైష్ణవ్‌ వెల్లడించారు. కొత్త విద్యా


విధానం ద్వారా అకడమిక్‌ విద్య, పరిశ్రమల అనుసంధానానికి అవకాశాలు ఉన్నాయన్నారు. పరిశ్రమల అవసరాల మేరకు విద్యార్థులు సన్నద్ధం అవుతున్నారని పేర్కొన్నారు. ఇందులో భాగంగా 270 విద్యా సంస్థల్లో


విద్యార్థులకు సెమీ కండక్టర్ల సాంకేతికతపై శిక్షణనిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు రూపొందించిన చిప్‌లను మొహాలీలో ఉత్పత్తి చేశారని..వాటి తయారీలో గణనీయమైన మార్పులు వచ్చినట్లు పేర్కొన్నారు.


టెలికాం విభాగం కోసం యూనివర్సిటీలో 5జీ ల్యాబ్‌లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రస్తుతం యూనివర్సిటీల్లో ఇన్‌క్యుబేటర్ల ఏర్పాటు జరుగుతోందని అన్నారు.


Trending News

Isi: పాక్‌ నిఘా సంస్థ కోసం పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగి అరెస్ట్‌..

ISI ఇంటర్నెట్‌డెస్క్‌: భారత్‌లో విస్తరించిన పాకిస్థాన్‌ నిఘా సంస్థ వేళ్లు తవ్వేకొద్దీ బయటకు వస్తున్నాయి. తాజాగా రాజస్థాన...

China: విద్యార్థుల వీసాలు నిలిపివేసిన అమెరికా.. స్పందించిన చైనా

విదేశీ విద్యార్థుల వీసాలకు నిర్వహించే ఇంటర్వ్యూలను అమెరికా తాత్కాలికంగా నిలిపివేయడంపై తాజాగా చైనా స్పందించింది.  ఇంటర్నె...

Crime news: సైబర్‌ నేరగాళ్లకు బ్యాంకు ఖాతాలు సమకూరుస్తున్న ఇద్దరి అరెస్టు

హైదరాబాద్‌: సైబర్‌ నేరగాళ్లకు బ్యాంకు ఖాతాలు సమకూరుస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు (Crime News). దిల్లీకి చెంది...

Bcci: ఆస్ట్రేలియా vs ఇండియా.. మహిళల జట్టు వన్డే సిరీస్‌ షెడ్యూలు విడుదల

స్వదేశంలో భారత మహిళల జట్టుకు, ఆస్ట్రేలియా ఉమెన్స్‌ టీమ్‌తో మూడు వన్డే మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ సిరీస్‌కు సంబంధించిన షెడ్...

Game changer: ‘గేమ్‌ఛేంజర్‌’.. మొత్తం ఏడున్నర గంటలు: ఎడిటర్‌ కీలక వ్యాఖ్యలు

రామ్‌చరణ్‌ (Ram Charan) హీరోగా శంకర్‌ (Shankar) దర్శకత్వం వహించిన చిత్రం ‘గేమ్‌ ఛేంజర్‌’ (Game Changer). ఈ చిత్రాన్ని ఉద...

Latests News

Ashwini vaishnaw: మరో సెమీ కండక్టర్‌ యూనిట్‌ ఏర్పాటుకు కేంద్ర క్యాబినెట్‌ ఆమోదం

ఉత్తరప్రదేశ్‌లోని జెవార్‌లో ఆరో సెమీ కండక్టర్‌ యూనిట్‌ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఇంటర్నెట్‌ ...

South west monsoon: నాలుగైదు రోజుల్లో కేరళకు నైరుతి రుతుపవనాలు: ఐఎండీ

ఇంటర్నెట్‌ డెస్క్‌: నైరుతి రుతుపవనాలు మరో నాలుగైదు రోజుల్లో కేరళను తాకనున్నాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడించింద...

Zodiac signs: డిసెంబర్ నాటికి ఈ 5 రాశులవారు ధనవంతులవ్వడం ఖాయమట.. మీ రాశి కూడా ఉందా?

కుంభ రాశి.. ఈ ఏడాది కుంభరాశివారికి మంచి ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. ఎందుకంటే మార్చిలో అంగారకుడు, శుక్రుడు, బుధుడు, శని ...

Mission swacchata aur paani: "స్వచ్ఛతా కి పాఠశాల"ను దేశమంతటా అనుకరించాలి

మరుగుదొడ్ల లభ్యత సమస్యగా ఉండదు. అయినప్పటికీ, పరిశుభ్రత ఇప్పటికీ సమస్యగా ఉంది. మరుగుదొడ్డిని కనుగొనడం వల్ల వచ్చే నిరాశను ...

Operation sindoor: మన సైనికులు రాత్రి ఒక చరిత్ర సృష్టించారు: రాజ్‌నాథ్‌ సింగ్

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘ఆపరేషన్ సిందూర్’ ద్వారా పాకిస్థాన్‌కు గట్టి జవాబిచ్చామని కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ పేర్కొన...

Top