Operation sindoor: మన సైనికులు రాత్రి ఒక చరిత్ర సృష్టించారు: రాజ్‌నాథ్‌ సింగ్

Eenadu

Operation sindoor: మన సైనికులు రాత్రి ఒక చరిత్ర సృష్టించారు: రాజ్‌నాథ్‌ సింగ్"

Play all audios:

Loading...

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘ఆపరేషన్ సిందూర్’ ద్వారా పాకిస్థాన్‌కు గట్టి జవాబిచ్చామని కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ పేర్కొన్నారు. రాత్రికిరాత్రి మన సైనికులు చరిత్ర సృష్టించారని కొనియాడారు.


అలాగే సైనికులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చిన ప్రధాని మోదీకి ధన్యవాదాలు చెప్పారు. ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాలలో బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్‌కు చెందిన ప్రాజెక్టులను ప్రారంభించిన


సందర్భంగా మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. దేశవ్యాప్తంగా మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కట్టుబడి ఉన్నామని చెప్పారు (Operation Sindoor). ‘‘మన సైనికులు రాత్రి అద్భుత పరాక్రమం ప్రదర్శించారు.


ఉగ్రవాద శిబిరాలపై సాహసోపేతమైన దాడులు చేసి సత్తా చాటారు. ఈ క్రమంలో సాధారణ పౌరులకు ఎలాంటి ఇబ్బంది కలిగించలేదు. ఉగ్ర శిబిరాలనే లక్ష్యంగా చేసుకున్నారు. పహల్గాంలో అమాయకపౌరులను చంపిన వారినే


మట్టుపెట్టాం. దేశ భద్రతకు భంగం కలిగించే చర్యలను సహించం. భారత్‌ లక్ష్యం పాక్‌ కాదు.. ఉగ్రవాదులు. ధైర్యసాహసాలు ప్రదర్శించిన మన సైనికులు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక సరిహద్దు రాష్ట్రాల


విషయంలో పూర్తి అప్రమత్తతతో ఉన్నాం’’ అని మంత్రి వెల్లడించారు. పహల్గాం ఉగ్రదాడి (Pahalgam Terror Attack)తో భారత్‌, పాక్‌ల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్న వేళ మనదేశం ప్రతీకార


చర్యలు చేపట్టింది. భారత్‌పై సీమాంతర ఉగ్రదాడులకు కుట్రపన్నినట్లు భావిస్తున్న మొత్తం తొమ్మిది స్థావరాలపై ఆర్మీ దాడులు చేపట్టింది. పూర్తి కచ్చితత్వంతో దాడులు చేసినట్లు పేర్కొంది. ఉద్రిక్త


పరిస్థితులకు తావులేకుండా.. పాక్‌ సైనిక సదుపాయాలపై ఎక్కడా దాడులు చేపట్టలేదని భారత ప్రభుత్వం పేర్కొంది. ఆపరేషన్‌ సిందూర్‌పై పలువురు కేంద్ర మంత్రులు, ప్రముఖులు సోషల్‌ మీడియా వేదికగా


స్పందించారు. ‘ఆపరేషన్‌ సిందూర్‌’ అనంతరం ‘భారత్‌ మాతా కీ జై’ పేరుతో పోస్టులు పెట్టారు.


Trending News

20 వరకు కట్టుదిట్టంగా లాక్‌డౌన్‌

సాక్షి, హైదరాబాద్‌ : కరోనా వ్యాప్తి నివారణ కోసం రాష్ట్రంలో లాక్‌డౌన్‌ బాగా అమలవుతోందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పే...

నేత కార్మికులకు అండగా సీఎం జగన్‌

'ధనవంతులవ్వడం చాలా సులభం': రాబర్ట్ కియోసాకి ఆర్ధిక సంక్షోభం, మార్కెట్ క్రాష్ గురించి చెప్పిన రిచ్ డాడ్ పూర్ డా...

Ap eapcet 2025: ఏపీ ఈఏపీసెట్‌ రాస్తున్నారా? మీ సందేహాలకు సమాధానాలివిగో

AP EAPCET 2025: ఏపీ ఈఏపీసెట్‌ పరీక్ష రాసే విద్యార్థుల సందేహాలు.. వాటికి సమాధానాలేంటో చూద్దాం..! By Features Desk Publish...

Sangameswara temple: అమృత గుండం.. ఒక్కసారి స్నానం చేస్తే చాలు..

Reported by: Published by: Last Updated:August 18, 2024 1:11 PM IST ఈ ఆలయం పూర్వం నాటి పాలకులు కుబేర భూపాల్ అనే రాజు నిర...

నాలుగేళ్ల ప్రేమ విషాదాంతం

శిరీష, వెంకటేష్‌ _నాలుగేళ్ల వాళ్ల ప్రేమ విషాదంతో ముగిసింది. కొద్ది రోజుల్లో పెళ్లి చేస్తామని పెద్ద వాళ్లు చెప్పినా ఇంతలో...

Latests News

Operation sindoor: మన సైనికులు రాత్రి ఒక చరిత్ర సృష్టించారు: రాజ్‌నాథ్‌ సింగ్

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘ఆపరేషన్ సిందూర్’ ద్వారా పాకిస్థాన్‌కు గట్టి జవాబిచ్చామని కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ పేర్కొన...

duduku | TechCrunch

SAVE NOW THROUGH JUNE 4 FOR TECHCRUNCH SESSIONS: AI SAVE $300 ON YOUR TICKET TO TC SESSIONS: AI—AND GET 50% OFF A SECOND...

Stories | short stories with moral | nithi kathalu - eenadu

కస్తూరీ పరిమళం ‘‘నీకు మైనుద్దీన్‌ అని ఎవరు పేరు పెట్టారోగానీ, ఎక్కడైనా మైనంలా అతుక్కుపోతూ ఉంటావు. ప్రాణస్నేహితుడు పల్లె ...

India- pakistan: పాక్‌ను నమ్మలేం.. ఇళ్లకు వెళ్లలేం.. : సరిహద్దు గ్రామాల ప్రజలు

(ప్రతీకాత్మక చిత్రం) ఇంటర్నెట్‌డెస్క్‌: ఆపరేషన్ సిందూర్‌ తర్వాత పాకిస్థాన్‌ రెచ్చగొట్టే చర్యలకు పాల్పడటంతో జమ్మూకశ్మీర్‌...

Earthquake: తుర్కియేలో భూకంపం.. పరుగులు పెట్టిన జనం

ఇంటర్నెట్‌ డెస్క్‌: తుర్కియేలో భూకంపం సంభవించింది. కొన్యా ప్రావిన్సులోని కులు జిల్లా కేంద్రానికి 14 కి.మీ దూరంలో భూమి కం...

Top