Vikram misri: కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాక్ ఉల్లంఘించడం అత్యంత దుర్మార్గం: విక్రమ్ మిస్రీ
Vikram misri: కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాక్ ఉల్లంఘించడం అత్యంత దుర్మార్గం: విక్రమ్ మిస్రీ"
Play all audios:
సరిహద్దుల్లో పాకిస్థాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని భారత విదేశాంగశాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ తెలిపారు దిల్లీ: సరిహద్దుల్లో పాకిస్థాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని
ఉల్లంఘించిందని భారత విదేశాంగశాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ (Vikram Misri) తెలిపారు. శనివారం రాత్రి దిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. కాల్పుల విరమణ అవగాహనను పాక్ ఉల్లంఘించడం సరికాదన్నారు.
డీజీఎంవో మధ్య జరిగిన అవగాహనను ఉల్లంఘించడాన్ని ఖండిస్తున్నట్టు చెప్పారు. కొన్ని గంటలుగా పాక్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోందని, ఇది అత్యంత దుర్మార్గమని ఘాటుగా స్పందించారు. కాల్పుల
ఉల్లంఘనకు సంపూర్ణ బాధ్యత పాక్దేనని స్పష్టం చేశారు. సరిహద్దుల్లో పాక్ ఉల్లంఘనలకు సైన్యం తగిన విధంగా జవాబిస్తుందన్నారు. పాక్ అతిక్రమణను నిలువరించేందుకు సైన్యానికి సంపూర్ణ అధికారాలు ఇచ్చామని
తెలిపారు. ఇప్పటికైనా ఈ ఉల్లంఘనలను పాకిస్థాన్ నిలువరిస్తుందని ఆశిస్తున్నట్టు విక్రమ్ మిస్రీ చెప్పారు. ‘‘మధ్యాహ్నం 3.35 గంటలకు ఇరుదేశాల డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలటరీ ఆపరేషన్స్ (DGMO)
స్థాయిలో ఇరుదేశాల మధ్య చర్చలు జరిగాయి. పాకిస్థాన్ డీజీఎంఓ భారత డీజీఎంవోకు ఫోన్ చేశారు. కాల్పుల విరమణకు ఇరు దేశాల సైనికాధికారులు అంగీకరించారు. సాయంత్రం 5గంటల నుంచి ఇది అమల్లోకి వచ్చింది.
భూ, గగన, సముద్రతలాల నుంచి ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ కొనసాగుతుంది. వీటికి సంబంధించి ఇరుదేశాల సైన్యానికి తగిన ఆదేశాలు వెళ్లాయి. ఈ నెల 12న సాయంత్రం డీజీఎంవోలు మళ్లీ చర్చలు జరుపుతారు’’ అని
విదేశాంగ శాఖ ప్రకటించింది. ఆ తర్వాత కొన్ని గంటలకే పాక్ నుంచి డ్రోన్లు భారత భూ భాగంలోకి దూసుకొచ్చాయి. ఎక్కడికక్కడ డ్రోన్లను సైన్యం నిర్వీర్యం చేస్తోంది. శ్రీనగర్లోని 25 కార్ప్స్ ప్రధాన
కార్యాలయం వద్ద కనిపించిన అన్ని డ్రోన్లను నిర్వీర్యం చేసినట్టు సైనిక వర్గాలు తెలిపాయి. మరో వైపు శ్రీనగర్లో కాల్పుల శబ్దాలు వినిపిస్తున్నాయని సీఎం ఒమర్ అబ్దుల్లా ట్వీట్ చేశారు.
Trending News
Nda meet: ఎన్డీయే పాలిత రాష్ట్రాల సీఎంలు, డిప్యూటీ సీఎంలతో ప్రధాని భేటీదిల్లీ: ఎన్డీయే (NDA) పాలిత రాష్ట్రాల సీఎంలు, డిప్యూటీ సీఎంలతో ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) దిల్లీలో సమావేశమయ...
కరోనా సెకండ్ వేవ్ వస్తోందిబుధవారం కలెక్టర్లు, జేసీలు, ఎస్పీలతో సీఎం వీడియో కాన్ఫరెన్స్ సాక్షి, అమరావతి: కోవిడ్ సెకండ్ వేవ్ వస్తోందని, ఇప్పటికే...
‘సున్నా వడ్డీ’తో మా కుటుంబాల్లో వెలుగుసాక్షి, అమరావతి: సున్నా వడ్డీ పథకం ద్వారా మా కుటుంబాల్లో వెలుగులు నింపారని పొదుపు సంఘాల మహిళలు సీఎం వైఎస్ జగన్మోహన్రె...
duduku | TechCrunchSAVE NOW THROUGH JUNE 4 FOR TECHCRUNCH SESSIONS: AI SAVE $300 ON YOUR TICKET TO TC SESSIONS: AI—AND GET 50% OFF A SECOND...
అయోధ్య రాముడి బ్యాంక్ బ్యాలెన్స్ తెలిస్తే షాక్ అవుతారు.. ఆలయానికి 900 కోట్లు ఖర్చు.. ఎంత మిగిలిందంటే..?CNN18 name, logo and all associated elements ® and © 2017 Cable News Network LP, LLLP. A Time Warner Company. All rights...
Latests News
Vikram misri: కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాక్ ఉల్లంఘించడం అత్యంత దుర్మార్గం: విక్రమ్ మిస్రీసరిహద్దుల్లో పాకిస్థాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని భారత విదేశాంగశాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ తెలిపారు ద...
Rare surgery: మహిళకు అరుదైన ఆపరేషన్ చేసిన ఢిల్లీ వైద్యులు.. 30 ఏళ్ల తరువాత పూర్తిగా నోరు తెరిచిన బాధితురాలుLast Updated:March 31, 2021 5:25 PM IST ఆ యువతికి దవడ ఎముక జాయింట్లు పుర్రె ఎముకలోకి చొచ్చుకొని ఉన్నాయి. దీంతో ఆమె నోరు ...
Brain dead: హార్ట్బీట్ చట్టం.. గర్భిణి బ్రెయిన్ డెడ్ అయినా పిండాన్ని బతికించేందుకు వైద్యంఇంటర్నెట్డెస్క్: గర్భం దాల్చిన ఓ యువతి అనారోగ్యం కారణంగా బ్రెయిన్డెడ్కు గురైంది. కానీ కడుపులో పిండాన్ని బతికించేందుక...
President Droupadi MurmuSays Ladakh has tremendous potential for the development of spiritual, adventure, and eco-tourism. View More Era of peac...
Palamu news in hindi: palamu latest news,palamu news paper - dainik jagran'ट्रंप के कहने पर पीएम मोदी ने किया सरेंडर', सीजफायर को लेकर राहुल गांधी के बयान पर मचा सियासी घमासान politics...