Operation sindoor: ఎస్‌-400పై ఫేక్‌ న్యూస్‌ ప్రచారంలో పాక్‌కు చైనా తోడు..

Eenadu

Operation sindoor: ఎస్‌-400పై ఫేక్‌ న్యూస్‌ ప్రచారంలో పాక్‌కు చైనా తోడు.."

Play all audios:

Loading...

operation sindoor | ఇంటర్నెట్‌డెస్క్‌: పాకిస్థాన్‌ తప్పుడు వార్తల ప్రచారాన్ని తీవ్రతరం చేసింది. ఇప్పుడు దాని ఐరన్‌ బ్రదర్‌ చైనాతో చేతులు కలిపింది. పాక్‌ వండివార్చి ఆన్‌లైన్‌లోని వదిలే


తప్పుడు కథనాలను చైనా, అజర్‌బైజన్‌ మీడియా సంస్థలు ప్రచారంలోకి తెస్తున్నాయి. తాజాగా దీనికి సంబంధించిన ఓ ఘటన వెలుగు చూసింది.  భారత్‌ అమ్ముల పొదిలో అత్యంత శక్తిమంతమైన గగనతల రక్షణ వ్యవస్థ


ఎస్‌-400. రాడార్‌ రేంజి దాదాపు 600 కిలోమీటర్ల వరకు ఉంటుందని చెబుతారు. అంతటి శక్తిమంతమైన క్షిపణి రక్షణ వ్యవస్థను పాక్‌కు చెందిన జేఎఫ్‌-17 యుద్ధ విమానం ఓ క్షిపణితో కూల్చేసిందని పాక్‌ ప్రభుత్వ


రంగ మీడియా సంస్థ పీటీవీ పేర్కొంది. ఈ దాడి పంజాబ్‌లోని ఆదంపుర్‌ వద్ద జరిగినట్లు వెల్లడించింది. వెంటనే ఈ వార్తలను చైనా ప్రభుత్వరంగానికి చెందిన మీడియా సంస్థ షినువా ప్రచారంలోకి తెచ్చింది. దీనిని


గ్లోబల్‌ టైమ్స్‌ అందుకొంది. మరోవైపు అజర్‌ బైజన్‌కు చెందిన మరో సంస్థ కూడా ఈ వార్తను హడావుడిగా ఆన్‌లైన్‌లో పెట్టింది.  ఈ ఆన్‌లైన్‌ విష ప్రచారంపై వెంటనే భారత మిలిటరీ విభాగం స్పందించింది.


హైపర్‌ సోనిక్‌ క్షిపణితో ఎస్‌-400ను ధ్వంసం చేసినట్లు పాక్‌ చేస్తున్న ప్రచారం తప్పు అని భారత సైనికాధికారులు పీటీకి వెల్లడించారు. ఎస్‌-400 ట్రయాంఫ్‌ గగనతల రక్షణ వ్యవస్థ. నాటో దేశాల నుంచి


వైమానిక దాడులను అడ్డుకొనేందుకు రష్యా దీనిని వాడుతోంది. ప్రపంచంలో ఇప్పటివరకు రష్యా, చైనా, టర్కీలు వీటిని వినియోగిస్తున్నాయి. విభిన్నమైన రాడార్లు, క్షిపణులు సమన్వయంతో పనిచేసి ప్రత్యర్థుల


ఫైటర్‌ జెట్స్‌, రాకెట్లు, మానవరహిత విమానాలను కూల్చేసే ఒక వ్యవస్థ ఇది. ఒక్క ముక్కలో చెప్పాలంటే వివిధరకాల ఆయుధాలను సమ్మిళితం చేసిన ఓ ప్యాకేజ్ అన్నమాట‌. దీనిని 2007లో రష్యా సైన్యంలోకి


ప్రవేశపెట్టింది. అదే ఏడాది జులైలో ఆకాశంలో సెకన్‌కు 2,800 మీటర్ల వేగంతో వస్తున్న రెండు లక్ష్యాలను 16 కిలోమీటర్ల ఎత్తున ఎస్‌-400 ఛేదించినట్లు రష్యా పేర్కొంది.


Trending News

Vastu: అప్పులు, ఆర్థిక కష్టాలు తీరాలంటే, ఇంట్లో 7 మార్పులు చెయ్యండి

గ్లాస్ విండో: మీకు అప్పుల బాధ తీరిపోవాలంటే, ఈశాన్యం దిక్కులో ఓ గ్లాస్ కిటికీని అమర్చండి. మీ ఇల్లు, షాప్ ఏదైనా సరే, ఈశ్యా...

నగరంలో ట్రాఫిక్‌ ఆంక్షలు

సాక్షి, సిటీబ్యూరో: మొహర్రం ఊరేగింపు నేపథ్యంలో మంగళవారం పాతబస్తీ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఎలాంటి అవ...

Pm narendra modi inaugurates 'maitri setu' between india and bangladesh - key points

Bangladesh Prime Minister Sheikh Hasina also virtually addressed the function organised to inaugurate the double lane Fe...

Shreyas iyer: శ్రేయస్‌ తన జట్టు సభ్యుల్లో గెలవాలన్న కోరికను రగిలిస్తాడు: సురేశ్ రైనా

పంజాబ్‌ కింగ్స్‌ కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ తన జట్టు సభ్యుల్లో సానుకూలత, గెలవాలన్న కోరికను రగిలిస్తాడంటున్న టీమ్‌ఇండియా ...

Revanth reddy: ఆ నలుగురికి నేను నచ్చను.. సంచలనంగా మారిన రేవంత్ రెడ్డి కామెంట్స్

Published by: Last Updated:November 27, 2022 4:07 PM IST ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ (TELANGANA CONGRESS) క్లిష్ట పరిస్థ...

Latests News

Operation sindoor: ఎస్‌-400పై ఫేక్‌ న్యూస్‌ ప్రచారంలో పాక్‌కు చైనా తోడు..

operation sindoor | ఇంటర్నెట్‌డెస్క్‌: పాకిస్థాన్‌ తప్పుడు వార్తల ప్రచారాన్ని తీవ్రతరం చేసింది. ఇప్పుడు దాని ఐరన్‌ బ్రదర...

Mahalakshmi-ravindar:డిఫరెంట్ లుక్ లో మహాలక్ష్మి - రవీందర్.. విషయం ఏంటో తెలుసా?

మహాలక్ష్మి వ్యాఖ్యాతగానే కాకుండా నటిగా కూడా పాపులర్. రవీందర్ చంద్రశేఖర్ నిర్మించిన ‘విద్యుం వారై కతిరు’ సినిమాలో కూడా మహ...

Pawan kalyan: చివరి ఉగ్రవాదిని అంతం చేసేవరకు మోదీ పోరాటం ఆగదు: పవన్‌కల్యాణ్‌

పాకిస్థాన్‌లోని ఉగ్ర స్థావరాలపై భారత్‌ చేసిన దాడులు గర్వించదగ్గ విషయమని ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ అన్నారు. హైదరాబ...

Bengaluru: బెంగళూరులో దారుణం.. సూట్‌కేస్‌లో మహిళ మృతదేహం

బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరు (Bengaluru) సమీపంలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. సూట్‌కేస్‌లో ఒక మహిళ మృతదేహం లభ్యం...

Cyber crime: గుజరాత్‌లో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆపరేషన్‌

సైబర్‌ నేరగాళ్లను పట్టుకునేందుకు తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు గుజరాత్‌లో ఆపరేషన్‌ చేపట్టారు. పలు కేసుల్లో న...

Top