Shreyas iyer: శ్రేయస్‌ తన జట్టు సభ్యుల్లో గెలవాలన్న కోరికను రగిలిస్తాడు: సురేశ్ రైనా

Eenadu

Shreyas iyer: శ్రేయస్‌ తన జట్టు సభ్యుల్లో గెలవాలన్న కోరికను రగిలిస్తాడు: సురేశ్ రైనా"

Play all audios:

Loading...

పంజాబ్‌ కింగ్స్‌ కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ తన జట్టు సభ్యుల్లో సానుకూలత, గెలవాలన్న కోరికను రగిలిస్తాడంటున్న టీమ్‌ఇండియా మాజీ బ్యాటర్‌ సురేశ్‌ రైనా. ఇంటర్నెట్‌ డెస్క్‌: పంజాబ్‌ కింగ్స్‌


(Punjab Kings) కెప్టెన్‌గా శ్రేయస్‌ అయ్యర్‌ (Shreyas Iyer) జట్టును చక్కగా ముందుకు నడిపిస్తున్నాడని టీమ్‌ఇండియా (Team India) మాజీ క్రికెటర్‌ సురేశ్‌ రైనా (Suresh Raina) అంటున్నాడు. గత ఐపీఎల్‌


సీజన్‌లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ను(Kolkata Knight Riders) విజేతగా నిలిపిన శ్రేయస్‌.. ఈసారి పంజాబ్‌కు సారథ్య బాధ్యతలు వహిస్తున్నాడు. ఐపీఎల్‌ (IPL) మెగా వేలంలో పంజాబ్‌ కింగ్స్‌ ఫ్రాంఛైజీ


ఏకంగా 26.75 కోట్లు వెచ్చించి శ్రేయస్‌ను సొంతం చేసుకుంది. దీనికి న్యాయం చేస్తూ.. ఇప్పటివరకు తాను ఆడిన 11 మ్యాచుల్లో 50.63 సగటుతో 405 పరుగులు చేశాడు పంజాబ్‌ సారథి. ఇందులో నాలుగు అర్ధసెంచరీలు


ఉన్నాయి. ‘శ్రేయస్‌ అయ్యర్‌.. డ్రెస్సింగ్‌ రూంలో చక్కటి వాతావరణం ఉండేలా చూస్తున్నాడు. జట్టు సభ్యుల్లో సానుకూలతను, గెలవాలన్న కోరికను రగిలిస్తున్నాడు. కోచ్‌గా రికీపాంటింగ్‌ (Ricky Ponting) కూడా


చక్కటి సేవలు అందిస్తున్నాడు. పంజాబ్‌ జట్టుకు ప్రభుసిమ్రన్‌ సింగ్‌, ప్రియాంశ్‌ ఆర్య చక్కటి ఆరంభాన్ని ఇస్తున్నారు. తర్వాత దాన్ని శ్రేయస్‌ అయ్యర్‌ కొనసాగిస్తున్నాడు.’ అని రైనా అన్నాడు. అలాగే


పంజాబ్‌ కింగ్స్‌ జట్టును వెంటాడుతున్న దురదృష్టాన్ని గురించి కూడా సురేశ్‌ రైనా మాట్లాడాడు. ‘ఈడెన్‌ గార్డెన్స్‌లో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌ 200 పైచిలుకు పరుగులు చేసింది. కానీ వర్షం


వల్ల ఆ మ్యాచ్ రద్దైంది. అలాగే ధర్మశాలలో 10.1 ఓవర్లకు ఒక వికెట్‌ నష్టానికి 124 పరుగులు చేసి పటిష్ట స్థితిలో ఉంది. భారత్‌, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఈ దశలో ఆ మ్యాచ్‌ కూడా


అర్ధంతరంగా రద్దైంది. ఇలా ఈ సీజన్‌లో పంజాబ్‌ కింగ్స్‌కు కాస్త అదృష్టం కలిసిరావడం లేదని’ రైనా తన అభిప్రాయం వ్యక్తంచేశాడు. 


Trending News

Vastu: అప్పులు, ఆర్థిక కష్టాలు తీరాలంటే, ఇంట్లో 7 మార్పులు చెయ్యండి

గ్లాస్ విండో: మీకు అప్పుల బాధ తీరిపోవాలంటే, ఈశాన్యం దిక్కులో ఓ గ్లాస్ కిటికీని అమర్చండి. మీ ఇల్లు, షాప్ ఏదైనా సరే, ఈశ్యా...

నగరంలో ట్రాఫిక్‌ ఆంక్షలు

సాక్షి, సిటీబ్యూరో: మొహర్రం ఊరేగింపు నేపథ్యంలో మంగళవారం పాతబస్తీ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఎలాంటి అవ...

Panchangam today: నేటి పంచాంగం. రోహిణీ కార్తె ప్రారంభం

నేడు 2024 శనివారం, మే 25, స్వస్తిశ్రీ చంద్రమాన క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత రుతువు, వైశాఖ మాసం, బహుళపక్షం. నేడు ...

Maoists: 20 మంది మావోయిస్టుల మృతి.. కుటుంబ సభ్యులకు అప్పగింత

మే 7న జరిగిన ఎదురుకాల్పుల్లో మృతిచెందిన 20 మంది మావోయిస్టుల మృతదేహాలను పోలీసులు గుర్తిస్తున్నారు. 11 మృతదేహాలను కుటుంబ స...

Heena sidhu and jitu rai bag gold at shooting world cup

New Delhi is playing host to the ISSF shooting World Cup and after Pooja Ghatkar picked up the bronze in the 10m air rif...

Latests News

Shreyas iyer: శ్రేయస్‌ తన జట్టు సభ్యుల్లో గెలవాలన్న కోరికను రగిలిస్తాడు: సురేశ్ రైనా

పంజాబ్‌ కింగ్స్‌ కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ తన జట్టు సభ్యుల్లో సానుకూలత, గెలవాలన్న కోరికను రగిలిస్తాడంటున్న టీమ్‌ఇండియా ...

Operation sindoor: సినిమా అప్పుడే అయిపోలేదు.. ఆర్మీ మాజీ చీఫ్‌ల కీలక వ్యాఖ్యలు

ఆపరేషన్‌ సిందూర్‌తో ఉగ్ర శిబిరాలపై భారత్‌ దాడి చేసిన నేపథ్యంలో ఆర్మీ మాజీ చీఫ్‌ మనోజ్‌ నరవణే సోషల్‌ మీడియాలో చేసిన పోస్ట...

Gali janardhan reddy: జైల్లో అదనపు సౌకర్యాలు కల్పించాలి: సీబీఐ కోర్టులో గాలి జనార్దనరెడ్డి పిటిషన్‌

ఓబుళాపురం మైనింగ్‌ కేసులో అరెస్టయి జైలులో ఉన్న గాలి జనార్దనరెడ్డి నాంపల్లి సీబీఐ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. హైదరాబా...

Pm modi: గుల్జార్‌ హౌస్‌ ప్రమాద ఘటన కలచివేసింది: మోదీ

చార్మినార్‌ పరిధి గుల్జార్‌హౌస్‌లో జరిగిన అగ్నిప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హైదరాబాద్‌:...

Pollution: పాక్‌ పంజాబ్‌పై కాలుష్యం పంజా.. నెలలో 18లక్షల మంది ఆసుపత్రులకు

ఇంటర్నెట్‌ డెస్క్‌: పాకిస్థాన్‌లోని (Pakistan) పంజాబ్‌ ప్రావిన్సులో కాలుష్యం తీవ్ర ప్రభావం చూపిస్తోంది. దీంతో లక్షల మంది...

Top