Operation sindoor: ఆపరేషన్‌ సిందూర్‌.. పార్లమెంటు ప్రత్యేక సమావేశానికి కేంద్రం నో..

Eenadu

Operation sindoor: ఆపరేషన్‌ సిందూర్‌.. పార్లమెంటు ప్రత్యేక సమావేశానికి కేంద్రం నో.."

Play all audios:

Loading...

Operation Sindoor: ఆపరేషన్‌ సిందూర్‌పై చర్చ కోసం పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసేందుకు కేంద్రం నిరాసక్తత చూపిస్తున్నట్లు సమాచారం. దిల్లీ: పహల్గాం దాడి అనంతరం నెలకొన్న భారత్‌-పాక్‌


ఉద్రిక్తతలు, ఆపరేషన్‌ సిందూర్‌ (Operation Sindoor)పై చర్చించేందుకు పార్లమెంట్‌లో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి. అయితే, ఇందుకు కేంద్రం నిరాసక్తత


కనబరుస్తున్నట్లు తెలుస్తోంది. ప్రత్యేక సమావేశం (Special Session of the Parliament) ఏర్పాటు చేసేందుకు కేంద్రం సముఖంగా లేదని సమాచారం. ఈ మేరకు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ పలు ఆంగ్ల మీడియా


కథనాలు వెల్లడించాయి. ఈ ఏడాది జులైలో జరిగే వర్షాకాల సమావేశాల్లోనే ప్రతిపక్షాలు లేవనెత్తే ప్రశ్నలకు కేంద్రం సమాధానం చెప్పనుంది. పహల్గాం దాడి (Pahalgam Terror attack) అనంతరం జరిగిన పరిణామాలు,


కలసికట్టుగా తీసుకున్న నిర్ణయాలను చర్చించేందుకు పార్లమెంట్‌లో ప్రత్యేక సమావేశం నిర్వహించాలని లోక్‌సభలో విపక్షనేత రాహుల్‌ గాంధీ ఇటీవల ప్రధాని మోదీకి లేఖ రాశారు. ‘‘ఐక్యత, సంఘీభావం అవసరమైన ఈ


తరుణంలో, వీలైనంత త్వరగా ఉభయ సభల్లో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటుచేయడం ముఖ్యమని విపక్షం భావిస్తోంది’’ అని రాహుల్‌ పేర్కొన్నారు. వీరితో పాటు మరికొందరు విపక్ష ఎంపీలు సైతం ఇదే డిమాండ్‌


వినిపించారు. * పాక్‌కు ఎరేసి ఉచ్చులోకి లాగిన భారత్‌.. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా..? అయితే, విపక్షాల డిమాండ్‌ను భాజపా నేతలు తోసిపుచ్చారు. ప్రస్తుతం ఆపరేషన్‌ సిందూర్‌ తాత్కాలికంగానే


నిలిచిందని, ఈ సమయంలో అనవసర చర్చలకు తావివ్వొద్దని ప్రతిపక్షాలను దుయ్యబట్టారు. ఆపరేషన్‌ సిందూర్‌ ముగిసిన తర్వాత ప్రత్యేక సమావేశం డిమాండ్‌ను లేవనెత్తాలని సూచించారు. ఈ క్రమంలోనే కేంద్రం కూడా


దీనిపై సుముఖంగా లేనట్లు తాజాగా వార్తలు వినిపిస్తున్నాయి. జులైలో పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు జరగనున్నాయి.


Trending News

20 వరకు కట్టుదిట్టంగా లాక్‌డౌన్‌

సాక్షి, హైదరాబాద్‌ : కరోనా వ్యాప్తి నివారణ కోసం రాష్ట్రంలో లాక్‌డౌన్‌ బాగా అమలవుతోందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పే...

నాలుగేళ్ల ప్రేమ విషాదాంతం

శిరీష, వెంకటేష్‌ _నాలుగేళ్ల వాళ్ల ప్రేమ విషాదంతో ముగిసింది. కొద్ది రోజుల్లో పెళ్లి చేస్తామని పెద్ద వాళ్లు చెప్పినా ఇంతలో...

Ap eapcet 2025: ఏపీ ఈఏపీసెట్‌ రాస్తున్నారా? మీ సందేహాలకు సమాధానాలివిగో

AP EAPCET 2025: ఏపీ ఈఏపీసెట్‌ పరీక్ష రాసే విద్యార్థుల సందేహాలు.. వాటికి సమాధానాలేంటో చూద్దాం..! By Features Desk Publish...

Sangameswara temple: అమృత గుండం.. ఒక్కసారి స్నానం చేస్తే చాలు..

Reported by: Published by: Last Updated:August 18, 2024 1:11 PM IST ఈ ఆలయం పూర్వం నాటి పాలకులు కుబేర భూపాల్ అనే రాజు నిర...

నేత కార్మికులకు అండగా సీఎం జగన్‌

'ధనవంతులవ్వడం చాలా సులభం': రాబర్ట్ కియోసాకి ఆర్ధిక సంక్షోభం, మార్కెట్ క్రాష్ గురించి చెప్పిన రిచ్ డాడ్ పూర్ డా...

Latests News

Operation sindoor: ఆపరేషన్‌ సిందూర్‌.. పార్లమెంటు ప్రత్యేక సమావేశానికి కేంద్రం నో..

Operation Sindoor: ఆపరేషన్‌ సిందూర్‌పై చర్చ కోసం పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసేందుకు కేంద్రం నిరాసక్తత చూపిస్...

ఇకపై తుపానుల ముప్పు ఎక్కువ

సాక్షి, అమరావతి: అంఫన్‌.. సూపర్‌ సైక్లోన్‌.. నిసర్గ.. కేవలం రెండు నెలల వ్యవధిలోనే ఈ మూడు తుపానులు వరుసగా తూర్పు కోస్తా, ...

Movie review: సంక్రాంతికి వస్తున్నాం సినిమా.. జెన్యూన్ రివ్యూ చెప్పేసిన అభిమానులు..

Reported by: Published by: Last Updated:January 14, 2025 3:47 PM IST కాకినాడ జిల్లాలో 'సంక్రాంతికి వస్తున్నాం'...

Mari selvaraj's vaazhai to have direct ott release: reports - news18

Curated By : Last Updated:November 21, 2023, 17:36 IST VAAZHAI STARS KALAIYARASAN, NIKHILA VIMAL, DHIVYA DURAISAMY AND P...

గుడ్‌న్యూస్‌ పంచుకున్న ‘వైల్డ్‌ డాగ్‌’ నటి

సాక్షి,ముంబై: ప్రముఖ బాలీవుడ్‌ నటి దియా మీర్జా  ఒక తీపికబురు తన ఫ్యాన్స్‌తో పంచుకున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలోముంబైకి చెంద...

Top