Nirmala sitharaman: ‘జీఎస్టీ రిజిస్ట్రేషన్లో అవినీతి’.. లింక్డిన్ పోస్ట్పై స్పందించిన నిర్మలా సీతారామన్
Nirmala sitharaman: ‘జీఎస్టీ రిజిస్ట్రేషన్లో అవినీతి’.. లింక్డిన్ పోస్ట్పై స్పందించిన నిర్మలా సీతారామన్"
Play all audios:
Nirmala sitharaman | ఇంటర్నెట్ డెస్క్: జీఎస్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో అవినీతి జరుగుతోందంటూ వచ్చిన సోషల్మీడియా పోస్ట్పై కేంద్ర మంత్రి నిర్మలాసీతారామన్ స్పందించారు. జీఎస్టీ నంబర్ను
పొందేందుకు తాను ‘అవినీతికి’ పాల్పడబోతున్నానంటూ ఓ వ్యక్తి చేసిన పోస్ట్ వైరల్గా మారిన నేపథ్యంలో ఆమె ఎక్స్ వేదికగా స్పందించారు. ప్రజా సమస్యలపై సత్వరమే స్పందిచాలని క్షేత్రస్థాయి అధికారులకు
సూచించారు. అంతకుముందు కేంద్ర పరోక్ష పన్నుల బోర్డు కూడా (CBIC) కూడా తన స్పందన తెలియజేసింది. ఇంతకీ ఏం జరిగిందంటే.? జీఎస్టీ రిజిస్ట్రేషన్ గురించి వినోద్ గుప్తా అనే వ్యక్తి లింక్డిన్లో ఓ
పోస్ట్ పెట్టారు. తన భార్య, కుమార్తె కలిసి నెలకొల్పిన సంస్థకు జీఎస్టీ నంబర్ కోసం తాను దరఖాస్తు చేశానని, 20 రోజులు దాటినా నంబర్ రాలేదని ఆరోపించారు. అభ్యంతరాలు వస్తున్నా జీఎస్టీ నంబర్
రాలేదని తెలిపారు. జీఎస్టీ నంబర్ పొందడం కోసం తాను లంచం ఇవ్వనున్నట్టు తన పోస్ట్లో పేర్కొన్నారు. * హారియర్ ఈవీ వచ్చేస్తోంది.. ధర ఇదేనా? ట్యాక్స్ నిపుణులు అభిషేక్ రాజారామ్ ఈ అంశంపై ఎక్స్
వేదికగా స్పందించారు. వినోద్ గుప్తా పోస్ట్ స్క్రీన్ షాట్ను కోట్ చేస్తూ.. జీఎస్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో అవినీతి గురించి సీబీఐసీకి తెలీడం లేదని పేర్కొన్నారు. ఉన్నతస్థాయి ఉద్యోగులే
జోక్యం చేసుకుని దేశంలోని ఈ అవినీతి నుంచి కాపాడాలంటూ పోస్ట్ పెట్టారు. సీబీఐసీని ట్యాగ్ చేశారు. దీంతో పరోక్ష పన్నుల బోర్డు సత్వరమే స్పందించి వివరణ ఇచ్చింది. గుప్తా దరఖాస్తు మే 26న ఫైల్
చేశారని, ఇది దిల్లీ స్టేట్ జీఎస్టీకి అసైన్ చేశారని పేర్కొంది. అయితే రెంట్ అగ్రిమెంట్పై సంతకం చేసిన వ్యక్తికి సంబంధించిన వివరాలను పూర్తిగా పేర్కొనకపోవడంతో దరఖాస్తు పెండింగ్లో ఉందని
తెలిపింది. ఇదే విషయాన్ని దరఖాస్తుదారుకు కూడా తెలియజేశామని వెల్లడించింది. పెండింగ్ వివరాలు అందితే సంబంధిత అధికారులు ప్రక్రియను పూర్తి చేస్తారని పేర్కొంది. వాస్తవాలు తెలుసుకోకుండా అసత్యాలు
ప్రచారం చేయొద్దని హితవు పలికింది. ఈ పోస్ట్పై నిర్మలా సీతారామన్ స్పందిస్తూ.. పన్ను చెల్లింపుదారులకు సేవలందించడంతో పాటు వారిని నమ్మకాన్ని చూరగొనడం కూడా ముఖ్యమని పేర్కొన్నారు. క్షేత్రస్థాయి
సిబ్బంది పారదర్శకంగా వ్యవహరించడంతో పాటు తక్షణమే స్పందించాలని సూచించారు.
Trending News
duduku | TechCrunchSAVE NOW THROUGH JUNE 4 FOR TECHCRUNCH SESSIONS: AI SAVE $300 ON YOUR TICKET TO TC SESSIONS: AI—AND GET 50% OFF A SECOND...
‘క్రికెట్ సెలక్షన్’ను ప్రత్యక్ష ప్రసారం చేయాలిముంబై: భారత క్రికెటర్, బెంగాల్ రంజీ జట్టు మాజీ కెప్టెన్ మనోజ్ తివారీ భారత సెలక్షన్ కమిటీ తీరుపై విరుచుకుపడ్డాడు. జట్...
Malayalam cinema for everyone: from 'manjummel boys,' to 'premalu' and 'aavesham'During its exceptional run in Tamil Nadu, _Manjummel Boys_ became the first Malayalam film ever to gross over `50 crores...
Crime news: శిశువులను విక్రయిస్తున్న ముఠా అరెస్టుసూర్యాపేట: సూర్యాపేటలో శిశువులను విక్రయిస్తున్న ముఠాను అరెస్టు (Crime News) చేశారు. ఆరుగురు మహిళలు, నలుగురు పురుషులను అర...
Road accident: ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురి దుర్మరణంగిద్దలూరు పట్టణం: ప్రకాశం జిల్లా కొమరోలు మండలం తాటిచెర్లమోటు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం (Crime News) జరిగింది. లారీ, కారు ఢ...
Latests News
Nirmala sitharaman: ‘జీఎస్టీ రిజిస్ట్రేషన్లో అవినీతి’.. లింక్డిన్ పోస్ట్పై స్పందించిన నిర్మలా సీతారామన్Nirmala sitharaman | ఇంటర్నెట్ డెస్క్: జీఎస్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో అవినీతి జరుగుతోందంటూ వచ్చిన సోషల్మీడియా పోస్ట...
Prabhas - radhe shyam : మరికొన్ని గంటల్లో ప్రభాస్ ‘రాధే శ్యామ్’ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్..CNN18 name, logo and all associated elements ® and © 2017 Cable News Network LP, LLLP. A Time Warner Company. All rights...
Itr filing date: ఐటీఆర్ ఫైలింగ్ గడువు పొడిగింపు.. ఐటీ విభాగం ప్రకటనITR filing date | ఇంటర్నెట్ డెస్క్: ఆదాయపు పన్ను రిటర్నుల దాఖలు విషయంలో ఐటీ విభాగం (Income tax department) కీలక నిర్ణయ...
Hyderabad: బ్యాండ్ సిబ్బందినీ వదలని ఎస్సై.. రూ. 15వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కి..హైదరాబాద్: లంచం తీసుకుంటూ ఓ ఎస్సై ఏసీబీకి చిక్కిన ఘటన జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్లో చోటు చేసుకుంది. ఏసీబీ అధికారులు ...
సల్మాన్ఖాన్ (బాలీవుడ్) రాయని డైరీకరణ్ ఫోన్ చేసి, ‘‘ఏంటి ఆలోచిస్తున్నావ్’’ అన్నాడు! ‘ఏం చేస్తున్నావ్?’ అని అతడు ఎప్పుడూ అడగడు. అతడు ఫోన్ చేసినప్పుడు...