Stock market: లాభాల్లో ట్రేడవుతున్న స్టాక్ మార్కెట్లు.. సెన్సెక్స్ 300 పాయింట్లు జంప్
Stock market: లాభాల్లో ట్రేడవుతున్న స్టాక్ మార్కెట్లు.. సెన్సెక్స్ 300 పాయింట్లు జంప్"
Play all audios:
Stock Market Opening Bell | ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నేడు లాభాల్లో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మిశ్రమ సంకేతాల నడుమ మదుపర్లు కాస్త అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. మార్కెట్
ప్రారంభంలోనే 150 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్.. భారతీ ఎయిర్టెల్, ఇన్ఫీ వంటి ప్రధాన షేర్లలో కొనుగోళ్ల మద్దతుతో రాణిస్తోంది. ఉదయం 9:25 గంటల సమయంలో సెన్సెక్స్ (Sensex) 387 పాయింట్ల లాభంతో
81,517 వద్ద ట్రేడవుతుండగా.. నిఫ్టీ (Nifty) 118 పాయింట్ల లాభంతో 24,696 వద్ద ఉన్నాయి. సెన్సెక్స్ 30 సూచీలో.. టాటా స్టీల్, భారతీ ఎయిర్టెల్, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, రిలయన్స్
ఇండస్ట్రీస్, బజాజ్ఫిన్సర్వ్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎటర్నల్, ఎంఅండ్ఎం, ఎల్అండ్టీ, ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టీసీఎస్ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. టాటా మోటార్స్, ఏషియన్
పెయింట్స్, నెస్లే ఇండియా, ఇండస్ఇండ్ బ్యాంక్, అదానీ పోర్ట్స్, సన్ఫార్మా, యాక్సిస్ బ్యాంక్, ఐటీసీ, హెచ్యూఎల్ షేర్లు నష్టాల్లో కదలాడుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్
బ్యారెల్ 66.18 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. బంగారం ఔన్సు 3,234 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. * క్షిపణి వేగంతో బీడీఎల్, మిధానీ షేర్లు అమెరికా ప్రధాన సూచీలైన నాస్డాక్, ఎస్ అండ్ పీ 500 నిన్నటి
ట్రేడింగ్ సెషన్లో లాభంతో ముగియగా.. డోజోన్స్ మాత్రం ఫ్లాట్గా ముగిసింది. ఆసియా-పసిఫిక్ మార్కెట్లు నేడు మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. ఆస్ట్రేలియన్ ఏఎస్ఎస్ 0.11 శాతం, జపాన్ నిక్కీ 0.81 శాతం
నష్టంతో కదలాడుతుంటే.. షాంఘై 1.42 శాతం, హాంకాంగ్ హాంగ్సెంగ్ మాత్రం 0.21 శాతం లాభంతో ట్రేడవుతున్నాయి. విదేశీ సంస్థాగత మదుపర్లు (FIIs) తిరిగి విక్రయదారులుగా నిలిచారు. మంగళవారం నికరంగా రూ.477
కోట్ల విలువ చేసే షేర్లను విక్రయించారు. ఇక దేశీయ సంస్థాగత మదుపర్లు (DIIs) నికరంగా రూ.4,274 కోట్ల షేర్లు కొనుగోలు చేశారు.
Trending News
Vastu: అప్పులు, ఆర్థిక కష్టాలు తీరాలంటే, ఇంట్లో 7 మార్పులు చెయ్యండిగ్లాస్ విండో: మీకు అప్పుల బాధ తీరిపోవాలంటే, ఈశాన్యం దిక్కులో ఓ గ్లాస్ కిటికీని అమర్చండి. మీ ఇల్లు, షాప్ ఏదైనా సరే, ఈశ్యా...
Khammam: ఖమ్మం జిల్లాలో ఘోర ప్రమాదం.. కారు ఢీకొని తల్లి, కుమారుడు మృతిఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం బుడదంపాడు వద్ద ఘోర ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన తాటి ముంజలు కొంటున్న వారిపైకి కారు దూసు...
పదేళ్లకే పిల్లల్లో బీపీ, మధుమేహం.. కారణం ఇదే : డాక్టర్ రిమా దాదాదిల్లీ: విద్యార్థుల్లో అధిక మధుమేహాన్ని నియంత్రించడమే లక్ష్యంగా పాఠశాలల్లో ‘షుగర్ బోర్డు’లను ఏర్పాటు చేయాలని సీబీఎస్ఈ(C...
Ipl 2025: ఐపీఎల్ పునఃప్రారంభానికి పొంచి ఉన్న వాన ముప్పుఈ రోజు రాత్రి 7:30 గంటలకు చిన్నస్వామి స్టేడియం వేదికగా ఆర్సీబీ, కోల్కతా నైట్రైడర్స్ తలపడనున్నాయి. అయితే ఈ మ్యాచ్కు వ...
జూమ్ వర్సెస్ జియోమీట్తమ యాప్ను కాపీ కొట్టారన్న జూమ్ సాక్షి, న్యూఢిల్లీ : జూమ్కు దీటుగా రిలయన్స్ జియో రూపొందించిన జియో వీడియో కాన్ఫరెన్సిం...
Latests News
Stock market: లాభాల్లో ట్రేడవుతున్న స్టాక్ మార్కెట్లు.. సెన్సెక్స్ 300 పాయింట్లు జంప్Stock Market Opening Bell | ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నేడు లాభాల్లో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మిశ్రమ సంకేత...
Zodiac signs: డిసెంబర్ నాటికి ఈ 5 రాశులవారు ధనవంతులవ్వడం ఖాయమట.. మీ రాశి కూడా ఉందా?కుంభ రాశి.. ఈ ఏడాది కుంభరాశివారికి మంచి ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. ఎందుకంటే మార్చిలో అంగారకుడు, శుక్రుడు, బుధుడు, శని ...
Dk shivakumar: రన్యారావుకు ‘వెడ్డింగ్ గిఫ్ట్’ ఇచ్చారు: కర్ణాటక మంత్రిపై డీకే శివకుమార్ వ్యాఖ్యలుబెంగళూరు: కన్నడ నటి రన్యారావు గోల్డ్ స్మగ్లింగ్ కేసులో కర్ణాటక హోంమంత్రి జి. పరమేశ్వరకు చెందిన విద్యాసంస్థలపై ఈడీ దాడు...
Sajjala bhargava reddy: భార్గవ్రెడ్డి ఇచ్చిన సమాధానాలు సంతృప్తిగా లేవు: మంగళగిరి సీఐఅమరావతి: మంగళగిరి పోలీసు స్టేషన్లో సజ్జల భార్గవ్రెడ్డి (Sajjala Bhargava Reddy) విచారణ ముగిసింది. సామాజిక మాధ్యమాల్లో ...
Elon musk: ట్రంప్ పాలకవర్గం నుంచి వైదొలగిన ఎలాన్ మస్క్అమెరికా: టెస్లా సీఈవో, అమెరికా ప్రభుత్వంలో డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ (DOGE) శాఖ బాధ్యతలు నిర్వహిస్తున్...