Niti aayog: జపాన్ను అధిగమించి.. నాలుగో ఆర్థిక శక్తిగా భారత్: నీతి ఆయోగ్ సీఈఓ
Niti aayog: జపాన్ను అధిగమించి.. నాలుగో ఆర్థిక శక్తిగా భారత్: నీతి ఆయోగ్ సీఈఓ"
Play all audios:
ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచంలో జపాన్ను అధిగమించి భారత్ నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా (Fourth largest economy) అవతరించిందని నీతి ఆయోగ్ సీఈఓ బీవీఆర్ సుబ్రహ్మణ్యం వెల్లడించారు. దేశ స్థూల
దేశీయోత్పత్తి (GDP) 4 ట్రిలియన్ డాలర్లకు చేరుకోవడంతో అమెరికా, చైనా, జర్మనీ తర్వాత స్థానంలో నిలిచిందన్నారు. పదో నీతి ఆయోగ్ పాలకమండలి సమావేశం అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రపంచ అస్థిరత, సవాళ్ల
నేపథ్యంలో భారత ఆర్థిక వ్యవస్థ స్థిరంగా కొనసాగుతూ ఒక మార్గదర్శిగా నిలుస్తోందని పేర్కొన్నారు. పెట్టుబడులకు గమ్యస్థానంగా దేశం ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తుండటంతో ఈ ఘనత సాధ్యమైందన్నారు. దేశ ఆర్థిక
వృద్ధిని తెలియజేసే ఐఎంఎఫ్ (IMF) అంచనాలను ఉటంకిస్తూ..అమెరికా, చైనా, జర్మనీ మాత్రమే ప్రపంచ ఆర్థిక ర్యాంకింగ్స్లో మనకంటే ముందు ఉన్నాయని అన్నారు. ఇదే విధంగా మనం ముందుకు సాగితే మరో మూడేళ్లలో
జర్మనీని దాటుకొని.. మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనుందని పేర్కొన్నారు. ఇందుకోసం మూలధన వ్యయాల పెంపు, సులభతర వ్యాపార నిర్వహణ, వ్యాపార నిర్వహణ ఖర్చులు తగ్గడం, కార్మికులతో తయారీకి
ప్రాధాన్యం, ప్రపంచ మార్కెట్పై దృష్టి సారించడం వంటి చర్యలు ఎంతో కీలకమని పేర్కొన్నారు. ప్రస్తుతం వృద్ధి చెందుతున్న దేశీయ డిజిటల్ మార్కెట్.. రాబోయే దశాబ్ద కాలంలో భారత చాలా కీలకమన్నారు.
మరోవైపు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఇదే విషయాన్ని ‘ఎక్స్’ వేదికగా తెలిపారు. వికసిత్ భారత్ వైపు ఇది అతిపెద్ద అడుగు అని పేర్కొన్నారు. దీన్ని సాకారం చేసిన ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు
తెలిపారు. కొన్నేళ్లలోనే భారత్ మూడో ఆర్థిక వ్యవస్థగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
Trending News
Vastu: అప్పులు, ఆర్థిక కష్టాలు తీరాలంటే, ఇంట్లో 7 మార్పులు చెయ్యండిగ్లాస్ విండో: మీకు అప్పుల బాధ తీరిపోవాలంటే, ఈశాన్యం దిక్కులో ఓ గ్లాస్ కిటికీని అమర్చండి. మీ ఇల్లు, షాప్ ఏదైనా సరే, ఈశ్యా...
నగరంలో ట్రాఫిక్ ఆంక్షలుసాక్షి, సిటీబ్యూరో: మొహర్రం ఊరేగింపు నేపథ్యంలో మంగళవారం పాతబస్తీ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఎలాంటి అవ...
జూమ్ వర్సెస్ జియోమీట్తమ యాప్ను కాపీ కొట్టారన్న జూమ్ సాక్షి, న్యూఢిల్లీ : జూమ్కు దీటుగా రిలయన్స్ జియో రూపొందించిన జియో వీడియో కాన్ఫరెన్సిం...
దర్యాప్తునకు ముందే స్టే ఎలా ఇస్తారు..?సాక్షి, న్యూఢిల్లీ: ‘గత విచారణ సందర్భంగానే మీకు చెప్పాం. ఇలా దర్యాప్తు ప్రారంభం కూడా కాకముందే స్టే ఆర్డర్లు ఇవ్వడాన్ని మ...
టీడీపీ భూ అక్రమాలకు అడ్డుకట్ట..సాక్షి, తిరుపతి: టీడీపీ హయాంలో సాగిన భూ అక్రమాలకు అడ్డుకట్ట వేసే దిశగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంటోంద...
Latests News
Niti aayog: జపాన్ను అధిగమించి.. నాలుగో ఆర్థిక శక్తిగా భారత్: నీతి ఆయోగ్ సీఈఓఇంటర్నెట్ డెస్క్: ప్రపంచంలో జపాన్ను అధిగమించి భారత్ నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా (Fourth largest economy) అవతరిం...
Anil ravipudi: మనోజ్.. మీరెప్పుడూ ఇలా నవ్వుతూ ఉండాలి.. మీ టైమ్ స్టార్ట్ అయింది: అనిల్ రావిపూడిహైదరాబాద్: బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (Bellamkonda Sai Sreenivas), నారా రోహిత్ (Nara Rohith), మంచు మనోజ్ (Manoj Manc...
తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటలుతిరుమల: తిరుమలలో శ్రీవారి సర్వదర్శనానికి అన్ని కంపార్టుమెంట్లు భక్తులతో నిండాయి. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్...
Kaleshwaram: సరస్వతి పుష్కరాలకు పోటెత్తిన భక్తజనం.. 8 కి. మీ మేర ట్రాఫిక్ జామ్సరస్వతి పుష్కరాలకు జనం పోటెత్తారు. దీంతో శనివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా పరిధిలోని మద్దుపల్లి- కాళేశ్వరం మార్గంలో భార...
Mlc kavitha: జాగృతి నేతలతో ఎమ్మెల్సీ కవిత సమావేశంహైదరాబాద్: తెలంగాణ జాగృతి నేతలతో ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) సమావేశమయ్యారు. బంజారాహిల్స్లోని తన నివాసంలో వారితో భేటీ ...