Mandipalli ramprasad reddy: తల్లి, చెల్లిని దూరం పెట్టిన వ్యక్తి.. రాష్ట్రం పట్ల నిజాయతీగా ఉంటారా? : మంత్రి మండిపల్లి
Mandipalli ramprasad reddy: తల్లి, చెల్లిని దూరం పెట్టిన వ్యక్తి.. రాష్ట్రం పట్ల నిజాయతీగా ఉంటారా? : మంత్రి మండిపల్లి"
Play all audios:
అమరావతి: జగన్ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో ముంచేశారని మంత్రి మండిపల్లి రాంప్రసాద్రెడ్డి (Mandipalli ramprasad reddy) విమర్శించారు. అప్పుల వల్లే ఎన్నికల్లో ఆయన చతికిలపడ్డారని చెప్పారు. రాజధాని
నిర్మాణం ఆపేసి.. 3 రాజధానుల నాటకమాడారని ఎద్దేవా చేశారు. ఒక్కరే డిసైడ్ చేసే సైకో డ్రామాగా జగన్ పాలన సాగిందని మండిపడ్డారు. తల్లి, చెల్లిని దూరం పెట్టిన వ్యక్తి.. రాష్ట్రం పట్ల నిజాయతీగా
ఉంటారా అని మండిపల్లి రాంప్రసాద్రెడ్డి ప్రశ్నించారు. ఒక్క ఛాన్స్ ఇస్తే రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కిపోయింది: మంత్రి గొట్టిపాటి ప్రజలు ఆశీర్వదించి ఏడాది పూర్తయిన సందర్భంగా మంత్రి గొట్టిపాటి
రవికుమార్ (Gottipati ravi kumar) శుభాకాంక్షలు తెలిపారు. విధ్వంసకారుడి కబంధ హస్తాల నుంచి రాష్ట్రం విముక్తి పొందిన రోజు ఇది అని పేర్కొన్నారు. ఐదేళ్ల విధ్వంసం, నరకయాతనను ప్రజలు ఇంకా
మర్చిపోలేదని చెప్పారు. అరాచక శక్తులకు ఒక్క ఛాన్స్ ఇస్తే రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కిపోయిందని తెలిపారు. రెట్టింపు సంక్షేమం, అభివృద్ధి చేస్తూ కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. భవిష్యత్తు
తరాల కోసం కృషి చేస్తూ ప్రతి హామీని ప్రభుత్వం నెరవేరుస్తోందని వివరించారు. దెబ్బతిన్న ఏపీ బ్రాండ్ను ఏడాదిలోనే తిరిగి నిలబెట్టగలిగాం: మంత్రి అనగాని ప్రజలు మెచ్చి.. ప్రజలు తెచ్చుకున్న
ప్రభుత్వమిదని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. ఏడాదిలో కూటమి ప్రభుత్వం ఎన్నో విజయాలు సాధించిందని చెప్పారు. ఇవ్వని హామీలూ అమలు చేస్తున్న సంక్షేమ ప్రభుత్వం తమదని పేర్కొన్నారు. దెబ్బతిన్న
ఏపీ బ్రాండ్ను ఏడాదిలోనే తిరిగి నిలబెట్టగలిగామని చెప్పారు. సూపర్ సిక్స్ పథకాలు ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని వివరించారు. సైకో పాలనతో వెనక్కి వెళ్లిన పరిశ్రమలను తిరిగి
రప్పిస్తున్నామన్నారు. ఇప్పటికే 6 లక్షల ఉద్యోగాలను కూటమి ప్రభుత్వం కల్పించిందని గుర్తుచేశారు. అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేసి ప్రజల ఆకలి తీరుస్తున్నట్లు తెలిపారు. విధ్వంసం నుంచి వికాసం వైపు
నడిపించాం: మంత్రో డోలా వైకాపా చేసిన విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని వికాసం వైపు నడిపించామని మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి అన్నారు. ఏడాదిలోనే హామీలన్నీ ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ముందుకు
సాగుతున్నామన్నారు. రాష్ట్రాభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు. కూటమి పాలనను నిండు మనసుతో ఆశీర్వదిస్తున్న ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. (Andhra Pradesh News)
Trending News
After 'soorarai pottru', sudha kongara to join hands with karthi for new projectMeanwhile, Karthi awaits the release of his upcoming film _Sulthan,_ which has been directed by Bakkiyaraj Kannan. Produ...
Ukraine- russia: రష్యా సైనిక స్థావరాలే లక్ష్యంగా ఉక్రెయిన్ భారీ దాడులుఉక్రెయిన్, రష్యా మధ్య ఉద్రిక్తత మరోసారి తారస్థాయికి చేరింది. రష్యాలోని వైమానిక స్థావరాలే లక్ష్యంగా ఉక్రెయిన్ పెద్ద ఎత్...
Jayalalithaa’s niece deepa jayakumar joins camp panneerselvam - scoopwhoopAfter J Jayalalithaa’s former aide and AIADMK chief VK Sasikala was convicted for fraud on Tuesday, Jaya’s niece Deepa J...
vodaphone | TechCrunchSAVE $200+ ON YOUR TECHCRUNCH ALL STAGE PASS BUILD SMARTER. SCALE FASTER. CONNECT DEEPER. JOIN VISIONARIES FROM PRECURSO...
Priyanka Chopra- Nick Jonas Sangeet: Isha Ambani reaches Jodhpur in style with Mukesh-Nita Ambani, Radhika MerchantMukesh Ambani was pictured with daughter Isha on their arrival at the Jodhpur airport. The saas-bahu jodi looked adorabl...
Latests News
Mandipalli ramprasad reddy: తల్లి, చెల్లిని దూరం పెట్టిన వ్యక్తి.. రాష్ట్రం పట్ల నిజాయతీగా ఉంటారా? : మంత్రి మండిపల్లిఅమరావతి: జగన్ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో ముంచేశారని మంత్రి మండిపల్లి రాంప్రసాద్రెడ్డి (Mandipalli ramprasad reddy) విమర...
Trending: 800 ఏళ్ల కాలం నాటి బావి.. ఇక్కడ ప్రత్యేక ఏంటంటే..CNN18 name, logo and all associated elements ® and © 2017 Cable News Network LP, LLLP. A Time Warner Company. All rights...
Adetola Olatunji, Author at TechCrunchTechCrunch Desktop LogoTechCrunch Mobile LogoLatestStartupsVentureAppleSecurityAIAppsEventsPodcastsNewslettersSearchSubm...
Varun Tej to work with director Srinu VaitlaThis movie will go on floors as soon as Varun wraps up the Dil Raju production. Actor Varun Tej's film with director Kri...
Rajnath singh: అప్పులు తెచ్చి.. మసూద్ అజార్కు రూ. 14 కోట్ల పరిహారం: పాక్ను ఎండగట్టిన రాజ్నాథ్ఇంటర్నెట్ డెస్క్: పాకిస్థాన్ ఎన్నోఏళ్లుగా పెంచి..పోషిస్తున్న ఉగ్రవాదాన్ని భారత సైన్యం కేవలం 23 నిమిషాల్లో తుడిచిపెట్ట...