Rajnath singh: అప్పులు తెచ్చి.. మసూద్ అజార్‌కు రూ. 14 కోట్ల పరిహారం: పాక్‌ను ఎండగట్టిన రాజ్‌నాథ్‌

Eenadu

Rajnath singh: అప్పులు తెచ్చి.. మసూద్ అజార్‌కు రూ. 14 కోట్ల పరిహారం: పాక్‌ను ఎండగట్టిన రాజ్‌నాథ్‌"

Play all audios:

Loading...

ఇంటర్నెట్‌ డెస్క్‌: పాకిస్థాన్‌ ఎన్నోఏళ్లుగా పెంచి..పోషిస్తున్న ఉగ్రవాదాన్ని భారత సైన్యం కేవలం 23 నిమిషాల్లో తుడిచిపెట్టేసిందని కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ (Rajnath Singh)


పేర్కొన్నారు. ప్రస్తుతం పాక్‌ చర్యలను భారత్‌ పరిశీలిస్తుందని.. తేడా వస్తే చర్యలు మరింత కఠినంగా ఉంటాయని హెచ్చరించారు. గుజరాత్‌లోని భుజ్‌ వైమానిక దళ సైనికులతో సమావేశమైన కేంద్ర మంత్రి ఈ


వ్యాఖ్యలు చేశారు. అంతర్జాతీయ ద్రవ్య నిధి నుంచి వచ్చిన నిధులలో ఎక్కువ భాగాన్ని పాకిస్థాన్‌ తన దేశంలో ఉగ్రవాద మౌలిక సదుపాయాల కోసం ఖర్చు చేస్తుందన్నారు. అప్పు చేసి మరీ దాయాది దేశం ఉగ్రవాదాన్ని


పెంచి పోషిస్తుందని పేర్కొన్నారు. ఆపరేషన్‌ సిందూర్‌లో (Operation Sindoor) ధ్వంసమైన ఉగ్రవాద స్థావరాలను పునర్నిర్మించడానికి  జైషే మహ్మద్‌ చీఫ్‌ మసూద్‌ అజార్‌కు రూ.14 కోట్ల ఇస్తున్నట్లు పాక్‌


ప్రభుత్వం ప్రకటించిందని తెలిపారు. పాక్‌కు నిధులు మంజూరు చేస్తే పరోక్షంగా ఉగ్రవాదాన్ని ప్రోత్సహించినట్లే అవుతుందని రాజ్‌నాథ్‌ అన్నారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఐఎంఎఫ్‌ పాక్‌కు నిధులు


సమకూర్చడంపై పునరాలోచించాలని కోరారు. భవిష్యత్తులోనూ ఆ దేశానికి ఎలాంటి సహాయం అందించొద్దని కోరారు.  ఆపరేషన్‌ సిందూర్‌లో పాక్‌కు భారత్‌ అర్థరాత్రి ఉదయపు వెలుగు ఎలా ఉంటుందో చూపించిందని.. మన


సైనికుల పరాక్రమం చూసి దేశ, విదేశాల్లోని భారతీయులు గర్విస్తున్నారని రాజ్‌నాథ్‌ అన్నారు. ఈ ఆపరేషన్ ప్రపంచం దృష్టిని ఆకర్షించిందని తెలిపారు. మన బ్రహ్మోస్ క్షిపణి శక్తిని దాయాది దేశం కూడా


అంగీకరించిందని పేర్కొన్నారు. భుజ్ వైమానిక స్థావరం అనేక పాకిస్థాన్‌ డ్రోన్‌లను కూల్చడాన్ని ప్రస్తావిస్తూ..సైన్యాన్ని ప్రశంసించారు. 1965లోనూ పాకిస్థాన్‌పై మన విజయానికి భుజ్ సాక్షిగా నిలిచిందని


గుర్తు చేశారు.  ఆపరేషన్‌ సిందూర్‌ అనంతరం పాకిస్థాన్‌కు రుణం ఇవ్వకూడదని భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసినప్పటికీ అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) నుంచి 1 బిలియన్‌ డాలర్ల నిధులు (దాదాపు రూ.8,540


కోట్లు) ఆ దేశానికి మంజూరయ్యాయి. ఎక్స్‌టెండెడ్ ఫండ్ ఫెసిలిటీ (EFF) కింద ఈ మొత్తాన్ని ఇవ్వడానికి ఐఎంఎఫ్‌ ఆమోదం తెలిపింది. మసూద్‌ అజార్‌కు పరిహారం ప్రకటించిన పాక్ ప్రధాని పాకిస్థాన్‌ ప్రధాని


షెహబాజ్ షరీఫ్ గురువారం జైషే మహ్మద్‌ చీఫ్‌ మసూద్‌ అజార్‌కు నష్టపరిహారం ఇవ్వనున్నట్లు ప్రకటించారు. భారత్‌ చేసిన వైమానిక దాడుల్లో 14 మంది మసూద్‌ కుటుంబసభ్యులు ప్రాణాలు కోల్పోయిన విషయం


తెలిసిందే. మృతుల కుటుంబాలకు రూ.కోటి పరిహారం ఇస్తామని ఆ దేశ ప్రధాని పేర్కొన్నారు. ఈ క్రమంలో కేవలం మసూద్‌ కుటుంబానికి రూ.14 కోట్లు చెల్లించే అవకాశం ఉంది. అదనంగా భారత్ దాడుల్లో ధ్వంసమైన ఇళ్లను


పునర్నిర్మిస్తామని పాక్‌ ప్రధాని హామీ ఇచ్చారు.


Trending News

Urvashi rautela: కేన్స్‌ వేడుకలో మెట్లపై ఫొటోలు.. విమర్శలను ఖండించిన ఊర్వశీ రౌతేలా

కేన్స్‌ వేడుకల్లో తాను ప్రతి నియమాన్ని పాటించానన్నారు నటి ఊర్వశీ రౌతేలా. తనపై వస్తోన్న విమర్శలను ఖండిస్తూ నోట్‌ విడుదల చ...

Konaseema: గోదావరిలో గల్లంతైన 8 మందిలో ముగ్గురి మృతదేహాలు లభ్యం

కోనసీమ: గోదావరిలో గల్లంతైన 8 మందిలో ముగ్గురి మృతదేహాలు లభ్యమయ్యాయి. మిగిలిన ఐదుగురి కోసం ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు, పోలీసులు...

Hardik pandya: హార్ధిక్ పాండ్యకు విడాకులిచ్చిన నటాషాకు ఎంత ఆస్తి ఉందో తెలుసా?

స్పోర్ట్స్ వార్మ్ ప్రకారం, హార్దిక్ పాండ్యా ఒక్కో యాడ్‌కు కోటి రూపాయలు వసూలు చేస్తున్నాడు. బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌ల ద్వా...

VIDEO: Revanth Reddy Sworn In As CM Of Telangana, Bhatti Vikramarka His Deputy

Anumula Revanth Reddy on Thursday took oath as Chief Minister of Telangana, becoming the first Congress CM of the younge...

Sooraj pancholi to work with parineeti chopra in 'circus'?

Teen hearthrob Sooraj Pancholi will star alongside Parineeti Chopra and Suniel Shetty in a musical drama titled _Circus_...

Latests News

Rajnath singh: అప్పులు తెచ్చి.. మసూద్ అజార్‌కు రూ. 14 కోట్ల పరిహారం: పాక్‌ను ఎండగట్టిన రాజ్‌నాథ్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: పాకిస్థాన్‌ ఎన్నోఏళ్లుగా పెంచి..పోషిస్తున్న ఉగ్రవాదాన్ని భారత సైన్యం కేవలం 23 నిమిషాల్లో తుడిచిపెట్ట...

Horoscope today | latest horoscope today - eenadu

నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (20/12/2024) Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్...

Mission impossible the final reckoning review: రివ్యూ: మిషన్‌ ఇంపాసిబుల్‌: ద ఫైనల్‌ రెకనింగ్‌.. సిరీస్‌లో చివరి సినిమా ఇదేనా?

Mission Impossible The Final Reckoning Review || చిత్రం: మిషన్‌ ఇంపాసిబుల్‌: ద ఫైనల్‌ రెకనింగ్‌; నటీనటులు: టామ్‌ క్రూజ్‌...

Andhra top news | latest andhra pradesh news - eenadu

వెన్నుపోటు, గొడ్డలివేటుకు పేటెంట్‌ జగన్‌ వెన్నుపోటు, గొడ్డలివేటుపై జగన్‌కే పేటెంట్లు ఉన్నాయని, ఆయన గురించి తెలిసే తల్లి,...

Bangladesh: తెల్లవారుజామున 3 గంటలకు.. లుంగీలో పారిపోయిన మాజీ అధ్యక్షుడు..

ఇంటర్నెట్‌ డెస్క్‌: బంగ్లాదేశ్‌ (Bangladesh)లో మాజీ ప్రధాని షేక్‌ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్‌ ప్రభుత్వం కుప్పకూలిన తర...

Top