Rajnath singh: అప్పులు తెచ్చి.. మసూద్ అజార్కు రూ. 14 కోట్ల పరిహారం: పాక్ను ఎండగట్టిన రాజ్నాథ్
Rajnath singh: అప్పులు తెచ్చి.. మసూద్ అజార్కు రూ. 14 కోట్ల పరిహారం: పాక్ను ఎండగట్టిన రాజ్నాథ్"
Play all audios:
ఇంటర్నెట్ డెస్క్: పాకిస్థాన్ ఎన్నోఏళ్లుగా పెంచి..పోషిస్తున్న ఉగ్రవాదాన్ని భారత సైన్యం కేవలం 23 నిమిషాల్లో తుడిచిపెట్టేసిందని కేంద్ర రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh)
పేర్కొన్నారు. ప్రస్తుతం పాక్ చర్యలను భారత్ పరిశీలిస్తుందని.. తేడా వస్తే చర్యలు మరింత కఠినంగా ఉంటాయని హెచ్చరించారు. గుజరాత్లోని భుజ్ వైమానిక దళ సైనికులతో సమావేశమైన కేంద్ర మంత్రి ఈ
వ్యాఖ్యలు చేశారు. అంతర్జాతీయ ద్రవ్య నిధి నుంచి వచ్చిన నిధులలో ఎక్కువ భాగాన్ని పాకిస్థాన్ తన దేశంలో ఉగ్రవాద మౌలిక సదుపాయాల కోసం ఖర్చు చేస్తుందన్నారు. అప్పు చేసి మరీ దాయాది దేశం ఉగ్రవాదాన్ని
పెంచి పోషిస్తుందని పేర్కొన్నారు. ఆపరేషన్ సిందూర్లో (Operation Sindoor) ధ్వంసమైన ఉగ్రవాద స్థావరాలను పునర్నిర్మించడానికి జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజార్కు రూ.14 కోట్ల ఇస్తున్నట్లు పాక్
ప్రభుత్వం ప్రకటించిందని తెలిపారు. పాక్కు నిధులు మంజూరు చేస్తే పరోక్షంగా ఉగ్రవాదాన్ని ప్రోత్సహించినట్లే అవుతుందని రాజ్నాథ్ అన్నారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఐఎంఎఫ్ పాక్కు నిధులు
సమకూర్చడంపై పునరాలోచించాలని కోరారు. భవిష్యత్తులోనూ ఆ దేశానికి ఎలాంటి సహాయం అందించొద్దని కోరారు. ఆపరేషన్ సిందూర్లో పాక్కు భారత్ అర్థరాత్రి ఉదయపు వెలుగు ఎలా ఉంటుందో చూపించిందని.. మన
సైనికుల పరాక్రమం చూసి దేశ, విదేశాల్లోని భారతీయులు గర్విస్తున్నారని రాజ్నాథ్ అన్నారు. ఈ ఆపరేషన్ ప్రపంచం దృష్టిని ఆకర్షించిందని తెలిపారు. మన బ్రహ్మోస్ క్షిపణి శక్తిని దాయాది దేశం కూడా
అంగీకరించిందని పేర్కొన్నారు. భుజ్ వైమానిక స్థావరం అనేక పాకిస్థాన్ డ్రోన్లను కూల్చడాన్ని ప్రస్తావిస్తూ..సైన్యాన్ని ప్రశంసించారు. 1965లోనూ పాకిస్థాన్పై మన విజయానికి భుజ్ సాక్షిగా నిలిచిందని
గుర్తు చేశారు. ఆపరేషన్ సిందూర్ అనంతరం పాకిస్థాన్కు రుణం ఇవ్వకూడదని భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసినప్పటికీ అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) నుంచి 1 బిలియన్ డాలర్ల నిధులు (దాదాపు రూ.8,540
కోట్లు) ఆ దేశానికి మంజూరయ్యాయి. ఎక్స్టెండెడ్ ఫండ్ ఫెసిలిటీ (EFF) కింద ఈ మొత్తాన్ని ఇవ్వడానికి ఐఎంఎఫ్ ఆమోదం తెలిపింది. మసూద్ అజార్కు పరిహారం ప్రకటించిన పాక్ ప్రధాని పాకిస్థాన్ ప్రధాని
షెహబాజ్ షరీఫ్ గురువారం జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజార్కు నష్టపరిహారం ఇవ్వనున్నట్లు ప్రకటించారు. భారత్ చేసిన వైమానిక దాడుల్లో 14 మంది మసూద్ కుటుంబసభ్యులు ప్రాణాలు కోల్పోయిన విషయం
తెలిసిందే. మృతుల కుటుంబాలకు రూ.కోటి పరిహారం ఇస్తామని ఆ దేశ ప్రధాని పేర్కొన్నారు. ఈ క్రమంలో కేవలం మసూద్ కుటుంబానికి రూ.14 కోట్లు చెల్లించే అవకాశం ఉంది. అదనంగా భారత్ దాడుల్లో ధ్వంసమైన ఇళ్లను
పునర్నిర్మిస్తామని పాక్ ప్రధాని హామీ ఇచ్చారు.
Trending News
IPL 2024: ఐపీఎల్ కోసం ఎయిర్టెల్ అదిరే ప్లాన్.. తక్కువ ధర, భారీగా డేటాIPL 2024: ఐపీఎల్ కోసం ఎయిర్టెల్ అదిరే ప్లాన్.. తక్కువ ధర, భారీగా డేటాPublished by:Kumar Krishnanews18-teluguLast Update...
నేటి తాజా వార్తలు @ ఈనాడు. నెట్ (02/06/2025)02/06/2025 23:20(IST) కర్నూలు నాలుగో పట్టణ సీఐ, హెడ్ కానిస్టేబుల్ సస్పెన్షన్ * సీఐ మధుసూదన్ గౌడ్, హెడ్ కానిస్టేబుల...
Karnataka government to rename salaam aarati started by tipu sultanThis move comes after various Hindutva outfits urged the state government to end the rituals performed in the name of Ti...
Scary Bridge: ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన వంతెన.. దీన్ని చూస్తేనే చాలు గుండె గుభేల్ మంటుంది..!Scary Bridge: ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన వంతెన.. దీన్ని చూస్తేనే చాలు గుండె గుభేల్ మంటుంది..!Published by:gvj srikanthn...
రైతులకు భారీ శుభవార్త.. రానున్న 10 నుంచి 15 రోజుల్లో..రైతులకు భారీ శుభవార్త.. రానున్న 10 నుంచి 15 రోజుల్లో..Reported by:Local 18 Hydnews18-teluguPublished by:Veera BabuLast U...
Latests News
Rajnath singh: అప్పులు తెచ్చి.. మసూద్ అజార్కు రూ. 14 కోట్ల పరిహారం: పాక్ను ఎండగట్టిన రాజ్నాథ్ఇంటర్నెట్ డెస్క్: పాకిస్థాన్ ఎన్నోఏళ్లుగా పెంచి..పోషిస్తున్న ఉగ్రవాదాన్ని భారత సైన్యం కేవలం 23 నిమిషాల్లో తుడిచిపెట్ట...
Jairam ramesh's letter on mnregs politically motivated: mayawatiShe accused Jairam of having a pre-conceived agenda and arriving at conclusions without taking cognisance of steps taken...
Karthi and Rakul Preet to team up again after ‘Theeram Adhigaaram Ondru’Last seen in AR Murugadoss’s Spyder, Rakul Preet Singh is hopeful of making a strong comeback to Tamil filmdom with her ...
From wall painting bharathiyar to holding parai classes: how chennai is celebrating ‘daan utsav’The initiative was started in 2009 by a group of people who thought the entire country must come together and do somethi...
Ananya panday: ఆయుష్కు జోడీగా‘లైగర్’ సినిమా ప్రచారాల్లో భాగంగా దేశ వ్యాప్తంగా బిజీగా పర్యటిస్తున్న బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే మరో క్రేజీ ప్రా...