Rajnath singh: అప్పులు తెచ్చి.. మసూద్ అజార్‌కు రూ. 14 కోట్ల పరిహారం: పాక్‌ను ఎండగట్టిన రాజ్‌నాథ్‌

Eenadu

Rajnath singh: అప్పులు తెచ్చి.. మసూద్ అజార్‌కు రూ. 14 కోట్ల పరిహారం: పాక్‌ను ఎండగట్టిన రాజ్‌నాథ్‌"

Play all audios:

Loading...

ఇంటర్నెట్‌ డెస్క్‌: పాకిస్థాన్‌ ఎన్నోఏళ్లుగా పెంచి..పోషిస్తున్న ఉగ్రవాదాన్ని భారత సైన్యం కేవలం 23 నిమిషాల్లో తుడిచిపెట్టేసిందని కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ (Rajnath Singh)


పేర్కొన్నారు. ప్రస్తుతం పాక్‌ చర్యలను భారత్‌ పరిశీలిస్తుందని.. తేడా వస్తే చర్యలు మరింత కఠినంగా ఉంటాయని హెచ్చరించారు. గుజరాత్‌లోని భుజ్‌ వైమానిక దళ సైనికులతో సమావేశమైన కేంద్ర మంత్రి ఈ


వ్యాఖ్యలు చేశారు. అంతర్జాతీయ ద్రవ్య నిధి నుంచి వచ్చిన నిధులలో ఎక్కువ భాగాన్ని పాకిస్థాన్‌ తన దేశంలో ఉగ్రవాద మౌలిక సదుపాయాల కోసం ఖర్చు చేస్తుందన్నారు. అప్పు చేసి మరీ దాయాది దేశం ఉగ్రవాదాన్ని


పెంచి పోషిస్తుందని పేర్కొన్నారు. ఆపరేషన్‌ సిందూర్‌లో (Operation Sindoor) ధ్వంసమైన ఉగ్రవాద స్థావరాలను పునర్నిర్మించడానికి  జైషే మహ్మద్‌ చీఫ్‌ మసూద్‌ అజార్‌కు రూ.14 కోట్ల ఇస్తున్నట్లు పాక్‌


ప్రభుత్వం ప్రకటించిందని తెలిపారు. పాక్‌కు నిధులు మంజూరు చేస్తే పరోక్షంగా ఉగ్రవాదాన్ని ప్రోత్సహించినట్లే అవుతుందని రాజ్‌నాథ్‌ అన్నారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఐఎంఎఫ్‌ పాక్‌కు నిధులు


సమకూర్చడంపై పునరాలోచించాలని కోరారు. భవిష్యత్తులోనూ ఆ దేశానికి ఎలాంటి సహాయం అందించొద్దని కోరారు.  ఆపరేషన్‌ సిందూర్‌లో పాక్‌కు భారత్‌ అర్థరాత్రి ఉదయపు వెలుగు ఎలా ఉంటుందో చూపించిందని.. మన


సైనికుల పరాక్రమం చూసి దేశ, విదేశాల్లోని భారతీయులు గర్విస్తున్నారని రాజ్‌నాథ్‌ అన్నారు. ఈ ఆపరేషన్ ప్రపంచం దృష్టిని ఆకర్షించిందని తెలిపారు. మన బ్రహ్మోస్ క్షిపణి శక్తిని దాయాది దేశం కూడా


అంగీకరించిందని పేర్కొన్నారు. భుజ్ వైమానిక స్థావరం అనేక పాకిస్థాన్‌ డ్రోన్‌లను కూల్చడాన్ని ప్రస్తావిస్తూ..సైన్యాన్ని ప్రశంసించారు. 1965లోనూ పాకిస్థాన్‌పై మన విజయానికి భుజ్ సాక్షిగా నిలిచిందని


గుర్తు చేశారు.  ఆపరేషన్‌ సిందూర్‌ అనంతరం పాకిస్థాన్‌కు రుణం ఇవ్వకూడదని భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసినప్పటికీ అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) నుంచి 1 బిలియన్‌ డాలర్ల నిధులు (దాదాపు రూ.8,540


కోట్లు) ఆ దేశానికి మంజూరయ్యాయి. ఎక్స్‌టెండెడ్ ఫండ్ ఫెసిలిటీ (EFF) కింద ఈ మొత్తాన్ని ఇవ్వడానికి ఐఎంఎఫ్‌ ఆమోదం తెలిపింది. మసూద్‌ అజార్‌కు పరిహారం ప్రకటించిన పాక్ ప్రధాని పాకిస్థాన్‌ ప్రధాని


షెహబాజ్ షరీఫ్ గురువారం జైషే మహ్మద్‌ చీఫ్‌ మసూద్‌ అజార్‌కు నష్టపరిహారం ఇవ్వనున్నట్లు ప్రకటించారు. భారత్‌ చేసిన వైమానిక దాడుల్లో 14 మంది మసూద్‌ కుటుంబసభ్యులు ప్రాణాలు కోల్పోయిన విషయం


తెలిసిందే. మృతుల కుటుంబాలకు రూ.కోటి పరిహారం ఇస్తామని ఆ దేశ ప్రధాని పేర్కొన్నారు. ఈ క్రమంలో కేవలం మసూద్‌ కుటుంబానికి రూ.14 కోట్లు చెల్లించే అవకాశం ఉంది. అదనంగా భారత్ దాడుల్లో ధ్వంసమైన ఇళ్లను


పునర్నిర్మిస్తామని పాక్‌ ప్రధాని హామీ ఇచ్చారు.


Trending News

Movie news - bollywood (hindi), tamil, telugu, kannada, malayalam - filmibeat

To Start receiving timely alerts please follow the below steps: * Click on the Menu icon of the browser, it opens up a l...

Katrina kaif and vicky kaushal: నెల‌కు రూ. 8ల‌క్ష‌ల అద్దె.. కొత్త జంట ఎక్క‌డ ఉండ‌బోతుందో తెలుసా?

Published by: Last Updated:December 07, 2021 4:44 PM IST KATRINA KAIF AND VICKY KAUSHAL: బాలీవుడ్‌ (BOLLYWOOD) లో విక్కీ...

Kaleshwaram overflows with devotion as thousands gather for saraswati pushkaralu

BHUPALPALLY: As the weekend aligned with the tenth day of the sacred Saraswati Pushkaralu, the serene village of Kaleshw...

ఆ కోళ్లు కాసులు కురిపిస్తున్నాయి..

రాజశ్రీ రకం కోళ్లు విజయనగరం ఫోర్ట్‌: అందరికీ ఉద్యో గాలు అసాధ్యం. పంట పండించాలంటే ఎంతోకొంత పొలం ఉండాలి. ఇవే వీ లేని యువతక...

Kamal haasan | latest kamal haasan - eenadu

జూన్‌లో థగ్‌ లైఫ్‌ కథానాయకుడు కమల్‌ హాసన్‌.. దర్శకుడు మణిరత్నం కలయికలో రూపొందుతున్న పాన్‌ ఇండియా చిత్రం ‘థగ్‌ లైఫ్‌’. రా...

Latests News

Rajnath singh: అప్పులు తెచ్చి.. మసూద్ అజార్‌కు రూ. 14 కోట్ల పరిహారం: పాక్‌ను ఎండగట్టిన రాజ్‌నాథ్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: పాకిస్థాన్‌ ఎన్నోఏళ్లుగా పెంచి..పోషిస్తున్న ఉగ్రవాదాన్ని భారత సైన్యం కేవలం 23 నిమిషాల్లో తుడిచిపెట్ట...

Peru | WSCOM

Peru | WSCOM Menu PERU ------------------------- 04/07/2019 ------------------------- WSCOM PLAY...

Stories | short stories with moral | nithi kathalu - eenadu

కస్తూరీ పరిమళం ‘‘నీకు మైనుద్దీన్‌ అని ఎవరు పేరు పెట్టారోగానీ, ఎక్కడైనా మైనంలా అతుక్కుపోతూ ఉంటావు. ప్రాణస్నేహితుడు పల్లె ...

Kamala harris | latest kamala harris - eenadu

కమల వికాసమా.. ట్రంప్‌ ప్రభంజనమా! ప్రపంచం యావత్తూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న అమెరికా ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. అధ్యక్షుడిన...

Ipl 2025: డీజేలు, చీర్‌ లీడర్స్‌ లేకుండానే మిగతా ఐపీఎల్‌ మ్యాచ్‌లు

భారత మాజీ క్రికెటర్‌ సునీల్‌ గావస్కర్‌ కోరిక మేరకు మిగిలిన 17 ఐపీఎల్‌ మ్యాచ్‌లను డీజేలు, చీర్‌లీడర్స్‌ లేకుండానే బీసీసీఐ...

Top